-
మళ్లీ నేరాల జోలికి వెళ్లొద్దు
తాడిపత్రి: తాడిపత్రి సబ్ జైలును జిల్లా జడ్జి శ్రీనివాస్ శనివారం తనిఖీ చేశారు. జైలు పరిసరాలను పరిశీలించి, ఖైదీలతో మాట్లాడారు. చాలా మంది క్షణికావేశంలో, మరికొందరు తెలిసే నేరాలు చేస్తుంటారన్నారు. ఖైదీలు పరి వర్తన చెందాలన్న ఉద్దేశంతోనే జైళ్లలో ఉంచుతామన్నారు. జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ నేరాల జోలికి వెళ్లకుండా, మంచిగా జీవించాలని సూచించారు. జిల్లా జడ్జి వెంట తాడిపత్రి లీగల్ సర్వీసెస్ అఽథారిటీ ఉద్యోగి గోపాల్రెడ్డి, జైలర్ కరీముల్లా, సిబ్బంది ఉన్నారు. నూతన ఎస్పీగా గౌతమి శాలి అనంతపురం: జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గౌతమి శాలి 2015లో ఐపీఎస్ అధికారిణిగా ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పెద్ద కన్నేలి స్వగ్రామం. ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. ఐపీఎస్గా ఎంపిక కాక ముందు చైన్నెలోని కాగ్నిజెంట్ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. గతంలో విశాఖపట్నం డీసీపీ–1గా, అనకాపల్లి ఎస్పీ, బొబ్బిలి ఏఎస్పీ, కర్నూలు ఏఎస్పీ (సెబ్, అడ్మినిస్ట్రేటివ్)గా విధులు నిర్వర్తించారు. ఇది వరకు ఎస్పీగా ఉన్న అమిత్ బర్దర్పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. 17 మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలోని 17 మండలాల పరిధిలో వర్షం పడింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు 7.4 మి.మీ వర్షపాతం నమోదైంది. గార్లదిన్నెలో 60.0 మి.మీ, ఉరవకొండ 33.6 మి.మీ, వజ్రకరూరు 26.2 మి.మీ, అనంతపురం 15.8 మి.మీ, పామిడి 15.4 మి.మీ, పెద్దపప్పూరు 11.6 మి.మీ, కూడేరు 10 మి.మీతో పాటు నార్పల, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, శింగనమల, యాడికి, కుందుర్పి, తాడిపత్రి, కంబదూరు, బెళుగుప్ప, పెద్దవడుగూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అటు శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా 16 మండలాల్లో వర్షపాతం నమోదైంది. కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) కోసం కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అఽధికారి వి.వినోద్కుమార్ ఆదేశించారు. జేఎన్టీయూలో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. బందో బస్తు పకడ్బందీగా చేపట్టాలని, ట్రాఫిక్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాట్లను చూసేందుకు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు వస్తుంటారని, వారి కోసం హంపీ హాస్టల్లో ప్రత్యేక గది ఏర్పాటు చేశామని చెప్పారు. అందులో టీవీలు అందుబాటులో ఉంచామన్నారు. స్ట్రాంగ్ రూమ్లో జరిగే ఏర్పాట్లను వాటి ద్వారా చూడవచ్చన్నారు. కార్యక్రమంలో జేసీ కేతన్గార్గ్, తదితరులు పాల్గొన్నారు. వీఆర్వోపై వేధింపుల కేసు గార్లదిన్నె: పామిడి మండలంలో వీఆర్వోగా పనిచేస్తున్న అమరనాథ్పై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపారు. గార్లదిన్నె మండలం కమలాపురానికి చెందిన అమరనాథ్కు అనంతపురానికి చెందిన రమ్యతో 2019లో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె ఉంది. మళ్లీ సంతాన భాగ్యం కలగలేదని, తనకు కుమారుడు కావాలని భార్యను వేధించేవాడు. రోజురోజుకూ వేధింపులు పెరిగిపోవడంతో భరించలేకపోయిన రమ్య గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రమ్య భర్త అమరనాథ్, మామ సుంకన్నపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
తాడిపత్రిలో అదుపులోకి శాంతిభద్రతలు
తాడిపత్రి/అర్బన్: తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. పోలింగ్ అనంతరం వరుస అల్లర్ల నేపథ్యంలో అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి వాజ్పేయి పట్టణంలోనే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పోలీసు బలగాలు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ప్రధాన కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నందలపాడు, శ్రీనివాసపురం, పప్పూరు రోడ్డు, మెయిన్బజార్, చిన్నబజార్, సీబీ రోడ్డు, టైలర్స్కాలనీ, శివాలయం వీధి, నంద్యాల రోడ్డు, గానుగవీధి, సంజీవనగర్, భగత్సింగ్ నగర్లో పోలీసులు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు రాక.. తాడిపత్రిలో అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం పట్టణానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు (ఆర్పీఎఫ్) బలగాలను రప్పించారు. ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. తాడిపత్రి చేరుకున్న సిట్ అధికారుల బృందం పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన సిట్ బృందం శనివారం రాత్రి పట్టణానికి చేరుకుంది. డీఎస్పీ శ్రీనివాస రావు నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ముందుగా అర్బన్ పోలీస్ స్టేషన్లో డీఐజీ షిమోషితో భేటీ అయ్యారు. అనంతరం సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్ఐ గౌస్బాషాతో కలిసి పోలింగ్ రోజు అల్లర్లు జరిగిన ఓంశాంతి నగర్ను పరిశీలించారు. గానుగవీధిలో టీడీపీ నాయకుడి ఇంటి పరిసరాలను పరిశీలించిన అనంతరం నేరుగా జూనియర్ కళాశాల మైదానాన్ని పరిశీలించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసంపై రాళ్లు రువ్విన తీరును స్థానిక పోలీసుల నుంచి తెలుసుకున్నారు. డీఎస్పీ కార్యాలయంలో సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణతో భేటీ అయ్యారు. సిట్ బృంద సభ్యులు మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. పట్టణంలోనే డీఐజీ షిమోషి మకాం రంగంలోకి ఆర్పీఎఫ్ బలగాలు -
పకడ్బందీగా పరీక్షలు
అనంతపురం అర్బన్: ‘‘త్వరలో జరగనున్న డీఈఈసెట్, ఎస్ఎస్ఈ అడ్వాన్స్ సప్లిమెంటర్, ఏపీఓఎస్ఎస్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేపట్టండి’’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాపీయింగ్ జరిగితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పరీక్షల నిర్వహణపై శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్), ఎస్ఎస్ఈ, ఇంటర్ పరీక్షలు జూన్ 1 నుంచి 8 వరకు జరగనున్నాయన్నారు. రెండు కేంద్రాల్లో జరగనున్న ఎస్ఎస్ఈ పరీక్షకు 427 మంది విద్యార్థులు, ఐదు కేంద్రాల్లో జరగనున్న ఇంటర్ పరీక్షకు 964 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 10 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు. మూడు కేంద్రాల్లో జరగనున్న ప్రాక్టికల్స్కు 379 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని ఆయన ఆదేశించారు. 24 నుంచి ఎస్ఎస్ఈ సప్లిమెంటరీ.. ఎస్ఎస్ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు జరగనున్నాయన్నారు. జిలావ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరగనున్న పరీక్షకు 13,332 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. 24న డీఈఈ సెట్ డీఈఈసెట్–2024 ఈనెల 24 జరగనుందని కలెక్టర్ తెలిపారు. ఒక కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షకు 34 మంది విద్యార్థులు, నలుగురు దివ్యాంగ విద్యార్థులు హాజరవుతారన్నారు. టాస్క్ఫోర్స్ ఏర్పాటు.. జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ వినోద్కుమార్ సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు జిల్లా ఎడ్యుకేషన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇందులో జిల్లా, రాష్టస్థాయి నిపుణులు ఉండాలన్నారు. 10వ తరగతి, ఇతర పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. చదువుతోనే మంచి భవిష్యత్తు సాధ్యమని, ఈ దిశగా ప్రేరణ కలిగించేలా విద్యార్థులకు విద్యను ఉపాధ్యాయులు బోధించాలన్నారు. రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలు, సాంస్కృతిక, వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీల్లో జిల్లా విద్యార్థులు పాల్గొనేలా చూడాలని చెప్పారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థిని ఒక ఉపాధ్యాయునికి మ్యాపింగ్ చేయాలని చెప్పారు. 8వ తరగతి నుంచి విద్యార్థులకు నైపుణాభివృద్ధి శిక్షణ ప్రారంభించాలన్నారు. విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ఇందు కోసం దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, డీఈఓ వరలక్ష్మి, ప్రభుత్వ ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్, డీఎంహెచ్ఓ ఈ.భ్రమరాంబదేవి. ఇతర అధికారులు పాల్గొన్నారు. -
10 రోజుల్లో నిఖా.. అంతలోనే విషాద గీతిక
వారిది చాలా పెద్ద కుటుంబం. ఆ ఇంటాయనది పెద్ద మనసు. తన తమ్ముడు చనిపోతే వారి కుటుంబాన్ని అక్కున చేర్చుకునిపోషిస్తున్నారు. పెద్ద కుమారుడు ఇటీవల చనిపోగా ఆ ఇంటి మనుషులకూ అండగా నిలబడ్డారు. పిల్లల ఆలనా పాలనా చూస్తున్నారు. ఇటీవల చిన్న కుమారుడి నిశ్చితార్థం జరిగింది. దీంతో ఆ కుటుంబమంతా ఎంతో సంతోషంలో మునిగిపోయింది. పెళ్లిని ఘనంగా చేయాలని నిశ్చయించింది. పెళ్లి పత్రికలను ఇప్పటికే చాలా మందికి పంచింది. ఎంతో ఆనందంగా ‘సాగిపోతున్నాం’ అనుకుంటున్న తరుణంలో వారిని వెంటాడిన మృత్యువు.. ఒక్కసారిగా అందరినీ విషాద సాగరంలోకి నెట్టేసింది. ప్రమాదంలో వరుడు కూడా చనిపోవడంతో రెండు కుటుంబాలూ, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.శ్రీ సత్యసాయి: మండలంలోని కరిడికొండ గ్రామ శివారు 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలవడంతో జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం నగరంలోని యల్లమ్మ వీధి బిందెల కాలనీకి చెందిన షేక్ అలీ సాహెబ్ (58) పామిడిలో గుజరీ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్ని రోజుల క్రితం తన తమ్ముడు మృతి చెందడంతో వారి కుటుంబాన్ని తన దగ్గరే ఉంచుకొని ఆలనాపాలన చూస్తున్నాడు. అదే విధంగా ఈ ఏడాది జనవరి 5న పెద్ద కుమారుడు రహంతుల్లా మృతి చెందగా, అతని భార్య షేక్ జాహిదాబాను (40), ఇద్దరు కుమారులు షేక్ మహమ్మద్ ఆహిల్ (6), షేక్ మహమ్మద్ అయాన్ (3)ను తనే పోషిస్తున్నాడు. కుమారుడు, కోడలు, మనవళ్లు, తమ్ముడి కుటుంబం కలసి 22 మంది ఒకే ఇంట్లో ఉంటున్నారు. అలీ సాహెబ్ చిన్న కుమారుడు షేక్ ఫిరోజ్బాషా (28) నగరంలోని ఓ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగిగా కొన్ని రోజుల క్రితం వరకూ పని చేసేవాడు. గుజరీ వ్యాపారం చూసుకోవాలని తండ్రి సూచించడంతో బ్యాంకు ఉద్యోగం మానేశాడు. తండ్రితో కలిసి రోజూ పామిడికి వచ్చి వ్యాపారం చూసుకుని వెళ్లేవారు.ఘనంగా నిశ్చితార్థం..తమ బంధువులకు చెందిన ఓ యువతితో ఫిరోజ్బాషాకు వివాహం చేయాలని అలీ సాహెబ్ నిశ్చయించారు. ఈ నెల 3న నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నెల 28న వివాహాన్ని అత్యంత వైభవంగా చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే పెళ్లి బట్టలు, ఇతర వస్తువుల కొనుగోలు కోసం రెండు రోజుల క్రితం రెండు కార్లలో హైదరాబాద్ వెళ్లారు. షాపింగ్ ముగించుకున్న అనంతరం తిరుగుపయనమయ్యారు. ఒక కారులో అలీ సాహెబ్తో పాటు తమ్ముడి భార్య షేక్ రెహాన (44), కుమారుడు ఫిరోజ్బాషా, పెద్ద కోడలు షేక్ జాహిదాబాను, మనవళ్లు షేక్ మహమ్మద్ ఆహిల్, షేక్ మహమ్మద్ అయాన్ ఉండగా, మరో కారులో బంధువులు ఉన్నారు. బంధువులంతా శనివారం తెల్లవారు జాము 4 గంటలకే అనంతపురం వచ్చేశారు.అయితే, మనవళ్లు షేక్ ఆహిల్, షేక్ అయాన్ ఏడుస్తుండటంతో తాము ప్రయాణిస్తున్న కారును అలీ సాహెబ్ కర్నూలులో ఆపించారు. వారు నిద్రపోయాక ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గుత్తి మండలం కరిడికొండ గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ మహమ్మద్ గౌస్ నిద్రమత్తులో తూగడంతో కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కి అవతలి వైపునకు వెళ్లి కర్నూలు వైపు వెళ్తున్న ఓ లారీని వేగంగా ఢీకొంది. ప్రమాదంలో అలీ సాహెబ్, ఫిరోజ్, మహమ్మద్ ఆహిల్, మహమ్మద్ అయాన్లు ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న షేక్ రెహానను గుత్తి ఆసుపత్రికి, షేక్ జాహిదాబానును అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు కూడా చికిత్స ఫలించక ప్రాణాలు విడిచారు. డ్రైవర్ గౌస్ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్రెడ్డి, గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి, ఎస్ఐ నబీరసూల్ ఘటనాస్థలిని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. రక్తమోడుతున్న వారి ఎస్ఐ తన చేతులతో బయటకు తీశారు. ఫిరోజ్బాషా మృతదేహం బయటకు తీసే సమయంలో తల తెగి కింద పడిపోగా ఎస్ఐ తీసుకొచ్చి అంబులెన్సు సిబ్బందికి అందించారు. ఎస్ఐ చొరవను పలువురు అభినందించారు.బిందెల కాలనీ కన్నీటి సంద్రం..తమ కాలనీకి చెందిన ఆరుగురు మృతి చెందారనే వార్తతో బిందెలకాలనీ విషాదంలో మునిగిపోయింది. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరమూకాలేదు. తమ వెనకే వస్తారనుకున్న వారు ఎంతసేపటికీ తిరిగిరాకపోవడం, ఆ క్రమంలోనే మరణవార్త తెలియడంతో కారులో ముందు వచ్చిన వారంతా ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.కుటుంబం మొత్తం మృతి..అలీసాహెబ్ పెద్ద కుమారుడు రహంతుల్లా ఈ ఏడాది జనవరిలో మరణించగా, శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రహంతుల్లా భార్యతో పాటు ఇద్దరు కుమారులు మరణించారు. ఇక.. అలీసాహెబ్ భార్య గతంలోనే మృతి చెందగా, ఇప్పుడు చిన్న కుమారుడు, అలీ సాహెబ్ కూడా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.మారాం చేసి.. మరణించి..షాపింగ్ నిమిత్తం హైదరాబాద్కు వెళ్తున్న మరిదికి, మామకు బాయ్ చెబుదామని జాహిదా కారు వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె వెంట వచ్చిన కుమారులిద్దరూ తామూ వెళ్దామని మారాం చేయడంతో కాదనలేక పిల్లలతో కలిసి జాహిదా కారులో వెళ్లారు. ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలను కూడా మృత్యువు కబళించింది.సోదరుడి కుమారుడి దత్తత..తన సోదరుడు కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందగా, అతడి కుమారుడైన గౌస్ను అలీసాహెబ్ దత్తత తీసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును నడుపుతున్న గౌస్ కూడా గాయపడ్డారు. -
అనంత ఎస్పీగా గౌతమి శాలి
అనంతపురం: అనంతపురం నూతన ఎస్పీగా గౌతమి శాలి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గౌతమి శాలి 2015లో ఐపీఎస్ అధికారిణిగా ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని పెద్ద కన్నేలి స్వగ్రామం. ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. ఐపీఎస్గా ఎంపిక కాక ముందు చైన్నెలోని కాగ్నిజెంట్ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. గతంలో విశాఖపట్నం డీసీపీ–1గా, అనకాపల్లి ఎస్పీ, బొబ్బిలి ఏఎస్పీ, కర్నూలు ఏఎస్పీ (సెబ్, అడ్మినిస్ట్రేటివ్)గా విధులు నిర్వహించారు. -
భక్తుల కొంగుబంగారం లక్ష్మీనృసింహుడు
ఉరవకొండ: భక్తుల కొంగుబంగారంగా పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి విశేష పూజలదుకుంటున్నారు. ఇక్కడి పచ్చదనం – జలపాతం చూపరులను ఆకట్టుకుంది. పర్యాటకంగా ఎంతో ప్రసిద్దిగాంచి, భక్తులకు ఆహ్లదం, మనశ్శాంతి, భక్తి భావాలు పంచుతోంది. రేపటి నుంచి లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. 20వ తేదీ ఆమిద్యాల నుంచి శ్రీవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పెన్నహోబిలం తీసుకొస్తారు. 21న ధ్వజారోహణం, 22న సింహ వాహనం, చంద్రప్రభ వాహనం, 23న గోవాహనం, శేషవాహనం, 24న హంస వాహనం, 25న హనమద్ వాహన ఉత్సవాలు నిర్వహిస్తారు. 26న గరుడ వాహనోత్సవం అనంతరం శ్రీవారి కల్యాణోత్సవం ఉంటుంది. 27న ఐరావత వాహనోత్సవం, 28న ఉదయం మడుగుతేరు, సాయంత్రం బ్రహ్మ రథోత్సవం, 29న అశ్వవాహనోత్సవం, 30న ధ్వజారోహణం, శయనోత్సవం, 31న ఉత్సవమూర్తులను ఆమిద్యాలకు చేర్చటంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. పాత రథానికి మరమ్మతులు.. గత ఏడాది ఏప్రిల్ 29న శ్రీవారి రథం మరమ్మతుల సమయంలో క్రేన్ పట్టుతప్పడంతో రథం ధ్వంసమైంది. పాత రథం స్థానంలో కొత్త రథం తయారీ పనులు జరుగుతున్నాయి. పూర్తయ్యేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో ఈసారి బ్రహ్మోత్సవాలకు పాత రథమే వినియోగించనున్నారు. ఈ మేరకు ఈఓ విజయకుమార్ పర్యవేక్షణలో పాత రథం మరమ్మతులు చేయించారు. రేపటి నుంచి పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలు 28న బ్రహ్మ రథోత్సవం చురుగ్గా ఏర్పాట్లు శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తున్నాం. చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు మరుగుదొడ్లు కూడా అందుబాటులోకి తెచ్చాం. అందరి సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తాం. – కె.విజయ్కుమార్ ఈఓ, పెన్నహోబిలం -
గురుకులాల్లో ఇంటర్ మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకుల కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకులాల సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్ఏజీ సెట్–2024లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుందని పేర్కొన్నారు. బాలుర గురుకులాల్లోని 154 ఖాళీలు, బాలికల గురుకులాల్లోని 295 ఖాళీల భర్తీకి 1:3 నిష్పత్తిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలురకు సంబంధించి ఎస్సీ కేటగిరీలో 22 నుంచి 7,569 ర్యాంకు వరకు, ఎస్టీ 261 నుంచి 5,730, బీసీ 5 నుంచి 403, ఓసీ కేటగిరీలో 19 నుంచి 1023 ర్యాంకు వరకు విద్యార్థులకు ఈ నెల 2న నార్పల మండలం బి.పప్పూరు గురుకులంలో కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. ● బాలికలకు సంబంధించి ఎస్సీ కేటగిరీలో 57 నుంచి 19,371 ర్యాంకు వరకు, బీసీసీ కేటగిరీలో 425 నుంచి 18,483 వరకు, ఎస్టీ 48 నుంచి 12,867, బీసీ 14 నుంచి 1,845, ఓసీ కేటగిరీలో 11 నుంచి 2,128 ర్యాంకు వరకు ఈ నెల 23న అనంతపురం రూరల్ మండలం కురుగుంట గురుకులంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం తొమ్మిది గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. మెరిట్ కార్డు, టెన్త్ మార్కుల మెమో, ఆధార్ కార్డు, కులం, ఆదాయ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. -
పీఏబీఆర్లో తగ్గిన నీటిమట్టం
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. జలాశంలో ఏర్పాటు చేసిన అనంత, సత్యసాయి, శ్రీరామిరెడ్డి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 55 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాంలోకి ఇన్ఫ్లో లేదు. వర్షాలు బాగా కురిస్తే వరద నీటి రూపంలో డ్యాంలోకి నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. శనివారం నాటికి డ్యాంలో 1.04 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జేఈ లక్ష్మీదేవి తెలిపారు. రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య గుత్తి: పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో బ్రిడ్జి వద్ద బాబు (37) అనే వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గుత్తిలోని వైఎస్సార్ కాలనీలో నివాసముండే బాబు తాగుడుకు బానిసయ్యాడు. ఏ పనీ చేసేవాడు కాదు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు గాలించినా జాడ కనపడలేదు. శనివారం రైలుకింద పడి చనిపోయినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. బాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప కేసు నమోదు చేశారు. సవారమ్మ ఆలయంలో చోరీ కుందుర్పి: బెస్తరపల్లి సవారమ్మ ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు హుండీలో ఉన్న దాదాపు రూ.లక్ష నగదుతో పాటు రూ.2 లక్షల విలువైన వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. పూజారి సూరి శనివారం ఉదయం ఆలయానికి రాగానే.. అప్పటికే తలుపులు తెరిచి ఉండడం చూసి లోనికెళ్లి పరిశీలించాడు. హుండీ కనిపించలేదు. దొంగలు ఎత్తుకుపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వెంకటస్వామి కేసు నమోదు చేశారు. -
ఆటోడ్రైవర్పై హత్యాయత్నం
గుంతకల్లు టౌన్: జన సమ్మర్ధనం కలిగిన ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టపగలే ఆటో డ్రైవర్పై హత్యాయత్నం జరిగింది. సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లులోని దోనిముక్కల రోడ్డు ఏరియాలో నివసిస్తున్న ఆటోడ్రైవర్ అబ్దుల్లా (30), సల్మా దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. కొద్దిరోజుల క్రితం అబ్దుల్లా, ఇదే ఏరియాకు చెందిన టిప్పర్డ్రైవర్ సికిందర్ అలియాస్ చాంద్బాషా మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి కక్ష పెంచుకున్న చాంద్బాషా అదును కోసం వేచి చూశాడు. శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ వద్ద ఆటోస్టాండ్లో కూర్చున్న అబ్దుల్లాపై చాంద్బాషా కత్తితో విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా పొడవడంతో అబ్దుల్లా కడుపులోని పేగులు బయటపడ్డాయి. స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో చాంద్బాషా అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అబ్దుల్లాను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అబ్దుల్లా తండ్రి వన్నూరప్ప ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ గణేష్ తెలిపారు. కాగా నిందితుడు టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
కూలిన వెంచర్ ముఖద్వారం
● ఇద్దరు కూలీలు దుర్మరణం కూడేరు: వెంచర్ ముఖద్వార నిర్మాణ సమయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. వెంచర్ దిమ్మె కుప్పకూలడంతో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు కూలీలు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. గొటుకూరు వద్ద అనంతపురం – బళ్లారి ప్రధాన రహదారి పక్కనే భవ్యశ్రీ పేరిట వెంచర్ వేస్తున్నారు. వెంచర్కు ముఖ ద్వార నిర్మాణం చేపట్టారు. ఇరువైపులా పిల్లర్లు వేసి దానిని అనుసంధానిస్తూ స్లాబ్ వనులు శనివారం చేస్తున్నారు. పైభాగంలో నిల్చుని వైబ్రేటర్ పెడుతున్న సమయంలో స్లాబ్ కూలింది. దీంతో ఓ వైపున ఉన్న పిల్లర్లు సైతం విరిగిపడ్డాయి. పైభాగన పనిచేస్తున్న మధ్యప్రదేశ్ కూలీలు పురంసింగ్ (27), హాషాసింగ్ (26) కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. తిహార్ అనే మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. కిందివైపున ఉన్న బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడుకు చెందిన కూలీలు ఆంజనేయులు, నాగరాజు సైతం గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా భవ్యశ్రీ వెంచర్కు ఎలాంటి అనుమతులూ లేవని సమాచారం. డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం సెంట్రల్: సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (విజయవాడ)లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ డైరెక్టర్ శేఖర్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి విద్యార్హతతో డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ, బీఎస్సీ విద్యార్హతతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ పెరాస్సింగ్ అండ్ టెస్టింగ్ కోర్సులకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు cipet24.onlineregistrationfor.org వెబ్సైట్లో ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం కూడా కల్పించిందని వివరించారు. మరిన్ని వివరాలకు 63001 47965 నంబర్లో సంప్రదించాలన్నారు. గ్రూప్–2 మెయిన్స్కు ఉచిత శిక్షణఅనంతపురం రూరల్: ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్– 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ పొందేందుకు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం బీసీ స్టడీ సర్కిల్ ఉప సంచాలకులు కుష్బూకొఠారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23 నుంచి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో శిక్షణ తరగతులు ప్రారంభిస్తామన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం లక్ష రూపాయల వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రిలిమినరీ పరీక్షల హాల్ టికెట్తో పాటు బయోడేటా, పదో తరగతి మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుకు జతచేసి బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలన్నారు. సెంట్రల్ వర్సిటీ కోర్సులపై ఆరా అనంతపురం: జంతలూరు వద్దనున్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ క్యాంపస్ను శనివారం కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కె.సంజయ్మూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ఎస్ఏ కోరి ప్రొఫెసర్లను పరిచయం చేశారు. అనంతరం క్యాంపస్లో మొక్కలు నాటారు. 2024–25 విద్యా సంవత్సరం నుంచి క్యాంపస్లో నిర్వహించే కోర్సులపై ఆరా తీశారు. -
ప్రయాణిస్తూనే.. ప్రాణాలొదిలాడు
అనంతపురం సిటీ: బెంగళూరు నుంచి గుల్బర్గాకు రైలులో బయల్దేరిన ప్రయాణికుడు గమ్యస్థానం చేరకనే మృత్యు ఒడికి చేరాడు. అనంతపురం జీఆర్పీ ఎస్ఐ విజయకుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే కేకే ఎక్స్ప్రెస్ రైలులోని జనరల్ బోగీలో ఓ వ్యక్తి (40) ప్రయాణిస్తున్నాడు. రైలు అనంతపురం సమీపంలోకి వచ్చే సరికి ఆ వ్యక్తిలో ఎటువంటి కదలికలూ లేకపోవడాన్ని తోటి ప్రయాణికులు గమనించి రైలు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు జీఆర్పీ పోలీసులకు తెలియజేశారు. రైలు అనంతపురం స్టేషన్ చేరుకోగానే జనరల్ బోగీని పరిశీలించిన పోలీసులు నిర్జీవంగా పడి ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని భద్రపరిచారు. మృతుని జేబులో బెంగళూరు – గుల్బర్గా జనరల్ టికెట్ లభించింది. ఇతర ఏ ఆధారమూ దొరకలేదని ఎస్ఐ విజయకుమార్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే మృతుడు గుల్బర్గా ప్రాంతానికి చెంది ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. ఇది సహజ మరణమేనని ఆయన పేర్కొన్నారు. మృతుడు మెరూన్ రెడ్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని కర్ణాటక రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించామని వివరించారు. మృతుని సంబంధీకులు ఎవరైనా ఉంటే 85002 38200 నంబర్కు సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. బెంగళూరు నుంచి న్యూఢిల్లీ వెళ్లే రైలులో ఘటన -
సాఫ్ట్బాల్లో ఎస్కేయూకు బంగారు పతకం
అనంతపురం: అఖిల భారత అంతర్ వర్సిటీ సాఫ్ట్బాల్ పోటీల్లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) జట్టు ప్రతిభచాటి బంగారు పతకం దక్కించుకుంది. 43 సంవత్సరాల యూనివర్సిటీ చరిత్రలో తొలి సారి బంగారు పతకం సాధించడం విశేషం. ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు బెంగళూరు యూనివర్సిటీ ఆధ్వర్యంలో సౌందర్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఈ టోర్నీ నిర్వహించారు. ఇందులో దేశ వ్యాప్తంగా 90 జట్లు పాల్గొన్నాయి. ఈ జట్టుకు కోచ్గా ఎస్కేయూ క్యాంపస్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ వెంకటేష్ వ్యవహరించారు. బంగారు పతకం సాధించిన జట్టు సభ్యులను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.హుస్సేన్రెడ్డి, యూనివర్సిటీ స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ ఎంవీ శ్రీనివాసన్ అభినందించారు. టోర్నీలో ఉత్తమ పిక్చర్గా షేక్ చిన్న మస్తాన్, బెస్ట్ బ్యాటర్గా బి. రాంబాబులకు అవార్డులు వరించాయి. -
అధికారుల పచ్చపాతం
అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికల నియమావళిని పారదర్శకంగా అమలు చేయాల్సిన ఉమ్మడి జిల్లాలోని పలువురు విద్యాశాఖ అధికారులు ‘పచ్చ’ పాతం ప్రదర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని, పోస్టల్ బ్యాలెట్ల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, టీడీపీకి మద్దతుగా బహిరంగ ప్రచారం చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా కనీస చర్యలు తీసుకోని అధికారులు ‘ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే’ అన్న ఓ టీచరుపై మాత్రం సస్పెన్షన్ వేటు వేశారు. అనంతపురం జిల్లా విద్యాశాఖలోని ఓ కీలక అధికారి ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. రెమ్యునరేషన్ పెంచడం సంతోషం అన్నందుకు సస్పెన్షన్ ఎప్పుడూ లేనివిధంగా పదోతరగతి స్పాట్ రెమ్యునరేషన్ పెంచుతూ గతేడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మార్చి 23న ‘సాక్షి’లో ‘పది స్పాట్ రెమ్యునరేషన్ భారీగా పెంపు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. పదేళ్ల తర్వాత అన్ని కేడర్ల ఉద్యోగులకూ రెమ్యునరేషన్ పెంచడం సంతోషదాయకమని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్కుమార్రెడ్డి ఈ సందర్భంగా పేర్కొనగా.. నెల తర్వాత దీనిపై గుర్తు తెలియని వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే నోటీసు ఇవ్వకుండా, కనీసం విచారణ చేయకుండా ఏప్రిల్ 29న పి.అశోక్కుమార్రెడ్డిని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మీ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి రెమ్యునరేషన్ వివరాలను డీఈఓ వరలక్ష్మీ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ కూడా వెల్లడించినట్లు ఇదే కథనంలో ఉంది. టీచరు అశోక్కుమార్రెడ్డికి వర్తించిన నిబంధన ఈ ఇద్దరు అధికారులకు వర్తించవా.. అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. టీచరుకో న్యాయం? అధికారులకో న్యాయమా? అనే చర్చ జరుగుతోంది. టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసినా... చర్యల్లేవ్! కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రాఘవేంద్రగుప్తా, నాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న వై.మంజనాథ్లు టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా టీడీపీకి కొమ్ముకాస్తున్న వీరి ద్వారా బ్రహ్మసముద్రం ఎంఈఓ పోస్టల్ బ్యాలెట్ ఆర్డర్ కాపీలను టీచర్లకు పంపిణీ చేశారు. వాస్తవంగా ఈ కాపీలను నేరుగా ఆయా టీచర్లకు అందజేయాల్సి ఉన్నా, ఎంఈఓ నిబంధనలు ఉల్లంఘించారు. దీనిపై పలువురు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయగా.. అశోక్కుమార్ రెడ్డి విషయంలో ఎలాగైతే చర్యలు తీసుకున్నారో.. ఆ విధంగానే ఈ ముగ్గురిపైనా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. కమిషన్ ఆదేశానుసారం చర్యలకు ఉపక్రమిస్తూ ఫైలును సిద్ధం చేయగా, చివరి నిమిషంలో ఓ కీలక అధికారి అడ్డుపడినట్లు తెలిసింది. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద ఓ వర్గం టీచర్లు, సంఘాల నాయకులు కనిపిస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలంటూ సదరు అధికారి కొందరికి ఆదేశాలిచ్చినట్లు కూడా సమాచారం. ● ఇక శ్రీసత్యసాయి జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు చంద్రశేఖర్, రామ్మోహన్, హరిప్రసాద్రెడ్డి ఓ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసినా వారిపై కనీస చర్యలు తీసుకోలేదు. ● ధర్మవరం నియోజకవర్గంలో ఓటరు కానప్పటికీ అక్కడి ఫెసిలిటేషన్ కేంద్రానికి వెళ్లిన ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోకుకుమార్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ప్రభావితం చేస్తూ హల్చల్ చేశాడు. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్కు అనుకూలంగా ఓట్లు వేయాలంటూ బహిరంగంగానే ప్రచారం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై కూడా చర్యలు తీసుకోలేదంటే విద్యాశాఖలోని పలువురు అధికారులు ఎంతగా ‘పచ్చ’ పాతం ప్రదర్శించారో అర్థమవుతుంది. ‘పది’ స్పాట్ రెమ్యునరేషన్పై ధన్యవాదాలు తెలిపిన టీచర్ల సంఘ నేత సస్పెన్షన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పత్రికలకు ఎక్కిన వారిపై చర్యలు నిల్ టీడీపీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీచర్లనూ పట్టించుకోని అధికారులు ఆధారాలతో సహా ఫిర్యాదులందినా వెనకేసుకొస్తున్న వైనం విద్యాశాఖలో కీలక అధికారి నిర్వాకం ఒక వర్గాన్నే లక్ష్యంగా చేసుకుని చర్యలు! -
ఏపీటీఎఫ్ (1938) జిల్లా అధ్యక్షుడిగా రామానాయక్
● ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసనాయక్ అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం స్థానిక ఉపాధ్యాయ భవనంలో ఫెడరేషన్ జిల్లా నూతన కౌన్సిల్ సమావేశం జరిగింది. నిబంధనల మేరకు అధికారుల అనుమతితో జిల్లా అధ్యక్షుడు ఎ.రవీంద్ర అధ్యక్షతన, ఎన్నికల పరిశీలకుడు ఎ. విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పీవీ ప్రసాద్, అధ్యక్షుడిగా రామా నాయక్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసనాయక్, ఉపాధ్యక్షుడిగా ఎస్.రామాంజనేయులు, అసోసియేట్ ప్రెసిడెంట్గా సి. పోతలయ్య, అదనపు కార్యదర్శిగా డి.ఆంజనేయులునాయక్, జిల్లా సబ్ కమిటీ సభ్యులుగా వజీర్బాషా, సాయినాథ్ రెడ్డి, బహేశ్వర, రామకృష్ణ, రమేష్ రెడ్డి, మద్దిలేటప్ప, అశోక్నాయక్, నాగార్జున, నారాయణరెడ్డి నరసింహులును ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కులశేఖర్రెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మట్టి దిబ్బలు పడి కూలీ మృతి గుమ్మఘట్ట: మండలంలోని గలగల గ్రామానికి చెందిన గాజుల రాజశేఖర్ (41) అనే వ్యక్తిపై మట్టి దిబ్బలు పడి శుక్రవారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గలగల గ్రామానికి చెందిన రాజశేఖర్, భాగ్యమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజశేఖర్ కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. గ్రామ సమీపంలో ఉన్న ఆర్.కొత్తపల్లి చెరువులోని ఇసుకను ఎద్దుల బండిలో తరలించేందుకు వెళ్లాడు. అడుగున ఉన్న ఇసుకను తవ్వుతుండగా పైన్నున్న మట్టిదిబ్బలు ఒక్కసారిగా మీద పడడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు మట్టిదిబ్బలను తొలగించేలోగా మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టుగోవిందరెడ్డి మృతుడి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. -
No Headline
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరంలో పంపిణీ చేసేందుకు జగనన్న విద్యాకానుక (జేవీకే) కిట్లు సిద్ధమవుతున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి విద్యార్థులకు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపాలంటే ఆర్థిక ఇబ్బందులతో వెనుకడుగు వేసేవారు. పంపినా అరకొర ఖర్చులు కూడా భరించలేక చాలామంది పిల్లలు డ్రాపౌట్స్గా మారేవారు. అప్పట్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాంను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేది. 9, 10 తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. ఇక మిగిలిన నోట్ పుస్తకాలు, ఇతరత్ర వాటిని కొనుగోలు చేయాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు కష్టంగా ఉండేది. విద్యకు జగన్ ఎనలేని ప్రాధాన్యత.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడు కార్యక్రమంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలకూ రూ.లక్షలు వెచ్చించి మౌలిక వసతులు కల్పించారు. కొత్త భవనాలు, మరుగుదొడ్లు, తరగతి గదులు, పెయింటింగ్, ఫర్నీచర్ ఇలా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. 9 రకాల వస్తువులతో కిట్.. తల్లిదండ్రులపై పైసా భారం పడకుండా 9 రకాల వస్తువులతో కూడిన ‘జగనన్న విద్యా కానుక’ కిట్లను 1–10 తరగతుల విద్యార్థులకు అందజేస్తున్నారు. ఒక కిట్కు ప్రభుత్వం రూ.1650 ఖర్చు చేస్తోంది. ఈ కిట్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, ఆక్స్ఫర్డ్, పిక్టోరియల్ డిక్షనరీలు, బ్యాగు, మూడు జతల యూనిఫాం, షూ, బెల్ట్ ఉంటాయి. ఇప్పటికే నాలుగేళ్లు ఈ కిట్లను ఇచ్చారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో విడత జేవీకే కిట్లను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 2,68,254 మంది ఉన్నారు. వీరికోసం రూ. 44.26 కోట్లు ఖర్చు చేసి జేవీకే కిట్లు అందజేస్తోంది. మొత్తంగా ఈ ఐదేళ్లలో విద్యాకానుక కిట్ల కోసం ప్రభుత్వం రూ.183 కోట్లు ఖర్చు చేసింది. ప్రైవేట్కు దీటుగా ‘ప్రభుత్వ’ విద్యార్థులు.. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా యూనిఫాం, షూ, బెల్ట్ ధరించి ఈ నాలుగేళ్లూ వెళ్లారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. ఏడు మండలాలకు చేరిన నోట్బుక్స్.. జగనన్న విద్యా కానుక కిట్లలోని అన్ని వస్తువులు రాష్ట్ర కార్యాలయం నుంచి నేరుగా మండల కేంద్రాల్లోని గోడౌన్లకు తరలిస్తారు. అక్కడి నుంచి ఆయా పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. ఏడు మండలాలకు నోట్ బుక్స్ చేరాయి. తక్కిన వస్తువులన్నీ రెండుమూడు రోజుల తర్వాత నుంచి రానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1–10వ తరగతి విద్యార్థులకు ‘జగనన్న విద్యా కానుక’ కిట్లు వరుసగా ఐదో ఏడాది ఇచ్చేందుకు చకచకా ఏర్పాట్లు ఇప్పటిదాకా ఏడు మండలాలకు చేరిన నోట్బుక్స్ బడి తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో విద్యా కానుక కిట్లు జిల్లాలో 2,68,254 మంది విద్యార్థుల కోసం రూ. 44.26 కోట్ల ఖర్చు -
24 నుంచి విత్తన వేరుశనగ పంపిణీ
అనంతపురం అర్బన్: ఖరీఫ్ పంటల సాగుకు ప్రభుత్వం సబ్సిడీపై అందించే విత్తనకాయల పంపిణీ ఈ నెల 24 నుంచి చేపట్టనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. శనివారం నుంచే విత్తన కాయల కోసం రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. విత్తన పంపిణీ అంశంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో జాయింట్ కలెక్టర్ కేతన్గార్గ్, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మతో కలిసి ఏడీఏ, ఏఓ, బ్యాంకర్లు, తదితర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 24వ తేదీ నుంచి విత్తనకాయల పంపిణీ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతుకూ విత్తనకాయలు అందించాలన్నారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా, అవకతవకలకు ఆస్కారం ఇవ్వకుండా పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. పంపిణీ రోజుకు అందుబాటులో ఉండేలా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఆర్బీకేలకు విత్తనకాయను ముందస్తుగానే తరలించి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఏపీ సీడ్స్ డీఎం వ్యక్తిగతంగా ఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయాలని ఏపీ సీడ్స్ డీఎంను, జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. రైతు కోరిన రకం విత్తనాలే ఇవ్వాలి.. రైతు కోరిన రకం విత్తనకాయలనే ఇవ్వాలని కలెక్టర్ కచ్చితమైన ఆదేశాలిచ్చారు. ఆర్బీకేల్లో ఏడీఏలు, వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించి రైతుకు ఏ రకమైన విత్తనకాయలు కావాలో తెలుసుకుని 19లోగా నివేదిక ఇవ్వాలని చెప్పారు. వానలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్బీకేల్లో విత్తనకాయలను జాగ్రత్తగా నిల్వ చేయాలని సూచించారు. సీసీఆర్పీ కార్డులు మరింతమంది రైతులకు అందించేలా చూడాలని చెప్పారు. వారికి బ్యాంకుల నుంచి పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నరసింహులు, ఏపీ సీడ్స్ డీఎం సుబ్బయ్య, ఏఓ రాకేష్, ఏడీఏలు,ఏఓలు, బ్యాంకర్లు పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో మానిటరింగ్ సెల్.. సబ్సిడీ విత్తనకాయల పంపిణీ పర్యవేక్షణకు జిల్లాస్థాయిలో సీడ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విత్తన పంపిణీలో రైతులకు ఏవేని సమస్యలు ఉంటే కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్ 08554– 232922, 08554–231922కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. రైతులకు పంపిణీ ఇలా.. ● అర ఎకరం వరకు 30 కిలోల సంచి ఒకటి. ● అర ఎకరం నుంచి ఎకరా వరకు 2 సంచులు. ● ఎకరం.. అంతకు మించి ఉంటే 3 సంచులు . విత్తనకాయ రకాలు, ధర.. ● కె–6, టీసీజీఎస్–1694 విత్తన వేరుశనగ కాయల 30 కిలోల సంచి పూర్తి ధర రూ.2,850. ఇందులో సబ్సిడీ రూ.1,140 పోగా రూ.1,710 చెల్లించాలి. ● కదిరి లేపాక్షి (కె–1812) రకం విత్తన వేరుశనగకాయల 30 కిలోల సంచి పూర్తి ధర రూ.2,610. ఇందులో సబ్సిడీ రూ.1,044 పోగా రూ.1,566 చెల్లించాలి. 81,832 క్వింటాళ్ల విత్తనాల కేటాయింపు.. అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్–2024లో రైతులు పంటలు సాగు చేసేందుకు సబ్సిడీపై అందజేసే విత్తనం సిద్ధమవుతోంది. జిల్లాకు వివిధ రకాల పంటలకు సంబంధించి 81,832 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించారు. ఇందులో వేరుశనగకు అగ్రస్థానం దక్కింది. వేరుశనగ 76,710 క్వింటాళ్లు, కందులు 2,300 క్వింటాళ్లు, విత్తన వరి 1,600 క్వింటాళ్లు, ఉలవలు 700 క్వింటాళ్లు, జీలుగ 200 క్వింటాళ్లు, పిల్లిపెసర 25 క్వింటాళ్లు, జనుము 7 క్వింటాళ్లు, అలసంద 106 క్వింటాళ్లు, పెసర 85 క్వింటాళ్లు, మినుములు 46 క్వింటాళ్లు, కొర్రలు 50 క్వింటాళ్లు, రాగులు 4 క్వింటాళ్లు కేటాయించారు. వేరుశనగకు 40 శాతం, జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలపై 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు. విత్తన వేరుశనగ సేకరణ వేగవంతం శింగనమల: విత్తన వేరుశనగ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని లోలూరు వద్దనున్న సాయి సీడ్స్ ఎంటర్ప్రైజెస్ గోడౌన్లో విత్తన వేరుశనగ ప్రొక్యూర్మెంట్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. నిర్దేశిత గడువులోపు విత్తన సేకరణ పూర్తి చేయాలన్నారు. సబ్సిడీ విత్తన బ్యాగులు పెంచాలి పామిడి: సన్నకారు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విత్తన వేరుశనగ బ్యాగుల సంఖ్య పెంచాలని ఎద్దులపల్లి రైతులు కలెక్టర్ వినోద్కుమార్ను కోరారు. శుక్రవారం ఎద్దులపల్లిలో ట్రైనీ కలెక్టర్ వినూత్నతో కలిసి కలెక్టర్ పర్యటించారు. తొలుత రైతు భరోసా కేంద్రంలో నిల్వ చేసిన విత్తన వేరుశనగను పరిశీలించారు. మండలానికి కే–6 రకం విత్తన వేరుశనగ 1,600 క్వింటాళ్లు కేటాయించినట్లు ఏఓ డీ లీనా వసుంధర కలెక్టర్కు వివరించారు. అనంతరం రైతు పవన్కుమార్ సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు వీరాంజనేయులు, ప్రతాప్రెడ్డి, మధుసూదన్రెడ్డి, తిప్పారెడ్డి, ఆదినారాయణ తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సన్నకారు రైతులకు ఎకరాకు 3 చొప్పున ఐదు ఎకరాలకు 15 ప్యాకెట్ల విత్తన వేరుశనగ కేటాయించాలని కోరారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు అధికారులకు కలెక్టర్ ఆదేశం -
అది ఎన్డీయే కమిషన్
అనంతపురం కార్పొరేషన్: బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ కాస్తా ఎన్డీయే కమిషన్గా మారిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విమర్శించారు. పోలీసుల వైఫల్యం కారణంగానే తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని స్పష్టం చేశారు. శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ మంగమ్మ, వైఎస్సార్సీపీ అనంతపురం, ఉరవకొండ, శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థులు అనంత వెంకటరామిరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, వీరాంజనేయులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను ముక్తకంఠంతో తప్పుపట్టారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన అధికారం చేజిక్కించుకోవాలని ఎత్తగడతో ముందుకెళ్లాయన్నారు. కూటమిగా ఏర్పడ్డాక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ను ఎన్డీయే తన గుప్పిట్లోకి తీసుకుందని ఆరోపించారు. దీని కారణంగానే రాష్ట్రంలో అరాచకశక్తులు చెలరేగిపోయాయన్నారు. తాడిపత్రిలో 274 పోలింగ్ కేంద్రాలకు గాను 134 సమస్యాత్మకమైనవని గుర్తించినా.. ఆ కేంద్రాల్లో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో అల్లర్లు చోటు చేసుకున్నాయన్నారు. సాక్షాత్తు నూతన ఎస్పీ పర్యవేక్షణలో పోలింగ్ రోజునే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగిందన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏ బూత్ వద్దకు వెళ్లినా.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి, ఏఎస్పీ రామకృష్ణ తారసపడ్డారని, దీన్నిబట్టి చూస్తే ఎన్నికలు పక్కా పథకం ప్రకారం నిర్వహించినట్లు తెలుస్తోందన్నారు. ట్రాక్టర్లో రాళ్లు తీసుకొచ్చి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఎన్నికల కమిషన్ (ఈసీ) జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, పట్టణ సీఐ మురళీకృష్ణలను బాధ్యులను చేసి సస్పెన్షన్ విధించిందన్నారు. తాడిపత్రి అల్లర్లు, అరెస్టులపై లోతుగా విచారణ చేపట్టాలని ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. పథకం ప్రకారమే కూటమి అడ్డదారులు.. ఎలాగైనా గెలవాలని ఎన్నికల కమిషన్ అండతో కూటమి నేతలు అడ్డదారులు తొక్కారని ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, అల్లర్లు జరిగాయన్నారు. కూటమి డైరెక్షన్లో అధికారుల బదిలీలు, నియామకాలు జరిగాయని, ఇందుకు ఎన్నికల కమిషన్ పూర్తి బాధ్యత వహించాలన్నారు. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు మాట్లాడుతూ తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఓటమి భయంతోనే టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా మాట్లాడుతూ తాడిపత్రిలో ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. తాడిపత్రి ఘటనపై లోతుగా విచారణ చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మేయర్ వసీం, పార్టీ అనంతపురం, హిందూపురం నియోజకవర్గాల డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్ రాగే పరుశురాం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, సైఫుల్లాబేగ్, సీపీ వీరన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్నోబులేసు, నాయకులు ధనుంజయ యాదవ్, కార్పొరేటర్ గురుశేఖర్ బాబు పాల్గొన్నారు. తాడిపత్రి ఘటనలో పోలీసుల వైఫల్యం ఎన్నికల కమిషన్ చర్యలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు -
కౌంటింగ్కు విధివిధానాలు
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) జూన్ 4వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపునకు మార్గదర్శకాలను ఎన్నికల సంఘం నిర్దేశించింది. జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. కౌంటింగ్ ప్రక్రియలో సూపర్వైజర్లు క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఆర్ఓలు, ఏఆర్ఓలు పర్యవేక్షక అధికారులుగా వ్యవహరిస్తారు. ఓట్ల లెక్కింపునకు నియమించిన అధికారులు, లెక్కింపు సిబ్బంది ఆరోజు తెల్లవారుజామున 4 గంటలకు హాజరవుతారు. ర్యాండమైజేషన్ పూర్తయిన తరువాత సిబ్బంది తమకు కేటాయించిన కౌంటింగ్ హాల్లోకి ప్రవేశిస్తారు. అనంతరం అక్కడి ఆర్ఓ, ఏఆర్ఓ సూచనలను స్వీకరిస్తారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే ఆయా టేబుళ్ల వద్ద సామగ్రి ఉందా లేదా అనేది సూపర్వైజర్లు పరిశీలిస్తారు. సందేహాలు వస్తే నివృత్తి చేసుకుంటారు. కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి అంశంపై జాగ్రత్తలు తీసుకుంటూ ప్రక్రియ సజావుగా జరిగేలా ఆర్ఓలకు సూపర్వైజర్లు తోడ్పాటు అందించాల్సి ఉంటుంది. ఈ విధానాలు పాటించాలి.. కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ సూపర్వైజర్లు నిర్వహించాల్సిన విధులు, పాటించాల్సిన విధానాల గురించి ఎన్నికల సంఘం స్పష్టంగా తెలియజేసింది. ● ఓట్ల లెక్కింపు వద్ద కౌంటింగ్ ఏజెంట్లతో పిచ్చాపాటిగా మాట్లాడకూడదు. ● స్ట్రాంగ్ రూమ్ నుంచి తెచ్చిన ఈవీఎం పెట్టెలకు సీల్ పరిశీలించిన తరువాతే వాటిని టేబుళ్లవారీగా దించాలి. ● 17సీ ఫారం–1, కంట్రోల్ యూనిట్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్లు సరిపోల్చుకోవాలి. ● ఆ తరువాత కంట్రోల్ యూనిట్ను బ్యాలెట్ యూనిట్కు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేయాలి. ● సిస్టమ్ డిస్ప్లే అయేంత వరకు వేచి చూడాలి. ఆ తరువాత టోటల్ బటన్ను ప్రెస్ చేసి 17సీ ఫారం–1తో సరిపోలిందా లేదా చూడాలి. ● ఆ తరువాత కంట్రోల్ యూనిట్ అడ్రస్ ట్యాగ్ తొలగించాలి. పై కవర్ తీసి, వేసిన సీళ్లను తొలగించిన తరువాత ‘రిజల్ట్ బటన్’ ప్రెస్ చేయాలి. ● అందులో అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లను 17సీ ఫారం–2లో నమోదు చేయాలి. ఆ ఫారాన్ని కార్బన్ పేపర్ ద్వారా రెండు కాపీలు ఉండేలా చూడాలి. ● ఓట్ల నమోదు అనంతరం అందులో ఏజెంట్ల సంతకం తీసుకోవాలి. ఒక ప్రతిని తమ వద్ద ఉంచుకుని, అసలు ప్రతిని 17సీ ఫారం–1కు పిన్ చేసి రో–ఇన్చార్జ్కు అందజేయాలి. వీవీప్యాట్లు ఇలా లెక్కించాలి ● నియోజకవర్గంలో ఎంపిక చేసిన 5 పోలింగ్ కేంద్రాలకు చెందిన వీవీ ప్యాట్లను ఒకదాని తరువాత ఒకటిగా లెక్కించాలి. ● వీవీ ప్యాట్ స్లిప్లను సంబంధిత ట్రేలో ఉంచాలి. పూర్తయిన తరువాత 25 చొప్పున కట్టగా కట్టాలి. స్లిప్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ● వీవీ ప్యాట్ కౌంటింగ్ అనంతరం ఆర్ఓ పరిశీలిస్తారు. కౌంటింగ్ ప్రక్రియపై ఆర్ఓ సంతృప్తి చెందిన తరువాత స్లిప్లను సంబంధిత బాక్స్లో ఉంచి, విధుల్లో ఉన్న ఏఆర్ఓకు అప్పగించాలి. మార్గదర్శకాలు నిర్దేశించిన ఎన్నికల సంఘం కేంద్రాల్లో సూపర్వైజర్లది క్రియాశీలక పాత్ర ఆర్ఓలు, ఏఆర్ఓల పర్యవేక్షణలో ప్రక్రియ జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రాలు -
రైళ్లపై రాళ్ల దాడి కేసులో ఇద్దరి అరెస్టు
అనంతపురం సిటీ: కాచిగూడ – బెంగళూరు మధ్య తిరిగే వందేభారత్ రైలుతో పాటు ముంబై – కోయంబత్తూరు మధ్య తిరిగే కుర్లా ఎక్స్ప్రెస్ రైలుపై రాళ్లతో దాడి చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఎట్టకేలకు అరెస్టు చేశారు. మార్చి నెల 28న కాచిగూడ నుంచి బెంగళూరుకు బయలుదేరిన వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 8న ముంబై – కోయంబత్తూరు మధ్య నడిచే కుర్లా ఎక్స్ప్రెస్పై కల్లూరు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన విషయం విధితమే. ఈ రెండు కేసుల్లో అనంతపురం ఆర్పీఎఫ్–జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో పురోగతి సాధించారు. పామిడి కల్లూరుకు చెందిన షేక్ దూద్వలి, షేక్ జిలానీ రాళ్ల దాడికి పాల్పడినట్లు గుర్తించారు. ఆర్పీఎఫ్ సీఐ రవిప్రకాశ్, ఎస్ఐ మధుకర్ చారి తమ సిబ్బందితో వలపన్ని వారిని అరెస్టు చేశారు. -
కళాఖండాలకు నిలయం
అనంతపురం కల్చరల్: మ్యూజియంలు అకడమిక్ విలువతో కూడిన వినోదానికి మూలంగా పనిచేయడమే కాదు సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కళాఖండాల సంరక్షణను ప్రోత్సహించడంలో ఎంతో సహాయపడతాయి. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని (ఐఎండీ) ప్రతి సంవత్సరం మే 18న జరుపుకుంటారు. ఏ సంస్కృతిలోనైనా మ్యూజియంల ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ రోజును పాటిస్తారు. మ్యూజియంలు సాంస్కృతిక మార్పిడి, సంస్కృతుల సుసంపన్నం, ప్రజల మధ్య పరస్పర అవగాహన, సహకారం, శాంతి అభివృద్ధికి ముఖ్యమైన సాధనాలు. అందమైన కట్టడాలలో ఒకటి.. ఆదిమానవుడు ఉపయోగించిన రాతి పనిముట్లు, మట్టిబొమ్మలు బౌద్ధ, జైన రాతి కాంస్య ప్రతిమలు, వివిధ రాజవంశాలకు చెందిన అపురూప వస్తువులతో ‘అనంత’ చరిత్ర వెరసి విజ్ఞానం .. వినోదం ఆవిష్కరించేలా జిల్లా కేంద్రంలో సర్వాంగ సుందర కట్టడం ఏర్పాటైంది. పురాతన వస్తువులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని జోడిస్తూ రాష్ట్రంలోనే అందమైన కట్టడాలలో ఒకటిగా నిలచిన ఈ మ్యూజియం భవంతి అందరిని ఆకర్షిస్తోంది. చరిత్రకు దర్పణంగా నిలిచే అధునాతన భవంతి విశేషాలు జిల్లా వాసుల ముంగిటకు రెండు నెలల కిందట మంత్రి ఆర్కే రోజా పురావస్తు శాఖాధికారులతో కలిసి ప్రారంభించారు. ‘మ్యూజియం డే’ లో నేపథ్యంలో అనంతపురంలోని మ్యూజియంలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. అనంత మ్యూజియం ప్రత్యేకతలివే... జిల్లా కేంద్రంలోని ఆదిమూర్తినగర్లో రూ.7.5 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అత్యంత అద్భుతంగా పురావస్తుశాఖ వారు నిర్మించారు. పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు మ్యూజియం పేరిట రూపుదిద్దుకున్న ఈ భవంతిలో జిల్లా సంస్కృతి, వారసత్వ సంపద, చరిత్రను చాటేలా వినూత్నమైన రీతిలో విజ్ఞాన వినోదాల మేళవింపుగా అధునాతన మ్యూజియం తయారైంది. ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఇంటరాక్టివ్ డిస్ప్లే, టచ్ స్క్రీన్ ద్వారా జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాల విశేషాలు, చారిత్రాత్మక స్థలాలు, జైన, బౌద్ధ అవశేషాలను తిలకించే ఏర్పాటుతో పాటు దాదాపు 1000 వస్తువులను పొందుపరిచారు. ముఖ్యంగా మూడు అంతస్తుల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సముదాయంలో వేల ఏళ్ల నాటి పనిముట్లు, మట్టి బొమ్మలు, అజంతా, చుగ్తాయ్, డెక్కన్, రాజస్థానీల ఆధునిక చిత్రలేఖనాలు, బంగారు, వెండి నాణేలు, కవచాలు, పిస్టల్స్, కత్తులు, డాళ్లు, ఫిరంగులు చూసే అవకాశం కల్పించారు. వేడుకల్లో పాల్గొనండి నూతనంగా నిర్మించిన మ్యూజియం హాలులో శనివారం ఉదయం మ్యూజియం డే వేడుకలు నిర్వహిస్తున్నాము. ఈ అద్భుతమైన కట్టడాన్ని తిలకించేందుకు చిన్నారులకు ఉచిత ప్రవేశం ఏర్పాటు చేశాము. కేంద్ర గ్రంథాలయం, ఇంటాక్ వారి సహకారంతో సాగే కార్యక్రమంలో చరిత్ర ప్రేమికులు, కవులు, రచయితలందరూ భాగస్వాములు కావాలి. ఘనమైన చరిత్ర కల్గిన ‘అనంత’ ప్రత్యేకతను చాటే విధంగా ఏర్పాటైన మ్యూజియంను విద్యార్థులు సందర్శించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – రజిత, సహాయ సంచాలకులు, జిల్లా పురావస్తుశాఖ ‘అనంత’లో రూ.7.5 కోట్లతో మ్యూజియం ఏర్పాటు ఆకర్షించే విగ్రహాలు, ఆదిమానవుని కాలం నాటి పనిముట్లు -
బాధ్యుడిని వదిలేసి ఇతరులపై వేటు
తాడిపత్రిరూరల్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తాడిపత్రిలో రెండు రోజుల పాటు జరిగిన అల్లర్లు, దాడులు, ప్రతిదాడులకు సంబంధించి ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు విమర్శలకు తావిస్తున్నాయి. శాంతిభద్రతలు అదుపుతప్పడానికి ఏఎస్పీ రామకృష్ణ బాధ్యుడని ఆరోపణలు పెల్లుబికిన నేపథ్యంలో ఆయన్ను కాకుండా డీఎస్పీ గంగయ్య, పట్టణ సీఐ మురళీకృష్ణను సస్పెండ్ చేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం విస్మయం కలిగిస్తోంది. తాడిపత్రి డీఎస్పీగా గంగయ్య 2023 మే5న బాధ్యతలు స్వీకరించారు. మొదటి నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలో రాజకీయ వివాదాలు, శాంతిభద్రతల సమస్య ఏర్పడలేదు. పోలింగ్ అనంతరం అల్లర్లను నియంత్రించేందుకు డీఎస్పీ గంగయ్య తన వంతు కృషి చేశారు. సిబ్బంది తక్కువగా ఉండటం టీడీపీ మద్దతుదారులు భారీగా ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి. పట్టణ సీఐగా ఉన్న మురళీకృష్ణ తాడిపత్రికి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఆయన కూడా వివాదాలకు దూరంగా ఉండేవారు. అల్లర్లను నియంత్రించడానికి సీఐ మురళికృష్ణ ప్రయత్నించి రాళ్ల దాడిలో గాయపడ్డారు. వీరిద్దరూ ఎస్పీతో పాటు తాడిపత్రి ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న ఏఎస్పీ రామకృష్ణ పరిధిలో ఉండటంతో సొంత నిర్ణయాలు తీసుకొని అల్లర్లను నియంత్రించలేని పరిస్థితి. అల్లర్లకు బాధ్యులను చేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల్లో ఎస్పీతో పాటు డీఎస్పీ, సీఐలు సస్పెండ్ చేశారు. అయితే ఏఎస్పీ రామకృష్ణ తప్పించుకోవడం బట్టి చూస్తే ఆయనకు చంద్రబాబుతో డైరెక్టు లింకు ఉందని, ఆ మేరకే తాడిపత్రికి ఎన్నికల ఇన్చార్జ్గా వేయించుకున్నారని, వైఎస్సార్సీపీ అభ్యర్థిని ఓడించడానికి స్థానిక టీడీపీ నాయకులతో చేతులు కలిపారని , ఆ సంబంధాల ద్వారానే సస్పెండ్ను తప్పించుకొని ఉండవచ్చని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనా అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. తాడిపత్రి ఘటనలో బాధ్యుడైన ఏఎస్పీ సేఫ్జోన్ డీఎస్పీ, సీఐలపై సస్పెన్షన్ వేటు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విస్మయం -
రక్తపోటును నిర్లక్ష్యం చేయొద్దు
అనంతపురం మెడికల్: రక్తపోటును నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. ప్రపంచ హైపర్ టెన్షన్ దినాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి జెండా ఊపి ప్రారంభించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకూ ర్యాలీ జరిగింది. బీపీని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారన్నారు. హైబీపీతో గుండె ఆరోగ్యం, స్ట్రోక్స్, మూత్రపిండాల వైఫల్యం వంటి వాటిని ప్రభావం చూపుతాయన్నారు. రక్తనాళాల్లో పీడనం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు (140/90 లేదా అంతకంటే ఎక్కువ) అధిక రక్తపోటు కింద పరిగణిస్తారన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, మద్యం, పొగాకు మానేసి, ఒత్తిడి లేకుండా జీవించాలన్నారు. అనంతరం అసంక్రమిత వ్యాధుల కార్యక్రమాధికారి డాక్టర్ నారాయణస్వామి బీపీ లక్షణాల గురించి విపులంగా తెలియజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత, డాక్టర్ అనుపమజేమ్స్, డాక్టర్ మహీంద్ర, ఓబులు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, పరిపాలనాధికారి గిరిజా మనోహర్, డెమో ఉమాపతి, త్యాగరాజు, గంగాధర్, ఎస్ఓ మహమ్మద్ రఫి, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, ఎన్సీడీ సిబ్బంది శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు మరణాల నియంత్రణకు కృషి అనంతపురం మెడికల్: మాతా, శిశు మరణాల నియంత్రణకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో గత నెలలో జిల్లాలో చోటు చేసుకున్న మాతా, శిశు మరణాలపై సంబంధిత వైద్యులు, సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గర్భిణీని 12 వారాల్లోపు రిజిస్ట్రేషన్ చేయించి, ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు, సేవలను అందించాలన్నారు. ఏ తల్లి ప్రసవం అనంతరం అధిక రక్తస్రావంతో మరణించకూడదన్నారు. ప్రతి గర్భిణీని పరీక్షించాలని, ప్రమాదకర లక్షణాలున్న వారిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవం జరిగేలా, 108ను వినియోగించుకునేలా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెలా అధిక సంఖ్యలో ప్రసవాలు చేయాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీదేవి, గైనకాలజిస్టు డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, డాక్టర్ అరుణలత, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శంకర్నారాయణ, ఎంపీహెచ్ఈఓ లక్ష్మణ్ణ, ఎంపీహెచ్ఎస్ హేమలత, తదితరులు పాల్గొన్నారు. సిజేరియన్లు తగ్గించాలి అనంతపురం మెడికల్: ‘నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు చేయకూడదు. సిజేరియన్లు తగ్గించి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలి’ అని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులను డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి ఆదేశించారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యులతో డీఎంహెచ్ఓ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు చేసిన వైద్యులపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణీ సీ్త్రల ప్రసవ సమయంలో సిజేరియన్ ద్వారా 30 నుంచి 40 శాతం మాత్రమే చేయాల్సి ఉందన్నారు. సిజేరియన్ చేయడానికి గల కారణాలు వైద్యశాఖకు పంపాలన్నారు. ముఖ్యంగా హైరిస్క్ సాధారణ ప్రసవానికి పూర్తీ ఇబ్బంది ఉన్నటువంటి గర్భిణులకు మాత్రమే సిజేరియన్ ద్వారా ప్రసవాలు చేయాలన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే నోటీసులు జారీ చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆరోగ్యశాఖ స్టాటిస్టికల్ ఆఫీసర్ మహమ్మద్ రఫి, డెమో ఉమాపతి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, ఉప డెమో త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భ్రమరాంబదేవి -
అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
అనంతపురం, సాక్షి: జిల్లా గుత్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు సైతం ఉండడం గమనార్హం. పెళ్లి షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగొస్తుండగా ఈ ఘోరం జరిగింది.అనంతపురం రాణినగర్కు చెందిన షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనునంది. పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గుత్తికి 4 కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనపై గుత్తి సీఐ వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మృతులను అల్లీ సాహెబ్ (58), షేక్ సురోజ్బాషా(28) మహ్మద్ అయాన్(6), అమాన్(4), రెహనాబేగం(40)గా గుర్తించారు. -
ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు: ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో టీడీపీ హింసా రాజకీయాలను ఖండిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎస్పీ అమిత్ బర్దర్ సమక్షంలోనే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్పై దాడి జరిగిందని.. ఎస్పీ, ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల సహకారంతోనే తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరిగాయన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల దౌర్జన్యం అమానుషమని.. ఏఎస్పీ రామకృష్ణ చౌదరిని కూడా సస్పెండ్ చేయాలని అనంతవెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు.చంద్రబాబు డైరెక్షన్లోనే..: విశ్వేశ్వరరెడ్డి ఉరవకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఓటమి భయంతోనే టీడీపీ హింసా రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇష్టారాజ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం వల్లే ఎన్నికల్లో హింస చెలరేగిందన్నారు. రౌడీషీటర్లు, ఖూనీకోర్లను పయ్యావుల కేశవ్ పోలింగ్ ఏజెంట్లగా పెట్టారు. తాడిపత్రిలో టీడీపీ అరాచకాలకు పోలీసులే నైతిక బాధ్యత వహించాలని విశ్వేశ్వరరెడ్డి అన్నారు.టీడీపీ దాడులు.. పిరికిపంద చర్య: వీరాంజనేయులుటీడీపీ-జనసేన-బీజేపీలకు ఓటమి భయం పట్టుకుందని..అందుకే వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు అన్నారు.తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి పిరికిపంద చర్యగా భావిస్తున్నామన్నారు. -
No Headline
అనంతపురం ఎడ్యుకేషన్: యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి పరిశ్రమలకు అందిస్తున్నాయి ఐటీఐలు. యువతకు భరోసానిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు పరుస్తున్నాయి. ఐటీఐలలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన మెళుకువలపై పట్టు సాధిస్తుండడంతో కోర్సు పూర్తవగానే మెండుగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. స్వల్పకాలిక వ్యవధిలోనే జీవితాల్లో స్థిరపడుతూ కుటుంబాలకు దన్నుగా నిలుస్తున్నారు. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు.. సంప్రదాయ కోర్సులతో పాటు ప్రతి ఐటీఐలోనూ ఒక్కో కోర్సుకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అనంతపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్, మెషినిస్ట్ గ్రైండర్ కోర్సులు చేసిన పలువురు విద్యార్థులు ప్రముఖ సంస్థలు బీహెచ్ఈఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్, బీఈఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, ఇస్రో తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. కోర్సు మధ్యలోనే ఆన్ జాబ్ ట్రైనింగ్ విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) విధానాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులు చదువుతుండగానే మధ్యలో ఈ ఓజేటీకి పంపుతున్నారు. విద్యార్థులను హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నగరాల్లోని వివిధ సంస్థల్లో మూడు నెలలు, ఆరు నెలల వ్యవధితో సంబంధిత అంశాల్లో నైపుణ్యం పెంపొందిస్తున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు ఆయా సంస్థలు స్టయిఫండ్గా కొంత మొత్తం చెల్లిస్తుండడం గమనార్హం. కోర్సు పూర్తయిన తర్వాత అవే సంస్థల్లో ఉద్యోగులుగా స్థిరపడాలనే సంకల్పంతో ఈ పద్ధతిని తీసుకొచ్చినట్లు తెలిసింది. 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 246 మంది విద్యార్థులు ఓజేటీకి వెళ్లారు. కోర్సులివే... కోపా (ఏడాది కోర్సు), డి/మాన్ సివిల్ (రెండేళ్లు), ఎలక్ట్రీషియన్ (రెండేళ్లు), ఎలక్ట్రానిక్స్ మెకానిక్ (రెండేళ్లు), ఫిట్టర్ (రెండేళ్లు), మెచినిస్ట్ గ్రైండర్ (రెండేళ్లు), మెకానిక్ మోటార్ వెహికల్ (రెండేళ్లు), మెకానిక్ డీజిల్ (ఏడాది), టర్నర్ (రెండేళ్లు), వైర్మెన్ (రెండేళ్లు), వెల్డర్ (ఏడాది), రిప్రిజిరేషన్, ఎయిర్ కండీషన్ టెక్నీషియన్ (రెండేళ్లు), డ్రెస్ మేకింగ్ (ఏడాది),ఫ్లంబర్ (ఏడాది), ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ (రెండేళ్లు), ఐసీటీఎస్ఎం (రెండేళ్లు), మెచినిస్ట్ (రెండేళ్లు). దరఖాస్తుల ఆహ్వానం.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్కు అర్హత కల్గిన విద్యార్థులు జూన్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యానికి పెద్దపీట కోర్సు పూర్తి కాగానే మెండుగా ఉపాధి అవకాశాలు స్వల్పకాలిక వ్యవధిలోనే స్థిరపడుతున్న విద్యార్థులు అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement