-
228 మంది ఉద్యోగులకు నోటీసులు
చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల విధులకు గైర్హాజరైన 228 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ వెల్లడించారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన నిర్వహించిన పోలింగ్కు పీఓ, ఏపీఓ, ఓపీఓ విధులకు పలు శాఖల ఉద్యోగులను నియమించామన్నారు. అయితే బాధ్యతలేకుండా 228 మంది విధులకు హాజరుకాలేదని, వారికి నిబంధనల మేరకు నోటీసులు జారీ చేశామని వివరించారు. 23 నుంచి విత్తనాల పంపిణీ చిత్తూరు అగ్రికల్చర్: ఈ ఖరీఫ్ సీజన్కు అవసరమైన వేరుశనగ విత్తన కాయలను ఈ నెల 23వ తేదీనుంచి రాయితీపై రైతులకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు. జిల్లాలో ఈ సీజన్కు గాను దాదాపు 65వేల హెక్టార్ల మేర వేరుశనగ పంటను రైతులు సాగు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను జిల్లాకు 38,655 క్వింటాళ్ల కాయలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. కే6 రకం కాయలు క్వింటాల్ రూ.9,500, నారాయణి రకం రూ.9,700 ధర నిర్ణయించినట్లు చెప్పారు. అందులో 40 శాతం సబ్సిడీ కింద క్వింటాల్కు రూ.3,800 తగ్గిస్తున్నట్లు వివరించారు. దీంతో కే6 రకం క్వింటాల్ రూ.5,700, నారాయణి రకం రూ.5,820 ధర ఉంటుందని తెలిపారు. ఈమేరకు కే6 30 కేజీల బస్తా రాయితీ పోను రూ.1,710, నారాయణి రకం రూ.1,746 రైతులు చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. ఇప్పటికే ఆయా రైతుభరోసా కేంద్రాల్లో విత్తన కాయలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఈ మేరకు విత్తనాలు అవసరమైన రైతులు తమ పేర్లను ఆయా ఆర్బీకేల్లో నమోదు చేయించుకోవాలని కోరారు. గంగ జాతర ఏర్పాట్ల పరిశీలన చిత్తూరు అర్బన్: నగరంలోని నడివీధి గంగమ్మ జాతర ఏర్పాట్లను ఎస్పీ మణికంఠ శనివారం పరిశీలించారు. తొలుత అమ్మవారి దీపం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జాతర నిర్వాహకులు హారతి అందించారు. అనంతరం మండపాన్ని పరిశీలించి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వంశపారంపర్య ధర్మకర్త కుటుంబీకులు సీకే లావణ్య తదితరులు ఉన్నారు. -
మౌలిక అంశాలే అజెండా
చిత్తూరు కార్పొరేషన్: మౌలిక అంశాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరించడమే అజెండా అని, ఈ మేరకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం ఎన్నికల నిబంధనలకు లోబడి జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరా, వైద్యం, విద్య, వ్యవసాయశాఖలపై సీఈఓ గ్లోరియాతో కలిసి అధికారులతో చర్చించారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పతులపై తరుచూ విమర్శలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు సక్రమంగా వైద్యం అందడంలేదని వార్తలు వెల్లువెత్తుతున్నాయన్నారు. వైద్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వీడాలన్నారు. సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. సమస్యలుంటే జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. బడులు ప్రారంభమయ్యే సమయం దగ్గర పడుతున్నందున ఆ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సచివాలయాల సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 9 ప్రాంతాలకు మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. డీఐఓ రవిరాజు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని వెల్లడించారు. పీహెచ్సీల్లో మందులను అందుబాటులో ఉంచామని వివరించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ మాట్లాడతూ ఈ నెల 23వ తేదీ నుంచి రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనకాయలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డీపీఓ లక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టామన్నారు. దోమల వ్యాప్తి నివారణకు ఫాగింగ్ చేయిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య, మహిళా శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ భారతి పాల్గొన్నారు. మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు -
ఎన్సీసీ శిక్షణతో భవితకు భరోసా
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్సీసీ శిక్షణతో భవితకు భరోసా వస్తుందనరి అంధ్రా బెటాలియన్ క్యాంప్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ లోకనాథన్ తెలిపారు. శనివారం చిత్తూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో వార్షిక శిక్షణ క్యాంపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎన్సీసీలో శిక్షణ పొందే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పారు. శిక్షణలో నేర్చుకునే ప్రతి అంశమూ క్యాడెట్ల ఉన్నతికి దోహదపడుతుందన్నారు. ఎన్సీసీ ఏ,బీ,సీ సర్టిఫికెట్లతో ఉన్నత విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ సదుపాయం లభిస్తుందని వెల్లడించారు. ఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా తల్ సైనిక్, ఐజీసీ ఆర్డీసీ క్యాంప్ల కోసం క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. తుపాకీ, డ్రిల్, ఆబ్స్టెకిల్, మ్యాప్రీడింగ్, కమ్యూ నిటీ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు ప్రసాద్రెడ్డి, గిరిధర్ నాయక్, రమేష్, కార్తిక్, చంద్ర, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
కాల్చిందినాని అన్నే!
‘అన్న(పులివర్తి నాని) ఫైర్ కూడా ఆన్చేశారు.. త్వరగా రండి’ అంటూ తన అనుచరుడు అన్న మాటలు ఇప్పుడు జిల్లాలో హాట్ టాఫిక్గా మారాయి. గత మంగళవారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా వర్సిటీ వద్ద టీడీపీ అల్లరి మూకలు వీరంగం సృష్టించాయి. వైఎస్సార్సీపీ నేతల కార్లు, వాహనాలు ధ్వంసం చేశాయి. స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. ఆ వీడియోలు, ఆడియోలు పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో మహిళా యూనివర్సిటీ వద్ద నానిపై దాడి జరగలేదని, ఆయనకు అసలు గాయాలు కూడా అవ్వలేదని తేటతెల్లమవుతోంది. కేవలం కారుపైన మాత్రమే దాడి జరిగినట్లు వీడియో బయటపడింది. పులివర్తి నానికి కాలు, చేయి విరిగినట్లు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆస్పత్రి వర్గాలు వెల్లడించడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికలు ఈనెల 13న అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంని చేసుకునేందుకు ఓటర్లు నిశ్చయించారు. ఇందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. దీన్ని జీరి్ణంచుకోలేని కూటమి నేతలు ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు విధ్వంసాలకు తెగబడ్డారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు రామచంద్రాపురం మండలం, బ్రాహ్మణకాలువ, చంద్రగిరి మండలంలోని కాసిపెంట్ల, రామిరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్కు అడ్డుగా ఉన్న ఏజెంట్లు, స్థానిక నాయకులపై దాడిచేశారు. అంతటితో ఆగకుండా బ్రాహ్మణకాలువ దళితవాడ, రామిరెడ్డిపల్లెలో కొట్టాల చంద్రశేఖరరెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి వాహనాన్ని తగులుబెట్టారు. మరో కారుని ధ్వంసం చేశారు. పులివర్తి నాని హై డ్రామాటీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై అసలు దాడే జరగలేదని, అతనికి గాయాలే అవ్వలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కారులో ఉన్న పులివర్తి నాని వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పులివర్తి నాని కారు దిగి పరుగెత్తుకెళ్లారు. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. ఆ తరువాత కాసేపటికి గన్మన్ వద్ద ఉన్న తుపాకీ తీసుకున్న పులివర్తి నాని గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే గన్మన్ ఈ కాల్పులతోనే గాయపడ్డారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులివర్తి నానినే గన్ ఫైర్చేశారు.. అన్నదానికి తన అనుచరుడు టీడీపీ నాయకుడికి ఫోన్చేసి మాట్లాడుతున్న ఆడియో ఒకటి బయటపడింది. గన్ ఫైర్చేసిన అనంతరం పులివర్తి నాని సుమారు 2 గంటల పాటు స్ట్రాంగ్ పరిసరాల్లో కలియదిరిగారు. ఆ తరువాత తనపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడిచేశారని, ఆ దాడి కారణంగా స్ఫృహతప్పి పడిపోయినట్లు నటించారు. ఆపై ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి తాను గాయపడినట్లు సరి్టఫికెట్ ఇవ్వమని డిమాండ్ చేశారు. ఆ వైద్యుడు స్విమ్స్కు వెళ్లమని సూచించారు. తన మందీ మార్బలంతో కార్లలో స్విమ్స్కు చేరుకున్నారు. అక్కడ వైద్యులను నయానో భయానో బెదిరించి కాలు, చేయి ఫ్రాక్చర్ అయినట్లు కట్టుకట్టించుకుని మరుసటి రోజు వరకు స్విమ్స్లోనే చికిత్స పొందుతున్నట్లు తన ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకున్నారు. పులివర్తి నానికి ఎటువంటి గాయాలు కాలేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయాలను సిట్ వెలుగులోకి తీసుకొచ్చి వాస్తవాలను బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నాని అరాచకాలు👉 ఎన్నిక అనంతరం టీడీపీ అభ్యర్థి నాని కూచువారిపల్లెకు చెందిన చంద్రగిరి ఏఎంసీ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తల్లిని పక్కకు తోసేసి, ఆ ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇంట్లోని వస్తువులు కాలి బూడిదయ్యే వరకూ నాని, నాని అనుచరులు అక్కడే ఉన్నారు.👉 కూచువారిపల్లిలో ఓ బాలుడిని స్వర్ణముఖి నది వద్దకు తీసుకెళ్లి అతనిపై యూరినేషన్ చేసి అమానవీయంగా చితకబాదారు.👉 కూచువారిపల్లెలో రామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్రెడ్డిని రక్షించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని చుట్టుముట్టారు. ఆయన రెండు కార్లను పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.👉 మోహిత్రెడ్డి అంగరక్షకుడుగా ఉన్న ఈశ్వర్రెడ్డిని ఓ ఇంట్లో కట్టేసి కొట్టారు. మోహిత్ రెడ్డితోపాటు ఉన్న వేణురెడ్డిని బలవంతంగా కొటాల గ్రామం వద్దకు తీసుకెళ్లి చెప్పులతో కొట్టారు. వళ్లంతా వాతలు పడేలా చితకబాదారు.👉 కూచువారిపల్లి రోడ్డుపై నిలబడి ఉన్న బాలుడు కవలికరెడ్డి మర్మాంగాలపై టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తన్ని గాయపరిచారు.👉 తిరుపతి రూరల్ పరిధిలోని రామానుజంపల్లి పోలింగ్ కేంద్రం సమీపంలో నిలబడి ఉన్న ఉపేందర్రెడ్డి, మాధవరెడ్డి, ప్రదీప్రెడ్డిపై దాడికి తెగబడ్డారు.👉 తిరుచానూరు ఎంపీటీసీ నరేష్రెడ్డిపై పులివర్తి నానీతోపాటు చిత్తూరు నుంచి వచ్చిన రౌడీలు ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడిచేశారు.👉 పులివర్తి నానితో వచ్చిన రౌడీలు తిరుపతి రూరల్ మండలం, కుంట్రపాకం గ్రామ మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి కొడుకు అవినాష్రెడ్డిని ఒళ్లంతా బ్లేడ్లతో కోశారు.👉 పాకాల మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ నంగా నరేష్ రెడ్డి కొడుకు లవంత్రెడ్డి రెండు చేతుల వేళ్లు రక్తం కారేలా కోసేశారు. బీటెక్ చదువుతున్న ఇతను ప్రస్తుతం పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి.👉 చెవిరెడ్డి మోహిత్రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తిచేసుకుని తిరుపతి నుంచి ఇంటికి వెళ్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు.👉 అగరాల గ్రామంపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు.👉 ‘తమ ప్రభుత్వం వస్తే మీ అంతు చూస్తాం. రోడ్లపై కూడా తిరగనివ్వం’ అంటూ పులివర్తి నాని, అతని అనుచరులు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను నిత్యం ఫోన్లు చేసి భయపెట్టడం రివాజుగా మారుతోంది.👉 పులివర్తి నాని భార్య సుధా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ దాడులకు పిలుపునిచ్చారు.👉 దీనిపై సిట్ బృందం విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
నైపుణ్యమస్తు.. ఉపాధిప్రాప్తిరస్తు!
యువతకు సకాలంలో ఉపాధి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఐటీఐ కళాశాలల్లో వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు శిక్షణ అందిస్తోంది. త్వరితగతిన ఉద్యోగాలు పొందేలా కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏటా వేలాది మంది యువతీయువకులు జీవితంలో స్థిరపడేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది ఐటీఐలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి పరీక్షల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అనంతరం కోర్సులపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దృష్టి సారించారు. ఇప్పటికే పాలిసెట్, రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. పలువురు విద్యార్థులు ఏ కోర్సులో చేరాలా అని ఆలోచన చేస్తున్నారు. అధిక శాతం మంది విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరగా, కొందరు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నారు. పదోత రగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఐటీఐ పూర్తి చేసినవారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సైతం అవకాశంగా పొందవచ్చని సూచిస్తున్నారు. సాంకేతిక కోర్సుల్లో ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ కోర్సులతో పాటు పలువురు విద్యార్థులు ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనన్ స్టిట్యూట్)కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందుబాటులో 2,356 సీట్లు జిల్లా వ్యాప్తంగా 2024–25 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు 2,356 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలలు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించి పరిశ్రమలకు అందిస్తున్నాయి . యువతకు భరోసానిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు పరుస్తున్నాయి. ఐటీఐలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అవసరమైన మెలకువలపై పట్టు సాధిస్తుండడంతో కోర్సు పూర్తవగానే మెండుగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రముఖ కంపెనీల్లో సైతం.. సంప్రదాయ కోర్సులతో పాటు ప్రతి ఐటీఐలోనూ ఒక్కో కోర్సుకు ప్రాధాన్యమిస్తున్నారు. చిత్తూరులోని ప్రభుత్వ ఐటీఐలో టర్నర్, మెషినిస్ట్, ఫిట్టర్ కోర్సులు చేసిన పలువురు విద్యార్థులు ప్రముఖ సంస్థలు బీహెచ్ఈఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్, బీఈఎల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, ఇస్రో తదితర సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. మధ్యలోనే జాబ్ ట్రైనింగ్.. విద్యా విధానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆన్లైన్ జాబ్ ట్రైనింగ్ (ఓజేటీ) విధానాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులు చదువుతుండగానే మధ్యలో ఓజేటీకి పంపుతున్నారు. విద్యార్థులను హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నగరాల్లోని వివిధ సంస్థల్లో మూడు నెలలు, ఆరు నెలల వ్యవధితో సంబంధిత అంశాల్లో నైపుణ్యం పెంపొందిస్తున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు ఆయా సంస్థలు స్టైఫండ్గా కొంత మొత్తం చెల్లిస్తుండడం గమనార్హం. అలాగే బాగా పనితీరుకనబరిచే విద్యార్థులు అదే కంపెనీల్లో ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి 265 మంది విద్యార్థులు ఓజేటీకి వెళ్లారు. కోర్సులివే... ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్ మోటర్ వెహికల్, (పదో తరగతి విద్యార్థతతో రెండు సంవత్సరాల కోర్సులు), వెల్డర్, మెకానికల్ డీజిల్, కంప్యూటర్ కోర్సు (పదోవతరగతి విద్యార్హతతో ఒక ఏడాది కోర్సులు) ఐటీఐ కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు www. iti.ap.gov.in వెబ్సైట్లో ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలో తొలివిడత కౌన్సెలింగ్కు అర్హత కల్గిన విద్యార్థులు జూన్ 10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇతర వివరాలకు 7799933370, 7799679351, 9493629036 నంబర్లలో సంప్రదించవచ్చు. ఉన్నత చదువులకు అవకాశం ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు అనంతరం బీటెక్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. చిత్తూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఐటీఐ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విద్యార్థులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణకు కోర్సులు విద్యనభ్యసించగానే మెండుగా అవకాశాలు స్వల్పకాలిక వ్యవధిలోనే స్థిరపడుతున్న యువత జిల్లా సమాచారం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు : 07 ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు : 09 2022–23లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు : 2,372 2023–24లో ప్రవేశం పొందినవారు : 2,356 2024–25లో అందుబాటులోని సీట్లు : 2,356 కోర్సు పూర్తయితే ఉద్యోగం సులువే.. ఐటీఐ ఉత్తీర్ణులైన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు. విద్యుత్, రైల్వే, రక్షణ తదితర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తున్నాయి. ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఐటీఐల్లో స్కిల్ హబ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికి సైతం ఐటీఐ కోర్సు దోహదపడుతుంది. -
గంగమ్మ ఆలయంలో చోరీ
పలమనేరు : మండలంలోని మొరం గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి గిన్నెబొట్టు, హుండీలోని నగదును అపహరించారు. శనివారం ఈ విషయాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో 40 రోజులుగా ప్రత్యేక పూజలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారి బంగారు ముక్కుపుడకపై కన్నేసిన దుండగులు చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. దుండగులు మొత్తం రూ.30వేల సొత్తు చోరీ చేసినట్లు గ్రామస్తులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టిప్పర్ బోల్తా : డ్రైవర్ మృతి
బంగారుపాళెం: మండలంలోని జయంతి ఎస్టీ కాలనీ వద్ద శనివారం సాయంత్రం టిప్పర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. వివరాలు.. కాలనీ సమీపంలో ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం టిప్పర్లతో మట్టి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగువబందార్లపల్లెకు చెందిన రాజేష్(34) తన టిప్పర్లో మట్టి అన్లోడ్ చేస్తుండగా హైడ్రాలిక్ రాడ్ విరిగి బోల్తాపడింది. దీంతో వాహనంలో ఇరుక్కుపోయి రాజేష్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. టిప్పర్ నుంచి డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
No Headline
ఎలక్ట్రానిక్ మెకానిక్ కోర్సు చేస్తున్నా నేను చిత్తూరులోని ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రానిక్ మెకానిక్ కోర్సు రెండో సంవత్సరం చదువుతున్నా. ఇక్కడి అధ్యాపకులు చక్కగా పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. కళాశాలలో మంచి సౌకర్యాలున్నాయి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఐటీఐ చదువుకుంటున్నాను. నైపుణ్యాలు పెంచుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడతా. – వేణుగోపాల్, విద్యార్థి, యాదమరి మండలం డిగ్రీ పూర్తి చేసి ఐటీఐలో చేరా డిగ్రీ కోర్సు పూర్తి చేశా. టెక్నికల్ వైపు వెళ్లాలనే ఉద్దేశంతో తిరిగి ఐటీఐ కోర్సులో చేరా. ప్రస్తుతం చిత్తూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో డ్రాప్ట్మెన్ సివిల్ కోర్సు ఫస్టియర్ చదువుతున్నా. ఇది పూర్తికాగానే నేను అనుకున్న రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తా. వర్చువల్ పద్ధతిలో శిక్షణ బాగా ఇస్తున్నారు. సౌకర్యాలు చక్కగా ఉన్నాయి. – ఐశ్వర్య, విద్యార్థిని, చిత్తూరు గతంలో ఎన్నడూ లేని వసతలు గతంలో ఎన్నడూ లేని వసతులు ఇప్పుడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఉన్నాయి. చిత్తూరులోని ఐటీఐ కళాశాలల్లో రూ.10 లక్షలతో వర్చువల్ క్లాస్రూం, ఏఆర్, వీఆర్ ల్యాబ్ను రూ.29 లక్షలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షలు సీబీటీ విధానంలో జరుగుతాయి. ఏటా వేల మంది విద్యార్థులు ఐటీఐ పూర్తి చేసి మంచి నైపుణ్యాలతో ఉన్నత ఉద్యోగాల్లో చేరుతున్నారు. – రవీంద్రరెడ్డి, ప్రభుత్వ,ప్రైవేట్ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్ -
విద్యుత్ చౌర్యంపై కేసులు
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాన్స్కో 8 డివిజన్ల పరిధిలోని మొత్తం 3,529 విద్యుత్ సర్వీసులను సిబ్బంది తనిఖీ చేశారు. తిరుపతి ఆపరేషన్ 99, తిరుపతి రూరల్ 50, పుత్తూరు 94, చిత్తూరు అర్బన్ 79, చిత్తూరు రూరల్ 59, మదనపల్లె 74, పీలేరు 41, పుంగనూరు పరిధిలో 63 కేసులు బుక్ చేశారు. ఇందులో విద్యుత్ అదనపు లోడ్ కేసులు 483 కేసులకు గాను క్రమబద్ధీకరణ రుసుము రూ.13.43 లక్షలు, చౌర్యం కేసులు 76కు గాను రూ.59 వేలు జరిమానాతో కలిపి మొత్తం 559 సర్వీసులపై కేసులు నమోదు చేసి రూ.14.02 లక్షలు చెల్లించాలని వినియోగదారులకు నోటీసులు ఇచ్చినట్లు ఎస్ఈ కృష్ణారెడ్డి వివరించారు. -
స్కూల్ బస్..‘ఫిట్నెస్’
● జిల్లా రవాణాశాఖ కార్యాలయం వద్ద బడి బస్సుల తనిఖీ ● కండిషన్లో లేకుంటే అనుమతి నిరాకరణ ● టెస్ట్లో నెగ్గితేనే సర్వీస్కు పర్మిషన్ కాణిపాకం: జిల్లాలోని పాఠశాలలను త్వరలోనే పునఃప్రారంభంకానున్నాయి. ఈ మేరకు బడి బస్సులు రోడెక్కనున్నాయి. ఈక్రమంలో విద్యార్థులు ప్రతి రోజూ ప్రయాణించే స్కూల్, కళాశాల బస్సుల ఫిట్నెస్ పరీక్షలకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. పరీక్షలో తప్పనిసరిగా బస్సులు కండిషన్లో ఉన్నట్లు రుజువు కావాలని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 852 బస్సులు జిల్లాలో బడి బస్సులు 852 వరకు ఉన్నాయి. వీటి లో ప్రతిరోజు 20 నుంచి 30 బస్సుల కండిషన్ను అధికారులు పరీక్షిస్తున్నారు. వాహనంలో లోటు పాట్లు కనిపిస్తే వెంటనే వెనక్కి పంపిస్తున్నారు. ఆ లోపాలను సరిదిద్దేంత వరకుకు సర్టిఫికెట్ జారీ చేయడంలేదు. పరీక్షలు ఇలా.. ● స్కూల్ బస్సును మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వయంగా డ్రైవ్ చేస్తారు. ● మరమ్మతులు ఏమైనా ఉన్నాయి గుర్తిస్తారు. ● బ్రేకులు, క్లచ్, స్టీరింగ్, హ్యాండ్ బ్రేక్, బ్యాటరీ, ఇంజన్కు సంబంధించి పలు విభాగాలను పరిశీలిస్తారు. ● అత్యవసర ద్వారాలు, కిటికీలు, టైర్లు, సీట్లను పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాతే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. నిబంధనలు ఇలా.. ● డ్రైవర్కు 60 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఐదేళ్లు అనుభవంతో కూడిన భారీ వాహన లైసెన్సు తప్పనిసరి ● శారీరక దారుఢ్యంతోపాటు ఆరోగ్యంగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ● డ్రైవర్, సహాయకుడు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి. వేగంగా, నిర్లక్ష్యంగా బస్సు నడపకూడదు ● బస్సులో ప్రథమ చికిత్స బాక్సు ఉండాలి ● విద్యార్థులు ఎక్కేందుకు, దిగేందుకు ఆధారంగా బస్సుకు రెండు వైపులా ఇనుప కడ్డీలు ఉండాలి. వాహనం ముందు భాగంలో పాఠశాల పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు తప్పనిసరి. కండిషన్ లేకుంటే చర్యలు స్కూల్ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. అన్నీ సక్రమంగా ఉంటేనే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తాం. ఫిట్నెస్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సును రోడ్డుపై తిరగనివ్వం. ఫిట్నెస్ పరీక్ష చేయించకుండా బస్సు నడిపితే కేసులు నమోదు చేస్తాం. లైసెన్స్ ఉన్న డ్రైవర్తోనే బండి నడిపించాలి. – నిరంజన్రెడ్డి, డీటీసీ, చిత్తూరు -
మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేత సంజన
చంద్రగిరి (తిరుపతి జిల్లా): జైపూర్లో స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా–2024 టైటిల్ను చంద్రగిరికి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద(18) గెలుచుకున్నారు. ఈ నెల 7–12 వరకు మలేసియాలోని కౌలాలంపూర్లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్–2024 పోటీలో భారత్కు సంజన వరద ప్రాతినిథ్యం వహించింది.ఈ పోటీల్లో ఆమె 1వ రన్నరప్గా నిలిచింది. సంజన బెంగళూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో అవార్డును గెలుచుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతోపాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ అవార్డు, పాపులర్ అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఆమె తన పిత్తా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో చేసిన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరీటాన్ని సాధించడమే తన ధ్యేయమని, దానికోసమే కష్టపడతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహీత సంజన వరద అన్నారు. -
ఇలాంటి క్షోభ ఎవరికీ రాకూడదు
పుత్తూరు: బాబు, విజయ దంపతులకు కలిగిన క్షోభ మరెవరికీ రాకూడదని మంత్రి ఆర్కే రోజా భావోధ్వేగం చెందారు. శుక్రవారం వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం గ్రామానికి వెళ్లి ముగ్గురు ఆడ బిడ్డలను పోగొట్టుకొన్న తల్లిదండ్రులను మంత్రి ఓదార్చారు. వారి బాధను చూడలేక ఆమె కూడా కంటతడి పెట్టారు. శివుడికి పూజలు చేసి, దీపారాధన చేస్తూ చెరువులో పడి మృత్యువాత పడ్డ చిన్నారులు రూపిక, చరిత, యుషిక మృత దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో గుండె రాయి చేసుకోవాలని, తాను అండగా ఉంటానని బాధిత కుటుంభానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కోరారు. బాసటగా నిలవాలని గ్రామస్తులను కోరారు. అనంతరం అశ్రునయనాల మధ్య చిన్నారుల మృత దేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
● తాతయ్యగుంట గంగమ్మకు తోటి వేషాలతో మొక్కులు ● అమ్మవారికి సేవకు పోటెత్తిన భక్తులు
అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు అంటూ భక్తులు ప్రార్థించారు. జాతరలో భాగంగా మూడోరోజు శుక్రవారం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి పోటెత్తారు. తోటి వేషాలు ధరించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయ ఆవరణలో పొంగళ్లు పొంగించి నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని సేవించుకుని తన్మయత్వం చెందారు. ఈ క్రమంలో నాలుగోరోజు శనివారం కై కాల, రజక కులస్తులు అనువంశిక వేషాలతో పురవీధుల్లో సంచరిస్తూ పూజలందుకోనున్నారు. అనంతరం గంగమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. – తిరుపతి కల్చరల్ -
24 నుంచి టెన్త్ సప్లిమెంటరీ
చిత్తూరు కలెక్టరేట్ : పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి జూన్ 3 వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ దేవరాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, 2006 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల పకడ్బందీ నిర్వహణకు చీఫ్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు జూన్ ఒకటి నుంచి 8వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 కేంద్రాలలో 1561 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని డీఈఓ వెల్లడించారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలన చిత్తూరు అర్బన్: నగరంలోని ఎస్వీ సెట్ కాలేజీలోని స్ట్రాంగ్రూమ్ను శుక్రవారం ఎస్పీ మణికంఠ చందోలు తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును క్షుణంగా పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కౌటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అరిఫుల్లా, డీఎస్సీలు పావన్కుమార్, మహబూబ్బాషా పాల్గొన్నారు. మైనారిటీ గురుకులాల్లో డైరెక్ట్ అడ్మిషన్లు చిత్తూరు కలెక్టరేట్ :జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ అధికారి చిన్నారెడ్డి వెల్లడించారు. శుక్రవారం విలేకరులతో ఆయ న మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరానికి మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలల్లో ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, పార్శిక్, బౌద్ధులు, జైను కులస్తుల విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయకుండానే అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. జిల్లా కేంద్రంలోని మురకంబట్టు మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో 63, 6వ తరగతిలో 55, 7వ తరగతిలో 48, 8వ తరగతిలో 47 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు భోజనం, వసతి సౌకర్యం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, కాస్మొటిక్ చార్జీలు, వైద్య సౌకర్యం కల్పి స్తున్నట్లు వివరించారు. వివరాలకు 8712625058, 9441155061 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు శరవేగంగా ఎన్హెచ్ పనులు చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని ఎన్హెచ్ఎఐ పీడీ కార్తీక్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బెంగళూరు–చైన్నె ఎక్స్ప్రెస్ పనుల్లో భాగంగా బెతమంగళం నుంచి బైరెడ్డిపల్లె వరకు మొత్తం 25 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 15 కిలోమీటర్లు పూర్తి అయినట్లు పేర్కొన్నారు. బైరెడ్డిపల్లె– బంగారుపాళ్యం 31 కిలోమీటర్లకు గాను 5 కి.మీ, బంగారుపాళ్యం–గుడిపాల మార్గంలో 29 కి.మీగాను 21.5 కి.మీ నిర్మించినట్లు తెలిపారు. చిత్తూరు–తచ్చూరు రోడ్డులో వరదారాజులపల్లె–కుమారారాజాపేట వరకు 43.8 కి.మీ నిర్మించాల్సి ఉండగా 25 కి.మీ పూర్తి చేశామన్నారు. కుమారారాజాపేట–వీరకావేరిరాజాపురం 17.58 కి.మీ గాను 1.6 కి.మీ, వీరకావేరిరాజాపురం–పొండవకం వర కు 34.66 కిలోమీటర్లకు గానూ 25 కి.మీ నిర్మించినట్లు ఆయన వివరించారు. 27 నుంచి వసంతోత్సవాలు తిరుపతి(అలిపిరి): శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారీ స మేతంగా వసంతోత్సవంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీవారు, సీతాలక్ష్మణ హనుమ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించనున్నట్లు వివరించారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం అంతరార్థమని తెలిపారు. ఒక రోజు సేవలో పాల్గొనేందుకు దంపతులు రూ.516 చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
బోయకొండ గంగమ్మా..పాహిమాం
చౌడేపల్లె: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల అభిషేక పూజలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. గంగమ్మ తల్లీ శరణు అంటూ పూజల్లో పాల్గొన్నారు. వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాల సమయంలో అమ్మవారికి అభిషేక పూజలు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు ఉపవాస దీక్షలతో పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అన్న ప్రసాదాల పంపిణీ ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్, ఈఓ పర్యవేక్షణలో సుమారు 2 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం బోయకొండ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న చోట జరుగుతున్న మరమ్మతు పనులను ఈఓ, చైర్మన్ పరిశీలించి తగు సూచనలు చేశారు. -
సప్తగిరి.. భక్తఝురి
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోవడంతో భక్తుల క్యూ శిలాతోరణం వరకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 76,369 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 41,927 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.63 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలో శుక్రవారం భా రీగా వర్షం కురవడంతో తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మాడవీధులు జలమయమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. -
మొదటి ఘాట్లో ప్రమాదాలు
తిరుమల : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శుక్రవారం పలు ప్రమాదాలు జరిగాయి. వివరాలు.. తమిళనాడుకు చెందిన భక్తులు మినీవ్యాన్లో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో కిందకు దిగుతుండగా మాల్వాడిగుండం సమీపంలో వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాన్లోని కొందరు భక్తులకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యాన్ను పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఈ ప్రమాద సమయంలో అటుగా వస్తున్న టీటీడీ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో లారీ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది. అలాగే ఘాట్ 19వ మలుపు వద్ద తమిళనాడుకు చెందిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలోనే టీటీడీ వాటర్ ట్యాంకు కూడా డివైడర్ను ఢీకొంది. -
చిన్న పొరబాటు జరిగినా కఠిన చర్యలు
● కౌంటింగ్ కేంద్రంలో పకడ్బందీ ఏర్పాట్లు ● చిత్తూరు ఆర్ఓ శ్రీనివాసులు చిత్తూరు కలెక్టరేట్ : కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లల్లో చిన్నపొరబాటు జరిగినా చర్యలు కఠినంగా ఉంటాయని చిత్తూరు అసెంబ్లీ ఆర్ఓ శ్రీనివాసులు అన్నారు. చిత్తూరు ఎస్పీ మణికంఠతో కలిసి ఆయన ఎస్వీ సెట్లోని కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పరిశీలించారు. అనంతరం ఆర్ఓ శ్రీనివాసులు మాట్లాడుతూ కౌంటింగ్కు ఏర్పాట్లు పకడ్బందీగా చేప ట్టాలన్నారు. అధికారులు, సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఐడీ కార్డు, ప్రొసిడింగ్ ఉత్తర్వులు ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని చెప్పారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉంటుందని తెలిపారు. 24 గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్కు ఏజెంట్లు వచ్చినప్పుడు రిజిస్టర్లో సంతకాలు చేయించుకోవాలని తెలిపారు. కంట్రోల్ రూమ్లో మూడు షిప్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిం చేలా చేపట్టి, వారందరికీ ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలో పోలీసులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా అలసత్వం ప్రదర్శించకూడదని తెలిపారు. డీఆర్ఓ పుల్లయ్య, ఏఎస్పీ అరిపుల్లా, కమ్యునికేషన్ మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ నరసింహులు, ఏఆర్ఓలు శ్రీనివాసులురెడ్డి, విజయలక్ష్మి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి అధికారులతో ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్వీ సెట్లో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టేబుల్స్ వేయించడం, సీసీ కెమెరాల ఏర్పాటు, బారికేడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పనపై అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలించి లోపాలు ఉన్నట్లైతే సరిచేయాలన్నారు. సిబ్బంది వివరాలతో పాటు కంప్యూటర్లు, నెట్ తదితర సాంకేతిక అంశాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని ఆయన తెలిపారు. -
పక్కాగా ‘విద్యాహక్కు’
● పేద పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ విద్య ● జిల్లాలో 827 మంది విద్యార్థులు ఎంపిక ● ఈ నెల 20లోపు అడ్మిషన్లు ● తొలి జాబితా విడుదల చేసిన విద్యాశాఖ తిరుపతి ఎడ్యుకేషన్ : ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1) (సి) ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25శాతం మంది విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వాలి. దీనికి అనుగుణంగా ప్రభుత్వం 2024–25వ విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని 34మండలాలకు గాను 31మండలాల నుంచి 1,407మంది పేద విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో నిబంధనలకు లోబడి ఉన్న 1,024మంది దరఖాస్తులను పరిగణలోకి తీసుకుని అందులో 827మందిని ఎంపిక చేస్తూ విద్యాశాఖ మొదటి విడత జాబితాను విడుదల చేసింది. జిల్లాలో ఎంపిక ఇలా.. విద్యాహక్కు చట్టం ప్రకారం సీఎస్ఈ వెబ్ పోర్టల్లో జిల్లాలోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్లు అమలుచేస్తున్న జిల్లాలోని 402 ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు రిజిస్ట్రేషన్లు చేసుకున్నాయి. అనంతరం ఆయా పాఠశాలలు ప్రభుత్వ నిబంధనల మేరకు ఒకటో తరగతిలో ప్రవేశాలకు 25శాతం సీట్లను కేటాయించాలి. అందులో భాగంగానే విడుదల చేసిన తొలి విడత జాబితాలో 827మంది విద్యార్థులు సీట్లు పొందనున్నారు. 20లోపు అడ్మిషన్లు పొందాలి విద్యాశాఖ విడుదల చేసిన జాబితా మేరకు జిల్లాలోని ఎంపిక చేసిన 827మంది విద్యార్థుల్లో ఇప్పటికే 600మందికి పైగా అడ్మిషన్లు పొందారు. మిగిలిన విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ఎంపికై న పాఠశాలలకు వెళ్లి సంబంధిత ధ్రువీకరణపత్రాలను సమర్పించి అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.సద్వినియోగం చేసుకోండి ఉచిత విద్యాహక్కు చట్టం మేరకు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటికే తొలివిడత జాబితాలో 827మంది లబ్ధి పొందగా, వారిలో 600కుపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. మిగిలిన వారు ఈ నెల 20వ తేదీలోపు ఎంపికై న ఆయా పాఠశాలలకు వెళ్లి అడ్మిషన్లు పొందాలి. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని పేద విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి. – శేఖర్, డీఈఓ, తిరుపతి -
విమానంలో విహారయాత్రకు విద్యాకుసుమాలు
సత్యవేడు: మాధనసాళెం జెడ్పీఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధిస్తే విమానంలో విహాయ యాత్రకు పంపుతానని సురుటుపల్లె ఆలయ కమిటీ సభ్యుడు ఉమాపతి ప్రకటించిన విషయం విధితమే. అందులో భాగంగా విద్యార్థులు పురుషోత్తం(552), వి. విష్ణు( 515),మహా(509), తనూజ(505)తోపాటు ప్రధానోపాధ్యాయుడు మునిమోహన్ను శుక్రవారం చైన్నె నుంచి హైదరాబాద్కు విమానంలో పంపించారు. టికెట్లతోపాటు విద్యార్థుల రెండు రోజుల విహార యాత్రకు అయ్యే మొత్తం ఖర్చును ఉమాపతే భరిస్తున్నారు. ఈ మేరకు ఉమాపతిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. -
పలమనేరు జాతరకు వేళాయే..
● కోరిన కోర్కెలు తీర్చే గంగమ్మ తల్లి ● గంగ జాతరకు 300 ఏళ్ల చరిత్ర ● 20న శిరస్సు మెరవణి, 22న విశ్వరూప దర్శనం ● మొదలైన పండుగ సందడిపలమనేరు: జిల్లాలోనే పలమనేరులో జరిగే తిరు పతి గంగమ్మ జాతరకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రాంతం గతంలో తమిళనాడు రాష్ట్రంలోని నార్త్ ఆర్కాట్ జిల్లాలో ఉన్నప్పటి నుంచి ఇక్కడ జాతర జరుగుతోంది. ఈజాతరకు స్థానికులే కాకుండా ఇరుగుపొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న స్థానికులు సైతం వస్తుంటారు. జిల్లాలోని జాతర్లకు విభిన్నంగా ఇక్కడి జాతరలో అమ్మవారి శిరస్సు మెరవణి కార్యక్రమం ప్రత్యేకంగా జరుగుతుంది. అమ్మవారి శిరస్సును తాకేందుకు జనం ఆసక్తిని చూపుతుంటారు. జాతరకు ముందు పట్టణంలో గంగచాటు పెట్టినప్పటి నుంచి పట్టణంలో పండుగ సందడి మొదలవుతుంది. అప్పటినుంచి స్థానిక మారెమ్మ, గంగమ్మ ఆలయాల వద్ద మహిళలు పొంగళ్లను పెట్టడం ఆనవాయితీ. అప్పటినుంచి జాతర వరకు అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తుంటారు. పట్టణానికి ఆనుకుని ఉన్న గ్రా మాలనుంచి ప్రజలు పొంగళ్లు పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి వస్తుంటారు. ఇక పట్టణంలోని కులసంఘాలు వారు రోజుకొక్కరు చొప్పున ప్రత్యేక పూజలు, అన్నదానాలను చేయడం ఆనవాయితీ. శిరస్సు మెరవణిలో లక్షల్లో టెంకాయలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగే జాతర్లకు భిన్నంగా ఇక్కడ బంగారు పూత పూసిన అమ్మవారిని శిరస్సును పట్టణంలో ఊరేగిస్తారు. ఈ తంతు పట్టణంలోని పాతపేట వేణుగోపాలస్వామి ఆలయం నుంచి అనాథిగా వస్తోంది. ఈ సందర్బంగా భక్తులు అమ్మవారికి లక్షల్లో టెంకాయలను కొట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయం వద్ద విస్త్రృత ఏర్పాట్లు.. పలమనేరు పట్టణంలో ఈనెల 20 నుంచి 22 దాకా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే తిరుపతి గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేవాదాయశాఖాధికారులు ఆలయం వద్ద విస్తృత ఏర్పాట్లను చేపట్టారు. విద్యుద్దీపాలంకరణలతో శోభాయమానంగా అలంకరణలు చేశా రు. చలువపందిళ్లు, భారీ క్యూలు ఏర్పాటు చేశారు. మరోవైపు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు భక్తులు విచిత్ర వేషధారణలతో ఇప్పటికే ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలో దుకాణాలు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. మరోవైపు పొరుగునే ఉన్న మారెమ్మ ఆలయంలో పొంగళ్ల నివేదన కార్యక్రమం నిత్యం ఘనంగా సాగుతోంది. అమ్మవారికి అభిషేకం, అన్నదానం... స్థానిక గంగమ్మ ఆలయం వద్ద శుక్రవారం రెడ్డిసంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు జరిగాయి. సంప్రదాయ దుస్తులను ధరించి వారంతా పూజల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. యోగివేమారెడ్డి ట్రస్టు అధ్యక్షుడు చెంగారెడ్డి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం స్థానిక వడ్డెర సంఘం, మాజీ సైనికోద్యోగులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానాలు చేపట్టారు. పట్టణంలో ఎటు చూసినా సందడి నెలకొంది. భారీ బందోబస్తు జాతరను శాంతియుతంగా నిర్వహించేందుకు భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నట్లు సీఐ చంద్రశేఖర్ తెలిపారు. చిన్నపిల్లల కోసం భారీ రంగుల రాట్నాలు, జాయింట్ వీలర్లును ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు ఆలయం వద్ద అవసరమైన సౌకర్యాలను చేపట్టారు. పలు చర్యలు తీసుకున్నారు. అమ్మవారి జలది చేసే చోట అవసరమైన పనులను చేపట్టారు. పట్టణంలో ఎటు చూసినాజాతర సందడి కనిపిస్తోంది. -
మరణంలోనూ వీడని బంధం
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ఒకరినొకరు విడిపోకూడదని ఉపాధి కూడా ఒకే చోట వెతుక్కున్నారు. ఎక్కడికి వెళ్లినా ఒకటిగానే వెళ్లేవారు. స్నేహితుడి వివాహానికి హజరయ్యేందుకు వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ ఒకేసారి దుర్మరణం చెందడం కుటుంబ సభ్యులు, సహా మిత్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. నగరి రూరల్ మండలం తడుకుపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నగరి: నగరి రూరల్ మండలం తడుకుపేట వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లా నైనార్ కోయిల్ గ్రామానికి చెందిన ఇళంగన్ (27), కన్నన్ (28) మృతిచెందగా, నగరి మున్సిపాలిటీ సత్రవాడకు చెందిన సంజయ్ (29) తీవ్రంగా గాయపడ్డాడు. మృతుని బంధువుల కథనం మేరకు.. చిన్ననాటి నుంచి ఇళంగన్, కన్నన్ మిత్రులు. వీరు ఉపాధి కూడా ఒకే చోట వెతుక్కున్నారు. చైన్నెలోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. వీరు తిరుపతిలో జరిగే సహ ఉద్యోగి వివాహానికి హాజరయ్యేందుకు పని ముగించుకొని మరో మిత్రుడు నగరికి చెందిన సంజయ్తో కలిసి ముగ్గురు ఒకే బైక్పై బయలుదేరారు. రాత్రి కావడంతో నగరి రూరల్ మండలం తడుకు పేట వద్ద అదుపుతప్పి రోడ్డుపై నిలిచి ఉన్న బొలేరో వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇళంగన్, కన్నన్ ఘటన స్థలంలోనే మృతి చెందగా, సంజయ్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఉన్నత వైద్య చికిత్స నిమిత్తం చైన్నెకి తరలించారు. విషయం తెలిసిన మృతుల బంధువులు, మిత్రులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. నైనార్ కోయిల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నీటి వీడ్కోలు ఫ్లెక్సీలో మిత్రులిద్దరినీ ఒక్కటిగానే ఉంచడంతో చూసినవారి గుండెలు తరుక్కుపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేష్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో స్నేహితుల మృతి మరొకరికి తీవ్రగాయాలు పెళ్లికి హాజరయ్యేందుకు వస్తుండగా తడుకు పేట వద్ద ఘటన -
పెంచలకోనకు ప్రత్యేక బస్సులు
రాపూరు: మండలంలోనిపెంచలకోన బ్రహ్మోత్సవాలకు 120 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రాపూరు ఆర్టీసీ డిపో మేనేజర్ అనిల్కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తిరుపతి, నెల్లూరు, గూడూరు, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి, వాకాడు, కావలి, వెంకటగిరి, గూ డూరు, వైఎస్సార్ జిల్లా కడప, మైదుకూరు, రాజంపేట, బద్వేల్ నుంచి ప్రత్యేక బస్సులను శనివారం నుంచి నడపనున్నట్లు వివరించారు. 22న నృసింహ జయంతి, 23న శ్రీవారి కల్యాణం నేపథ్యంలో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశముందని, ఆ మేరకు బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అన్ని బస్సుల్లో మామూలు చార్జీలనే వసూలు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలమనేరుకు చెందిన ద్విచక్రవానదారుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చైన్నె నుంచి బెంగళూరు వెళుతున్న లారీ మొగిలి ఘాట్లో జాతీయ రహదారి మధ్యలో నిలిచిపోయింది. అదే సమయంలో చిత్తూరు నుంచి పలమనేరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనం లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో పలమనేరు పట్టణం పాతపేట అంబేడ్కర్ నగర్కు చెందిన మురుగేష్ కుమారుడు సురే ష్(21) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో బంగారుపాళెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందాడు. ఏఎస్ఐ మళ్లెమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాటుబాంబు పేలి పెంపుడు కుక్కకు గాయాలు చౌడేపల్లె: దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లె సమీపంలో శుక్రవారం నాటుబాంబు పేలి పెంపుడు కుక్కకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రైతు చెంగారెడ్డి పెంపుడుకుక్కను పెంచు కుంటున్నాడు. శుక్రవారం ఇంటికి సమీపంలో ఉన్న ఒక రైతు మామిడితోటలోకి కుక్క వెళ్లింది. కొద్దిసేపటికి పెద్ద పేలుడు శబ్దం వచ్చింది. చెంగారెడ్డి అక్కడికి వెళ్లి చూడగా నాటు బాంబు పేలి కుక్క తీవ్రంగా గాయపడి ఉంది. దవడ భాగం చీలిపోయి ఉంది. వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు పాతిపెట్టిన నాటుబాంబును కొరకడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనతో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెంగారెడ్డి తెలిపారు. ఆముదాలకోనలో ఒంటరి ఏనుగు! చంద్రగిరి : మండలంలోని ఆముదాల కోన వద్ద అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు సంచరిస్తున్నట్లు పనపాకం రేంజ్ డీఆర్ఓ చిన్నబాబు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం అటవీప్రాంతంలో ఆయన పర్యటించి ఏనుగు కాలి గుర్తులను పసిగట్టారు. గతంలో తవణంపల్లె, పాకాల వద్ద ఇద్దరిని హతమార్చింది ఈ ఏనుగే అని గుర్తించామని డీఆర్ఓ వెల్లడించారు. ఈ మేరకు ఆముదాల కోన ఎస్టీ కాలనీ, కల్రోడ్డుపల్లె, మిట్టూరు, కాశిపెంట్ల, కొత్త ఇండ్లు గ్రామాల్లోని ప్రజలకు తీసుకోవాల్సిన అవగాహన కల్పించారు. ఒంటరి ఏనుగు ఎక్కడ కనిపించినా వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఏనుగును దారి మళ్లించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం పిచ్చాటూరు : స్థానిక పీహెచ్సీ సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. శివగిరి ఏఏడబ్యూకు చెందిన మాతయ్య(22) ద్విచక్రవాహనంపై పిచ్చాటూరుకు వస్తుండగా శ్రీరామాపురం వెళుతున్న బస్సు ఢీకొంది. దీంతో మాతయ్య అక్కడికక్కడే మరణించాడు. ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదిగో ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటున్నా
● భార్య, అక్కకు వీడియో కాల్ ● రైలు కింద పడి అటెండర్ ఆత్మహత్య కుప్పం: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న నరేంద్ర మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు, మదనపల్లె సమీపంలోని బసినికొండకు చెందిన నరేంద్ర మూర్తి (40) శాంతిపురం మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఇటీవల తాగుడుకు బానిసయ్యాడు. గురువారం కుప్పం రైల్వే స్టేషన్కు వచ్చి భార్య కల్పన, అక్క సుజాతకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకోవాల్సిన రూట్ను వీడి యో కాల్లో చూపించినట్లు తెలిసింది. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహానికి కుప్పం వంద పడకల ఆస్పత్రిలో పంచనామా చేసి, బంధువులకు అప్పగించారు. మృతుడికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. -
మృతుల కుటుంబాల్లో తీరని విషాదం
బంగారుపాళెం: కూలి పనులకు వెళితేగానీ బతుకు సాగని కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీరని విషాదం నింపింది. మండలంలోని మొగిలి ఘాట్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కీరమంద గ్రామానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరు మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారందరూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన ఓ రైతుకు వరిగడ్డి తీసుకువచ్చేందుకు అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్, రాజా, నాగభూషణం, రాజయ్య, జయచంద్ర, బాబు కూలీలుగా ట్రాక్టర్లో చౌడేపల్లె మండలం రాయలపేటకు వెళ్లారు. వరిగడ్డి లోడుతో వారు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో మొగిలి వద్ద ట్రాక్టర్ను కట్టెల లోడ్డుతో కర్ణాటక నుంచి చిత్తూరు పోతున్న లారీ ఢీకొనడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రాజా బంగారుపాళెంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం రాజాకు వివాహమైంది. పిల్లలు లేరు. వేణుగోపాల్ పలమనేరు ఏరియా ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆడపిల్లలకు పెళ్లయిపోయింది. పోలీసులు గురువారం రోడ్డు ప్రమాద మృతులకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోడ్డు ప్రమాద సంఘటన కీరమంద గ్రామంలో విషాదాన్ని నింపింది. కూలి చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునే ఇంటి యజమానులు విగత జీవులుగా, క్షతగాత్రులుగా మారిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement