-
ముమ్మరంగా వేరుశనగ పంపిణీ
● ఇప్పటికే 4,155 క్వింటాళ్ల పంపిణీ ● 11,104 క్వింటాళ్లకు పేర్లు నమోదు చేసుకున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సబ్సిడీపై వేరుశనగ పంపిణీ చురుగ్గా సాగుతోంది. వేరుశనగ కోసం రైతులు పోటెత్తుతున్నారు. మార్కెట్ ధర కంటే తక్కువకు లభిస్తుంటం, మిర్చి, ఇతర పంటల రైతులు వేరుశనగ సాగు వైపు మళ్లడంతో డిమాండ్ పెరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే వేరుశనగ కాయలు పంపిణీ చేస్తుండటం విశేషం. జిల్లాకు 13,929 క్వింటాళ్ల వేరుశనగ కేటాయించగా... ఇప్పటికే 12,843 మంది రైతులు 11,104 క్వింటాళ్ల కోసం ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్ రిపోర్టు ప్రకారం 4155 క్వింటాళ్లు పంపిణీ అయింది. ఏపీసీడ్స్ ఇప్పటి వరకు దాదాపు 250 ఆర్బీకేల్లో 8,700 క్వింటాళ్లు రైతులకు అందుబాటులో ఉంచింది. కర్నూలు జిల్లాలో వేరుశనగ ముమ్మరంగా పంపిణీ జరుగుతోంది. నంద్యాల జిల్లాలో ఈ నెల 30 నుంచి పంపిణీ చేపట్టడానికి వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వేరుశనగకు మినహా మిగిలిన విత్తనాలపై రైతులు దృష్టి సారించలేదు. ఒకటి, రెండు రోజుల్లో పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు పంపిణీ చేపట్టనున్నారు. కందులు, మినుములు తదితర వాటికి ఇంకా ధరలు నిర్ణయించాల్సి ఉంది. -
ఎంబ్రాయిడరీలో మహిళలకు ఉచిత శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఎంబ్రాయిడరీ (జర్దోసి మగ్గం), ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శివప్రసాద్ తెలిపారు. జూన్ 19 నుంచి 30 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు వయస్సు చదవడం, రాయడం వచ్చిన మహిళలు అర్హులన్నారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామన్నారు. వివరాలకు 63044 91236 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇద్దరికి జైలు శిక్ష నంద్యాల(వ్యవసాయం):మద్యం తాగి వాహ నం నడుపుతూ పట్టుబడిన వారికి నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామభూపాల్ రెడ్డి జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి జిల్లా కేంద్రానికి చెందిన మోత్కూ రు మధు, కొత్తపల్లె గ్రామానికి చెందిన కొప్పెర చంద్రశేఖర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీస్ సిబ్బందికి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు. నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా వారికి ఏడు రోజులు జైలు శిక్షవిధించినట్లు పోలీసులు తెలిపారు. ఆకతాయిలకు జైలు శిక్ష నంద్యాల 1 టౌన్ ఏరియాలో బహిరంగ ప్రదేశాల్లో మతం తాగుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించిన షేక్ ఖాసిం, షేక్ నూర్బాషాను పోలీసులు అదుపులోకి తీసుకొని నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రామభూపాల్ రెడ్డి ఎదుట హాజరుపరిచారు. జడ్జి విచారించి నిందితులపై నేరం రుజుంఉ కావడంతో ఒక్కొక్కరికి 7 రోజులు పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. జిరాక్స్ సెంటర్ సీజ్ వెల్దుర్తి(కృష్ణగిరి): వెల్దుర్తి కొత్తబస్టాండు సమీపంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న నీలకంఠేశ్వర జిరాక్స్ సెంటర్ను బుధవారం ఆర్ఐ మస్తాన్, వీఆర్ఓ ప్రసాద్ సీజ్ చేశారు. అడంగల్, ఇతరత్రా ప్రభుత్వ ధ్రువపత్రాలు అక్రమంగా, అనుమతులు లేకుండా జారీ చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా ఓ రైతుకు బ్యాంకు రుణ కోసం ఏకంగా తహసీల్దార్ కార్యాలయం సీల్, సంతకం ఫోర్జరీ చేసినట్లు ఏపీజీబీ బ్యాంకు మేనేజర్ గుర్తించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మీసేవ, కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) తదితర కార్యాలయాల్లో సేవలకు సంబంధించిన ప్రభుత్వ లోగోతో కూడిన ధ్రువపత్రాలు సైతం అక్రమంగా కలిగి ఉండడంతోపాటు వాటిని జారీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గనుల శాఖ విధానాలపై వర్క్షాప్ కర్నూలు (న్యూటౌన్): గనుల శాఖ అనుసరిస్తున్న వివిధ విధానాలపై బుధవారం బెంగళూరులో వర్క్షాప్ నిర్వహించారు. సెంట్రల్ మైనింగ్ సెక్రటరీ కాంతారావు, జాయింట్ సెక్రటరీ వీణ హాజరైన ఈ సమావేశంలో దేశంలోని అన్ని జిల్లాల మైనింగ్ అధికారులు, డైరెక్టర్లు, గ్రానెట్ ఫెడరేషన్స్ నాయకులు పాల్గొన్నారు. గ్రానెట్పై ఉన్న రాయల్టీ, ఇతర పన్నులను తగ్గించాలని, విదేశాల నుంచి ముడి గ్రానెట్ రాయిని దిగుమతి చేసుకునేందుకు ఇనుమతులివ్వాలని గ్రానెట్ ఫెడరేషన్స్ సభ్యులు కోరినట్లు జిల్లా నుంచి హాజరైన మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ టి.రాజశేఖర్ తెలిపారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
బనగానపల్లె రూరల్ : మండల పరిధిలోని చెర్లోకొత్తూరు గ్రామంలో ఎన్ మల్లికార్జునరెడ్డి(38) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్ఐ రామిరెడ్డి బుధవారం తెలిపారు. మల్లికార్జురెడ్డికి సుమారు తొమ్మిదేళ్ల క్రితం లక్ష్మీతో వివాహం కాగా ఇద్దరు సంతానం. మల్లికార్జునరెడ్డి మద్యం సేవిస్తూ, జులాయిగా తిరుగు తుండడంతో భార్య లక్ష్మీ కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఇంటి నుంచి బయటికి వచ్చిన మల్లికార్జునరెడ్డి బుధవారం ఉదయం గ్రామ సమీపాన మృతి చెందిపడి ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
లెక్కింపు కేంద్రాల్లోకి ‘తమ్ముళ్లు’
కర్నూలు: ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి పోలింగ్ ముగిసే వరకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన కర్నూలు అసెంబ్లీ బరిలోని టీడీపీ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఎక్కువ మంది తన వారిని పంపేలా వ్యూహాలు పన్నుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు/ఏజెంట్ల నియామకానికి ఈనెల 30లోపు వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్/రిటర్నింగ్ అధికారి డాక్టర్ సృజన సూచించారు. ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, ఎన్డీఏ కూ టమి అభ్యర్థితో పాటు మరో 23 మంది అభ్యర్థులు కర్నూలు బరిలో ఉన్నారు. అభ్యర్థుల తరపున ఏజెంట్లు నియమించుకోవడానికి ఆధార్ కార్డులతో పాటు గుర్తింపు పత్రాలు, ఫొటోలు ఇస్తే గుర్తింపు కార్డులు జా రీ చేస్తారు. గుర్తింపు పొందిన పార్టీలతో పాటు పో టీలో ఉన్న ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి తరపున ఏజెంట్లను నియమించుకునేందుకు అవకాశం ఉండటంతో స్వతంత్ర అభ్యర్థులకు ఎరవేసి వారి తరపున కూడా తన వారిని నియమించుకునే వ్యూహాన్ని కర్నూలు టీడీపీ అభ్యర్థి పన్నుతున్నట్లు ఆయన శిబిరంలో చర్చ జరుగుతోంది. స్వతంత్రంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో ఉన్న 8 మంది, ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఒకరి తరపున ఉన్న ఏజెంట్లకు బదులు టీడీపీ అభ్యర్థి సొంత మనుషులను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మాత్రమే ఎన్నికల కమిషన్ అనుమతిస్తుంది. దీంతో స్వతంత్ర అభ్యర్థుల తరపున తన పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, సామాజిక వర్గానికి చెందిన యువకులను ఏజెంట్లుగా నియమించుకున్నట్లు తెలిసింది. లెక్కింపు కేంద్రం లోపల తన వారు ఎక్కువ మంది ఉండేలా చూసుకుంటున్నారని, అవసరమైతే లోపల గొడవలకు కూడా సిద్ధంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇలాంటి ప్రలోభాలను ఎలా నిలువరిస్తారోనన్న చర్చ జరుగుతోంది. హాట్ టాపిక్గా మాజీ కార్పొరేటర్పై దాడి ఘటన మూడు దశాబ్దాలుగా ముఖ్య అనుచరుడుగా కొనసాగిన ఓ మాజీ కార్పొరేటర్పై ఎన్నికల పోలింగ్ రోజు ప్రముఖ పారిశ్రామికవేత్త దాడి చేయించిన ఘటన హాట్టాపిక్గా మారింది. తన కుమారునికి వ్యతిరేకంగా పాతబస్తీలో ప్రచారం నిర్వహిస్తున్నాడని వేగులు ఇచ్చిన సమాచారంతో ఆయన ఆగ్రహించినట్లు తెలిసింది. పోలింగ్ రోజు ఉస్మానియా కాలేజీ వద్ద ఉన్న మాజీ కార్పొరేటర్ వద్దకు ఓ గిరిజన యువకుడిని పంపి దాడి చేయించి చెప్పుతో కొట్టించినట్లు ఆయన వర్గీయుల్లో చర్చ జరుగుతోంది. స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్ల కొనుగోలుకు టీడీపీ బేరసారాలు తమ వారి పేర్లు ఇవ్వాలని అభ్యర్థి సంప్రదింపులు -
కౌంటింగ్ ఏర్పాట్లు భేష్
కర్నూలు(సెంట్రల్): రాయలసీమ యూనివర్సిటీలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించి సంతకం చేశారు. అనంతరం కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేస్తున్న ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ బ్లాక్ల్లో పర్యటించి చేపట్టిన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. ఈవీఎంలను తీసుకొచ్చే సమయంలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా విద్యుత్ వైర్లు బయటకు కనిపించకుండా చూసుకోవాలన్నారు. ● ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి టేబుల్ వారీగా ఫలితాలను ప్రింట్ చేసి ఏజెంట్లకు ఇవ్వడానికి పెద్దసైజు ఫొటో కాపీ మెషీన్ను ఏర్పాటు చేయిస్తామని, ఆ దిశగా ఆర్వోలు ప్రతిపాదనలు పంపాలన్నారు. ● కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరు పడితే వారిని అనుమతించరాదన్నారు. ● ఆర్యూ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి కేవలం అబ్జర్వర్లు, కలెక్టర్, ఎస్పీ, అన్ని నియోజకవర్గాల ఆ ర్వోలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ● మిగతా కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులతో పాటు ఏజెంట్లను బాయ్స్ హాస్టల్ వెనుక భాగం నుంచి అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ● అక్కడే మొబైల్ డిపాజిట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, ఇక్కడ పనిచేసేందుకు సచివాలయ ఉద్యోగులను నియమించాలన్నారు. ● కౌంటింగ్ సిబ్బంది కోసం జూన్ 4న ఉదయం 5 గంటలకు కలెక్టరేట్ నుంచి ఉచితంగా బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. ● కలెక్టర్ వెంట ఎస్పీ కృష్ణకాంత్, ఆర్వోలు నారపురెడ్డి మౌర్య, భార్గవ్తేజ, శివ్నారాయణ్ శర్మ, ఎం.శేషిరెడ్డి, రామలక్ష్మీ, చిరంజీవి, మురళీ, రామునాయక్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో కె.మధుసూధన్రావు, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖరరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్ ఉన్నారు. ఏ కౌంటింగ్ హాలు ఎక్కడంటే.. నియోజకవర్గం కౌంటింగ్ హాలు పేరు ప్రదేశం ఎమ్మిగనూరు, పాణ్యం, ఇంజినీరింగ్ బ్లాక్ కోడుమూరు, ఆలూరు కర్నూలు, ఆదోని లైఫ్ సైన్సెస్ బ్లాక్ మంత్రాలయం, పత్తికొండ లైబ్రరీ బ్లాక్ -
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్
● గతంలో ఎప్పుడూ లేని విధంగా 2023–24 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 25 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ● ప్రస్తుతం కర్నూలు జిల్లాలో 1,14,286, నంద్యాల జిల్లాలో 1,09,713 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 2,23,999 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ● ఇందువల్ల రానున్న వ్యవసాయ సీజన్లో విద్యుత్ లోడ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. ● ఇందులో భాగంగా లైన్ సామర్థ్యాన్ని రూ.15 కోట్లతో పెంచనున్నారు. ● కర్నూలు కార్బైడ్ 220 కేవీ సబ్ స్టేషన్ నుంచి గూడూరు వరకు ఉన్న ఏపీ ట్రాన్స్కో లైన్ సామర్థ్యం పెంపు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ● ఈ లైన్ సామర్ధ్యం ప్రస్తుతం 70 మెగా వాట్స్ ఉంది. ఈ లైన్ ద్వారా 120 మెగావాట్స్ విద్యుత్ సరఫరా చేసేందుకు ఉద్దేశించిన పనులు చేపడుతుండటం విశేషం. ● ప్రస్తుతం ఏసీఎస్ఆర్ ప్యాన్కర్ కండక్టర్తో లైన్ ఉంది. ఇది వచ్చే ఖరీఫ్ సీజన్లో పెరిగే లోడ్ను తట్టుకోలేదనే ఉద్దేశంతో లైన్ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. తాజాగా ఏసీఎస్ఎస్ కండక్టర్లోకి మారుతుండటం వల్ల విద్యుత్ సామర్థ్యం పెరుగుతుంది. ● గడివేముల మండలం గని నుంచి సోమయాజులపల్లె వరకు ఏపీ ట్రాన్స్కో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి రంగం సిద్ధమైంది. కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో పగటి పూటనే 9 గంటల విద్యుత్ను మరింత నాణ్యతతో అందించేందుకు విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్, ఏపీ ట్రాన్స్కో కొత్త లైన్లు ఏర్పాటు, ఉన్న లైన్ల సామర్థ్యం పెంపు, సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని(ఎంవీఏ) పెంచడం, కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించడం విశేషం. సాగునీటి వనరులు అందుబాటులోకి రావడంతో ఏడాదికేడాది ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో బోర్లలో భూగర్భ జలాలు పెరగడంతో రైతులు కూరగాయల పంటలతో పాటు ఆరుతడి పంటలు జోరుగా సాగు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి వ్యవసాయంలో ఉచిత విద్యుత్కు శ్రీకారం చుట్టి 7 గంటల పాటు విజయవంతంగా ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఏడు గంటల విద్యుత్ ఇవ్వడంలో కిందామీదా పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. తొమ్మిది గంటల పాటు నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. పలు ప్రాంతాల్లో 220/133/ 33 కేవి విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మించడం, విద్యుత్ లైన్లను అభివృద్ధి చేయడం కలసి వచ్చింది. హడ్కో నిధులతో కొత్త లైన్లు వ్యవసాయానికి, పరిశ్రమలకు మరింత నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు ఏపీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రూ.41 కోట్లతో కొత్త లైన్లతో పాటు కొత్త సబ్ స్టేషన్లు.. 263 కిలోమీటర్ల మేర 33 కెవి లైన్లు, 58 కిలోమీటర్ల 11 కేవీలైన్లు ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యుత్ శాఖకు కర్నూలు టౌన్, కర్నూలు రూరల్, నంద్యాల, ఆదోని, డోన్, ఎమ్మిగనూరుల్లో డివిజన్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో హడ్కో నిధులతో కొత్తలైన్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఐదు 33/11 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. ప్యాపిలి మండలం గార్గదిన్నె, డోన్ మండలం తిమ్మపురం, మంత్రాలయం మండలం సూగూరు, బండిఆత్మకూరు మండలం వీఆర్పేట, రుద్రవరం మండలం నాగులవరం గ్రామాల్లో సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. రూ.306 కోట్లతో ఆర్డీఎస్ఎస్ లైన్లు గ్రామాలకు, వ్యవసాయానికి రూ.306.19 కోట్లతో ప్రత్యేక లైన్లు సిద్ధమవుతున్నాయి. ఆర్డీఎస్ఎస్ కింద రికార్డు స్థాయిలో లైన్లు వేస్తుండటం విశేషం. 33 కేవీ లైన్ 114 కిలోమీటర్ల పొడవున రూ.11.19 కోట్లతో.. రూ.295 కోట్లతో 11 కేవీ లైన్ 5,207 కిలోమీటర్లు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని డివిజన్లను కలుపుతూ ఈ లైన్లు సిద్ధం చేస్తున్నారు. బేతంచెర్లలో 220 కేవీ సబ్ స్టేషన్ సిద్ధంనంద్యాల జిల్లాలోని బేతంచెర్ల మండలం నాపరాతి పాలిషింగ్ యూనిట్లు, ఇతర పరిశ్రమలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కూడా ఎక్కవే. వీటన్నింటికీ నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లక్ష్యంగా రూ.60 కోట్లతో ఏపీ ట్రాన్స్ 220 కేవీ సబ్ స్టేషన్తో పాటు లైన్ కూడా వేస్తున్నారు. నిర్మాణ పనులు ముగింపుదశలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో లో వోల్టేజీ, హైవోల్టేజీ సమస్యలు వచ్చేవి. ఇందువల్ల విద్యుత్ మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరిగేది. ఇక్కడ 220 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటు అవుతుంటంతో అన్ని సమస్యలకు పరిష్కారం లభించినట్లయింది. కాగా కర్నూలు జగన్నాథగట్టులోని టిడ్కో హౌసింగ్ దగ్గర కొత్తగా 132 కేవీ సబ్ స్టేషన్ నెలకొల్పడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే టెక్నికల్ ఫీజుబులిటీ రావడం విశేషం. -
బడి బస్సులు భద్రమేనా?
మొత్తం ఎఫ్సీ చేయించుకోవాల్సినవి బడి బస్సులు చేయించుకున్నవి కర్నూలు జిల్లా 416 250 166 నంద్యాల జిల్లా 598 309 289 ● త్వరలో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం ● పిల్లల భద్రత అత్యంత కీలకం ● స్కూల్ బస్సులకు సామర్థ్య పరీక్షలు తప్పనిసరి ● ఉమ్మడి జిల్లాలో విద్యాసంస్థల బస్సులు సుమారు 1,014 ● ఇప్పటి వరకు ఎఫ్సీ రెన్యూవల్ చేసుకున్నవి 559 ● ఇంకా చేయించుకోవాల్సినవి 455నిబంధనల్లో ముఖ్యమైనవి కొన్ని.. ● ఆర్టీఏ అధికారులు జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాలను బస్సులో ప్రదర్శించాలి. ● ప్రతి బడి బస్సుకు పసుపు రంగు తప్పనిసరి. ● 15 ఏళ్లు దాటిన వాహనాలను తిప్పరాదు. ● వాహనంలో ప్రథమ చికిత్స కిట్లు, మందులతో పాటు అత్యవసర ద్వారాలు ఉండాలి. ● బస్సులో అగ్నిప్రమాదం సంభవిస్తే మంటలు ఆర్పేందుకు వీలుగా ఫైర్ ప్రొటెక్షన్ సిలిండర్ ఉండాలి ● డ్రైవర్ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ● బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకు నేందుకు వీలుగా బస్సు ముందు తలుపు ముందు సమాంతరంగా రైలింగ్ ఏర్పాటు చేయాలి. ● బస్సు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులతో రాంగ్ రూట్లో ప్రయాణించరాదు. కర్నూలు: వచ్చే నెలలో విద్యాసంస్థలు ప్రారంభమవుతాయి. పిల్లలకు ఉత్తమ విద్య అందించాలని తల్లిదండ్రులు ఇప్పటికే భారీగా ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చేర్పిస్తున్నారు. కేవలం పిల్లల చదువుపై మాత్రమే కాకుండా వారిని నిత్యం ఇంటి నుంచి పాఠశాలలు, కళాశాలలకు రాకపోకలు సాగించే బడి బస్సుల సామర్థ్యంపై కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే బడి బస్సు భద్రంగా ఉంటే పిల్లల ప్రయాణం సురక్షితమవుతుంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల యజమానులు బస్సుల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాలల పునఃప్రారంభానికి ముందే బస్సు సామర్థ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నారు. అనుమతి ఉంటేనే... కర్నూలులో డీటీసీ కార్యాలయం, ఆదోని, నంద్యాలలో ప్రాంతీయ రవాణా కార్యాలయాలతో పాటు డోన్, ఆత్మకూరు ప్రాంతాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బస్సులకు పరీక్షలు నిర్వహిస్తారు. అనుమతులు లేని వాటికి జరిమానాలు, కేసులు నమోదు చేస్తుంటారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఉన్నాయా లేదా నిశితంగా పరిశీలిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1,014 బస్సులు ఉన్నాయి. ఇప్పటివరకు 559 బస్సులకు ఎఫ్సీ చేయించుకోగా ఇంకా 455 బస్సులు రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంది. ఆన్లైన్లో ఈ–స్లాట్ తేదీల ఖరారు... ఏటా మే 16 నుంచి జూన్లో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు రవాణా శాఖ కార్యాలయంలో బడి బస్సులకు ఎఫ్సీ చేయించి ధ్రువీకరణ పత్రాలు పొందాలి. వాహన ఫిట్నెస్ ధ్రువీకరణ కోసం ముందుగా ఆన్లైన్లోనే విద్యాసంస్థల యాజమాన్యాలు ఏపీ ట్రాన్స్పోర్ట్ ఈ–ప్రగతి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం ఎఫ్సీ చేయించుకునేందుకు రవాణా శాఖ కార్యాలయం అధికారులు ఓ తేదీని కేటాయిస్తారు. ఆ ప్రకారం వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి తీసుకెళ్తే ఫిట్నెస్ తనిఖీలు నిర్వహిస్తారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల వద్ద స్కూల్, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాహనాలు ఎలా ఉండాలనే విషయమై ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇవి తప్పనిసరి... పాఠశాలలు, కళాశాలల బస్సులకు సామర్థ్య పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా ఉమ్మడి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో ఉంటున్నారు. ఫిట్నెస్ ధ్రువ పత్రం, పర్మిట్, ఇన్సురెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవర్కు సంబంధించి వాల్యూడ్ లైసెన్స్ సమర్పించి సామర్థ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. డ్రైవర్తో పాటు బస్సులో ఉండే అటెండెంట్ వివరాలను కార్మిక శాఖ కార్యాలయంలో నివేదించి వారు ధ్రువీకరించిన పత్రం సైతం రవాణా శాఖ కార్యాలయంలో సమర్పించాలి. డ్రైవర్ బస్సును వేగంగా నడిపినా, అజాగ్రత్తగా వ్యవహరించినా, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపినా అతనిపై చర్యలు తీసుకునేలా పాఠశాల పేరెంట్స్ కమిటీ ద్వారా బస్సుల్లో ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయాలి. ఫిట్నెస్ లేకుండా బయట తిరిగితే సీజ్ పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవుతున్న దృష్ట్యా బస్సులకు తప్పకుండా సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. జిల్లాలో నమోదైన పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు బస్సుల సామర్థ్యంపై దృష్టి సారించాలి. ఏ ఒక్క పత్రం లేకుండా బస్సు రోడ్డుపై ఎక్కినా అలాంటి వాటిపై చర్యలు తీసుకోవడమే కాకుండా సీజ్ చేస్తాం. – రమేష్, ఆర్టీఓ -
జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేదలను వజ్రాలు వరిస్తున్నాయి. జొన్నగిరిలో పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి మంగళవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.1.75 లక్షలు, జత కమ్మలు ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
కర్నూలు(సెంట్రల్): రాయలసీమ యూనివర్సిటీలో జూన్ 4న చేపట్టనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు. మంగళవారం ఆర్యూలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్రూమ్లను కలెక్టర్, ఎస్పీ జి.కృష్ణకాంత్ పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌంటింగ్కు సంబంధించి టేబుళ్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందన్నారు. ఏజెంట్ ఐడెంటిఫికేషన్ కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కల్యాణి, ఆర్అండ్బీ ఎస్ఈ నాగరాజు, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్ పాల్గొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ ప్రభాకర్రెడ్డి కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్గా కార్డియోథొరాసిక్ సర్జరీ హెచ్వోడీ డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైద్యశాఖ సెక్రటరీ డాక్టర్ మంజుల డి.హోస్మాని జీవో ఆర్టీ.352 ద్వారా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ)అప్పజెబుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ వి.వెంకటరంగారెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ కానునండటంతో ఈ ఉత్తర్వులు ఇచ్చారు. కర్నూలు మెడికల్ కాలేజిలోనే విద్యాభ్యాసం చేసిన డాక్టర్ సి.ప్రభాకర్రెడ్డి ఇక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. కొంత కాలం పాటు విశాఖపట్టణంలో ప్రొఫెసర్గా పనిచేశారు. 2016 నుంచి మళ్లీ ఇక్కడకు వచ్చి ప్రొఫెసర్గా, డిప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించారు. 30న మూడో తరగతి ప్రవేశాలకు లాటరీ కర్నూలు(అర్బన్): జిల్లాలోని మూడు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 3వ తరగతి ప్రవేశాలకు సంబంధించి ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు ఈ నెల 30న ఉదయం 11 గంటలకు లాటరీ నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల కన్వీనర్ ప్రిన్సిపాల్ ఎ.లక్ష్మిగుర్రప్ప తెలిపారు. కర్నూలు, ఆలూరులో బాలికలు, తుగ్గలి మండలం రాతనలో బాలురకు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పాఠశాలల్లో 3వ తరగతి ప్రవేశాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక బిర్లాగేట్ సమీపంలోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో లాటరీ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఎస్సీ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాలని ఆయన కోరారు. వెబ్సైట్లో తాత్కాలిక జనరల్ సీనియారిటీ జాబితా కర్నూలు సిటీ: జిల్లాలోని మున్సిపల్ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో సెకండ్ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులుగా పని చేస్తున్న వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించేందుకు తయారు చేసిన తాత్కాలిక జనరల్ సీనియారిటీ జాబితా డీఈఓ వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ కె.శామ్యూల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్సైట్లో సీనియారిటీ, వారి అర్హతల ఆధారంగా సబ్జెక్టులతో సహా వివరాలు పొందుపరిచామని, దీనిపై ఏవైన అభ్యంతరాలు ఉంటే ఈ నెల 31వ తేదీలోపు తగిన ఆధారాలతో డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ పేర్కొన్నారు. ఎస్బీఐలో సర్వర్ సమస్య కర్నూలు(అగ్రికల్చర్): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంగళవారం లావాదేవీలు స్తంభించాయి. సర్వర్ సమస్య కారణంగా ఉదయం నుంచి లావాదేవీలు ముందుకు సాగకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఎస్బీఐలో సర్వర్ సమస్య దేశ వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్బీఐ బ్రాంచీల బయట బోర్డులు ఏర్పాటు చేసి ఖాతాదారులు సహకరించాలని కోరారు. బుధవారం ఉదయానికి సర్వర్ను రీస్టోర్ చేసేందుకు, యథావిధిగా లావాదేవీలు నిర్వహించేందుకు ఎస్బీఐ ఉన్నతస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. -
చర్మవ్యాధి విభాగంలో థర్మాస్కోప్ మిషన్ ఏర్పాటు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చర్మవ్యాధుల విభాగంలో మంగళవారం థర్మాస్కోప్ మిషన్ను ఏర్పాటు చేశారు. దీనిని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ చిట్టినర్సమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.వెంకటరంగారెడ్డి సంయుక్తంగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మిషన్ ద్వారా అవాంఛిత రోమాలు, నల్లమచ్చలు, పులిపి ర్లు తొలగించడం, జుట్టు తగ్గడం, చర్మం పునరుద్ధరించడం, పునరుజ్జీవనం కోసం ఉపయోగపడుతుందన్నారు. బయాప్సీ లేకుండా చర్మవ్యాధులను గుర్తించేందుకు సైతం ఈ పరికరం ఉపయోగకరం అన్నారు.కార్యక్రమంలో చర్మవ్యాధి విభాగం హెచ్ వోడి డాక్టర్ పద్మజ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ గౌతమి, డాక్టర్ రూపశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రులకు నోటీసులు
కర్నూలు(హాస్పిటల్): సిజేరియన్ ఆపరేషన్లు అధికంగా చేస్తున్న పలు ప్రైవేటు ఆసుపత్రులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వై.ప్రవీణ్కుమార్ నోటీసులు జారీ చేశారు. ఆయా ఆసుపత్రులకు వచ్చిన మొ త్తం ప్రసవ కేసుల్లో 85 శాతానికి పైగా సిజేరియన్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ జాబితాలో కర్నూలులోని గాయత్రి హాస్పిటల్, అమీలియో హాస్పిటల్, కేఎం హాస్పిటల్, సన్రైజ్ హాస్పిటల్, జీఎన్ఆర్ హాస్పిటల్లు ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల వివరణను పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం కర్నూలు (లీగల్): భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మంగళవారం ఆయన పర్యావరణ పరిరక్షణపై లోకాదలత్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివిధ వ్యర్థాలు తొలగింపుపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి బీవై మునిప్రసాద్ , అసిస్టెంట్ ఇంజినీర్ తదితరులు పాల్గొన్నారు. -
● ఏర్పాట్లపై నివేదికలు అందజేయండి ● జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన
కౌంటింగ్ సిబ్బందికి ఐడెంటిటీ కార్డులు కర్నూలు (సెంట్రల్): కౌంటింగ్ హాల్లో ఏర్పాట్ల పనులు నిర్వర్తించే సిబ్బంది అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, రేపటి నుంచి సిబ్బంది ఎవరైనా యూనివర్సిటీకి వెళ్లే సమయంలో కచ్చితంగా ఐడెంటిటీ కార్డు ఉండాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఎన్నికల కౌంటింగ్ సన్నద్ధతపై రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టేబులేషన్, ఎన్కోర్, ఈటీపీబీఎస్, వీవీ ప్యాట్ స్లీప్ కౌంటింగ్ తదితర అంశాల మీద ఏఆర్ఓలకు, ఇతర సిబ్బందికి ఇప్పటికీ కనీసం రెండు సార్లు శిక్షణ ఇచ్చారా? లేదా?, సిబ్బందికి ఐడెంటిటీ కార్డులు ఇచ్చారా? లేదా? అనే విషయాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొబైల్ డిపాజిట్ సెంటర్, ఏజెంట్ ఐడెంటిఫికేషన్ సెంటర్కి సంబంధించి చేయాల్సిన పనులు రేపటిలోపు పూర్తి చేయాలన్నారు. ఫుడ్ కోర్టు, ఏజెంట్ ఐడెంటిఫికేషన్ సెంటర్, కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బంది హాజరుకు సంబంధించిన ప్రదేశం వద్ద టెంట్లు, ఇంజినీరింగ్, లైఫ్ సైన్స్, లైబ్రరీ బ్లాక్ల వద్ద మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసే పనులు కూడా పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ మెటీరియల్ తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. బ్లాక్ ఎన్వలప్, వీడియోగ్రఫి, కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేయనున్న పబ్లిక్ అడ్రస్ సిస్టం వివరాలను కూడా సంబంధిత రిటర్నింగ్ అధికారులకు రేపు తెలియజేస్తామన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపె ముందుగానే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కౌంటింగ్ హాల్లో పూర్తయిన ఏర్పాట్లు, ఏజెంట్ ఐడెంటిఫికేషన్ సెంటర్లో జరుగుతున్న పనులు తదితర అంశాల వివరాలను అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. టెలీ కాన్ఫరెన్స్లో పాణ్యం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు భార్గవ్ తేజ, శివనారాయణ్ శర్మ, శేషిరెడ్డి, రామలక్ష్మి, చిరంజీవి, మురళి, రాము నాయక్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అల్లర్ల కలకలం.. భద్రత కట్టుదిట్టం
కర్నూలు: కర్నూలు శివారులోని రాయలసీమ యూనివర్శిటీ వద్ద నిత్యం రద్దీగా ఉండే కర్నూ లు–కడప జాతీయ రహదారిలో మంగళవారం ఉదయం పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు ప్లకార్డులు చేతబట్టి పోలీసులు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. తక్షణమే పోలీసులు సైరన్ మోగించుకుంటూ తమ వాహనాల్లో అక్కడికి వచ్చి ఆందోళనకారులను చుట్టుముట్టారు. అగ్నిమాపక శకటం, వజ్ర వాహనంతో పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర పోలీసు బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉందని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే లాఠీచార్జి చేస్తామంటూ హెచ్చరించారు. ఎంతకీ వారు వినకపోవడంతో పోలీసులు వాటర్ గన్తో నీటిని చల్లారు. అయినా చొచ్చుకు రావడంతో టియర్ గ్యాస్ వదిలారు. అప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో నిరసనకారులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఆగ్రహించిన ఆందోళనకారులు అల్లర్ల తీవ్రత పెంచారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. కల్పిత పాత్రలతో పోలీసులే ఆందోళన పోలీసులు–అల్లరి మూకల మధ్య గొడవలు జరిగిన విషయంలో కల్పిత పాత్రలతో పోలీసులే ఆందోళనకారులుగా వేషం వేసి రాళ్లు విసిరినట్లు చేశారు. అనంతరం పోలీసులు టియర్ గ్యాస్, తుపాకులతో ఫైరింగ్, వజ్ర వాహనంతో ఫైరింగ్, లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఇద్దరి అల్లరి మూకలకు గాయాలు కావడంతో వారిని స్ట్రెచర్పై అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అల్లరి మూకలను ఏ విధంగా సంఘటనా స్థలం నుంచి తరిమికొట్టాలో, విధ్వంసానికి ప్రయత్నించే వారిని అణచివేసి పరిస్థితులను ఏ విధంగా అదుపులోకి తీసుకోవాలి.. గాయపడిన వారికి చికిత్స అందించడం, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడటం వంటి సన్నివేశాలు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఇదంతా చూస్తున్న ప్రజలు హడలిపోయారు. ఓట్ల లెక్కింపు నాడు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే పోలీసులు తీసుకునే కఠిన చర్యల్లో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్/ఎన్నికల అధికారి డాక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ హాజరై మాక్డ్రిల్ను పర్యవేక్షించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు నాగరాజు, నాగబాబు, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ట్రైనీ డీఎస్పీ భావన, సీఐలు నాగరాజు యాదవ్, శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ గౌస్, గౌతమి, శ్రీధర్, కిరణ్ కుమార్రెడ్డి, పవన్కుమార్, ఆర్ఐలు జావిద్, సోమశేఖర్ నాయక్, నారాయణ, ఆర్ఎస్ఐలు, ఏఆర్, సివిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు : ఎస్పీ కృష్ణకాంత్ ఓట్ల లెక్కింపు రోజు చట్ట విరుద్ధంగా ఎవరైనా అల్లర్లు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రాయలసీమ యూనివర్శిటీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంది. శాంతిభద్రతల పరీరక్షణలో భాగంగా ప్రజల ధన, మాన, ప్రాణ నష్టం వాటిల్లకుండా చేపట్టే చర్యలను పోలీసులతో మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాం. -
కర్నూలులో వజ్రాల వేట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలువజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి.‘సీమ’లో ఏజెంట్ల తిష్టవర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత (క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు.విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ.వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది.ఈ ఏడాది లభ్యమైన వజ్రాల వివరాలు👉 ఈ నెల 8న చెన్నంపల్లిలో రూ.3.96 లక్షల విలువ చేసే వజ్రం లభించింది.👉 మే 20న రామాపురంలో రూ.50 వేల విలువైప వజ్రం దొరికింది.👉 మే 21న మద్దికెర మండలం మదనంతపురంలో రూ.6.50 లక్షల విలువైన వజ్రం లభ్యమైంది.👉 మే 22న ఇదే గ్రామంలో దొరికిన వజ్రాన్ని రూ.18 లక్షలు, 10 తులాల బంగారం చెల్లించి వ్యాపారి కొనుగోలు చేశారు.👉 మే 23న జొన్నగిరిలో రూ.15 వేలు, పగిడిరాయిలో రూ.12 వేల విలువ చేసే వజ్రాలు లభించాయి. 👉 మే 24న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.6.20 లక్షలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు.👉 మే 25న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.1.20 లక్షల నగదు, జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు.👉 తాజాగా తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన వ్యక్తికి మంగళవారం ఓ వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి రూ.లక్ష నగదు, అర తులం బంగారం ఇచ్చి దానిని కొనుగోలు చేశారు.ఐదోసారి వచ్చావానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నా. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం.– ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా వజ్రాన్ని గుర్తు పడతాంమాది కలికిరి. హైదరాబాద్లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం.– రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లాఒక చిన్న వజ్రం దొరికినా చాలుమా ఊళ్లో పనుల్లేవు. వజ్రాలు దొరికాయని పేపర్లు, టీవీల్లో వచ్చింది. ఖాళీగా ఉండలేక ఇక్కడికి వచ్చాం. నాతో పాటు మా ఊరోళ్లు పదిమంది వచ్చారు. వజ్రాలు వెతుకుతున్నాం. కొన్ని రాళ్లు మెరుస్తున్నాయి. అవి వజ్రాలు కాదంటున్నారు. కొద్దిరోజులు చూస్తాం. చిన్న వజ్రం దొరికినా కష్టం తీరకపోతుందా అనే ఆశతో చూస్తున్నాం.– లక్ష్మక్క, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా -
వజ్ర సంకల్పం
కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఇప్పటికే కొందరికి వజ్రాలు దొరికాయి కూడా. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కర్నూలువజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే.. మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలు వజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆ్రస్టేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు. ‘సీమ’లో ఏజెంట్ల తిష్ట వర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత(క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వా«దీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు. విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ. వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది. వజ్రాన్ని గుర్తు పడతాం మాది కలికిరి. హైదరాబాద్లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం. – రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లా ఐదోసారి వచ్చా వానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నాను. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం. – ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా -
ఆశల విత్తు ఆరంభం
ఆస్పరి: ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు పొలాలను సిద్ధం చేసుకుని విత్తనాలు నాటుతున్నారు. ఆస్పరి మండలంలో హలిగేర, యాటకల్లు, తొగలుగల్లు, కలపరి, దొడగొండ, బైలుపత్తికొండ, ములుగుందం, కారుమంచి, కై రుప్పల, గార్లపెంట, డీకోటకొండ తదితర గ్రామాల్లో విత్తన పనులు జోరుగా సాగుతున్నాయి. ఎర్ర నేలల్లో పత్తి, వేరుశనగ, కొర్ర, సజ్జ పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తోంది. ఈసారి ముందస్తుగా వర్షాలు కురుస్తుండడంతో విత్తన పనుల్లో రైతులు బిజీ అయ్యారు. -
ఆన్లైన్లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు
కర్నూలు సిటీ: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రవేశపెట్టింది. ఆన్లైన్లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు అందిస్తూ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,345 ప్రాథమిక, 902 ప్రాథమికోన్నత, 1,000 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 7.25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా విద్యార్థులకు 2023–24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఎఫ్ఏ–1, ఎఫ్ఏ–2, ఎఫ్ఏ–3, ఎఫ్ఏ–4 పరీక్షలతో పాటు ఎస్ఏ–1, ఎస్ఏ–2 పరీక్షల్లో వచ్చిన మార్కులు, వచ్చిన గ్రేడ్లు, విద్యా సంవత్సరంలో నెలలో పనిదినాలు, స్కూల్కి హాజరైన రోజులు.. సంబంధించిన వివరాలతో కూడిన ప్రగతి పత్రాలను (హోలిస్టిక్ రిపోర్ట్ కార్డులను) విద్యాశాఖ నేరుగా తల్లిదండ్రుల రిజిస్టర్ సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచార రూపంలో చేరవేస్తున్నారు. వీటితో పాటు విద్యార్థి పాఠ్యేతర సబ్జెక్టుల్లో చూపిన ప్రతిభతో కూడిన ప్రగతి పత్రాలను తల్లిదండ్రులకు పంపించే విధానాన్ని మొట్ట మొదటిసారి అమల్లోకి తెచ్చారు. 1 నుంచి 9వ తరగతి చదివిన విద్యార్థుల పూర్తి వివరాలు ప్రోగ్రెస్ కార్డుల్లో ఉంటా యి. విద్యార్థి పేరు, తల్లిదండ్రల వివరాలు, చిరు నామా, ఆధార్కార్డు నంబరు, స్కూల్లో చేరిన సంవత్సరం, పుట్టిన తేదీ, మీడియం, విద్యార్థి ఎత్తు, బ రువు, రక్త గ్రూప్ తదితర వివరాలు కార్డుల్లో చేర్చారు. ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా విద్యార్థి తల్లిదండ్రుల రిజిస్టర్ మొబైల్ నంబరుకు డియర్ పెరెంట్ అంటూ ఎస్ఎంఎస్ వస్తుంది. దీనిలో ఇచ్చిన లింక్ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత స్క్రీన్పై కనిపించే అక్షరాలను అక్కడ ఇచ్చిన స్పేస్లో టైపు చేయగా, రిజిస్టర్ మొబైల్కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తరువాత హోలిస్టిక్ రిపోర్ట్ కార్డు అని వస్తుంది. దీనిని పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవడం ద్వారా విద్యార్థి ప్రగతికి సంబంధించిన పూర్తి వివరాలను చూసుకోవచ్చు. తల్లిదండ్రుల సెల్ఫోన్కు పంపుతున్న విద్యాశాఖ ఓటీపీ ఆధారిత సురక్షితమైన పద్ధతిలో సమాచారం బట్వాడా -
జనరల్ ప్రయాణం.. టికెట్ మరింత సులభం
● యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టికెట్ బుకింగ్ ● ఆన్లైన్లో రోజువారీ టికెట్ల కేటాయింపు ● కాగిత రహిత టికెట్ దిశగా రైల్వే శాఖ అడుగులు ● నంద్యాల సెక్షన్ పరిధిలోని 10 స్టేషన్లలో యూటీఎస్పై అవగాహన నంద్యాల(సిటీ): రైలు జనరల్ బోగిలో ప్రయాణం అంటే మామూలు హడావిడి కాదు. ఇంటి నుంచి రైల్వేస్టేషన్కు చేరుకోవడం, లగేజీ, పిల్లలతో వెళ్లడం.. తీరా టికెట్ తీసుకుందామంటే అక్కడ కౌంటర్లో చాంతాడంత క్యూ.. రైలు వెళ్లిపో తుందేమోనన్న ఆత్రుత.. ఇకపై ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ.. ఇంట్లో నుంచే జనరల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం రైల్వే శాఖ కల్పించింది. ప్రధానంగా పెద్ద రైల్వేస్టేషన్లలో పండుగలు, సెలవులు, ప్రత్యేక రోజుల్లో రైలు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. టికెట్ కొనుగోళ్లకు కౌంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో బారులుదీరుతారు. ఆ సమయంలో ఈ యాప్ ద్వారా జనరల్ టికెట్ కొనుగో లు చేసి దేశంలో ఎక్కడికైనా.. ఏ రైలులోనైనా ప్రయాణించవచ్చు. ప్రయాణికుల ఇక్కట్లను తీర్చేందుకు రైల్వే శాఖ యాప్ను అందుబాటు లోకి తీసుకొచ్చింది. యూటీఎస్ (అన్ రిజర్వ్ టికెటింగ్ సిస్టం) ఆన్ మొబైల్ యాప్ సదుపాయాన్ని కల్పించింది. సాధారణ టికెట్పై ప్రయాణించాలనుకునే వారు అదే రోజున ఈ యాప్ ద్వారా టికెట్ పొందొచ్చు. నంద్యాల జిల్లాలోని రైల్వే స్టేషన్లలో ఈ యాప్ ద్వారా ప్రయాణికులు సాధారణ, సీజనల్, ప్లాట్ ఫాం టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. రైల్వే అధికారులు ఈయాప్ ద్వారా ఎలా టికెట్ తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. పాటించాల్సిన నిబంధనలు... ● ప్రయాణం చేసే రోజునే టికెట్ బుక్ చేసుకోవాలి. ● టికెట్ బుక్ అయిన గంటలోపే రైలు ఎక్కాలి. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టికెట్ బుక్ కాదు. ● ఫోన్లో జీపీఆర్ఎస్ యాక్టివేషన్లో ఉండాలి. ● టికెట్ పొందడం, ప్రయాణ సమయంలో సమస్యలు ఉంటే యూటీఎస్ యాప్లోని హెల్ప్ కస్టమర్ కేర్ నంబర్లను సంప్రదించవచ్చు. యాప్లో నమోదు... జీపీఆర్ఎస్ యాక్టివేషన్ ఉన్న స్మార్ట్ ఫోన్, ఇంటర్ నెట్ కనెక్షన్ ఉన్నవారు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యూటీఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా www.utsonmobile.indianrail.gov.in వెబ్సైట్లోకి వెళ్లి యూటీఎస్ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్ నంబరు, పేరు, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలు సమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ సంబరు నమోదు చేసిన వెంటనే వినియోగదారుడి పేరున ఖాతా రిజిస్ట్రేషన్ అవుతుంది. టికెట్ బుకింగ్... యూటీఎస్ యాప్ తెరిచి ఫోన్ నంబరు, పాస్వర్డ్తో తమ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. టికెట్ ఎలా పొందాలో వివరాలున్న తెర కనిపిస్తుంది. ఇందులో సాఽ దారణ బుకింగ్, క్విక్ బుకింగ్, ఫ్లాట్ఫాం బుకింగ్, సీజన్ బుకింగ్, క్యూఆర్ బుకింగ్, క్యాన్సిల్ టికెట్, బుకింగ్ హిస్టరీ, షో టికెట్. ఆర్–వ్యాలెట్, ప్రొఫైల్, హెల్ప్ వంటి వివరాలు కనిపిస్తాయి. సాధారణ బుకింగ్, బుక్ అండ్ ట్రావెల్, బుక్ అండ్ ప్రింట్, టికెట్ ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు వివరాలు ఉంటాయి. టికెట్ బుకింగ్ కోసం సాధారణ బుకింగ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత ఎక్కాల్సిన, దిగాల్సిన స్టేషన్ వివరాలు ప్రయాణికుల సంఖ్య నమోదు చేయాలి. చెల్లింపు ఇలా.. యాప్లో గెట్ ఫేర్ ఆప్షన్ ద్వారా టికెట్ ధర తెలుసు కోవాలి. కొనుగోలు నగదు చెల్లింపును ఆర్–వ్యాలెట్, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్ యాప్ల ద్వారా చేపట్టవచ్చు. షో టికెట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే బుక్ చేసిన టికెట్ వివరాలు, వ్యూ టికెట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే టికెట్ కనిపిస్తాయి. కాగిత రహిత టికెట్ బుక్ చేసుకున్నవారు తమ స్మార్ట్ ఫోన్లో టికెట్ డౌన్లోడ్ చేసుకొని ప్రయాణం సమయంలో టీసీకి చూపించాలి. ప్రింటెడ్ టికెట్ ఆప్షన్ ఎంచుకున్న వారు రైల్వేస్టేషన్లోని ఏటీవీఎం, కో–టీవీఎం ఓసీఆర్ యంత్రాలు, ఓటీఎస్ బుకింగ్ కౌంటర్లో ఫోన్, బుకింగ్ ఐడీ నంబర్ నమోదు చేసి టికెట్ ప్రింట్ తీసుకోవాలి. జనరల్ టికెట్ సులభంగా పొందొచ్చు జనరల్ రైల్ టికెట్ను యూటీఎస్ యాప్ ద్వారా సులభంగా పొందవచ్చు. ఇందుకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండగానే రైలు టికెట్ను బుక్ చేసుకుని ఎంచక్కా రైలు ఎక్కే అవకాశం రైల్వే శాఖ కల్పిస్తుంది. నంద్యాల పరిధిలోని 10 రైల్వే స్టేషన్లలలో ఇదివరకే ఈ యాప్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి స్టేషన్లో ప్రత్యేక సిబ్బంది సహకారంతో ప్రయాణికులకు సమాచారాన్ని అందిస్తు న్నాం. రానున్న కాలంలో క్యూలలో నిల్చునే వారి సంఖ్య తగ్గేలా చేస్తాం. – షా మహమ్మద్, కమర్షియల్ ఇన్స్పెక్టర్, నంద్యాల సెక్షన్ -
కమనీయం.. పాండురంగడి చక్రస్నానం
కోవెలకుంట్ల: పట్టణంలోని వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో సోమవారం వసంతోత్సవం, స్వామివారి చక్రస్నాన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు పాండురంగడికి పంచామృతాభిషేకం, భూసూక్త విధానేన అభిషేకాలు, తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం స్వామివారి వసంతోత్సవంలో భాగంగా భక్తులు రంగులు చల్లుకున్నారు. వైశాఖ మాసాన్ని పురస్కరించుని 11 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో కల్యాణం, వాహన సేవలు, రథోత్సవం అనంతరం కోనేటిలో చేపట్టిన చక్రస్నాన కార్యక్రమం కమనీయంగా కొనసాగింది. రాత్రి ధ్వజారోహణ, కంకణ నిమజ్జనం, నాకబలితో ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన పాండురంగడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరిరోజు నిర్వహించిన కార్యక్రమాలను తిలకించేందుకు పట్టణంతోపాటు చుక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కోనేటి ప్రాంగణం జనసంద్రమైంది. -
గాలివానతోనే విద్యుత్ కోతలు
● విద్యుత్ శాఖ ఎస్ఈ ఎం.ఉమాపతి కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికారిక విద్యుత్ కోతలు లేవని, గాలివానతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని ఆ శాఖ ఎస్ఈ ఎం.ఉమాపతి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మే నెలలో కురిసిన వర్షాలకు, పెనుగాలుల తీవ్రతకు 22 గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కొద్ది గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందే తప్ప.. కోతలనేవే లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే కొన్ని పత్రికల్లో నిరంతరం విద్యుత్ కోతలంటూ ఆవాస్తవ కథనాలు వచ్చాయన్నారు. ఉమ్మడి జిల్లాలో 33 కేవీ ఫీడర్లు 34, 11 కేవీ ఫీడర్లు 28 కాలిపోయాయని, 33 కేవీ పోల్స్ 115, 11 కేవీ పోల్స్ 2,093, ఎల్టీ పోల్స్ 1,226 కూలిపోయాయని, 33 కేవీ లైన్లు 6.78 కిలోమీటర్లు, 11 కేవీ లైన్స్ 125,58 కిలోమీటర్లు దెబ్బతిన్నాయని, 217 ట్రాన్స్ఫార్మర్లు కాలి పోయాయని తెలిపారు. దీంతో విద్యుత్ శాఖకు రూ.10.09 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. మే నెలకు సంబంధించి రోజువారి విద్యుత్ వినియోగం కోటా 14.56 మిలియన్ యూనిట్లు ఉందని, అయితే 11.17 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగం ఉందని పేర్కొన్నారు. కోటాలో రోజుకు 3.38 మిలియన్ యూనిట్లు విద్యుత్ మిగులుతోందని, అలాంటపుడు విద్యుత్ కోతలు విధించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. దెబ్బతిన్న పోల్స్, లైన్లను కొద్ది గంటల వ్యవధిలోనే పునరుద్ధరించి విద్యుత్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
1 నుంచి ‘ఓపెన్’ సప్లిమెంటరీ పరీక్షలు
కర్నూలు సిటీ: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఆదోనిలో ఒకటి, కర్నూలులో రెండు, ఎమ్మిగనూరులో ఒకటి, పత్తికొండలో ఒకటి చొప్పున మొత్తం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు 930, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,265 మంది హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిన వారికి జూన్ 10న కర్నూలు బీక్యాంపు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరీక్ష నిర్వహించనున్నారు. కొనసాగుతున్న సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగినఫస్ట్ ఇయర్ పరీక్షలకు 10,601 మంది విద్యార్థులకుగాను 10,182 మంది హాజరుకాగా 414 మంది గైర్హాజరయ్యారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు 3,218 మందికిగాను 3049 మంది హాజరుకాగా 169 మంది గైర్హాజరైయినట్లు ఇంటర్మీడియెట్ ప్రాంతీయ కార్యాలయ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. ● పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు 2,107 మంది విద్యార్థులకుగాను 1,132 మంది విద్యార్థులు హాజరు కాగా 975 మంది గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. గ్రూప్–2 మెయిన్స్కు ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): గ్రూప్–2 (మెయిన్స్) పరీక్షలకు స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ పి.వెంకటలక్షుమ్మ తెలిపారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలు, నంద్యా ల జిల్లాలకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులు త మ దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్కు స్వయంగా లేదా పోస్టు ద్వారా జూన్ 3వ తేదిలోగా అందించాలన్నారు. ఎంపికై న అభ్యర్థులకు కర్నూలులోని బీసీ స్టడీ సర్కిల్లో 60 రోజుల పాటు శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్తో పాటు శిక్షణా కాలం పూర్తయి న అనంతరం అర్హులైన అభ్యర్థులకు స్టయిఫండ్ మంజూరవుతుందన్నారు. వివరాలకు 08518–236076 నెంబర్ను సంప్రదించాలన్నారు. 14 మండలాల్లో వర్షం కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు 14 మండలాల్లో వర్షం కురిసింది. ఎమ్మిగనూరులో 30.6, ఆదోని లో 28.6, గోనెగండ్లలో 22.6, మంత్రాలయంలో 20.8, నందవరంలో 14.2, కోసిగిలో 13.4, పెద్ద కడబూరులో 8.4, ఆలూరులో 8.4, దేవనకొండలో 6.2, కౌతాళంలో 4.8, హాలహర్విలో 4.2 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. మే నెల సా ధారణ వర్షపాతం 40.1 మి.మీ ఉండగా 103.7 మి.మీ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే మే నెలలో 27 రోజుల్లో 159 మి.మీ అధికంగా నమోదు కావడం విశేషం. -
విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి
గడివేముల: పెసరవాయి గ్రామానికి చెందిన కేబుల్ ఆపరేటర్ వాసుదేవరెడ్డి (42) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజులు క్రితం గాలీవానకు గ్రంఽథివేముల సమీపంలో కేబుల్ వైర్లు తెగిపోయాయి. వాటిని సరిచేసేందుకు సోమవారం స్తంభం పైకి ఎక్కగా ప్రమాదవశాత్తు తీగలు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య స్వాతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుడు ఆర్బీ చంద్రశేఖర రెడ్డి, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ శివరాంరెడ్డి, గ్రామ నాయకులు ఎల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. -
బాలిక ఆత్మహత్య
మిడుతూరు: వీపనగండ్ల గ్రామంలో సోమవారం ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ జగన్ మోహన్ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని తలముడిపి గ్రామానికి చెందిన రామకృష్ణ, మహేశ్వరి దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కుమార్తె హేమలత (16) పదో తరగతి పూర్తి చేసింది. కుట్టు మిషన్ నేర్చుకునేందుకు నెల రోజుల క్రితం అమ్మమ్మ ఊరు వీపనగండ్లకు పంపించారు. కాగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో హేమలత సోమవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొలం నుంచి తిరిగి వచ్చిన అమ్మమ్మ పద్మమ్మ గుర్తించి వెంటనే బాలికను కిందకు దించి ఆటోలో నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలికకు తరచుగా కడుపు నొప్పి వస్తుండేదని, నొప్పి భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలిక తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్లో దాదాపు 2.50 లక్షల హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉందని, ఇందుకు అవసరమైన బీటీ విత్తన ప్యాకెట్లను సరఫరా చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. సోమవారం సాయంత్రం పత్తి విత్తన కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడారు. జిల్లాకు 18 లక్షలకుపైగా ప్యాకెట్లు అవసరమవుతాయని, వ్యవసాయ శాఖ కమిషనరేట్ 19లక్షల ప్యాకెట్లకు ఆయా కంపెనీల సప్లయి ప్లాన్ ఇచ్చిందన్నారు. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్లకు కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం చేస్తే కంపెనీలపైనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంఆర్పీ రూ.864 ఉందని, దీనికి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా చర్యలు తప్పవన్నారు. సమావేశంలో కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, ఆదోని ఏడీఏ బాలవర్థిరాజు, ఎమ్మిగనూరు ఏడీఏ మహమ్మద్ఖాద్రీ, ఏవో రాఘవేంద్ర, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
● బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.1.84 లక్షల నగదు మాయం ● లబోదిబోమంటున్న బాధితుడు
ఎమ్మిగనూరురూరల్: క్రెడిట్ కార్డు పంపి, ఫోన్ ద్వారా ఓటీపీ తెలుసుకుని బ్యాంక్ అకౌంట్లలో రూ.1.84 లక్షలు నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ ఘటన ఎమ్మిగనూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు...పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి నూరిల్లా, ఆయన భార్య రిజ్వానాకు ఈ నెల 17న ఎమ్మిగనూరు బ్రాంచ్ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ పేరు నుంచి కొత్త క్రెడిట్ కార్డులు రిజిష్టర్ పోస్టులో వచ్చాయి. అప్పటి నుంచి ఆర్బీఎల్ బ్యాంక్ ఐడీ పేరుతో 08800627894 నంబర్ నుంచి కాల్స్ రావడం.. ఓటీపీ చెప్పాలని అడగడంతో నమ్మిన నూరల్లా ఓటీపీ నంబర్ ఇచ్చారు. 17వ తేదీన రూ. 51,445.18, అలాగే 18వ తేదీన రూ. 51.475లు, ఆ తరువాత 19వ తేదీన రూ. 32,944 ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేసుకున్నారు. అలాగే రిజ్వనాకు కాల్ చేసి క్రెడిట్ కార్డు యాక్టివ్ చేస్తామని సెల్కు వచ్చిన ఓటీపీ నెంబర్ తీసుకుని 20వ తేదీన రూ. 48,386 డ్రా చేసుకున్నారు. భార్యాభర్తల అకౌంట్ నుంచి మొత్తం రూ. 1,84,250.18 సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాధితుడు స్థానిక బజాజ్ ఫైనాన్స్ కార్యాలయం వెళ్లి క్రెడిట్కార్డులు చూపించడంతో ఇవి తమవి కావని చెప్పారు. వెంటనే నూరిల్లా సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేయటంతో వాటిని బ్లాక్ చేశారు. బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ జరుపుతున్నామని పట్టణ పోలీసులు తెలిపారు. డూప్లికేట్ క్రెడిట్ కార్డ్ చూపుతున్న బాధితుడు నూరిల్లా
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
Advertisement