-
మిగిలేది బూడిదే..
ధూమపానం అలవాటు అటు ఆర్థికంగాను.. ఇటు ఆరోగ్యపరంగాను మిగిలేది బూడిదే. నన్ను ఈ రోజు మీరు బూడిద చేస్తే...రానున్న రోజులలో మిమ్మల్ని నేనూ బూడిదలో కలిపేస్తాను అంటున్న సిగరెట్ను యువత ఫ్యాషన్గా అలవాటు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో హైస్కూలు, టీనేజ్ స్థాయి నుంచే ఎక్కువ మంది ఆకర్షితులు అవుతున్నారు. దీనిని గుర్తించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధూమపానం వల్ల వచ్చే శారీరక, మానసిక ఆరోగ్యపరమైన అనర్థాల గురించి వారికి చెప్పాల్సి ఉంది. – డాక్టర్ శ్రీపాద రామకృష్ణ, కౌన్సెలింగ్ సైకాలజిస్టు, బీవీసీ ఇంజినీరింగ్ కాలేజీ, ఓడలరేవు -
ఓట్ల లెక్కింపు కీలకం
అమలాపురం రూరల్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత కీలకమని, ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల శిక్షణ కేంద్రం నోడల్ అధికారి శివశంకర్ అన్నారు. ఓట్లను లెక్కించే సూపర్వైజర్లు, సహాయకులకు నోడల్ అధికారులకు అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో చివరి విడత అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పొరపాటుకు కూడా తావివ్వద్దని, ప్రతీ ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండి తమకు కేటాయించిన విధులను పూర్తి చేయాలని ఆదేశించారు. జూన్ 4వ తేదీ 7 గంటలకు స్ట్రాంగ్ రూములను పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరుస్తామని తదుపరి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. సిబ్బంది ఉదయం ఐదున్నర గంటలకే తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవైపు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు, మరోవైపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమాంతరంగా జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్లు అధిక సంఖ్యలో పోలైనం దున, వాటి లెక్కింపు కోసం రెండు టేబుళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు.ఓట్ల లెక్కింపు కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ శర్మ, డీటీ పలివెల అశోక్ ప్రసాద్ పాల్గొ న్నారు. -
క్యాన్సర్ స్క్రీనింగ్పై ముగిసిన శిక్షణ
అమలాపురం టౌన్: జిల్లా స్థాయి క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మూడు రోజులపాటు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగింది. జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యులు పాల్గొన్నారు. ఆ మెడికల్ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, నోడల్ అధికారిణి డాక్టర్ రుక్మిణీదేవి ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల శిక్షణ జరిగింది. రంగరాయ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీఎస్ఎల్ నరసింహం అధ్యక్షతన గురువారం శిక్షణ ముగింపు కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.లావణ్యకుమారి మాట్లాడుతూ రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్ల కోసం 30 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారందరినీ పరీక్షించాలని ప్రభుత్వం నిర్దేశించిందని వివరించారు. ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ స్పెషలిస్ట్లకు రెండో స్థాయి శిక్షణ నిర్వహించామన్నారు. -
చెండాడిన ‘మే’ర్తాండుడు
సాక్షి అమలాపురం: ఒకవైపు నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించాయి. మరోవైపు వారం రోజుల క్రితం రెమాల్ తుపాను వల్ల రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో వాతావరణం చల్లబడిందని సామాన్యులు సంతోషించారు. ఈ సమయంలో రోహిణి కార్తె మొదలైంది. ఈ ఏడాది రోహిణి ప్రభావం పెద్దగా ఉండదని, సాధారణ ఎండలే కాస్తాయని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. కాని రోహిణి కార్తె మొదలై రోజులు గడుస్తున్న కొద్దీ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత రెండు రోజులుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జిల్లాలో నిప్పులు కురిపిస్తున్నాడు. మండుతున్న ఎండలు.. అధిక తేమ... వేడి గాలులు, వడగాడ్పులతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గ్రామాల్లో సైతం కర్ఫ్యూ వాతావరణం వేసవి మొదలైన తరువాత ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపని సూర్యుడు తన తీక్షణతను చూపిస్తున్నాడు. జిల్లాలో బుధ, గురు వారాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. జిల్లా కేంద్రమైన అమలాపురంలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యధికంగా కొబ్బరి కేంద్రమైన అంబాజీపేట, మండపేటలో 41 డిగ్రీలు నమోదయ్యింది. ఉదయం పది దాటితే చాలు నిప్పులు కురిపిస్తున్న భానుడు తీవ్రతకు జనం జడిసిపోతున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పట్టణాలతోపాటు గ్రామాలు సైతం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సామాన్యులు, చిరు వ్యాపారులు అల్లాడిపోతున్నారు. రోడ్ల వెంబడి తోపుడు బండ్లు, చిన్నచిన్న దుకాణాలలో వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు మధ్యాహ్న సమయంలో దుకాణాలు మూసివేస్తున్నారు. తిరిగి సాయంత్రం తెరుస్తున్నారు. సాయంత్రం నాలుగు తరువాతే వ్యాపారాలు మొదలవుతున్నాయని చిరు వ్యాపారులు చెబుతున్నారు. రాత్రి పూటా వేడిగాలులు కనిష్ట ఉష్ణోగ్రతలు సహితం 30 డిగ్రీలు చేరాయి. దీంతో రాత్రి అయినా వేడి గాలి వీడడం లేదు. ఫ్యాను కింద కూర్చున్నా సరే... వేడి గాలితో సామాన్యులు అల్లాడి పోతున్నారు. రాత్రి వేళ్లలో ఆరుబయట నిద్రపోతున్నా సరే ఉక్కబోత వీడక ఆపసోపాలు పడుతున్నారు. ఎండ తీక్షణానికి వేడి గాలి తోడు కావడంతో మధ్యాహ్న సమయంలో ఎక్కుడ తలదాచుకోవాలో తెలియడం లేదని జనం వాపోతున్నారు. జిల్లాలో జూన్ 10వ తేదీ వరకు మధ్యలో ఒకటి, రెండు రోజులు మినహా ఇదే ఉష్ణోగ్రతలు ఉంటాయని జనం అంచనా. ఎండలకు విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. ఫ్యాన్లు, ఏసీలు ఉదయం, సాయంత్రం, రాత్రి అనే తేడా లేకుండా పనిచేస్తూనే ఉన్నాయి. పలుచోట్ల లోడ్ పెరిగి సాంకేతిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఖరీఫ్ సన్నాహక సూచిక సూర్యుడు రోహిణి నక్షత్రంలో ప్రవేశించడంతో రోహిణి కార్తె మొదలవుతుంది. సాధారణంగా మే 4వ వారంలో ఈ కార్తె మొదలవుతుంది. మొత్తం 15 రోజుల పాటు ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది మే 25న మొదలైన కార్తె జూన్ 8వ తేదీ వరకు ఉండనుంది. రోహిణి ఎండలు ఎంతగా మండుతాయంటే రోళ్లు పగిలిపోతాయని జనం నమ్మకం. ఇది చాలాసార్లు రుజువైంది కూడా. రోహిణి కార్తె ఖరీఫ్ సాగుకు రైతులు సమాయత్తం కావాలని సూచిస్తోంది. విత్తనాలు సిద్ధం చేసుకోవడంతోపాటు సాగుకు సన్నాహాలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అగ్ని నక్షత్రంలో సూర్యుడి ప్రవేశం వల్లే అగ్ని నక్షత్రం (కృతికా నక్షత్రం)లో మూడు, నాలుగు పాదాలు, రోహిణి మొదటి పాదంలో సూర్యడున్నంత సేపు రోహిణి కార్తి ఉంటుంది. సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు. దీనివల్ల వేడి ఎక్కువగా ఉంటుంది. అగ్నినక్షత్రంలో సూర్యడి ప్రవేశం వల్ల ఈ కాలంలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతాయి. ఈ ఎండలకు బలంగా ఉండే రోళ్లు కూడా పగులుతాయని పెద్దలు చెప్పారంటే ఎండ తీవ్రత ఎలా ఉంటోందనేది అప్పుట్లోనే గుర్తించారు. – ఉపద్రష్ట నాగాదిత్య, జోతిష్య కర్త, దైవజ్ఞ రత్న, అమలాపురం ఠారెత్తిస్తున్న రో‘హీట్’ కార్తె ఎండలు రోళ్లు పగిలే స్థాయిలో నిప్పులు కురిపిస్తున్న సూర్యుడు అంబాజీపేటలో 41 డిగ్రీలు.. కనిష్టం 30 డిగ్రీలు ఆపై ఉక్కబోత... విలవిలలాడుతున్న సామాన్యులు -
No Headline
సాక్షి అమలాపురం: ‘సరదా సరదా సిగిరెట్టూ... ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ..’ రాముడు... భీముడు సినిమాలో ఒక హాస్యపాట. అప్పట్లో చాలా పాపులర్ అయ్యింది. కాని ఈ పాటలో సిగరెట్టు కాల్చడం వల్ల కలిగే మనసుకు కలిగే ఆనందం కన్నా.. దీనివల్ల కలిగే అనారోగ్యాన్ని కూడా కవి అద్భుతంగా వర్ణించారు. ‘ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చు’ అని సిగరెట్టు గురించి గొప్పగా చెబితే ‘ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే.. కారణమన్నారు డాక్టర్లూ, పసరు బేరుకొని, కఫము జేరుకొని, ఉసురు తీయు పొమ్మన్నారూ’ అని పాటలో హెచ్చరించారు. పాటలోనే కాదు.. కాల్చే సిగరెట్టు పెట్టిమీద.. పొగాకు ఉత్పత్తుల అమ్మే ప్యాకెట్ల మీద ఇది క్యాన్సర్ కారకమని హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు. యువకుల నుంచి వయో వృద్ధుల వరకు పొగాకు ఉత్పత్తుల బారినపడి అకాల మృత్యువాతకు గురవుతున్నారు. ప్రధానంగా యువత సిగరెట్లు.. పొగాకు ఉత్పత్తులతో వ్యసనాలు మొదలు పెడుతూ గంజాయి.. హెరాయిన్ వంటి భయంకరమైన మాదక ద్రవ్యాలకు సైతం బానిసలవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గంజాయి.. హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు యువత బానిస కావడానికి ధూమపానం తొలి మెట్టుగా మారుతోంది. ‘మే 31వ తేదీ వరల్డ్ నో టుబాకో డే ’ సందర్భంగా కథనం... ఫ్యాషన్ మత్తులో కొందరు.. ఎంజాయ్ చేస్తున్నామనే భావనలో మరికొందరు... ధూమపానం ఒత్తిడి తగ్గిస్తుందని ఇంకొందరు భావిస్తున్నారు. జిల్లాలో యుక్త వయస్సు వచ్చిన వారి నుంచి వృద్ధుల వరకు పొగాకు ఉత్పత్తుల బారిన పడుతున్నారు. సిగరెట్స్, బీడి, హుక్కా, చిలుంలు ఆరోగ్యాన్ని పొగతో ఇబ్బంది పెడుతుండగా, ఖైనీ, గుట్కా, జర్దాలు పొగలేకుండానే పొగపెడుతున్నాయి. గుట్కాను ప్రభుత్వం నిషేధించినా అక్కడక్కడా చాటుమాటు విక్రయాలు చేస్తున్నారు. ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ కాలేజీల్లో కొత్తగా వీటిబారిన పడుతున్నవారు అధికంగా ఉంటున్నారు. ర్యాగింగ్ పేరుతో జూనియర్లకు వీటిని అలవాటు చేస్తున్న సీనియర్లు ఉన్నారు. జిల్లాలో రోజుకు ఐదు లక్షలకు పైగా సిగరెట్లు.. చుట్టలు వినియోగిస్తున్నట్టు అంచనా. గుట్టుచప్పుడు కాకుండా గుట్కా అమ్మకాలు గుట్కా, ఖైనీ, చుట్టా, బీడీ, సిగరెట్టు యువతకు ఫ్యాషన్గా మొదలై... వ్యసనంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల బాల కార్మికులు కూడా విపరీతంగా గుట్కాకు అలవాటు పడుతున్నారు. ప్రభుత్వం పొగాకు పదార్థాలు నిషేధించింది కానీ గుట్టు చప్పుడు కాకుండా గుట్కా అమ్మకాలు ఇంకా జోరుగానే సాగుతున్నాయి. ఒక సిగరెట్ తాగితే 11 నిమిషాల ఆయుష్షు తగ్గుతుంది. పొగ తాగే వారి ఇంట్లో ఉండడంతో కుటుంబ సభ్యులకు వ్యాధులు సోకే అవకాశం లేకపోలేదు. మానేయడం అంత సులువుకాదు ● ధూమపానం మానేయడం అనేది మనం అనుకునేంత ఈజీ కాదు. ఎందుకంటే మీరు వెంటనే ధూమపానం మానేసినప్పుడు, మీరు ఆకలి, అలసట, తలనొప్పి, నిద్రలేమి, దగ్గు, మలబద్ధకం వంటి కొన్ని తాత్కాలిక సమస్యలను చూడాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలు కొంతకాలమే. వీటిని బూచిగా చూసి తిరిగి మొదలు పెడుతుంటారు. కొన్ని రోజులు మాత్రమే ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ● ధూమపానం చేయాలనే కోరిక 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంటుంది. అంటే ఒకసారి సిగరెట్ తాగాలనే ఆలోచన వస్తే.. కొన్ని నిమిషాలు మాత్రమే దానిపైకి మనసు లాగుతుంది. సంగీతం వినడం, వీడియోలు చూడటం, పనిని కొనసాగించడం లేదా స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి చేస్తే ధూమపానం నుంచి దృష్టిని మరలించవచ్చు. పొగ చూరిపోతున్న ఆరోగ్యం సిగరెట్లో నికోటిన్తో పాటు హానికరమైన రసాయనాలు ఉంటాయి. బెంజోపైరీన్, అక్రోలిన్, నైట్రోసమైన్లు ఉన్నాయి. జిల్లాలో 58 మంది క్యాన్సర్ బారిన పడగా, వీరిలో 28 మంది లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. వీరిలో అధిక శాతం మంది పొగాకు పీల్చడం, నమలడం వల్ల క్యాన్సర్ బారినపడినవారు ఉన్నారు. జిల్లాలో 29 శాతం మంది యువకలు సిగరెట్స్కి బానిసలుగా ఉన్నారు. వారికి 35 నుంచి 45 వయస్సు వచ్చే సరికి ఊపిరితిత్తులు, గుండెజబ్బులకు గురవుతున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పొగ పీల్చడంతో 4,000 రకాల రసాయనాలు శరీరంలోకి వెళుతున్నాయి. వీటిలో 43 రకాల క్యాన్సర్ కారకాలు 400 రకాల విష పదార్థాలు శరీరంలో చేరుతున్నాయి. పొగాకు ఉత్పత్తుల వల్ల లంగ్ క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, స్వర పేటిక, అన్నవాహిక, మూత్రాశయం, మూత్రపిండాలు, ప్యాక్రియాస్, కడుపు క్యాన్సర్ వంటి అనేక రోగాలకు ధూమపానం ప్రధాన కారణం. ఇది రక్తనాళాల సంకుచితానికి కారణమవుతుంది. ఇది రక్తప్రసరణ అడ్డంకికి దారితీస్తుంది. తద్వారా గుండెపోటు, లంగ్ క్యాన్సర్తో పాటు బ్రోన్కైటిస్, ఎంఫిసెమా, ఆస్తమా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. రెండేళ్ల పాటు మృత్యుఘోష వినిపించిన కరోనా వైరెస్ వల్ల ఉపిరితిత్తులు దెబ్బతిని మృతి చెందినవారు అధికంగా ఉన్నారు. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు, నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. హెచ్చరిస్తున్నా ఫలితం లేదు ఫ్యాషన్గా మొదలై.. వ్యసనంగా మారుతుంది పలు రకాల అనారోగ్యాలు లంగ్.. నోటి క్యాన్సర్ బారిన పడుతున్న సిగరెట్ ప్రియులు జిల్లాలో రోజుకు ఐదు లక్షలకు పైగా సిగరెట్లు.. చుట్టల వినియోగం నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం -
ధూమపానానికి దూరం జరిగితే...
20 నిమిషాలు : రక్తపోటు, హృదయ స్పందన రేటు స్థిరీకరించబడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 8 గంటలు : రక్తంలో నికోటిన్, కార్బన్ మోనాకై ్సడ్ స్థాయిలు సగానికి తగ్గుతాయి. ఆక్సిజన్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేస్థాయి. గుండెపోటు ప్రమాదం తగ్గడం ప్రారంభమవుతుంది. 12 గంటలు : రక్తంలో కార్బన్ మోనాకై ్సడ్ స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. 24 గంటలు : కార్బన్ మోనాకై ్సడ్ పూర్తిగా కరిగిపోతుంది. దగ్గు ద్వారా గొంతులో నుంచి కొన్ని వెళ్లిపోతాయి. 72 గంటలు : ఊపిరితిత్తులు ఇప్పుడు మరింత గాలిని పంపడం ప్రారంభిస్తాయి. శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుంది. 1 నుంచి 2 వారాలు : ఊపిరితిత్తుల పనితీరు, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 1 నెల : మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. చర్మాన్ని పోషిస్తుంది, ముడతలు రాకుండా చేస్తుంది. 1 సంవత్సరం : ధూమపానం చేసేవారితో పోలిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదం సగానికి తగ్గిపోతుంది. 15 సంవత్సరాలు : గుండెపోటు వచ్చే ప్రమాదం ధూమపానం చేయనివారితో సమానంగా ఉంటుంది. -
నిరంతరం అవగాహన
పొగతాగడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నాం. దీనిపై జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మత్తు పదార్థాలకు బానిసైన వారికి డీ అడిక్షన్ సెంటర్లలో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నాం. నో టొబాకోడే సందర్భంగా అన్ని ఆస్పత్రుల వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. – డాక్టర్ జాన్ లెవి ఇంజేటి, ప్రోగ్రామ్ ఆఫీసర్, ఎన్సీడీ అండ్ ఆర్బీఎస్కే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల కలిగే అనర్థాలపై పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. పబ్లిక్ ప్రదేశాల్లో గతేడాది 595 అవగాహన క్యాంపులు నిర్వహించాం. కళాశాలల్లో విద్యార్థులకు 15 చోట్ల అవగాహన సమావేశాలు నిర్వహించాం. – కొల్లాటి ప్రమీల, సోషల్ వర్కర్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్(ఎన్సీడీ) -
వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు
అయినవిల్లి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 2024 పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్టు ముక్తేశ్వరం వైవీఎస్ అండ్ బీఆర్ ఎం.కళాశాల ప్రిన్సిపాల్ కె.విశాల గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 3న జరగాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూన్6 తేదీకి మార్చినట్లు తెలిపారు. మే 31 నుంచి జూన్ 5 తేదీ వరకూ వెబ్ కౌన్సెలింగ్ ఆప్షన్స్ పెట్టుకోనేవారి షెడ్యూల్ జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ మార్చినట్టు తెలిపారు. సీట్లు ఎలాట్మెంట్ జూన్ 7కు బదులు 13కు మార్చామన్నారు. జూన్ 10 నుంచి 14వరకు ఇచ్చిన షెడ్యూల్ను జూన్ 14 నుంచి 19 తేదీ వరకూ మార్చినట్టు తెలిపారు. పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ క్లాసు వర్కును జూన్ 10 నుంచి 14కు మార్చినట్టు తెలిపారు. -
ఈసెట్లో మోడేకుర్రు విద్యార్థికి 3వ ర్యాంకు
కొత్తపేట: ఏపీ ఈసెట్ కెమికల్ బ్రాంచ్లో కొత్తపేట మండలం మోడేకుర్రు గ్రామానికి చెందిన గొలకోటి నితిన్రామ ధనుంజయకుమార్ 3వ ర్యాంకు సాధించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన గొలకోటి సత్తిబాబు, వరలక్ష్మి దంపతుల కుమారుడైన ధనుంజయకుమార్ కెమికల్ ఇంజినీర్ కావాలన్నది తన లక్ష్యవమని తెలిపాడు. వరప్రసాద్కు 7వ ర్యాంకు అయినవిల్లి: ఎస్.మూలపాలెం ఎంపీఎం కళాశాల విద్యార్థి వి.వరప్రసాద్ 2024 ఈసెట్ అగ్రికల్చల్ ఇంజినీరింగ్ విభాగంలో 7వ ర్యాంకు సాధించినట్లు ఆ కళాశాల కరస్పాండెంట్ జి.శ్రీదేవి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వరప్రసాద్తో పాటు 12 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు. అంగర విద్యార్థికి మణికంఠకు 10వ ర్యాంకు కపిలేశ్వరపురం: మండలంలోని అంగరకు చెందిన అబ్బిశెట్టి భాస్కర మణికంఠ ఈ సెట్ ఫలితాల్లో 10వ ర్యాంకు సాఽధించాడు. కంప్యూటర్ సైన్స్లో డిప్లమా పూర్తి చేసిన మణికంఠ ఇంజినీరింగ్లో చేరిక కోసం ఈ సెట్ రాశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడాలన్నది తన ఆశయమని మణికంఠ తెలిపారు. -
గురువారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2024
గత ఏడాది జూలై.. ఆగస్టు నెలల్లో కూనవరం స్ట్రైట్కట్ (మొగ) ద్వారా సముద్రంలోకి ముంపునీరు ఇలా దిగుతోంది. ఈ మొగ ద్వారా అమలాపురం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాలకు చెందిన సుమారు 20 వేల ఎకరాల వరి ఆయకట్టు, పది వేల ఎకరాల ఆక్వా చెరువుల ముంపునీరు సముద్రంలోకి దిగాల్సి ఉంది. నీరు ఈ విధమైన ప్రవాహంతో దిగితేనే చేలు ముంపుబారిన పడవు. కూనవరం స్ట్రైట్కట్ వద్ద సాధారణంగా వేసవిలో పరిస్థితి ఇది. మొగ చాలా వరకు మూసుకుపోయి ముంపునీరు పెద్దగా దిగదు. వర్షాలు లేకపోవడం, వేసవిలో సాగు లేక ముంపునీరు కూనవరం మేజర్ డ్రెయిలో చాలా తక్కువ పారుతోంది. ఆక్వా చెరువుల నుంచి వచ్చిన నీరు, మొగ ద్వారా ఆటుపోటు సమయంలో వచ్చే సముద్రం నీరు తిరిగి వెళ్లిపోతోంది. ఇలా ఉన్న మొగను డ్రైనేజీ శాఖ అధికారులు జూలై నెలలో డ్రెడ్జింగ్ చేసి తెరుచుకునేలా చేస్తుంటారు. కూనవరం స్ట్రైట్కట్ వద్ద ఈ ఏడాది పరిస్థితి. చూస్తే ఎడారిని తలపిస్తోంది. డ్రెయిన్ నుంచి సముద్రంలో కలిసే చోట సుమారు అర కిలోమీటరు మేర ఇసుక తిన్నెలు వేసేసింది. గతంలో కన్నా ఈ ఏడాది మట్టి మరింత పేరుకుపోయింది. డ్రెయిన్ కన్నా సముద్ర మొగ వద్ద మూడునాలుగు అడుగుల ఎత్తున ఇసుక మేటలు వేయడంతో ఈ ఏడాది వర్షాకాలం డ్రెడ్జింగ్ కూడా కష్టమే. ముందు భారీగా ఇసుక తవ్వకాలు చేసి తరువాత డ్రెడ్జింగ్ చేయాల్సి వస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఈసీఐ నిబంధనల మేరకు ఏర్పాట్లు
అమలాపురం రూరల్: అమలాపురం పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జూన్ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా 26 జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపు కేంద్రాల సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా శుక్లా మాట్లాడుతూ పారదర్శకంగా ఓట్ల లెక్కింపు సాగేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వెయ్యి మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకులు తదితరులతో పాటు దాదాపు 400 మంది ఇతర సిబ్బంది కౌంటింగ్, అనుబంధ విధుల్లో పాల్గొంటారని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రిటర్నింగ్ అధికారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియను సమష్టి కృషితో విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు, జాప్యం లేకుండా ఫలితాల వెల్లడికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. మీడియా కేంద్రం వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు తాజా సమాచారాన్ని ప్రతి రౌండ్కూ సకాలంలో అందించాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ తెరిచేందుకు కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 5.30గంటలకు లెక్కింపు కేంద్రానికి హాజరుకావాలన్నారు. ఏజెంట్లు పెన్ను, పెన్సిల్, 17సీ ఫారం, తెల్లకాగితం మాత్రమే తీసుకురావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ఈవీఎంలోని ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించడానికి వేర్వేరుగా టేబుల్లను ఏర్పాటు చేశామన్నారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఫలితాల తర్వాత ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు తప్పనిసరని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు అడ్మిన్ ఎస్పీ ఎస్.ఖాదర్ బాషా, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జి. కేశవవర్ధన రెడ్డి, వి.మదన్మోహన్ రావు, డీవీఎస్ ఎల్లారావు, ఎ.శ్రీరామచంద్రమూర్తి, జీవీవీ సత్యనారాయణ, పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఎం.ఝాన్సీ రాణి ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ హిమాన్షు శుక్లా -
మొగమాటం ఏంటో!?
సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం : మధ్యడెల్టాలో ఖరీఫ్కు ప్రధాన అవరోధం ‘ముంపు’. కొద్దిపాటి వర్షానికే వేల ఎకరాల్లో చేలు ముంపునకు గురవుతున్నాయి. ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో భారీ వర్షాలు, తుపాన్లకు ఏటా వేల ఎకరాల్లో పంట నష్టపోతున్నారు. ముమ్మిడివరం, ఉప్పలగుప్తం, అమలాపురం, కాట్రేనికోన మండలాల్లో ఆయకట్టు ముంపునకు కూనవరం స్ట్రైట్కట్ కారణమవుతోంది. అలాగే అమలాపురంతో పాటు ఉప్పలగుప్తం, అమలాపురం మండలాల్లో ముంపునీరు దిగాల్సి ఉంది. ఈ రెండు మొగల ద్వారా సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు సముద్రంలో కలుస్తోంది. ఇప్పుడు ఈ రెండు మొగలు మూసుకుపోయాయి. వేసవిలో ఇది సహజమే అయినా ఈ ఏడాది మొగల వద్ద పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేశాయి. శాశ్వత పరిష్కారమే శరణ్యం కూనవరం, రామేశ్వరం మొగలు పూడుకుపోకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఆయకట్టు రైతులు దశాబ్దాలుగా కోరుతున్నారు. 2002 నుంచి అంటే సుమారు 22 ఏళ్ల నుంచి తాత్కాలిక పనులు తప్ప శాశ్వత చర్యలు లేవు. పూడుకుపోయినప్పుడల్లా డ్రెడ్జింగ్ చేసి మమ అనిపిస్తున్నారు. వీటి పరిష్కారానికి ముంబాయి చెందిన ఓషనోగ్రఫీ అధికారులు మొగకు ఇరువైపులా డ్రెయిన్ నుంచి సముద్రంలోకి గ్రోయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాయి. కానీ దీనిపై సాగునీటి పారుదల శాఖ అధికారులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. కొంతమంది మాత్రం కూనవరం, రామేశ్వరం మొగలను ఆనుకుని ఉన్న పర్రభూముల (సాంప్)లో ఆక్రమణలు తొలగించాలని కోరుతున్నారు. సుమారు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా ఏర్పడిన పర్రభూములను ఆక్రమించి కొందరు ఆక్వా సాగు చేస్తున్నారు. దీని వల్ల పర్రభూములు కుదించుకుపోయాయి. లేకుంటే ఈ పర్రభూములలోకి ముంపునీరు చేరి నదుల ద్వారా సముద్రంలో కలిసేది. అలాగే పర్రభూముల నుంచి సముద్రంలోకి నీరు దిగేలా పలుచోట్ల గండ్లు కొట్టాలని అప్పుడు వేగంగా ముంపునీరు సముద్రంలో దిగుతుందని వారు తేల్చారు. ఈ కార్యాచరణ రూపొందించడంలో అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రెండు దశాబ్దాలుగా కేవలం డ్రెజ్జింగ్, ఇసుక మేటల తొలగింపు వంటి తాత్కాలిక పనులను మాత్రం చేస్తున్నారు. దీని వల్ల ఆయకట్టు రైతులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. మత్స్య సంపదకు కోత చేపల వేట నిషేధంతో తీర ప్రాంత మత్స్యకారులు ప్రత్యామ్నాయ పద్ధతిలో పర్రభూములలో వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అల్లిపర్ర మీద రాఘవులపేట, ఎన్.కొత్తపల్లికి చెందిన మత్స్యకారులు, చిర్రయానాం పర్రభూమి మీద చిర్రయానాం, గచ్చకాయల పోర, పల్లం, నీళ్లరేవుకు చెందినవారు, ఎస్.యానాం పర్రమీద ఎస్.యానాం మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. పర్ర భూముల్లో కొయ్యింగ, కట్టి పరిగెలు, కడిసెలు, మాతలు, టైగర్ రొయ్యలు, తెల్ల రొయ్యలు దొరుకుతుంటాయి. ఈ పర్ర భూముల మీద రోజుకు కనీసం రూ.పది లక్షల విలువైన మత్స్య సంపద లభ్యమవుతుందని అంచనా. మొగల నుంచి సముద్రపు నీరు రాకపోవడంతో మత్స్యసంపద తగ్గిపోతోందని మత్స్యకారులు వాపోతున్నారు. మూసుకుపోయిన కూనవరం స్ట్రైట్కట్ అదే బాటలో రామేశ్వరం మొగ పెద్ద ఎత్తున వేసిన ఇసుక మేటలు ఖరీఫ్ వేళ 50 వేల ఎకరాలకు ఇబ్బంది మొగ మూసుకపోయి ఎండిపోతున్న సాంప్లు మత్స్య సంపదకు అవాంతరం ఏటా డ్రెడ్జింగ్తో సరిపెడుతున్న అధికారులు శాశ్వత చర్యలకు ఇబ్బందేమిటో మరి! మత్స్య సంపద తగ్గిపోతోంది పర్రభూమిలోకి సముద్రపు నీరు రాకపోవడంతో ఇవి చాలా వరకు పూడుకుపోయాయి. అల్లిపర్ర చాలా వరకు ఎండిపోయింది. ఇక్కడ వేట చేయడం ద్వారా రోజుకు కనీసం రూ.500 నుంచి రూ.600 వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడా సంపాదన లేదు. – అరదాని రాజు, మత్స్యకారుడు, ఎన్.కొత్తపల్లి, ఉప్పలగుప్తం మండలంశాశ్వత పరిష్కారం చూపాలి మొగలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. గ్రోయిన్లు కట్టడం, సాంప్లలో ఆక్రమణలు తొలగించడం, డ్రెయిన్లలో పూడిక తొలగింపు, గుర్రపుడెక్క తీయడం వంటి పనులు ఒక పద్ధతిలో చేయాలి. అప్పుడు ముంపునీరు ఎటువంటి సమస్య లేకుండా దిగుతుంది. గతంలో భారీ వర్షాలు కురిస్తే రెండు, మూడు రోజులు చేలు ముంపు నీటిలో ఉన్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు వారం, పది రోజులు చేలు మునిగిపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. – సత్తి శ్రీనివాస్, గోదావరి ప్రాజెక్టు కమిటీ మాజీ వైస్ చైర్మన్, సవరప్పాలెం, అమలాపురం మండలం -
భవితకు దివ్యమైన ప్రణాళిక
ప్రత్యేక వైద్య శిబిరాలు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో మెడికల్ అసెస్మెంట్ క్యాంపులు ఏర్పాటు చేశారు. రావులపాలెం, రామచంద్రపురం, ముమ్మిడివరం, రాజోలు, అమలాపురంలలో ఏర్పాటుచేసిన శిబిరాల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన ఉపకరణాలను గుర్తించి, వాటి కోసం దరఖాస్తులు స్వీకరించారు. వారిని ప్రత్యేక వైద్య నిపుణులతో పరీక్షలు చేయించి వారికి ఎటువంటి పరికరాలు అవసరమో గుర్తించారు. ఈ విధంగా సుమారు 800 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని గుర్తించారు. వీరిని మెంటల్లీ రిటార్టెడ్ (ఎంఆర్), హియరింగ్ ఇంపైర్డ్ (హెచ్ఐ), విజువల్లీ ఇంపైర్డ్ (వీఐ), సెరిబ్రల్ పాలసీ కింద నాలుగు విభాగాలుగా విభజించారు. ఈ శిబిరాల్లో పాఠశాలలకు రాకుండా ఇంటి వద్ద ఉండేవారు కూడా వచ్చారు. ఇలా పాఠశాలలకు రాని ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఉన్నారని గుర్తించి, ఇటువంటి వారి కోసం సర్వే ప్రారంభించారు. రాయవరం: అన్ని అవయవాలు సక్రమంగా ఉండి, ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు వారి అనుభూతులను తల్లిదండ్రులతో పంచుకుంటారు. దివ్యాంగులైన చిన్నారులు మాత్రం వారి ఆనందాన్ని, కష్టాలను, అనుభూతులను పూర్తి స్థాయిలో వ్యక్తంచేయలేరు. ప్రభుత్వం అటువంటి ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను కూడా మిగిలిన చిన్నారులతో సమానంగా చూడాలని చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు మిగిలిన చిన్నారుల మాదిరిగానే అన్ని అవకాశాలను అంది పుచ్చుకునేలా ప్రతి మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సహిత విద్యను ప్రవేశ పెట్టింది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఇంటికే పరిమితం కాకుండా మానసికంగా, శారీరకంగా ఎదిగేందుకు ఈ భవిత కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సమాజంలో ఇంకా మిగిలి ఉన్న ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను గుర్తించడానికి భవిత కేంద్రాల ఐఈఆర్పీ(ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్)లు సర్వే చేస్తున్నారు. ఇంక్లూజన్–2025లో భాగంగా దివ్యాంగ చిన్నారులందరికీ వారికి అవసరమైన విద్యను అందించడం, ప్రతి చిన్నారిని వారి వయసుకు తగ్గట్టుగా పాఠశాలలో చేర్పించడమే లక్ష్యంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే దివ్యాంగ చిన్నారుల విద్యను డిజిటలైజేషన్ చేసి, ట్యాబ్లను అందజేశారు. సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఇంటికే పరిమితం కాకుండా.. మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందేందుకు ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల ద్వారా అవసరమైన చర్యలను సమగ్ర శిక్షా అభియాన్ తీసుకుంటోంది. మానసిక దివ్యాంగుల్లో విద్యార్థి దశలో ఉన్నవారికి విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటుగా, ప్రతివారం ఫిజియోథెరపీ సేవలను అందజేస్తున్నారు. వీరిలో అవసరమైన పరికరాలను అందించడానికి చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక అవసరాలు గల వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించడం, పాఠశాలలకు రప్పించేలా భవిత కేంద్రంలోని ఐఈఆర్పీలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రతి మండలంలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను గుర్తించేందుకు ఐఈఆర్పీలు ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. జిల్లాలో 22 భవిత కేంద్రాలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 22 భవిత కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 2,586 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఉన్నారు. వీరిలో అవసరమైన వారికి వారంలో ఒకరోజు ఫిజియోథెరపీ సేవలను అందిస్తున్నారు. వీరు కాకుండా, గతేడాది జూన్లో నిర్వహించిన సర్వేలో పాఠశాలలకు రాకుండా ఇంటి వద్ద ఉన్న వారిని గుర్తించేందుకు సర్వే చేస్తున్నారు. సర్వే అనంతరం వారి వయసుకు తగిన విధంగా, అంగన్వాడీ కేంద్రం లేదా ప్రాథమిక పాఠశాలల్లో వారిని చేర్పిస్తారు. ఈ ఏడాది సెలవు రోజుల్లోనే సర్వే చేయాలని అధికారులు ఐఈఆర్పీలను ఆదేశించారు. స్థానిక అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ల సహాయంతో సర్వే చేపడుతున్నారు. నాలుగు రకాల అలవెన్స్లు ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు నాలుగు రకాల అలవెన్సులను ప్రభుత్వం అందజేస్తుంది. ఎస్కార్ట్, ట్రాన్స్పోర్ట్, హోమ్ బేస్డ్, రీడర్ అలవెన్స్లను అందజేస్తున్నారు. అంధులైన చిన్నారులకు రీడర్ అలవెన్స్ కింద రూ.200 చొప్పున 10 నెలలకు ఒకసారి రూ.2000 అందజేస్తున్నారు. బడికి వచ్చే వారికి ఎస్కార్ట్ అలవెన్స్ కింద ఒక్కో విద్యార్థికి నెలకు రూ.300 వంతున పది నెలలకు రూ.3,000 అందిస్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కింద ఒక్కో విద్యార్థికి రూ.300 వంతున పది నెలలకు రూ.3,000 అందజేస్తున్నారు. బాలికలకు ప్రత్యేకంగా గర్ల్ చైల్డ్ అలవెన్స్ కింద ఒక్కో విద్యార్థినికి రూ.200 వంతున 10 నెలలకు రూ.2000 ఇస్తున్నారు. హోమ్ బేస్డ్ అలవెన్స్ కింద బడికి రాకుండా ఇంటి వద్ద ఉంటూ విద్య నేర్చుకునే ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు నెలకు రూ.300 వంతున పది నెలలకు రూ.3,000 అందజేస్తున్నారు. అలాగే బడికి వెళ్లే వారికి పాఠశాలల్లో అందరు విద్యార్థులతో పాటు వీరికి విద్యాకానుకలో భాగంగా యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బెల్టు తదితర సామగ్రిని అందజేస్తున్నారు. అమ్మఒడి పథకాన్ని కూడా వీరికి వర్తింపజేస్తున్నారు. మండలాల వారీగా గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల వివరాలు ఇలా.. మండలం చిన్నారులు అయినవిల్లి 09 ఆలమూరు 08 అల్లవరం 10 అమలాపురం 06 అంబాజీపేట 07 ఆత్రేయపురం 12 ఐ.పోలవరం 06 కె.గంగవరం 10 కపిలేశ్వరపురం 04 కాట్రేనికోన 10 కొత్తపేట 09 మలికిపురం 12 మామిడికుదురు 16 మండపేట 09 ముమ్మిడివరం 23 పి.గన్నవరం 09 రామచంద్రపురం 10 రావులపాలెం 11 రాయవరం 14 రాజోలు 13 సఖినేటిపల్లి 15 ఉప్పలగుప్తం 09 గడప గడపకూ వెళ్లి భవిత కేంద్రాల ఐఈఆర్టీల సర్వే ప్రత్యేక అవసరాల చిన్నారుల గుర్తింపు సమగ్ర శిక్ష ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీకి కృషిప్రతి ఒక్కరినీ గుర్తించేందుకే జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల్లో ప్రతి ఒక్కరినీ ఈ పథకం కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్వే ప్రారంభించాం. సర్వే ముమ్మరంగా సాగుతోంది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు వారి అవసరాల మేరకు విద్యను అందిస్తున్నాం. భవిత కేంద్రాలకు రాని వారికి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ను అందిస్తున్నాం. ఎక్కడా సిబ్బంది కొరత లేదు. – ఎంవీవీ సత్యనారాయణ, సహిత విద్య జిల్లా కోఆర్డినేటర్, అమలాపురం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను సాధారణ విద్యార్థులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు భవిత కేంద్రాలు దోహదపడుతున్నాయి. ఈ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందజేస్తున్నారు. బడికి వచ్చే అవకాశం ఉన్న ప్రతి చిన్నారిని, భవిత కేంద్రానికి రప్పించి విద్యను అందించడం ప్రధాన ఉద్దేశం. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు అవసరమైన పరికరాలను అందజేస్తున్నాం. ఇప్పటి వరకు 232 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను గుర్తించాం. – ఎ.మధుసూదనరావు, డిప్యూటీ కలెక్టర్, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, సమగ్ర శిక్షా, అమలాపురం -
పాసులుంటేనే అనుమతి
అమలాపురం టౌన్: చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ప్రవేశానికి విధిగా పాస్ ఉండాలని ఎస్పీ సుసరాపు శ్రీధర్ సూచించారు. అలాగే వివిధ పార్టీల అభ్యర్ధులు, కౌంటింగ్ ఏజెంట్ల వాహనాలు నిర్దేశిత ప్రాంతంలోనే నిలపాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రత, నిఘాను ఎస్పీ శ్రీధర్ ఎన్నికల సంఘానికి, పోలీసు ఉన్నతాధికారులకు బుధవారం నివేదించారు. పలు ప్రాంతాల్లో పోలీసు అధికారులు క్యాసో తనిఖీలు, దాడులు బుధవారం నిర్వహించారు. ఈ దాడులు, తనిఖీల వివరాలను ఎస్పీ కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ● అల్లవరం శివారు సడక్ రోడ్డు వద్ద పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.28,300 నగుదు సీజ్ చేశారు. ● ఐ.పోలవరం మండలం జి.మూలపొలంలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి 2 లీటర్ల నాటుసారా, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ● రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు, రాయవరం మండలం కూర్మాపురం, రామచంద్రపురం మార్కెట్ సెంటర్, అమలాపురం మున్సిపల్ కాలనీ, ఐ.పోలవరం మండలం పశువుల్లంక ప్రాంతాల్లో పోలీసు అధికారులు స్థానిక రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలతో అవగాహన సదస్సులు నిర్వహించి ఓట్ల లెక్కింపు రోజున అమలయ్యే బందోబస్తు గురించి వివరించారు. ఎస్పీ సుసరాపు శ్రీధర్ -
వెబ్ కౌన్సెలింగ్కు 63 మంది హాజరు
అయినవిల్లి: మండలంలోని ముక్తేశ్వరం వైవీఎస్ అండ్ బీఆర్ఎం కళాశాలలో జరిగిన పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్కు బుధవారం 63 మంది విద్యార్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.విశాల తెలిపారు. 27001 ర్యాంకు నుంచి 43000 ర్యాంకు వరకూ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. గురువారం 43001 నుంచి 59000 ర్యాంకు వరకూ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రతి విద్యార్థికి ‘విద్యాకానుక’ రాయవరం: వచ్చే నెల 12న పాఠశాలల పునఃప్రారంభం రోజునే ప్రతి విద్యార్థికి విద్యాకానుక అందజేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని డిప్యూటీ కలెక్టర్, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎ.మధుసూదనరావు తెలిపారు. రాయవరం మండలంలో శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యాకానుక–5 స్టాక్ పాయింట్ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 22 మండలాల్లో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో పాటు, విద్యాకానుక–5 స్టాక్ను సక్రమంగా, సమర్ధవంతంగా పాఠశాలలకు చేరవేసేందుకు ప్రతీ కాంపొనెంట్కు ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అలాగే పాఠశాల స్థాయిలో కూడా కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చామని అన్నారు, జిల్లాలో మండల స్టాక్ పాయింట్లకు పూర్తి స్థాయిలో నోట్ బుక్, బెల్టులు చేరుకున్నాయన్నారు. సింగిల్ రూల్, బ్రాడ్ రూల్, వైట్ 6.62లక్షల నోట్ పుస్తకాలు, 66,549 బెల్టులు చేరుకున్నాయన్నారు. దశలవారీగా పాఠ్య పుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు చేరుకుంటున్నాయన్నారు. 51,897 మంది బాలికలకు 47,729 మంది బాలురకు షూలు, 11,557 ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, 99,232 వంతున యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్ మండల స్టాక్ పాయింట్లకు చేరుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు జూన్ 5వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో మెటీరియల్ చేరుతుందన్నారు. మండల విద్యాశాఖాధికారులు పి.రామలక్ష్మణమూర్తి, వై.సూర్యనారాయణలకు పలు సూచనలు ఇచ్చారు. అంతకు ముందు ఆయన మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పాఠశాల హెచ్ఎంలతో మనబడి నాడు–నేడు పనులపై సమీక్షించారు. ఆయన వెంట సమగ్ర శిక్షా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏఎంవో పి.రాంబాబు, సైట్ ఇంజినీర్ సూర్యనారాయణ, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ ఎస్.రామారావు, అకౌంటెంట్ సత్యనారాయణ తదితరులున్నారు. -
కోనసీమ పనసకు గిరాకీ
సాక్షి అమలాపురం: చూడగానే నోరూరించే పనస పంటకు కోనసీమ కేరాఫ్ అడ్రస్గా మారింది. తేనెలూరే రుచి ఉండే ఈ పనస తొనలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. కొబ్బరి, అరటి తరువాత కోనసీమలో పండే విలువైన పంటల్లో పనస ఒకటి. ఈ కారణంగా తూర్పు, పశ్చిమ ఏజెన్సీలలో పండే పనసకన్నా కోనసీమలో పండే పనసకు మంచి డిమాండ్ ఉంది. 79.36 ఎకరాల్లో సాగు వేసవి వచ్చి0దంటే చాలు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనస కాయల ఎగుమతులు జోరందుకుంటాయి. జిల్లాలో డెల్టా ప్రాంతంతోపాటు గోదావరి లంక గ్రామాల్లో కొబ్బరి తోటల్లో పనస చెట్లను పెంచడం రైతులకు ఆనవాయితీగా వస్తోంది. జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతుంది. ఇక్కడ కొబ్బరి తోటల్లో మధ్యన, గట్ల మీద, సరిహద్దుల్లో పనసను రైతులు పెంచుతుంటారు. పనస మీద వచ్చే ఆదాయానికి తోడు ఏళ్ల పాటు చెట్టును పెంచితే టేకు, మద్ది కర్రతో సమానంగా ఆదాయం వస్తున్నది. దీని వల్ల డెల్టా, గోదావరి లంకల్లో పనస చెట్లు గణనీయంగా ఉంటాయి. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం జిల్లాలో 79.36 ఎకరాల్లో పనస సాగు జరుగుతున్నది.కానీ వాస్తవంగా కొబ్బరి తోటలు, రోడ్లు, పంట కాలువల వెంబడి చెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే ఇందుకు రెండుమూడు రెట్లు సాగు జరుగుతున్నదని అంచనా. ఏజెన్సీతో పోల్చుకుంటే డెల్టా, గోదావరి లంకల్లో పెరిగే పనస తొనల రుచి అధికం. అందుకే జిల్లా నుంచి వచ్చే పనసను కోనసీమ పనసగా చెప్పి ఇతర పట్టణాల్లో అమ్ముతుంటారు. సీజన్లో రూ.ఐదు కోట్ల ఎగుమతులు వేసవి సీజన్లో జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున పనస కాయలు రవాణా అవుతుంటాయి. కొబ్బరి తరహాలోనే పనసకు సైతం అంబాజీపేట అతి పెద్ద హోల్సేల్ మార్కెట్. రోజుకు 500కు పైగా పనస కాయలు వస్తాయని అంచనా.కాగా, జిల్లా నుంచి రోజుకు 800 నుంచి వేయి కాయల వరకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి పనస ఎగుమతి అవుతున్నది. మార్చి నుంచి జూలై నెల వరకు ఒక్క అంబాజీపేట నుంచే రూ.5 కోట్ల విలువైన పనస ఎగుమతి అవుతున్నదని అంచనా. మొత్తం జిల్లావ్యాప్తంగా రూ.7 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నదని తెలుస్తున్నది. దిగుబడి పెరిగి.. ధర తగ్గింది.. గత నాలుగైదు ఏళ్ల కన్నా ఈ ఏడాది దిగుబడి అధికంగా ఉంది. చెట్టుకు సగటున 10 నుంచి 15 కాయల వరకు వస్తుంటాయి. ఈసారి 25 కాయలకు పైబడి దిగుబడిగా వస్తోంది. దీనివల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. కాయ సైజు, బరువును బట్టి రూ.100 నుంచి రూ.400 వరకు ధర ఉంటున్నది. ఏడాది పొడవునా పనస పొట్టు కూరల్లో వినియోగించే పనస పొట్టు ఏడాది పొడవునా కోనసీమలో దొరుకుతున్నది. ఇది కూడా ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున రవాణా జరుగుతున్నది. కేజీ పనస పొట్టు ధర రూ.175 నుంచి రూ.200 వరకు ఉంది. ఇది డిసెంబర్ నుంచి జూలై వరకు స్థానికంగా లభ్యమవుతున్నది. పెరిగిన ఎగుమతులుగతంలో కన్నా గత ఐదేళ్లుగా అంబాజీపేట మార్కెట్ నుంచి ఎగుమతులు పెరిగాయి. ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలికి పనస కాయల ఎగుమతి జరుగుతున్నది. ఈ ఏడాది కాయల దిగుబడి అధికంగా ఉంది. అయితే ఎగుమతులు పెరగడం వల్ల సరుకు నిల్వ ఉండడం లేదు. మా దుకాణాల వద్ద రిటైల్ అమ్మకాలు కూడా పెరిగాయి. – కుంపట్ల నాగేశ్వరరావు, వ్యాపారి, అంబాజీపేట -
ఇంటి వంటలు మరిపించేలా మధ్యాహ్న భోజనం
అమలాపురం రూరల్: ఇంటి వంటలు మరిపించే విధంగా స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.కమలకుమారి సూచించారు. అమలాపురం మండలంలో పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం నిర్వహించే నిర్వాహకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అమరావతి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల ప్రకారం ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై అసిస్టెంట్ డైరెక్టర్ (ఎండీఎం) సురేష్ మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టకాహరం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఎంతో ఉత్సాహంగా వంటల పోటీలలో పాల్గొన్నారు. మండల విద్యాశాఖ అధికారి దుర్గాదేవి, ప్రధానోపాధ్యాయుడు ఎస్.పురుషోత్తంరాజు, మధ్యాహ్నం భోజనం నిర్వాహకుల సంఘం నాయకులు కొల్లాటి దుర్గాబాయి, ఎంఐఎస్ రెహమాన్, సీవో అన్నపూర్ణ, సీఆర్పీలు త్రినాథ్, నాగు మండల సిబ్బంది పాల్గొన్నారు. -
ఖరీఫ్ వేళ రిలీఫ్
చెరువు ఆధునీకరణ అల్లవరం మండలం దేవగుప్తంలో ఫారం పాండ్ పనులలో భాగంగా గ్రామంలో అధ్వానంగా ఉన్న చెరువును ఆధునీకరిస్తున్నారు. దీని అంచనా విలువ రూ.3,11,600. కూలీలకు వేతనాల రూపంలో రూ.2,89,294 అందించనున్నారు. మొత్తం 993 పనిదినాలుగా గుర్తించారు. ఈ మండల పరిధిలోని 21 గ్రామాలలో 49 పనులు చేపట్టారు. రోజుకు 3,902 పని దినాలు కల్పించాల్సి ఉండగా, 3,096 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రైతులకు మేలు వేసవిలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులు రైతుల అవసరాలకు తగినట్టుగా చేపట్టాం. వారికి మేలు చేసేలా పంట కాలువలు, బోదెలలో పూడిక తీత పనులు జరుగుతున్నాయి. పొలాల్లో ట్రెంచ్ పనులు, పుంత రోడ్లు, చెరువుల ఆధునీకరణ జరుగుతోంది. వీటివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. – ఎస్.మధుసూదనరావు, డ్వామా పీడీ సాక్షి, అమలాపురం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజేఎన్ఆర్జీఎస్) పనులు జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నికల సందడిలో కూడా పనుల జోరు తగ్గలేదు. పంట కాలువలు, బోదెలలో పూడికతీత పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఖరీఫ్లో పొలాలకు సక్రమంగా సాగునీరు అందనుంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లాలో ఉపాధి హామీ పనులు నిరాటంకంగా సాగాయి. జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికాబద్ధంగా పనులను గుర్తించారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ప్రభుత్వం నుంచి అనుమతి సాధించారు. అందుకే ఎన్నికల సమయంలో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు ముందుకు సాగాయి. పెరిగిన వేగం రబీ సాగు పూర్తి కావడం, పంట కాలువలు మూసివేయడం (క్లోజర్)తో పనులలో వేగం పెరిగింది. అడపాదడపా వర్షాలు పడుతున్నా ఏ మాత్రం ఆటంకం కలగడం లేదు. రోజుకు లక్ష మందికి పని కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. అయితే 89,896 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నారు. కూలీలకు రోజుకు సగటున రూ.290 చొప్పున వేతనం రూపంలో దక్కుతోంది. జిల్లావ్యాప్తంగా రూ.2.60 కోట్లకు పైగా వేతనం కూలీలకు అందేలా అధికారులు పనులు చేపట్టారు. పంట కాలువలకు ప్రాధాన్యం వేసవిలో చేపట్టిన పనుల్లో పంట కాలువలు, బోదెల్లో పూడికతీతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలోని తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో ప్రధాన పంట కాలువలతో పాటు, చానళ్లు, పంట బోదెలలో పూడికతీత పనులు చేపట్టారు. పంట కాలువల వెంబడి మట్టి తొలగింపు, జంగిల్ క్లియరెన్స్ వంటివి చేస్తున్నారు. ప్రధాన పంట కాలువలకు అనుసంధానంగా ఉన్న డైరెక్టర్ పైప్ (డీపీ)ల వద్ద పూడిక తీయడం వల్ల ఆయకట్టు రైతులకు అధికంగా మేలు జరగనుంది. పనుల వివరాలు పంట కాలువలపై 828 పనులు చేపట్టగా వీటి ద్వారా 61,398 మందికి ఉపాధి దొరుకుతోంది. వేతనాల రూపంలో రూ.1.78 కోట్లు అందిస్తున్నారు. ఇక పంట బోదెలకు సంబంధించి 415 పనులు చేపట్టగా రోజుకు 22,693 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వీరికి ఉపాధి వేతన రూపంలో రూ.65.80 లక్షల ఖర్చు చేస్తున్నారు. మొత్తం మీద పంట కాలువలు, బోదెలకు కలిపి రోజుకు రూ.2.43 కోట్లు ఖర్చు చేస్తున్నారు. విశ్వేశరాయపురంలో చెరువులో పూడికతీత పనులుఫ జోరుగా ఉపాధి పనులు ఫ కూలీలకు చేతినిండా పని.. సాగునీటికి హామీ ఫ పంట కాలువలు, బోదెలకు మోక్షం సాగునీటికి ఆటంకం లేకుండా.. ఐ.పోలవరంలోని ప్రధాన పంట కాలువలో పూడిక తీత, చెట్ల తొలగింపు పనులు చేపట్టారు. వీటిలో రోజుకు 350 మంది వరకూ పనిచేస్తున్నారు. ఈ కాలువపై సుమారు 5 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. పూడిక తొలగింపు వల్ల ఖరీఫ్లో ఆయా చేలకు వచ్చే సాగునీటికి ఆటంకాలు ఉండవు. పూడికతీత పనులు రావులపాలెం మండలంలో డెల్టా ప్రధాన పంట కాలువలో పూడిక తీత పనులు శరవేగంగా సాగుతున్నాయి. పూడిక, మొక్కలను కూలీలు తొలగిస్తున్నారు. దేవరపల్లి గరువు వద్ద నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ఈ పనులు జరుగుతున్నాయి. మొత్తం పని విలువ రూ.6,73,959 కాగా, ఇప్పటి వరకు రూ.3,51,632 ఖర్చు చేశారు. 2,494 పనిదినాలు కాగా, రోజుకు 135 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మల్కిపురం మండలం విశ్వేశ్వరరాయపురంలో ఉపాధి హామీ పథకంలో చెరువులో పూడికతీత పనులు చేపట్టారు. స్థానికంగా 15 రజక కుటుంబాలకు, పాడి రైతులకు మేలు చేసే ఈ చెరువు ఆధునీకరణ పనులు రూ.5 లక్షలతో చేపట్టారు. ఈ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. -
ఇళ్ల లబ్ధిదారులకు..
జిల్లాలోని వైఎస్సార్, జగనన్న కాలనీలు, వైఎస్సార్ గృహ నిర్మాణాల పథకంలో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి 90 రోజుల వేతనం రూపంలో ఉపాధి అమలు చేస్తున్నారు. వీరికి 90 రోజుల పని దినాలకు సంబంధించి వేతనాలను వారి ఖాతాలో జమ చేస్తున్నారు. ఇలా 606 పనులకు గాను 858 మందికి లబ్ధి చేకూరుతోంది. వీటితోపాటు పంట పొలాల్లో ట్రెంచ్ పనులు 55 చేపట్టగా 1,690 మందికి, మొక్కలు నాటే పనులు 16 చేస్తుండగా 31 మందికి, ఫారం పాండ్ రెండు పనులకు 62 మందికి, చెరువులలో పూడికతీత పనులు 14 చేపట్టగా 1,292 మందికి, పుంత రోడ్ల నిర్మాణ పనులు 26 చేపట్టగా 1,872 మందికి ఉపాధి పని కల్పిస్తున్నారు. -
బాలబాలాజీ హుండీ రాబడి రూ.32.78 లక్షలు
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 62 రోజులకు స్వామివారికి హుండీల ద్వారా రూ.32,78,548 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి గ్రంధి మాధవి తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ డి.నాగమల్లేశ్వరరావు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. హుండీల ద్వారా 32 గ్రాముల బంగారం, 140 గ్రాముల వెండి లభించాయన్నారు. ఆలయ ఉద్యోగులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన వలంటీర్లు లెక్కింపులో సేవలందించారు. రెండో రోజు పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ అయినవిల్లి: ముక్తేశ్వరం వైవీఎస్ అండ్ బీఆర్ఎం కళాశాలలో మంగళవారం పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ను ప్రారంభించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ కె. విశాల తెలిపారు. రెండు రోజులుగా పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. ఒకటి నుంచి 27,000 ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ నిర్వహించగా 64 మంది విద్యార్థులు హాజరయినట్టు తెలిపారు. వీరి సర్టిఫికెట్లు పరిశీలించి, ఇద్దరు విద్యార్థులను అనర్హులుగా ప్రకటించామన్నారు. బుధవారం 27,000 నుంచి 43,000 ర్యాంకు వరకూ కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఉపాధి హామీ పనుల్లో నాణ్యత అల్లవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రుపాయలు వెచ్చించి చేస్తున్న ఉపాధి పనుల్లో నాణ్యత, పారదర్శకత ఉండాలని డీపీఏ రాంబాబు అన్నారు. మండలంలోని దేవగుప్తం, గుండెపూడి గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో చేస్తున్న పనులను మంగళవారం ఎంపీడీఓ కృష్ణమోహన్తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ రాంబాబు మాట్లాడుతూ ఉపాధి పనులు కనీసం 4 గంటల పాటు చేయాలని, కొలతల ప్రకారం ఉపాధి కూలీలు పని చేయాలన్నారు. ఉపాధి కూలీలతో పని చేయించే సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఉపాధి పనుల్లో నాణ్యతపై సిబ్బందిని డీపీఓ ప్రశ్నించారు. పనుల్లో నాణ్యత ఉండాలని, ఎక్కడా అవకతవకలకు చోటుండకూడదని సిబ్బందికి సూచించారు. పని ప్రదేశంలో మస్తర్లు నమోదు చేసి. పని ప్రదేశంలో ఫొటోని అప్లోడ్ చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తున్న పనులను పంచాయతీ కార్యదర్శులు తరుచుగా మస్తర్లు తనిఖీలు చేయాలన్నారు. ఈఓపీఆర్డీ ఎన్వీవీ సత్యనారాయణ, కార్యదర్శి పి.శ్రీనివాస్, టీఏ అనిల్, ఫిల్డ్ అసిస్టెంట్లు ఏడుకొండలు పాల్గొన్నారు. అనంతరం ఎంట్రుకోన సచివాలయాన్ని డీపీఓ రాంబాబు సందర్శించి బహిరంగ మల విసర్జన సర్వే పురోగతిపై సిబ్బందిని ప్రశ్నించారు. సర్వే పూర్తి చేసి యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఆ కార్యక్రమంలో కార్యదర్శి జ్యోతి, సుధామాధూరి, కోమలి, శాంతికుమారి పాల్గొన్నారు. వయసు చిన్న.. ప్రతిభ మిన్న కాకినాడ: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్టుగా పసిప్రాయంలోనే ఆ చిన్నారి ప్రతిభలో మిన్న అనిపించుకుంటోంది. కాకినాడకు చెందిన అవసరాల శేషగిరి, పరిమళ దంపతుల కుమార్తె జస్వికశ్రీ తన ప్రతిభతో ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించింది. ఐదు నెలల వయస్సు వచ్చేసరికే జస్వికశ్రీ పక్షులు, జంతువులు, కూరగాయలు, రంగులు, ఆకారాలు, వృత్తులను గుర్తు పట్టడాన్ని తల్లిదండ్రులు గమనించారు. దీనిని వీడియో తీసి, నోబుల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు పంపించారు. అప్పటికే ఉన్న రికార్డును జస్వికశ్రీ బ్రేక్ చేసినట్లు తెలుపుతూ ఆ సంస్థ ప్రతినిధులు ధ్రువపత్రం పంపించారు. ఆ ధ్రువపత్రాన్ని జస్వికకు నగరపాలక సంస్థ కమిషనర్ జె.వెంకటరావు మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. -
ప్రాథమిక దశలో గుర్తిస్తే చికిత్స సులభం
అమలాపురం టౌన్: క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే ఆ వ్యాధికి నిరోధానికి అవసరమైన ౖవైద్యం, చికిత్స అందించడం సులభం అని డీఎం అండ్ హెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర అన్నారు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మూడు రోజులపాటు వైద్యులకు జరిగిన అవగాహన సదస్సుల్లో జిల్లాకు చెందిన ప్రభుత్వ వైద్యులు పాల్గొనే ఈ విషయం స్పష్టం చేసినట్టు ఆయన మంగళవారం తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలతో నిర్వహించిన ఈ సదస్సులో జిల్లాకు సంబంధించి వైద్య విధాన పరిషత్కు చెందిన గైనకాలజిస్టులు, డెంటిస్ట్లు హాజరయ్యారని పేర్కొన్నారు. రేడియాలజీ, డెంటల్, అంకాలజీ విభాగాలకు చెందిన వైద్య నిపుణులైన ప్రొఫెసర్లు ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ప్రాథమికంగా క్యాన్సర్ను ఎలా గుర్తించాలి, ఎలాంటి చికిత్స అత్యవసరంగా మొదలు పెట్టాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు గ్రామాల్లో ఉన్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల్లో పనిచేస్తున్న సిబ్బందికి, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు పూర్తి అవగాహన కల్పించాలని ప్రొఫెసర్లు వైద్యులకు సూచించారు. వారితో నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల సర్వేలో ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను ఏ విధంగా అన్వేషించాలి. ఎలా గుర్తించాలి. ప్రాథమిక దశలో గుర్తించిన రోగులకు తక్షణమే ఎలాంటి వైద్యం అందించాలనే పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సదస్సుల్లో నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.రుక్మిణీదేవి, డాక్టర్ హేమలత, ఎన్సీడీ ప్రొగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జాన్లెవీ, అకౌంట్ ఆఫీసర్ వెంకట శ్రీనులతో పాటు ఎన్సీడీలు పాల్గొన్నారు. క్యాన్సర్పై జిల్లా ప్రభుత్వ వైద్యులకు అవగాహన సదస్సు -
దర్శనాలకు బ్రేక్
సామర్లకోట: రాష్ట్రంలోని పంచారామాల్లో అత్యంత ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం సామర్లకోట. ఇక్కడ బాలాత్రిపురసుందరీ సమేతుడై యోగలింగరూపుడై వెలసిన కుమారారామ భీమేశ్వరస్వామి మనసారా కోరిన కోర్కెలు తీర్చుతాడన్నది భక్తుల విశ్వాసం. ఇక్కడకు ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి, స్వామివారికి, అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తూంటారు. పరమేశ్వరునికి ప్రీతికరమైన సోమవారం, మాస శివరాత్రి వంటి రోజుల్లో అత్యధికంగా వస్తూంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో స్వామి వారి శివలింగం జీర్ణావస్థకు చేరుతోంది. దేవదాయ శాఖ అధికారులు శివలింగం పరిస్థితిని పురావస్తు శాఖ అధికారులకు నివేదించారు. ఈ మేరకు మేరకు శివలింగానికి జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని కేంద్ర పురావస్తు శాఖ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) అధికారులు సూచించారు. దీనిలో భాగంగా బుధవారం నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకూ పురావస్తు శాఖ ఆధ్వర్యాన ఈ క్షేత్రంలో జీర్ణోద్ధరణ పనులు చేపట్టనున్నారు. ఇవి పూర్తయ్యేంత వరకూ స్వామి వారి మూలవిరాట్టుతో పాటు అమ్మవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. శాస్త్రోక్తంగా.. పంచారామ క్షేత్రంలో శివలింగం జీర్ణోద్ధరణ పనులు శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం మండపారాధన, కలశ స్థాపన, కళారాధన, దేవాతారాధన, అగ్నిహోత్ర సంబంధమైన హోమాలు నిర్వహిస్తారు. దీని ద్వారా స్వామివారి కళలను పూర్ణకుంభంలోకి ఆవాహన చేస్తారు. ఈ పూర్ణకుంభాన్ని, స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను భక్తుల దర్శనార్థం నంది మండపంలో ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు దేవదాయ శాఖ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రతువుల అనంతరం జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుడతారు. ఫ సామర్లకోట పంచారామ క్షేత్రంలో నేటి నుంచి జీర్ణోద్ధరణ పనులు ఫ శివలింగానికి కెమికల్ ట్రీట్మెంట్ ఫ వచ్చే నెల 8 వరకూ కొనసాగనున్న కార్యక్రమం ఫ పురావస్తు శాఖ ఆధ్వర్యాన నిర్వహణ -
28 మోటారు సైకిళ్లు సీజ్
అమలాపురం టౌన్: ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జిల్లా పోలీసులు, కేంద్ర బలగాలు జిల్లాలో దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అక్రమ మద్యం, రికార్డులు లేకుండా తిరుగుతున్న మోటారు సైకిళ్ల స్వాధీనం వంటి చర్యలు చేపడుతున్నాయి. జిల్లా ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆదేశాలతో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ దాడులు, తనిఖీలను మంగళవారం మరింత విస్తృతం చేశారు. జిల్లాలో నిర్వహించిన క్యాసో తనిఖీలు, దాడుల ద్వారా మొత్తం 42 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. 28 మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. వీటి వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వివరించింది. ● పామర్రు పోలీసు స్టేషన్ పరిధిలో ఎస్సై ఎస్కే జాని బాషా ఆధ్వర్యంలో సిబ్బంది మద్యం అక్రమ తరలింపుపై కేసు నమోదు చేశారు. అయిదుగురిని అరెస్ట్ చేసి కారును సీజ్ చేశారు. కారులో రూ.13, 353 విలువైన 22 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను ఉంచి అక్రమ రవాణా చేస్తున్నందుకు వారిని అరెస్ట్ చేశారు. ● రామచంద్రపురం పట్టణం అంబికాపల్లి అగ్రహారంలో పోలీసులు క్యాసో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సరిగా లేని 9 మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ● రామచంద్రపురం పట్టణం నరసాపురపుపేటలో ఎస్సై కె.సురేష్బాబు తన సిబ్బందితో క్యాసో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు లేని 19 మోటారు సైకిళ్లను సీజ్ చేశారు. ● ఐ.పోలవరం మండలం భైరవలంక, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, రాఘవులపేట, అంబాజీపేట మండలం ముక్కామల, ఆత్రేయపురం మండలం ఉచ్చిలి, మండపేట రూరల్ మండలం వేములపల్లి, కేశవరం, మామిడికుదురు మండలం గోగన్నమఠం, కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయా పోలీసు అధికారులు స్థానిక ప్రజలతో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలతో అవగాహన సదస్సులు నిర్వహించారు. ● కాట్రేనికోన పోలీస్స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.2,600 విలువైన 20 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ● పి.గన్నవరం మండలం నాగుల్లంకలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.4,800 నగదును సీజ్ చేశారు. ● కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ రోజున బందోబస్తు నిర్వహించిన ఎన్సీసీ, ఎస్ఎస్ఎస్ విద్యార్థులకు రూ.500 గౌరవ వేతనం, ప్రశంసా పత్రాన్ని డీఎస్పీ కేవీ రమణ, సీఐ ఎం.రామ్కుమార్ అందజేశారు.42 మద్యం సీసాల పట్టివేత -
పకడ్బందీగా కౌంటింగ్
సాక్షి, అమలాపురం: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ ఆసిస్టెంట్లకు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ నెల 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈవీఎంలను చెయ్యేరు ఇంజినీరింగ్ కాలేజీల్లోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచామన్నారు. జూన్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి కౌంటింగ్ హాల్లో ప్రతి నియోజకవర్గానికి టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓటర్ల లెక్కింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గానికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక టేబుల్, సర్వీస్ ఓటర్ల కోసం మరో టేబుల్ కేటాయించి మూడు రౌండ్లలో సుమారు 18,000 ఓట్లు లెక్కించనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో 1,644 పోలింగ్ కేంద్రాలలో జిల్లావ్యాప్తంగా ఉన్న 15,31,410 మంది ఓటర్లలో 12,84,008 మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని ఆయన తెలిపారు. ఏడు నియోజక వర్గాల ఓట్ల లెక్కింపు కోసం 88 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి 82 టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో 24 రౌండ్లలో, ముమ్మిడివరం 19 రౌండ్లలో, అమలాపురం 20, రాజోలు 15 , పి.గన్నవరం 18, కొత్తపేట అసెంబ్లీ 26, మండపేట 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానున్నదన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రధాన ఎన్నికల ఏజెంట్లు, లెక్కింపు సిబ్బందికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. లెక్కింపు ఏజెంట్ల కోసం మాత్రం వేరే మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓటర్లు లెక్కింపు పర్యవేక్షణకు సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉన్న తహసీల్దార్లు వారి పరిధిలోని డిప్యూటీ తహసీల్దార్లను నియమించామన్నారు ప్రతి రౌండ్ పూర్తి కాగానే ఫలితాలను వెల్లడించేలా ఏర్పాటు చేశామన్నారు. డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ టి.వైద్యనాథశర్మ, రాజకీయపార్టీ ప్రతినిధులు దూరి రాజేష్, వడ్డి నాగేశ్వరరావు, కేఎస్ఎల్ భవాని, కారెం వెంకటేశ్వరరావు, పి.పవన్ సూర్య పాల్గొన్నారు.కలెక్టర్ హిమాన్షు శుక్లా -
కాలం చెల్లిన మందులతో కాసుల వేట
అలా తెలిసింది మా వదిన శ్రీదేవి గర్భిణి కావడంతో వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుతున్నాం. ఆమెకు కవలలని వైద్యులు చెప్పారు. డాక్టర్ రాసిచ్చిన మందులు లైఫ్ మందుల స్టోర్లో కొనుగోలు చేశాను. వాటిలో ప్రొజెస్టిరోన్ మందులున్నాయి. అవి వేసుకున్నాక మా వదినకు వాంతులు, కొంత ఇబ్బంది రావడంతో వెంటనే వైద్యుని సంప్రదించాం. మేం కొన్న మందులు వేసుకున్నాక ఇలా అవడంతో వెంటనే వాటిపై ఎక్స్ఫైరీ తేదీ చూశాము. ప్రొజెస్టిరోన్ మందులపై ఎక్స్పైరీ తేదీ అయిపోయింది. అది తెలియక వేసుకోవడంతో ఆ మందులు రక్తంలో కలిసిపోయాయి. దీనివల్ల ఏం ప్రమాదం ఎదురవుతుందోనని భయంగా ఉంది. దీనిపై డ్రగ్స్ అధికారులకు ఫిర్యాదు చేశాను. – పొలమరశెట్టి వెంకటేశ్వరరావు, కొంతమూరు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు మందుల అమ్మకాల్లో నిబంధనలు పాటించకుంటే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. రాజమహేంద్రవరంలోని లైఫ్ మందుల దుకాణంపై ఫిర్యాదు రావడంతో వెంటనే దాడి చేసి, వివరాలు సేకరించాం. ఎక్స్పైరీ మందులు విక్రయించారనే కోణంలో ఆ దుకాణం లైసెన్స్ను తాత్కాలికంగా వారం రోజులు రద్దు చేశాం. మందుల దుకాణదారులు బాధ్యతగా వ్యవహరించాలి. వినియోగదారునికి అవసరమైన, నాణ్యమైన మందులు ఇచ్చి వారి నమ్మకాన్ని చూరగొనాలి. లేకపోతే చర్యలు తప్పవు. మందుల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేశాం. డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం. – నాగమణి, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణ శాఖ, రాజమహేంద్రవరం ● కొరడా ఝళిపించిన డ్రగ్స్ అధికారులు ● రాజమహేంద్రవరంలో లైఫ్ మందుల దుకాణం లైసెన్స్ రద్దు ● పలు షాపుల్లోనూ ఇదే తంతు ● డిస్కౌంట్ పైనే వినియోగదారుల దృష్టి ● అదే అదనుగా కొన్నిచోట్ల ఎక్స్పైరీ మందుల విక్రయం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): దుస్తులో.. మోటార్ సైకిలో.. కారో.. గృహోపకరణ వస్తువో కొందామని మార్కెట్కు వెళ్తే.. ఆన్లైన్ షాపింగ్ చేస్తే.. డిస్కౌంట్ ఎంత వస్తుందనే ప్రతి ఒక్కరూ చూస్తారు. ఇది సగటు వినియోగదారుని బలహీనత. వారిని ఆకర్షించేందుకు కొంతమంది వ్యాపారులు అనుసరించే సూత్రం కూడా ఇదే. దీనిని అవకాశంగా తీసుకుని కొంతమంది వ్యాపారులు నాణ్యతకు తిలోదకాలు ఇస్తూంటారు. ఇది మామూలు వస్తువుల వరకూ అయితే వినియోగదారుకు ఆర్థికంగా మాత్రమే నష్టం కలుగుతుంది. అదే మందుల విషయంలో అయితే..! ఏకంగా ఆరోగ్యానికే ముప్పు వస్తుంది. ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంది. చాలా మంది వినియోగదారులు ఏ షాపులో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారనేదే చూస్తున్నారు తప్ప.. మందుల నాణ్యత, కాలపరిమితి వంటివి గమనించడం లేదు. ఈ చిన్నపాటి తప్పిదమే వారికి ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతోంది. ‘ఎక్స్పైరీ’పై దృష్టి పెట్టాల్సిందే.. కాలం చెల్లిన మందులు విక్రయించారంటూ ఓ బాధితుడు ఇటీవల రాజమహేంద్రవరంలోని లైఫ్ మందుల దుకాణంపై ఫిర్యాదు చేశారు. దీనిపై ఔషధ నియంత్రణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగమణి రంగంలోకి దిగారు. ఆ ఫిర్యాదులోని ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారణ కావడంతో ఆ దుకాణం లైసెన్స్ను వారం రోజుల పాటు సస్పెండ్ (తాత్కాలిక రద్దు) చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఒక్క దుకాణమే కాదు. అధికారులు పకడ్బందీగా దాడులు చేస్తే ఇతర మందుల దుకాణాల్లో సైతం ఇటువంటి ‘ఎక్స్పైరీ’ వ్యవహారాలు బయటపడతాయి. సాధారణంగా దుకాణదారులు తమ వద్ద ఉన్న మందుల్లో కాలం చెల్లిన వాటిని ముందుగానే గుర్తించి, పక్కన పెట్టేస్తారు. కానీ, వీటితో కూడా కాసుల వేట సాగించాలనుకునే వ్యాపారులు మాత్రం స్ట్రిప్లో ఎక్స్పైరీ తేదీ ఉన్న భాగాన్ని కట్ చేసి, మిగిలిన మాత్రలను దర్జాగా విక్రయిస్తున్నారు. యథేచ్ఛగా మత్తు మందుల విక్రయాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 4,200 రిటైల్, 1,300 హోల్సేల్ కలిపి మొత్తం 5,500 మందుల దుకాణాలున్నాయి. కొంత మంది వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కి మరీ ఇష్టానుసారం మత్తు మందులు సైతం విక్రయించేస్తున్నారు. ఉదాహరణకు ఆల్ప్రోజలమ్ వంటి మత్తు మందులను వైద్యుని చీటీ లేకుండా విక్రయించకూడదు. అలాగే హెచ్1 డ్రగ్స్ కూడా వైద్యుల చీటీ మేరకే ఇవ్వాలి. కానీ, ఇటువంటి మందులను పలు దుకాణాల్లో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. చాలా మంది జ్వరం, కడుపునొప్పి వంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు ఇంటి సమీపాన ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి, రోగ లక్షణాలు చెప్పి, దుకాణదారు ఇచ్చే మందులు తెచ్చి వేసుకుంటారు. ఆ మందులు ఎవరు తయారు చేశారనే వివరాలు ఆ మందులపై ముద్రించి ఉండవు. అటువంటి మందులు వేసుకోవడం వల్ల ఇబ్బంది తాత్కాలికంగా తగ్గినా కిడ్నీ, లివర్ వంటి శరీర అవయాలపై దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఆయా వ్యాపారులు కూడా డాక్టర్ చీటీ లేకుండానే నాసిరకమైన, కాలం చెల్లిన మందులు యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినప్పటికీ డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడంతో స్వార్థపరులైన వ్యాపారులు బరితెగిస్తున్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు నిత్యం ఎన్ని దుకాణాలకు వెళుతున్నారు, ఎన్ని తనిఖీలు చేస్తున్నారు, ఎన్ని కేసులు నమోదు చేస్తున్నారనేది సరైన జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోతోంది.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
- Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
Advertisement