-
అక్కడ గాజు గ్లాస్ ముందే పగిలిందా..?
ఎన్నికల ఫలితాల డేట్ దగ్గరపడేకొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో పోటీ చేసిన గ్లాస్ పార్టీ ఏజెన్సీలోని పోలవరంలో కూడా బరిలో దిగింది. టిక్కెట్ ఆశించిన టీడీపీ నేతలు గ్లాస్ను పగలగొట్టాలని ముందు డిసైడ్ అయిపోయారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. పెరిగిన ఓటు శాతం కూడా తమకే అనుకూలమని వైఎస్ఆర్సీపీ అంటోంది. గ్లాస్ పార్టీ గల్లంతు ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోలవరంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ బలంగా ఉంది. పోలవరంలో పాగా వేసిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఇక్కడ బాగా ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య...వైఎస్ఆర్సీపీ ఏర్పడ్డాక...టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. అయితే ఈసారి పోలింగ్కు ముందే కూటమి చేతులెత్తేసినట్లయింది. కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు బరిలో నిలిచారు. జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ ముఖ్య నేతలు అనేకమంది తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ నాయకులు ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనలేదు. టీడీపీ బరిలో ఉంటే..వైఎస్ఆర్సీపీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగేదని..జనసేన కావడంతో ఓటమి ముందే ఖరారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి విజయం లాంఛనమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.పోలవరం నియోజకవర్గంలో 85.98 శాతం పోలింగ్ నమోదైంది. అయితే విజయంలో మహిళల తీర్పే కీలకం కానుంది. ఓటు వేసినవారిలో పురుషుల కంటే సుమారు 6,208 మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రతీ గ్రామంలోనూ అత్యధికంగా మహిళా ఓటర్లే క్యూలో కనిపించారు. గంటలకొద్దీ క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఇక వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ శాతంతో పోటీలో నిలిచిన వారు ఎవరికివారు గెలుపు తమదే అంటూ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాల పట్ల ఆయన నాయకత్వం పట్ల ప్రజలకు సంపూర్ణంగా విశ్వాసం కలిగిందని.. ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కట్టబోతున్నారని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుక బడిన పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ ప్రాంతం నేడు మారిన రూపురేఖలతో అబ్బురపరుస్తోంది. గతంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రూపం మారి కార్పొరేట్ స్కూళ్ళ కంటే గొప్పగా అలలారుతున్నాయి. నాడు కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వాస్పత్రులు నేడు ఆధునిక సౌకరర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయి. గ్రామాల్లో నూతన సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి.పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ సుమారు రూ. 665.77 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నించలేదు. అసలు గిరిజనుల ఆవాసాలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని గిరిజనులు భావిస్తున్నారు. జగన్ నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్ కే ఓటేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. -
ఇంటర్ పరీక్షలకు 5,343 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జరిగిన ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 3,898 మంది జనరల్ విద్యార్థులకు గాను 3,605 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 344 మందికి గాను 308 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరిగిన ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు జనరల్ విద్యార్థులు 1,310 మందికి 1,228 మంది హాజరు కాగా, 232 మంది ఒకేషనల్ విద్యార్థులకు 202 మంది హాజరయ్యారు. పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగలేదని పరీక్షల కన్వీనర్ బి.ప్రభాకర రావు చెప్పారు. పశ్చిమగోదావరిలో... భీమవరం: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష బుధవారం ప్రశాంతంగా జరిగింది. మొదటి సంవత్సరం జనరల్ పరీక్షకు 6,294 మందికి 5,820, ఒకేషనల్ పరీక్షకు 391 మందికి 346 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్ఐవో కె.చంద్రశేఖర్బాబు చెప్పారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షకు 1,684 మంది విద్యార్థులకు 1,539 మంది, ఒకేషనల్ పరీక్షకు 147 మందికి 136 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. -
బడి బస్సుకు భద్రత
వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు పునఃప్రారంభం నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో బడి బస్సుల భద్రతపై రవాణా శాఖ దృష్టి సారించింది. నిబంధనల మేరకు వాటి సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చర్యలు చేపట్టింది. కండీషన్లో ఉన్న వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ)లు జారీ చేస్తోంది. జిల్లాలో 1,327 స్కూల్ బస్సులు ఉండగా, ఇప్పటికే 555 బస్సులకు రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలు తెరిచేనాటికి మిగిలిన వాటినీ పరీక్షించేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో స్కూలు బస్సుల వివరాలు రవాణా శాఖ మొత్తం ఫిట్నెస్ పరీక్షలుకార్యాలయం బస్సులు పూర్తయినవిభీమవరం 528 224 పాలకొల్లు 288 80 తణుకు 193 73 తాడపల్లిగూడెం 318 178 సాక్షి, భీమవరం: జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు 463 ఉన్నాయి. విద్యార్థుల రవాణ కోసం ఆయా విద్యాసంస్థలు బస్సులనే అధికంగా వినియోగిస్తున్నాయి. బస్సు కండీషన్లో లేకపోతే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. వారి భద్రత కోసం విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఏటా రవాణా శాఖ స్కూల్ బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించి నిబంధనల మేరకు కండీషన్లో ఉన్న వాహనాలకు మాత్రమే ఎఫ్సీ జారీ చేస్తుంది. ప్రభుత్వ నిబంధనలు మేరకు ప్రతి స్కూల్ బస్సుకూ ఎఫ్సీ తప్పనిసరి. లేనివాటిని గుర్తించి సీజ్ చేయాల్సిన బాధ్యత రవాణశాఖ అధికారులపై ఉంది. నిర్ణీత తేదీల్లో పరీక్షలు : గత ఏడాది జారీ చేసిన ఎఫ్సీ గడువు ఈనెల 15వ తేదీతో ముగియడంతో రానున్న విద్యాసంత్సరానికి గాను 17వ తేదీ నుంచి బస్సుల ఫిట్నెస్ను తేల్చే పనిలో జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోని మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు నిమగ్నమయ్యారు. బస్సులకు ఎఫ్సీల జారీ కోసం పాటించాల్సిన నిబంధనలపై ఇప్పటికే పాఠశాల, కళాశాలల యాజమాన్యాలకు తెలియజేశారు. ఆన్లైన్లో బస్సుల వివరాలను నమోదు చేయించి నిర్ణీత తేదీ వాటికి సంబంధిత రవాణా శాఖ కార్యాలయాల వద్ద ఫిట్నెస్ పరీక్షలు చేస్తున్నారు. తల్లిదండ్రులూ గమనించాలి : బస్సులోని ఫస్ట్ఎయిడ్ బాక్స్ను నెలకోసారి పేరెంట్స్ కమిటీ పరిశీలించాలి. దీనికోసం ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలి. సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను ఎక్కించరాదు. ప్రతి నెలా బస్సు కండిషన్ను యాజమాన్యాలు, పాఠశాల పేరెంట్స్ కమిటీ తనిఖీ చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకం ఉంచి ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేసి ఫిర్యాదులను పరిశీలించాలి. రవాణా, పోలీస్, విద్యాశాఖల సహకారంతో ప్రతి విద్యా సంస్థ ఏడాదిలో ఒక రోజు విద్యార్థులకు రోడ్ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. పాఠశాల వద్ద బస్సుల పార్కింగ్కు ప్రత్యేక స్థలం ఉండాలి. ఈ నిబంధనలు తప్పనిసరి బస్సు డ్రైవర్కు 60 ఏళ్ల లోపు వయస్సు ఉండి ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. బీపీ, షుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలి. ఈ సర్టిఫికేట్ను బస్సులో ఒకటి, యజమాని వద్ద ఒకటి ఉంచాలి. ప్రతి బస్సుకూ అటెండర్ తప్పనిసరి స్కూల్ బస్సుల వేగం గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే ఉండేలా స్పీడ్ గవర్నర్స్ తప్పనిసరి బ్రేక్, హ్యాండ్ బ్రేక్, స్టీరింగ్, టైర్లు, స్పీడోమీటర్ అన్నీ కండీషన్లో ఉండాలి. బస్సుకు సంబంధించిన అన్ని లైట్లు పనిచేయాలి రిఫ్లక్టివ్ టేపును బస్సుకు నాలుగు వైపులా అతికించాలి బస్సుకు ఉన్న గ్లాసులు అన్ని పటిష్టంగా ఉండాలి బస్సు నుంచి అధిక మొత్తంలో బ్లాక్ స్మోక్ (పొగ) రాకుండా చూడాలి బస్సుకు అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి సైడ్ విండోలకు మధ్యలో మూడు అంగుళాలకు మించని దూరంలో అడ్డంగా మూడు లోహపు కడ్డీలు అమర్చి ఉండాలి. ఫుట్ బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 మి.మీ ఎత్తుకు మించరాదు. మెట్లు జారకుండా లోహంతో అమర్చబడి ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్లు ఏర్పాటు చేయాలి బస్సు ఎడమవైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు, స్కూల్ బాయ్ అండ్ గర్ల్ ఇమేజ్ పొందుపర్చాలి బస్సు బయలుదేరే సమయం, ఆగే స్థలాలు రూట్ ప్లాన్, విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు, డ్రైవర్ వివరాలు బస్సులో ఉంచాలి. ముగిసిన పాత ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు మొదలైన కొత్త ఎఫ్సీల జారీ ప్రక్రియ జూన్ 12లోగా పూర్తికి రవాణా శాఖ కసరత్తు జిల్లాలో 463 ప్రైవేట్ విద్యా సంస్థల పరిధిలో మొత్తం 1,327 స్కూల్ బస్సులు ఇప్పటికే 555 వాహనాలకు ఫిట్నెట్ పరీక్షలు పూర్తి విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. జిల్లాలో 1,327 స్కూల్ బస్సులు ఉండగా ఇప్పటికి 555 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. స్కూల్స్ తెరిచేలోగా మిగిలిన వాటికి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థుల భద్రత దృష్ట్యా స్కూల్స్ తెరిచాక ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎఫ్సీ లేని బస్సులను సీజ్ చేస్తాం. – ఉమామహేశ్వరరావు, జిల్లా రవాణా శాఖ అధికారి, భీమవరం -
వైభవంగా ధ్వజారోహణం
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనంతరం యాగశాలలో హోమ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ధ్వజపటంను ఆలయం చుట్టూ ప్రదక్షణ గావించి ధ్వజస్తంభం వద్ద శ్రీదేవి, భూదేవి ,శ్రీనివాసుడి ఉత్సవమూర్తులు, సుదర్శన్ పెరుమాళ్ను వేదికపై ఉంచి ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ధ్వజపటంకు ప్రత్యేక గరుడ ప్రసాదం నివేదన చేసి సంతానం కోరుతూ వచ్చిన సుమారు 30 మంది దంపతులకు ఈ గరుడ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాలలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బుధవారం శేష వాహనంపై స్వామివారికి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఉభయదారులుగా పేరిచర్ల జగపతిరాజు దంపతులు, బాల భాస్కర్ దంపతులు, హనుమంత రామ నాగబాబు దంపతులు పాల్గొన్నారు. ఉభయదారులకు స్వామివారి ఆశీస్సులు అందజేసి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు. ప్రతిరోజు సాయంత్రం ఉచిత బస్సు సర్వీసును ఏర్పాటు చేసినట్లు ఈవో మానికల రాంబాబు తెలిపారు. నేటి కార్యక్రమాలు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం నిత్యహోమం, నీరాజనం, తీర్థప్రసాద గోష్టి జరుగుతాయి. సాయంత్రం స్వామి వారికి హనుమంత వాహన సేవ నిర్వహిస్తారు. -
కౌంటింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు
ఏలూరు (మెట్రో): ఏలూరు జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు – 2024 కౌంటింగ్ సన్నద్ధతపై అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెనన్స్లో కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జేసీ బి.లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ ఎం.సూర్యతేజ, డీఆర్వో డి.పుష్పమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏలూరు శివారులోని సర్ సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంగణంలోనే ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఎనిమిది కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి 14 టేబుల్స్, అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను బట్టి 16 నుంచి 21 రౌండ్లు జరగనున్నాయన్నారు. ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సాయంత్రం 4 గంటల లోపు, పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి సాయంత్రం 5 గంటల లోపు పూర్తి వివరాలు అందించగలమన్నారు. ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపునకు అవసరమైన భద్రతా చర్యలను చేపట్టామన్నారు. మొబైల్ పార్టీలను కూడా నియమించామన్నారు. జిల్లా వ్యాప్తంగా కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమాలను ముమ్మరం చేశామన్నారు. జిల్లాలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలు చేస్తున్నామన్నారు. అలాగే అదనపు బ్యారీ కేడింగ్, సీసీటీవీల ఏర్పాటు చేపట్టామని, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉన్నామని ఎస్పీ వివరించారు. కౌంటింగ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండండి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకు రిటర్నింగ్ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో కౌంటింగ్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించారు. నిబంధనల మేరకు ఒకొక్క నియోజకవర్గంలోని 5 చొప్పున వీవీ ప్యాట్లోని స్లిప్లను లెక్కించడంలో, లెక్కింపు అనంతరం వాటిని భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ అనంతరం ఎప్పటికప్పుడు కచ్చితమైన ఫలితాలను అందించాలన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి పలు సూచనలతో దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, ఐటీడీఎ పీఓ ఎం.సూర్యతేజ, డీఆర్వో డి.పుష్పమణి, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ ర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ -
ఆహ్లాదం.. పాపికొండల విహారం
మద్దిలో జయంత్యుత్సవాలు గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో ఈ నెల 31 నుంచి జూన్ 4వ తేదీ వరకు హనుమద్ జయంత్యుత్సవాలను నిర్వహించనున్నారు. 8లో uసీహెచ్సీలో అరుదైన శస్త్రచికిత్స బుట్టాయగూడెం సీహెచ్సీలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఓ గిరిజనుడికి దవడ కింది భాగంలో ఏర్పడిన కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించారు. 8లో uగురువారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2024● పాపికొండలకు పెరుగుతున్న పర్యాటకుల తాకిడి ● యాత్రికుల కోసం అందుబాటులోకి అనేక సౌకర్యాలు బుట్టాయగూడెం: పాపికొండల మధ్య గోదావరిపై లాంచీ ప్రయాణం అద్భుతమైన అనుభూతి. వేసవిలో లాంచీలపై ప్రయాణం ఎంతో ఆనందాన్ని పంచుతుంది. ప్రస్తుతం పాపికొండలకు పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతుంది. ప్రతీ ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందడి చేస్తుండగా ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పర్యాటకులు పాపికొండల ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. గత రెండు రోజులుగా పాపికొండలకు విహారయాత్రికుల తాకిడి ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. అల్లూరి జిల్లా గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి పేరంటాలపల్లి వరకూ లాంచీల్లో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఆనందంగా గడుపుతున్నారు. ఈ విహారయాత్రకు విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, భద్రాచలం, జంగారెడ్డిగూడెం, తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సందర్శన స్థలాలు : పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శన స్థలాలను చూడవచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మగుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కాటేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ శివుడిని దర్శించుకోవచ్చు. గోదావరి వెంట ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనసు దోచుకుంటుంది. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టును తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. గిరిజనుల ఆప్యాయత, ఆదరణ పేరంటాలపల్లి పర్యాటకులకు గిరిజనుల ఆప్యాయత, ఆదరణ ఆకట్టుకుంది. అక్కడి కొండరెడ్డి గిరిజనులు పర్యాటకులకు వెదురుతో తయారు చేసిన రకరకాల కళాకృతులను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. పాపికొండల పర్యటనకు వెళ్ళిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వాటిని కొనుగోలు చేసి యాత్రకు గుర్తుగా ఇంటికి తీసుకువెళ్తుంటారు. గండిపోచమ్మ గుడి నుంచి ప్రశాంతమైన, సుందరమైన గోదావరి అలలపై సాగే ఈ యాత్ర సుమారు 5 గంటలకు పైగా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పర్యాటకులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో యాత్రికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. న్యూస్రీల్పాపికొండల నడుమ గోదావరిలో ప్రయాణిస్తున్న లాంచీలులాంచీలో పేరంటాలపల్లి వస్తున్న పర్యాటకులు లాంచీలో పేరంటాలపల్లి చేరుకున్న పర్యాటకులు -
రావిపాడు ఘటనలో బాధితులకు న్యాయం చేస్తాం
తాడేపల్లిగూడెం: రావిపాడులో సైనికోద్యోగి కుటుంబానికి కేటాయించిన స్థలం వాస్తవికతపై అధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ చెప్పారు. రావిపాడు ఘటనకు సంబంధించి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు బుధవారం కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్ధితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఈ స్థలంలో నిర్మాణం విషయంలో సైనికోద్యోగి భార్యపై దాడి చేయడంతో వివాదం చెలరేగడం, అంబేడ్కర్ విగ్రహం తరలింపు సమయంలో ఒక వర్గం రాళ్లతో దాడి ఘటనలపై ఇరు వర్గాలపై కేసులు నమోదయ్యాయన్నారు. అయితే ఉద్రిక్తతలను ప్రేరేపించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కథనాలను ప్రసారం చేయడం, రాయడం వంటివి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామన్నారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాధితులకు హామీ ఇచ్చారు. 70 మందిపై కేసు : డీఎస్పీ మూర్తి తాడేపల్లిగూడెం: రావిపాడులో సైనికోద్యోగి కుటుంబానికి కేటాయించిన స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో పోలీసులపై రాళ్లతో దాడులు, ఇతర ఘటనలకు సంబంధించి 70 మందిపై నాలుగు కేసులు నమోదు చేసినట్టు తాడేపల్లిగూడెం డీఎస్పీ మూర్తి బుధవారం విలేకరులకు చెప్పారు. సైనికోద్యోగి పలివెల నాగేశ్వరరావుకు కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తుండగా, ఏసుబాబు కాలనీకి చెందిన ఎస్సీ వర్గీయులు నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద అంబేడ్కర్ విగ్రహం పెట్టే క్రమంలో గొడవ జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సైనికోద్యోగి భార్య విజయలక్ష్మి తనపై కొందరు దాడిచేసి వివస్త్రను చేసే ప్రయత్నం చేశారనే ఫిర్యాదుపై కేసు నమోదు చేశామన్నారు. ఏసుబాబు కాలనీకి చెందిన కొందరు విజయలక్ష్మి తమను కులం పేరుతో దూషించి అవమానించారని ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేశామన్నారు. శాంతిభద్రతలను అదుపు చేసే క్రమంలో కొందరు పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో ఒక ఎస్సైతో పాటు, నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారన్నారు. గ్రామంలో ఈ నెలాఖరువరకు 144 సెక్షన్, 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు. రూరల్ సీఐ ఏ.రమేష్, పెంటపాడు ఎస్ఐ సమావేశంలో పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు 4,251 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన భౌతికశాస్త్రం పరీక్షకు 8,289 మంది విద్యార్థులకు 4,251 మంది విద్యార్థులు హాజరు కాగా, 4,038 మంది గైర్హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్, డీఈఓ, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మొత్తం 14 పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. -
భయంతో వ్యక్తి ఆత్మహత్య
భీమడోలు: గొడవ పడిన వ్యక్తులు తనను ఏమైనా చేస్తారేమోనన్న భయంతో ఓ వ్యక్తి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భీమడోలు పంచాయతీ పరిధిలోని ఆర్జావారిగూడెంలో చోటు చేసుకుంది. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆర్జావారిగూడెంకు చెందిన వల్లూరి జయరాజు (55) అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసుల వివరాలు ప్రకారం.. ఆర్జావారిగూడెంకు చెందిన వల్లూరి జయరాజుకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులతో చిన్న చిన్న గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీ సోమవారం సాయంత్రం వారి మధ్య గ్రామంలో గొడవ జరిగింది. అది మనసులో పెట్టుకుని వారు ఏమైనా చేస్తారేమో అని భయపడి జయరాజు గ్రామ శివారున గల పొలాల వద్ద ఈనెల 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ఎలుకల మందు మజ్జిగలో కలుపుకుని తాగాడు. ఆపస్మారక స్థితిలో ఉన్న జయరాజును ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ పరిస్థితి విషయమించి జయరాజు మృతి చెందాడు. జయరాజు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. -
సినీ నిర్మాత తుమ్మలపల్లికి ఆత్మీయ చైతన్య పురస్కారం
భీమవరం: భీమవరం డీఎన్నార్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో ఆవరణలో చైతన్యభారతి సంగీత నృత్య నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ నుంచి నిర్వహించే 17వ జాతీయ స్థాయినాటిక పోటీలకు సర్వం సిద్ధం చేశారు. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ పోటీల్లో ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన నాటక సంఘాలు తొమ్మిది నాటకలను ప్రదర్శించనున్నాయి. నాటకోత్సవాలను గురువారం రాత్రి డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు, పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ, పంతం వేణుగోపాలకృష్ణ నెహ్రూ ప్రారంభిస్తారు. ప్రారంభ సభలో సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు, నాటక రచయిత పురాణం వెంకట రామ్కుమార్లకు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు, దర్శకుడు జనాబ్ ఎస్ఎం బాషాకు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారాలతో సత్కరిస్తారు. నాటకోత్సవాల ముగింపు సందర్భంగా జూన్ 2న కందాళం ఫౌండేషన్ ఆఫ్ ఆమెరికా వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్యపురస్కారం, రంగస్థల నటీమణి ఎం రత్నకుమారిని పెనుపోతుల శేషగిరిరావు రంగస్థల చైతన్యపురస్కారంతో సత్కరిస్తారు. నాటిక పోటీల వేదిక ఏర్పాట్లును చైతన్య భారతి సభ్యులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, భట్టిప్రోలు శ్రీనివాసరావు,పేరిచర్ల లక్ష్మణవర్మ, కట్రేడ్డి సత్యనారాయణ, అప్పారావు, బాషా తదితరులు పర్యవేక్షించారు. నాలుగు రోజులు.. 9 నాటికలు ● 30వ తేదీన గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి ‘మూల్యం’ ● 31న కళాంజలి హైదరాబాద్ వారి ‘రైతేరాజు’, అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి ‘మనస్విని’, ఉషోదయ కళానికేత్న్ కట్రపాడు వారి ‘విముక్తి’ ● జూన్ 1న అభినయ ఆర్ట్స్ గుండూరు వారి ‘ఇంద్రప్రస్థం’, తెలుగు కళాసమితి విశాఖపట్నం వారి ‘నిశ్శబ్దమా! నీ ఖరీదెంత’, శ్రీసాయి ఆర్ట్స్ కొలకలూరు వారి ‘కౌసల్యా! సుప్రజా, రామా’, ● 2న చైతన్య కళాభారతి కరీంనగర్ వారి ‘స్వప్పం రాల్చిన అమృతం’, విటీ పీఎస్ కల్చరల్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం వారి ‘ఎనిమి’ సాంఘిక నాటికలను ప్రదర్శిస్తారు. -
షిప్ట్ ఆపరేటర్ రాసలీలలు
జంగారెడ్డిగూడెం: విద్యుత్ సబ్స్టేషన్లో రాసలీలలు నిర్వహిస్తూ షిప్ట్ ఆపరేటర్ అడ్డంగా దొరికిపోయాడు. మద్యం సేవించి ఒక మహిళతో నగ్నంగా దొరికిపోయాడు. వినియోగదారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్స్టేషన్లో షిప్ట్ ఆపరేటర్ గంగు మహేష్ రెడ్డి మంగళవారం రాత్రి విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారు జామున విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులు సబ్స్టేషన్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో వినియోగదారులు విద్యుత్ సబ్స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే మహేష్ రెడ్డి పూటుగా మద్యం సేవించి ఒక మహిళతో నగ్నంగా దొరికిపోయాడు. వినియోగదారులు ఈ విషయాన్ని విద్యుత్ ఏడీఈ యు.సుబ్బారావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన వచ్చి చూసే సరికి మహేష్రెడ్డి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయంలో అసాంఘిక కార్యకలాపాలేందని ప్రశ్నించారు. దీనిపై విద్యుత్ ఈఈ పి.రాధాకృష్ణ మాట్లాడుతూ మహేష్రెడ్డి ఔట్సోర్సింగ్ పద్దతిపై షిప్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడని, అతనిపై పోలీసు కేసు నమోదు చేశారని చెప్పారు. మహేష్ రెడ్డిని విధులు నుంచి శాశ్వతంగా తొలగించినట్టు ఈఈ రాధాకృష్ణ తెలిపారు. -
సీపెట్ డిప్లమో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ముసునూరు: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఐపీఈటీ) గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్టు జాయింట్ డైరెక్టర్ అండ్ హెడ్ సీహెచ్ శేఖర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని పదో తరగతి విద్యార్హత గల యువతకు మూడేళ్ల వ్యవధిగల డిప్లమో కోర్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. అర్హులు మే 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కోర్సులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ఫీజు రీ యింబర్స్మెంట్ వర్తిస్తుందని తెలిపారు. సీపెట్ అడ్మిషన్ టెస్ట్ (కాట్)ను జూన్ 9న నిర్వహిస్తారని, ర్యాంకుల ఆధారంగా 150 మందికి విజయవాడలోని భారత ప్రభుత్వ సంస్థ సీఐపీఈటీ కేంద్రంలో శిక్షణ ఇస్తారని చెప్పారు. శిక్షణ అనంతరం ప్లాస్టిక్ సంస్థల్లో ఉద్యోగావకాలు కల్పిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు ప్రోగ్రామ్ ఆర్గనైజర్ సాకిరి రామకృష్ణను ఫోన్ నెంబర్ 93985 35697లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఈదులగూడెం బాలుడికి కరాటేలో బంగారు పతకం
ఆగిరిపల్లి: అంతర్జాతీయ కరాటే పోటీల్లో ఈదులగూడెంకు చెందిన ఓ బాలుడు అండర్–10 కటా విభాగంలో ప్రతిభ చూపి బంగారు పతకం సాధించాడు. గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న దేవరపల్లి భరత్రాయ్ ఈ నెల 21 నుంచి 24 వరకు నేపాల్లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా బుధవారం గ్రామ సర్పంచ్ విజయ, పలువురు గ్రామ పెద్దలు బంగారు పతాకం సాధించిన భరత్ రాయ్, కోచ్ జాస్తి విద్యాధర్లను ఘనంగా సత్కరించి అభినందించారు.రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి భీమడోలు: జాతీయ రహ దారి భీమడోలు రైల్వే గేటు సమీ పంలోని లింగంపాడు వంతెన వద్ద రోడ్డు దాటు తున్న సెంట్రింగ్ కార్మికుణ్ని బుధవారం సాయంత్రం ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భీమడోలు పంచాయతీ అరుంధతీ కాలనీకి చెందిన భీమడోలు మహాలక్ష్ముడు (38) అక్కడిక్కడే మృతి చెందాడు. అరుంధతీ కాలనీకి చెందిన సెంట్రింగ్ పని చేసే మహాలక్ష్ముడు ఏలూరులోని తన తల్లి వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. లింగంపాడు వంతెన వద్ద బస్సు ఎక్కేందుకు జాతీయ రహదారి దాటుతుండగా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపుగా వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మహాలక్ష్ముడు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహాలక్ష్ముడు అక్క కలపాల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. ప్రయాణికుడి మృతి భీమవరం: భీమవరం కొత్త బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడని ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ వ్యక్తి 17వ నెంబర్ ఫ్లాంట్ ఫాం వద్దకు వచ్చి అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడని, బస్టాండ్ సిబ్బంది చూసి 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారని చెప్పారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్టు నిర్ధారించినట్టు తెలిపారు. ఆ వ్యక్తికి 40 ఏళ్లు వయస్సు ఉంటుందని వివరించారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసుల సెల్ నెంబర్లు 94407 96633, 94407 96632లో తెలియజేయాలని కోరారు. -
పది సప్లిమెంటరీ పరీక్షకు 3,548 మంది హాజరు
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం గణితం పరీక్షకు 7,470 మంది విద్యార్థులకు 3,548 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా విద్యాశాఖాధికారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ కలిపి మొత్తం 18 పరీక్షా కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు. ‘పశ్చిమ’లో... భీమవరం: టెన్త్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలో భాగంగా మంగళవారం నిర్వహించిన గణిత పరీక్షకు 49.90 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.వెంకటరమణ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 5,004 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 2,497 మంది హాజరయ్యారన్నారు. గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలల మూసివేత ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రైవేటు యాజమాన్యాలు నడుపుతున్న వివిధ పాఠశాలలను 2024–25 విద్యా సంవత్సరం నుంచి మూసివేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలో మొత్తం అనుమతిలేని 6 ప్రైవేటు పాఠశాలలు గుర్తించామన్నారు. వీటిలో ఏలూరు శనివారపు పేటలోని స్వర్ణభారతి ప్రాథమికోన్నత పాఠశాల, ఏలూరులోని ఎవరెస్ట్ ప్రాథమిక విద్యాలయ, ఏలూరులోని ఎవరెస్ట్ ఉన్నత విద్యాలయ, ఏలూరులోని వెన్నవల్లివారి పేటలోని సన్షైన్ ఇంగ్లీష్ మీడియం ప్రాథమికోన్నత పాఠశాల, జంగారెడ్డిగూడెంలోని కై రలి ప్రాథమికోన్నత పాఠశాల, ఆగిరిపల్లిలోని ఎన్ఎస్ఆర్ పబ్లిక్ స్కూల్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్ పరీక్షకు 6,324 మంది హాజరు ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 27 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం ప్రథమ సంవత్సరం గణితం –బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 5269 మంది జనరల్ విద్యార్థులకు 4992 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 319 మందికి 287 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 5588 మందికి గాను 5279 మంది హాజరు కాగా 309 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరిగిన గణితం–బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షకు జనరల్ విద్యార్థులు 997 మందికి 919 మంది హాజరు కాగా 78 మంది గైర్హాజరయ్యారు. 150 మంది ఒకేషనల్ విద్యార్థులకు 126 మంది హాజరు కాగా 24 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 1147 మందికి గాను 1045 మంది హాజరు కాగా 102 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరుగలేదని పరీక్షల కన్వీనర్ బీ. ప్రభాకరరావు తెలిపారు. -
ఇంటర్ విద్యతో సాఫ్ట్వేర్ ఉద్యోగం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగులుగా మారే సదవకాశం, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ బిట్స్ పిలానీ, శాస్త్ర, అమిటీ లాంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో ఉన్నత చదువు కొనసాగించే సదావకాశం విద్యార్థులకు ఉందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే. చంద్రశేఖర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విద్యార్థులకు ఈ మహత్తర అవకాశం లభిస్తుందని, రాష్ట్రంలో 75 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసిన అన్ని గ్రూపుల నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు, హెచ్సీఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలలో ఇంటర్మీడియట్ విద్యను 75 శాతం మార్కులతో పూర్తి చేసిన విద్యార్థులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 500 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొన్నారని, వీరికి ఇంటర్మీడియట్ బోర్డ్, హెచ్సీఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న భీమవరంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో ఉదయం 9 నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత క్యాట్ పరీక్ష, ఇంటర్వ్యూ, చివరిగా ఇంగ్లీష్ వెర్షన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తారు. బైపీసీ, సీఈసీ, హెచ్ఐసీ, ఒకేషనల్ గ్రూపులు చదివిన విద్యార్థులు డీపీఓ విభాగంలో ఉద్యోగం పొందవచ్చన్నారు. ఉన్నత విద్యను కొనసాగించే సదవకాశాన్ని కూడా కల్పించడానికి హెచ్సీఎల్ సంస్థ ప్రణాళిక రూపొందించింది. అమిటీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉన్నత విద్య చదివేందుకు హెచ్సీఎల్ ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన చెప్పారు. ఏవైనా సందేహాలు ఉంటే సాయి కిరణ్ను 9642973350 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు. -
కౌంటింగ్కు పటిష్ట భద్రత
బుధవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2024ఏలూరు టౌన్: ఎన్నికల ఫలితాల విడుదలకు కౌంట్డౌన్ మొదలైంది. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ఆంక్షల నడుమ ఓట్ల లెక్కింపునకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజకీయ పార్టీల నేతలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని సూచించారు. ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కలెక్టర్, ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ నేతృత్వంలో ఎస్పీ డీ.మేరీ ప్రశాంతి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కౌంటింగ్ కేంద్రాల వద్ద 500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ జీ.స్వరూపరాణితోపాటు ఏఎస్పీ స్థాయి అధికారులు ముగ్గురు, డీఎస్పీలు ఆరుగురు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు 15 మంది, సబ్ ఇన్స్పెక్టర్లు 50 నుంచి 60 మంది, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ బలగాలతోపాటు, కేంద్ర సాయుధ బలగాలను సైతం మోహరించేలా చర్యలు చేపట్టారు. సాయుధ బలగాల మోహరింపు సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు నిరీక్షిస్తుండగా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా సాగేలా చూడడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా భారీఎత్తున పోలీస్ బలగాలను మోహరించేలా చర్యలు తీసుకున్నారు. ఏకంగా వెయ్యి మందికి పైగా పోలీస్, సాయుధ బలగాలను ఆయా ప్రాంతాల్లో బందోబస్తుకు నియమించారు. కేంద్ర సాయుధ బలగాలతోపాటు, ఏఆర్ పోలీసులు, సివిల్ పోలీసులతో పికెటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ర్యాలీలు, సంబరాలకు నో పర్మిషన్ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు మోటారు సైకిల్ ర్యాలీలు, సంబరాలకు పోలీసు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. బాణసంచా నిషేధించారు. పెట్రోల్ బంకుల యజమానులకు సీసాల్లో పెట్రోల్ కొట్టవద్దని సూచించారు. మద్యం విక్రయాలకు సైతం బ్రేక్ వేస్తూ అవాంచనీయ సంఘటనలకు చెక్ పెట్టేలా పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. నేరగాళ్లు, రౌడీషీటర్లపై నిఘా ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతం ఎన్నికల సందర్భంగా గొడవలు, అల్లర్లు సృష్టించిన వ్యక్తులపై నిఘా పెంచారు. ఏలూరు జిల్లాలో తాజాగా పోలింగ్ అనంతరం 114 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయగా, కొత్తగా గొడవలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులు షీట్స్ తెరిచారు. ఏలూరు, దెందులూరు, నూజివీడు, కై కలూరు, చింతలపూడి, పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల పరిధిలో రాజకీయ పార్టీల సానుకూల వ్యక్తులపైనా నిఘా పెంచారు. న్యూస్రీల్ జిల్లా వ్యాప్తంగా సాయుధ బలగాల మోహరింపు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు ర్యాలీలు, సంబరాలు, సమావేశాలకు నో పర్మిషన్ అల్లర్లకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం ఏలూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్ధ వంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్తోపాటు, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు అల్లర్లుకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – డీ మేరీ ప్రశాంతి, జిల్లా ఎస్పీ -
క్యాన్సర్పై అవగాహన కల్పించాలి
ఏలూరు (టూటౌన్): క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ శర్మిష్ట చెప్పారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాన్సర్ శిక్షణా కార్యక్రమాన్ని డీఎం అండ్ హెచ్ఓ శర్మిష్ట, వైద్యకళాశాల ప్రధాన అధ్యాపకుడు డాక్టర్ భాస్కరరావుతో కలిసి మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా అవగాహాన పెంచుకొని క్యాన్సర్ గురించి సమగ్రంగా తెలుసుకుని తెలుసుకున్న విషయాలను కింది స్థాయి వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పిలు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. వైద్య కళాశాల ప్రధాన అధ్యాపకుడు భాస్కరరావు మాట్లాడుతూ కింది స్థాయి వైద్య సిబ్బంది ప్రజల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించిన వెంటనే వారికి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన వైద్యాన్ని అందించడానికి సహాయపడాలన్నారు. శిక్షణా కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ గంగాభవాని, జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన గైనకాలజిస్టులు, దంత వైద్య నిపుణులు పాల్గొన్నారు. డీఎం అండ్ హెచ్ఓ శర్మిష్ట -
కౌంటింగ్కు పక్కా ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): కౌంటింగ్కు ఏర్పాట్లను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, డీఆర్ఓ డి.పుష్పమణితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ హాలులో ఓట్ల లెక్కింపునకు సౌకర్యంగా సీటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ హాలులో ప్రతి రౌండ్కు ఏ అభ్యర్ధికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించేందుకు వీలుగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాలుకు ఈవీఎం, వీవీపాట్లను తీసుకువచ్చేందుకు ప్రత్యేక దారి ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశామన్నారు. -
కూటమికి రోజులు దగ్గరపడ్డాయి
ద్వారకాతిరుమల: కూటమికి కాలం చెల్లే రోజులు దగ్గరపడ్డాయని వైఎస్సార్ సీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్ధి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన శ్రీనివాస్, రాధిక దంపతులకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చెలికాని రాజబాబు, మండల వైఎస్సార్ సీపీ నేత పాకలపాటి త్యాగ భీమేశ్వరరావు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆ తరువాత క్షేత్రపాలకుడైన శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి, స్వామి, అమ్మవార్లకు పూజాధికాలను నిర్వహించారు. అనంతరం శ్రీనివాస్ దంపతులు స్థానిక కాపు కల్యాణ మండపానికి చేరుకోగా, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు వారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చేనెల 4న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్ధులంతా విజయాన్ని సాధిస్తారని, మళ్లీ రాష్ట్రంలో తమ పార్టీ ప్రభంజనాన్ని సృష్టించడం ఖాయమన్నారు. గెలుపు విషయంలో కూటమి నేతలు చేస్తున్నదంతా హడావిడేనని, మరో వారం రోజుల్లో కూటమి కకావికలం కావడం ఖాయమన్నారు. నిరుపేదలను, మహిళలను, రైతులను ఆర్ధికంగా ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ సీపీ మాత్రమేనని, అదే తమను గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు చిగురుపల్లి శామ్యూల్, శ్రీవారి దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యుడు మానుకొండ సుబ్బారావు, ఉక్కుర్తి వెంకట్రావు, చిలుకూరి చంద్రం, కొల్లి సుబ్బారావు, పొనమాల ఉమామహేశ్వరరావు, దూలపల్లి ప్రసా ద్, కంచర్ల రాంబాబు, ముల్లంగి భానురెడ్డి, చిలుకూరి నాగ సుబ్రహ్మణ్యం, బొంతు శ్రీను, మదన్, హనుమంతు, చిట్టూరి అన్నవరం, పెద్దేవం గ్రామ సర్పంచ్ వెంకట్రావు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ -
అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా
పోలవరం రూరల్: కౌంటింగ్ నేపథ్యంలో పోలవరం సబ్ డివిజన్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ డి.మేరీప్రశాంతి పోలీసు అధికారులను ఆదేశించారు. పోలవరం డీఎస్పీ కార్యాలయంలో సబ్డివిజన్ పరిధిలోని సీఐ, ఎస్సైలతో మంగళవారం శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బైండోవర్ చేయాలన్నారు. పోలీసు అధికారులు ప్రతి గ్రామంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందన్న విషయాన్ని ప్రచారం చేయాలన్నారు. ఎవరైనా పోలీస్ కేసుల్లో చిక్కుకుంటే కలిగే ఇబ్బందులను ప్రజలకు తెలియజేయాలన్నారు. కౌంటింగ్ అనంతరం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా సమాచారం సేకరించి సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై నిఘా ఉంచాలన్నారు. అధికారులు విధి నిర్వహణలో అలసత్వంగా ఉండవద్దని, ఏ చిన్న తప్పు జరిగినా ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని గమనించి విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎన్.సురేష్కుమార్ రెడ్డి, పోలవరం సీఐ జి.మధుబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ మేరీ ప్రశాంతి పోలవరం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సమీక్ష -
శ్రీవారికి స్వర్ణ కిరీటం సమర్పణ
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్నకు గ్రామానికి చెందిన భక్తుడు మొగతడకల శ్రీనివాసరావు సుమారు రూ.10 లక్షల విలువైన 139.900 గ్రాముల బరువుగల బంగారు కిరీటాన్ని మంగళవారం సమర్పించారు. ముందుగా దాత శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో ఈ స్వర్ణ కిరీటాన్ని దేవస్థానం డీఈఓ బాబురావు, ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్ రమణరాజులకు అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబానికి ఆలయ అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనాన్ని పలికి, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. కారు ఢీకొని తాపీ కూలీ దుర్మరణం పెనుమంట్ర: కానూరు–లంకలకోడేరు వంతెన వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తాపీ కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, తాపీ మేస్త్రికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. నెలమూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నాగరాజు రామరాజు (63) తన సొంత ఇంటి నిర్మాణం కోసం సామగ్రి తెచ్చుకునేందుకు తాపీమేస్త్రి షేక్ సత్తార్తో కలిసి మంగళవారం మోటారు సైకిల్పై కొమ్ముచిక్కాల బయలుదేరారు. కానూరు– లంకలకోడేరు వంతెన వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారు వీరి మోటార్సైకిల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రామరాజుకు తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందగా, సత్తార్కు తీవ్ర గాయాలయ్యాయి. సత్తార్ను పాలకొల్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవీంద్రబాబు చెప్పారు. పల్లాలమ్మకు బంగారు నెక్లెస్ సమర్పణ కాళ్ల: పెద అమిరంలో గ్రామ దేవత పల్లాలమ్మకు మంగళవారం దాతలు బంగారు నెక్లెస్ సమర్పించారు. గ్రామ పెద్దలు ముదుండి వెంకట సత్యనారాయణ రాజు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఉషాకుమారి కుమారులు సోమరాజు రూ.3 లక్షల విలువ చేసే ఐదు కాసుల బంగారు నెక్లెస్ ఆలయంలో అందజేశారు. -
ఈవీఎంలకు పటిష్ట భద్రత
ఏలూరు టౌన్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఏలూరు జిల్లా ఎస్పీ డీ మేరీ ప్రశాంతి చెప్పారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద బందోబస్తును సోమవారం పరిశీలించారు. బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర సాయుధ బలగాలతో భద్రతా ఏర్పాట్లతో పాటు నిత్యం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూంలకు నలువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఆకస్మికంగా జిల్లా అధికారులు తనిఖీ చేస్తున్నారని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామాల్లో ఘర్షణలు జరగకుండా చూడాలి ఉంగుటూరు : ఎన్నికలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గ్రామాలు ప్రశాంత వాతావరణంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లపై ప్రత్యేక నిఘ ఉంచాలన్నారు. ముందస్తు బైండోవరు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు రూల్స్ గురించి ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వైభవంగా శ్రీరామలింగేశ్వరుడికి వైశాఖ పూజలు
పెనుమంట్ర: సుప్రసిద్ధ శైవక్షేత్రమైన నత్తారామేశ్వరం గ్రామంలో పరశురాముడు ప్రతిష్ఠించిన గోస్తనీ గర్భంలో ఉన్న ఆలయంలోని శ్రీరామలింగేశ్వరస్వామి దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వైశాఖమాసంలో మాత్రమే దర్శనమిచ్చే ఈ స్వామికి వైశాఖ మాసం మూడో సోమవారం కావడంతో భక్తులు ఏకాదశ రుద్రాభిషేకాలు, మహాన్యాస పూర్వక అభిషేకాలు, అభిషేక పండితులు కాశీభట్ల సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు సాయంత్రం వరకు క్యూలో నిల్చుని స్వామివారిని దర్మించుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు దాతల సహకారంతో అన్నదానం, క్యూలైన్లలో నిల్చున్న భక్తులకు మజ్జిక, బెల్లంపానకం, పులిహోర, చక్రపొంగలి ప్రసాదంగా అందజేశారు. అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అమ్మభగవాన్ భక్త బృందం భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నత్తారామేశ్వరంలో శైవక్షేత్రానికి పోటెత్తిన భక్తజనం -
పొరపాట్లకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు
ఏలూరు (ఆర్ఆర్పేట)/పెదపాడు : ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు చేయాలని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ కౌంటింగ్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో సోమవారం ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బందికి నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, డీఆర్ఓ డీ పుష్పమణి, రిటర్నింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించారని, అదే స్ఫూర్తితో కౌంటింగ్ ప్రక్రియను కూడా నిర్వహించాలన్నారు. సీఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జూన్ 4న ఉదయం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఓట్ల సంఖ్యను బట్టి 16 నుంచి 21 రౌండ్ల వరకు కౌంటింగ్ ఉంటుందన్నారు. అల్పాహారం అనంతరం సిబ్బంది తమకు కేటాయించిన నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ సెంటర్కు వెళ్ళి రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సరైన కారణం లేకుండా పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించకూడన్నారు. సిబ్బంది తమ సందేహాలను శిక్షణ అధికారి చక్రపాణిని అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కే. సుబ్బారావు, ఆర్డీఓలు ఎన్ఎస్కె ఖాజావలి, కే.అద్దయ్య , వై.భవానీశంకరి, జిల్లా పంచాయతి అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు ఏలూరు (మెట్రో): ఓట్ల లెక్కింపు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్కుమార్కు కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ చెప్పారు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి సోమవారం కేంద్ర ఎన్నికల అధికారులు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్సింగ్తో కలిసి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్కుమార్ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్కుమార్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు చర్యలు చేపట్టామన్నారు. -
బాలికను అపహరించిన యువకుడిపై కేసు నమోదు
భీమడోలు: భీమడోలులో ఓ బాలికను అపహరించిన యువకుడిపై సోమవారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. భీమడోలులో ఇంటర్ చదువుతున్న బాలికను అదే గ్రామానికి చెందిన వదులకు వీరబాబు అనే యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి మాయమాటలు చెప్పి సోమవారం తెల్లవారుజామున ఇంటి నుంచి అపహరించి వెంట తీసుకువెళ్లిపోయాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వై.సుధాకర్ ఆ యువకునిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెట్రోల్ బంక్ సొమ్ముతో వర్కర్ పరారీ జంగారెడ్డిగూడెం: స్థానిక జాతీయ ప్రధాన రహదారి వద్ద గల ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి పెట్రోల్, డీజిల్ అమ్మిన సొమ్ము రూ.2,49,600 నగదుతో ఉడాయించాడు. దీనికి సంబంధించి పెట్రోల్ బంక్ యజమాని కొండా ఉమామహేష్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బూసా రాజశేఖరరెడ్డి లక్కవరంలో నివసిస్తూ స్థానిక పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్, అమ్మిన సొమ్ముతో పరారయ్యాడు. అయితే అప్పటి నుంచి అతను తిరిగివచ్చి డబ్బులు చెల్లిస్తాడని బంకు యజమాని ఎదురుచూశాడు. అయితే నేటికి అతను తిరిగిరాకుండా సొమ్ము తిరిగి చెల్లించకుండా పరారీలో ఉండడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్సై బి.జ్యోతిబాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోళ్ల వ్యర్థాల రవాణాపై కేసు నమోదు భీమడోలు: అక్రమంగా చేపల చెరువులకు కోడి వ్యర్థాలను తరలిస్తున్న కంటైనర్ లారీ డ్రైవర్పై సోమవారం రాత్రి భీమడోలు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, పర్యావరణానికి హాని కలిగించేలా చేపల చెరువులకు ఒంగోలుకు చెందిన కంటైనర్ లారీ డ్రైవర్ వేగిరెడ్డి రామ్మోహనరావు లారీలో రెండు టన్నుల కోళ్ల వ్యర్థాల లోడుతో కోడూరుపాడు గ్రామం నుంచి పూళ్ల వైపు వస్తున్నాడు. పోలీసులకు అందిన సమాచారం మేరకు కోడూరుపాడు రైల్వే గేటు వద్ద కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నట్లు గుర్తించి పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్, యాజమానిపై ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య కొయ్యలగూడెం: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విజయ విష్ణువర్దన్ సోమవారం చెప్పారు. కన్నాపురం గ్రామానికి చెందిన వెంప వెంకటేశ్వరరావు (45) ఇటీవల అప్పులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో మనస్తాపంతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
లారీ ఢీకొని వృద్ధురాలి మృతి
ఆకివీడు: అజ్జమూరులో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. అజ్జమూరుకు చెందిన పీతల నందమ్మ (65) మందు బిళ్లలు కొనేందుకు సోమవారం వెళ్లి తిరిగి వస్తుండగా, అజ్జాలమ్మ గుడి వద్దకు వచ్చేసరికి ఆకివీడు నుంచి కుప్పనపూడి వైపు వెళుతున్న ఓ లారీ వేగంగా వస్తూ వృద్ధురాలిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించార. మనవరాలి ఫిర్యాదు మేరకు ఎస్సై బి.నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
- Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
Advertisement