-
ప్రేమోన్మాది నాగరాజుకు ఉరిశిక్ష విధించాలి
నెల్లూరు(అర్బన్): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పూజిత, ఆమె తల్లి కాంతమ్మలపై నిందితుడు నాగరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ఎనెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజిత, కాంతమ్మను మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం ఆమె దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న వన్స్టాప్ సఖి సెంటర్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లెం విమల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయనిర్మల, రాజ్యలక్ష్మి, అధికార ప్రతినిధి సుప్రియ పాల్గొన్నారు. -
22న వీఎస్యూకు గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక
నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22న జిల్లా పర్యటనకు విచ్చేయనున్నట్లు కలెక్టర్ ఎం హరినారాయణన్ శనివారం తెలిపారు. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకలో ఆయన పాల్గొంటారు. 22వ తేదీ ఉదయం 9.45 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి ఉదయం 10.40 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. 11.30 గంటల నుంచి విక్రమ సింహపురి యూనివర్సిటీలో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 5.35 గంటలకు పోలీస్ పరేడ్ మైదానం నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. గ్రంథాలయంలో వేసవి శిబిరం నెల్లూరు(మినీబైపాస్): వేసవి విజ్ఞాన శిబిరం సందర్భంగా స్థానిక రంగనాయకుల పేటలోని శాఖా గ్రంథాలయంలో శనివారం విద్యార్థినీ విద్యార్థులకు పుస్తక పఠనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురిపూడి ట్రస్ట్ అధ్యక్షులు సతీష్ కుమార్ విచ్చేసి విద్యార్థులకు పేపర్ క్రాఫ్ట్లో భాగంగా టోపీలను చేయించారు. తదుపరి పిల్లలకు చాక్లెట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జూన్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు గ్రంథాలయ అధికారి వి.అరుణ పేర్కొన్నారు. నీట మునిగిన యువకుడిని కాపాడిన మైరెన్ పోలీసులు తోటపల్లిగూడూరు: కోడూరు బీచ్లో ప్రమాదంలో చిక్కుకున్న ఓ యువకుడిని మైరెన్ పోలీసులు కాపాడి ప్రాణాలు నిలబెట్టారు. వివరాల్లోకెళితే.. నెల్లూరు డైకాస్ రోడ్డుకు చెందిన జాని తన స్నేహితులతో కలిసి శనివారం ఉదయం కోడూరు బీచ్ సందర్శనకు వచ్చారు. మిత్రులందరూ బీచ్లో జలకాలాడుతుండగా జాని ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకొన్న మైరెన్ పోలీసులు శేషగిరి, సంజయ్లు వెంటనే వచ్చి నీటిలో మునిగిపోతున్న అతనిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. నీళ్లు తాగి ప్రాణాపాయ స్థితికి చేరిన జానిని నీళ్లు కక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. -
ఎక్కడ చూసిన ఎన్నికల చర్చే
కోవూరు: ఎన్నికల సమరం ముగిసింది. ఫలితాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. గెలుపుపై ఎవరి అంచనాలు వారికి, ఎవరి ధీమాలు వారికి ఉన్నాయి. అయితే గ్రామాల్లో ఎన్నికల వేడిమాత్రం ఇంకా తగ్గలేదు. నలుగురు గుమిగూడిన చోట ఫలితాలు, మెజార్టీలపైనే జోరుగా చర్చ సాగుతోంది. ఏ ఓటర్లు ఏ పార్టీకి మొగ్గుచూపుతున్నారన్న రచ్చబండ చర్చలు కొనసాగుతున్నాయి. అంతే కాకుండా సామాజిక వర్గాల ప్రకారం ఎవరు, ఏ పార్టీ వైపు మొగ్గు చూపారన్న చర్చ కూడా నడుస్తోంది. పోల్ మేనేజ్మెంట్ ప్రభావం ఎంత, తమకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, గెలుపు ఏ విధంగా ఉండబోతోంది, ప్రత్యర్థికి బలహీనంగా మారిన పరిస్థితులు, తద్వారా గ్రామాల వారీగా మెజార్టీ వచ్చేందుకు ఏ పార్టీకి అవకాశం ఉందన్న లెక్కలు జోరుగానే వేస్తున్నారు. ఫంక్షన్లు, ఉత్సవాలు ఇలా సందర్భం ఏదైనా చర్చ మాత్రం ఎన్నికల ఫలితాల పైనే ఉంటోంది.వివిధ అంశాలపై ఆరాగ్రామాల వారీగా తమవైపు నిలబడే ఓటర్ల లెక్కలను గ్రామస్థాయి నాయకుల ద్వారా పోటీదారులు, వారి వర్గం వారు ఆరా తీస్తున్నారు. రాజకీయంగా చురుగ్గా ఉండే నాయకులకు స్థానికంగా లెక్కల మాట అటుంచితే, ఇతర ప్రాంతాల్లోని బంధువులు, స్నేహితుల నుంచి ఫోన్లు కూడా అధికంగా వస్తున్నాయి. తమ నియోజక వర్గాల్లో చర్చలకు తోడు కీలకంగా నిలిచే స్థానాల్లో ఫలితం ఏంటన్న అంశం కూడా ఈ చర్చల్లో ప్రధాన భూమిక పోషిస్తోంది. ఏది ఏమైనా ఫలితాలు వెలువడే వరకు ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయన్నది ఒప్పుకోవాల్సిందే.సోషల్ మీడియా గప్చుప్సాధారణంగా ఎన్నికల సమయంలో ఓట ర్లను ఆకర్షించడం కోసం వీధుల్లోని గోడలపై పోస్టర్లు అతికించే ఆనవాయితీ నుంచి డిజిటల్ వేదికల్లో వినూత్న పంథాలో ప్రచారం చేసేంత వరకు రూపాంతరం చెందింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొన్ని నెలలుగా జిల్లా అంతటా జోరుగా ప్రచారం సాగింది. 13వ తేదీతో ఎన్నికల ముగియడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మూగబో యింది. వాట్సాప్ మెసేజ్లు, అభ్యర్థుల బ్రాడ్ కాస్టింగ్ కాల్స్, రీల్స్తో దద్దరిల్లిన సోషల్ మీడియా ప్రచారం ఎన్నికలు ముగి యగానే గప్చుప్ అయిపోయింది. -
వేడుకగా బండాసుర వధఅలంకార ఉత్సవం
నెల్లూరు(బృందావనం): వైశాఖమాసం పురస్కరించుకుని సంప్రదాయంగా నగరంలోని మూలాపేటలో శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో వసంతోత్సవాలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి బండాసుర వధ అలంకారోత్సవం వేడుకగా నిర్వహించారు. విశేషాలంకారంలో కొలువైన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని భక్తు లు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కె.కృష్ణమ్మ, కుమారుడు కె.మాలకొండయ్య వ్యవహరించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈఓ వేణుగోపాల్ పర్యవేక్షించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
కొడవలూరు: కొడవలూరు మండలం టపాతోపు వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంకు చెందిన 8 మంది మారుతి ఎర్టిగా కారులో బ్రహ్మంగారిమఠం, ఒంటిమిట్ట రామాలయాలను దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. టపాతోపు క్రాస్రోడ్డు వద్ద ముందు వెళుతున్న లారీ హఠాత్తుగా స్లో చేయడంతో వెనుక వస్తున్న కారు వేగం అదుపు కాక లారీ వెనుక భాగాన ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న అట్ల ఏడుకొండలరెడ్డి, గుడివాడ దుర్గారావు, అన్నం కోదండరామిరెడ్డి, అసోది మల్లారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డి పరిస్ధితి కాస్త మెరుగ్గా ఉండగా, మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న మరో నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతోపాటు బాగా పరిచయస్తులు కావడంతో ప్రత్యేక కారులో దైవ దర్శనానికి బయలు దేరినట్లు బాధితులు తెలిపారు. మానవత్వం చాటుకొన్న వైద్య విద్యార్థినులు ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ రహదారిపై కారులో వెళుతున్న వైద్య విద్యార్థినులు కొందరు తమ వాహనాన్ని ఆపి బాధితులకు ప్రాథమిక చికిత్స చేసి మానవత్వం చాటుకొన్నారు. సంఘటనా స్ధలికి చేరుకొని కారులో ఉన్న ప్రమాద బాధితులను స్ధానికుల సాయంతో వెలికి తీయడంతోపాటు వారందరికీ ప్రాథమిక చికిత్స అందించారు. 108 వాహనానికి సమాచారం ఇచ్చి వారందర్నీ అందులోకి తరలించడంలో ఎంతో చొరవ చూపారు. వైద్య విద్యార్థినుల చొరవను అందరూ ప్రశంసించారు. ఎస్సై కె.వీరప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు నలుగురికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం క్షతగాత్రులంతా బాపట్ల జిల్లా వాసులు -
వైభవంగా కన్యకాపరమేశ్వరి నగరోత్సవం
నెల్లూరు(బృందావనం): నగరంలో శనివారం రాత్రి శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి నగరోత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని స్టోన్హౌస్పేటలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి నగరోత్సవం స్టోన్హౌస్పేటలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరింది. అమ్మవారు ప్రత్యేక వాహనంలో ఏర్పాటు చేసిన వ్యాఘ్ర వాహనంపై కొలువుదీరి నవాబుపేట, శెట్టిగుంట రోడ్డు తదితర మార్గాల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. -
ఎక్కడ చూసినా ఎన్నికల చర్చే
ఖరీఫ్కు విత్తనాలు సిద్ధం నెల్లూరు(బారకాసు): జిల్లాలో రానున్న ఖరీఫ్ సీజన్కు సంబంధించి వివిధ రకాల విత్తనాలను స్థానికంగా రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి పేర్కొన్నారు. నెల్లూరులోని వ్యవసా యశాఖ కార్యాల యంలో సబ్డివిజన్ ఏడీఏల తో శనివారం ఖరీఫ్ స న్నద్ధంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు జీలుగ 4,501 క్వింటాళ్లు, జనుము 2,135 క్వింటాళ్లు, పిల్లిపెసర 2,092 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గరిష్టంగా ఐదు ఎకరాల వరకు విత్తనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రధానంగా బోర్ల కింద సాగు చేసుకునే రైతులకు మేలు రకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కిలోకి రూ.5 చొప్పున సబ్సిడీ ఇస్తామన్నారు. మినుము, పెసర, కందులకు 50 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు గమనించి రైతు భరోసా కేంద్రాల వద్ద తీసుకోవచ్చని సూచించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ వ్యవసాయశాఖ అధికారిణి సత్యవాణి -
షార్ట్సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం
● పేలిన గ్యాస్ సిలిండర్ అల్లూరు: మండల పరిధిలోని పురిణి పంచాయతీ నలచెరువుకట్ట కాలనీలో విద్యుత్ షార్ట్సర్క్యూట్తో పూరిల్లు దగ్ధమైన ఘటన శనివారం వేకువజామున జరిగింది. బాధితుల వివరాల మేరకు నలచెరువుకట్టకు చెందిన గిరిజనులు నంబూరు సరోజనమ్మ – శేషయ్య దంపతులు పూరింటిలో నివాసం ఉంటున్నారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా శనివారం వేకువజామున పూరింటిలో మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని గమనించిన సరోజనమ్మ వెంటనే అప్రమత్తమై ఇంట్లోని కుటుంబసభ్యులతో బయటకు వచ్చేసింది. ఇరుగుపొరుగు వారిని పిలవగా.. వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పూరింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలడంతో వారు పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మంటలను ఆర్పడం కోసం అగ్నిమాపక వాహనానికి ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇంట్లోని వస్తువులు, దుస్తులు మొత్తం కాలిపోయి బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. వీఆర్వో శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నాయకుడు దాసరి పోలయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించి తనవంతుగా రూ.2 వేల ఆర్థికసాయం అందజేశారు. -
చంపుతామని బెదిరించి నగదు దోపిడీ
● నిందితుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తిని కత్తితో చంపుతామని బెదిరించి అతని వద్దనున్న నగదు, సెల్ఫోన్ దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసి దోపిడీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. పొదలకూరు రోడ్డు జీవీఆర్ కాలనీకి చెందిన ఎ.కార్తీక్ ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద తోపుడు బండ్లపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి ఆయన ఎస్2 థియేటర్లో సినిమాకు వెళ్లాడు. అర్ధరాత్రి సినిమా వదలడంతో బైక్పై ఇంటికి బయలుదేరాడు. బాబా సమోసా దుకాణం సమీపంలోకి వచ్చేసరికి ఆటో, స్కూటీపై నలుగురు వ్యక్తులు అతనిని అటకాయించారు. కత్తితో చంపుతామని బెదిరించి కార్తీక్ వద్దనున్న రూ.5 వేల నగదు, సెల్ఫోన్ దోచుకెళ్లారు. ఆటోనంబర్, స్కూటీ నంబర్ను గుర్తుపెట్టుకున్న బాధితుడు దోపిడీ ఘటనపై 17వ తేదీ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ బి.అశోక్కుమార్ ఆదేశాల మేరకు ఎస్సై సయ్యద్ లతీఫున్నీసా కేసు నమోదు చేశారు. ఆటో, బైక్ నంబర్లు, సీసీఫుటేజ్ల ఆధారంగా నిందితులు కొండాయపాళెం నక్కలగుంటకు చెందిన అరుల్ రాజ్, గోవర్ధన్, ఫణీంద్ర, రొక్సన్గా గుర్తించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దోపిడీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మత్తు, మాదక ద్రవ్యాల వినియోగానికి బానిసై దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. -
పాత నేరస్తుడి అరెస్ట్
● రూ.14.24 లక్షల సొత్తు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): దొంగతనానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న పాతనేరస్తుడిని పోలీసులు నగరంలోని భగత్సింగ్కాలనీ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై అరెస్ట్ చేశారు. శనివారం బాలాజీనగర్ పోలీసుస్టేషన్లో నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి నిందితుడి వివరాలను వెల్లడించారు. నెల్లూరు నగరంలోని అరవిందానగర్ ఎక్స్టెన్షన్ ఏరియాల్లో శ్రీవల్లి కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె ఈ నెల 15వ తేదీన తన కుటుంబంతో కలిసి అల్లూరులోని అత్త ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగుడు ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించాడు. బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.14.24 లక్షల విలువ చేసే 44.5 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకుని వెళ్లాడు. ఈ నెల 16వ తేదీన ఇంటికి వచ్చిన శ్రీవల్లి, ఆమె కుటుంబ సభ్యులు చోరీ ఘటనపై బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఇన్స్పెక్టర్ ఎల్.వీరానాయక్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో క్లూస్టీం వేలిముద్రలు సేకరించింది. సాంకేతికత ఆధారంగా.. నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంతోపాటు, సీసీఫుటేజ్ల్లో లభ్యమైన ఆధారాల మూలంగా నిందితుడు పాతనేరస్తుడైన బోడిగాడితోటకు చెందిన ప్రస్తుతం జనార్దనరెడ్డికాలనీలో నివాసం ఉంటున్న ఎం.సునీల్గా గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతికత ఆధారంగా శనివారం భగత్సింగ్కాలనీ సమీప జాతీయ రహదారిపై నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరం చేసినట్లు అంగీకరించడంతో అతనిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.14.24 లక్షల విలువ చేసే 44.5 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై డీసీ షీట్ సునీల్ చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసయ్యాడు. సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలను ఎంచుకున్నాడు. 2013 నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో నవాబుపేట పోలీసులు నిందితుడిపై డీసీ షీట్ తెరిచారు. చోరీ జరిగిన రోజుల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసి చోరీసొత్తు రాబట్టేందుకు కృషి చేసిన స్థానిక ఇన్స్పెక్టర్ ఎల్.వీరానాయక్, ఏఎస్సై పి.శ్రీనివాసరాజు, హెచ్సీలు కె.వి.సుధాకర్, సీహెచ్ శివకుమార్, సీహెచ్ రమేష్, పి.వెంకటరావు, కానిస్టేబుల్స్ ఎం.శ్రీహరి, పి.తిరుపతి, పి.పార్ధసారథి, ఓవీఎస్ శివప్రసాద్లను ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
స్ట్రాంగ్రూంలో పోస్టల్ బ్యాలెట్లు
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్ట్లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలో ఉంచి సీల్ వేశారు. శనివారం పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్ కవర్లను పోస్టల్ సిబ్బంది కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.హరినారాయణన్కు అందజేశారు. ఈ పోస్టల్ బ్యాలెట్లను ట్రంకుపెట్టెల్లో భద్రపరిచి సీలు వేశారు. అనంతరం స్ట్రాంగ్రూంలో బాక్సులను ఉంచి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్రూంకు తాళాలు వేసి సీలు వేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ బాపిరెడ్డి, వైఎస్సార్సీపీ ప్రతినిధి సుబ్బరాయుడు, టీడీపీ ప్రతినిధి కృష్ణ చైతన్య పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై..
● చికిత్స పొందుతూ యువకుడు మృతి నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందాడు. నార్త్ ట్రాఫిక్ పోలీసుల వివరాల మేరకు.. ముత్తుకూరుకు చెందిన పి.రాజేష్, చెముడుగుంటకు చెందిన సురేష్ నగరంలోని రావూస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ఈ నెల 17వ తేదీన ఇద్దరూ పరీక్ష రాశారు. అనంతరం రాజేష్ స్నేహితుడిని ఇంటి వద్ద వదిలేందుకు బైక్పై జాతీయ రహదారి మీదుగా చెముడుగుంటకు బయలుదేరారు. రాజేష్ బైక్ నడుపుతుండగా సురేష్ వెనుక కూర్చున్నాడు. సర్వేపల్లి కాలువ వద్దకు వచ్చేసరికి రాజేష్ ముందు వెళుతున్న బైక్ను వేగంగా ఢీకొనడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో సురేష్ స్నేహితుడిని మెడికవర్ హాస్పిటల్కు తరలించి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్యం కోసం నారాయణ ఆస్పత్రికి అక్కడి నుంచి జీజీహెచ్కు తరలించారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ రాజేష్ శనివారం మృతిచెందాడు. మృతుని తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు నార్త్ ట్రాఫిక్ ఎస్సై గీతారమ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దాడిపై కేసు నమోదు
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తిపై దాడి కేసులో చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. మూలాపేట కొండదిబ్బకు చెందిన గోవర్ధన్కు మూలాపేటకు చెందిన సునీల్కు ఆర్థిక విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ రాత్రి మూలాపేటలోని వాగ్ధా స్కూల్ వద్ద ఉండగా సునీల్, మరికొందరు తనపై దాడి చేశారని గోవర్ధన్ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. ● లారీడ్రైవర్ మృతి మనుబోలు: మండల పరిధిలోని జాతీయ రహదారిపై వీరంపల్లి క్రాస్రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతిచెందాడు. గుంటూరు జిల్లాలోని దామరపల్లి గ్రామానికి చెందిన కొల్లిపర సాంబశివరావు(40) లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గుంటూరు నుంచి తిరుపతికి రైలు చక్రాల లోడుతో వెళుతున్నాడు. ఈ క్రమంలో వీరంపల్లి క్రాస్రోడ్డు వద్ద లారీని ఆపి ఇంజిన్ ఆయిల్ నింపుతున్నాడు. అదే సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సాంబశివరావు అక్కడికక్కడే మృతిచెందాడు. మనుబోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు దాటుతుండగా.. ● గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి వెంకటాచలం: రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతిచెందిన ఘటన వెంకటాచలం మండలంలోని కాకుటూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగింది. కోవూరుకు చెందిన ఆంథోని(55) గత ఆరేళ్లుగా కాకుటూరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి స్నానం చేసిన అనంతరం రోడ్డు దాటుతుండగా.. గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్లే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. కాలువలో జారిపడి వ్యక్తి మృతి సంగం: కాలువ వద్ద కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మండల కేంద్రం సంగంకు చెందిన పెంచలయ్య స్థానిక కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్ద కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై నాగార్జునరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీయించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెంచలయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
డబ్బులు తిరిగిచ్చేయండి..!
కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మరో దాష్టీకానికి తెరలేపారు. ఎన్నికల్లో సైకిల్ పార్టీకి ఓటమి తప్పదని తెలిసినా, ఓటర్లను ప్రలోభపర్చేందుకు నగదును ఏరులై పారించారు. తీరా పోలింగ్ సరళి బట్టి తన గెలుపు సాధ్యం కాదని తేలిపోవడంతో తాను పంచిన డబ్బును తిరిగి రాబట్టుకునే పనిలో ఆయన నిమగ్నమైన తంతును చూస్తున్న ప్రజలు నివ్వెరపోతున్నారు. కావలి: కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అనుచరుల అరాచకాలు, ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్కు గంట ముందు వరకు సైతం ఓటుకు రూ.రెండు వేల చొప్పున పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసిన ఆయన అనుచరులు, అనంతరం తమ అసలు నైజాన్ని బయటపెట్టారు. పోలింగ్ సరళిని గమనించాక ఓటమి తప్పదనే అంశం స్పష్టం కావడంతో డబ్బులను వెనక్కివ్వాలంటూ ఓటర్లను వేధిస్తున్నారు. ఓటర్లపై దుర్భాషలు పోలింగ్ అనంతరం వార్డుల వారీగా లెక్కలు చూసుకున్న కావ్య అనుచరులు.. ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి డబ్బులను వెనక్కివ్వాలంటూ ఓటర్లను దుర్భాషలాడుతున్నారు. మహిళలపై సైతం అసభ్య పదజాలాన్ని వాడుతున్నారు. కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు నున్నా మురళి ఫోన్లో ఓటర్లను బెదిరిస్తున్న ఆడియోలు గురువారం కలకలం సృష్టించాయి. సుమారు ఏడు నిమిషాల నిడివి గల రెండు ఆడియో రికార్డింగుల్లో ఓ కుటుంబాన్ని ఆయన తీవ్రంగా బెదిరిస్తున్న విషయం వెలుగు చూసింది. ఆశా.. నిరాశేనా.. ! ఓటుకు భారీ మొత్తం పంపిణీతో పాటు టీ కప్పులు, గ్రామాల్లో ప్రార్థన మందిరాల నిర్మాణానికి నగదును పంపిణీ చేసి ఓట్లను కొనుగోలు చేసేందుకు యత్నించారు. ఉదయగిరి నియోజకవర్గం నుంచి తీసుకొచ్చిన తమ వ్యక్తులను కాపలాగా ఉంచారు. అయితే పోలింగ్ ప్రారంభమయ్యాక, వీరి ఆశలు అడియాశలయ్యాయి. దాదాపు అన్ని చోట్ల వైఎస్సార్సీపీకే మద్దతు తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేయడంతో పోలింగ్ సరళికి అడ్డంకులు సృష్టించేందుకు సైతం కావ్య అనుచరులు యత్నించారు. ముసునూరుతో పాటు దగదర్తి, అల్లూరు మండలాల్లో పలుచోట్ల గొడవలు సృష్టించారు. అయినా పోలింగ్ సజావుగా సాగడంతో కంగుతిన్నారు. చివరికి లెక్కలు చూసుకొని డబ్బులను వెనక్కివ్వాలంటూ ఓటర్లను బెదిరిస్తుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. డబ్బివ్వకపోతే బయట తిరగలేరు రూ.రెండు వేలు తీసుకున్నా, తమకు ఓటేయలేదని.. కృష్ణారెడ్డి కార్యాలయానికి వచ్చి డబ్బులను వెనక్కివ్వాలని హుకుం జారీ చేసిన అంశం ఆడియోల్లో స్పష్టంగా ఉంది. అలా కాని పక్షంలో బయట తిరగలేరని.. ఇంటికొచ్చి గొడవ చేస్తామంటూ పత్రికల్లో రాయలేని విధంగా సదరు కుటుంబాన్ని దూషించారు. ఈ బూతు పురాణాన్ని తట్టుకోలేక సదరు కుటుంబం ఫోన్ కట్ చేస్తున్నా, పదే పదే చేస్తూ బెదిరింపులకు దిగారు. కావలి పట్టణంలోని పలు వార్డులతో పాటు అల్లూరు, బోగోలు, దగదర్తి మండలాల్లోనూ ఇదే పరిస్థితి సాగుతోంది. తమ వద్ద డబ్బులు తీసుకొని ఓట్లను పక్కాగా ఫ్యాన్ గుర్తుకే వేశారని ఆరోపిస్తూ ఇళ్ల ముందుకొచ్చి రంకెలేస్తున్నారు. కాగా ఆడియో వైరల్ కావడంతో కావ్య వర్గం కాస్త వెనక్కి తగ్గింది. కావలిలో కావ్య అనుచరుల అరాచకం ఓటర్లకు బెదిరింపులు -
బీసీజీ వ్యాక్సిన్తో బహుళ ప్రయోజనాలు
కొడవలూరు: పెద్దల బీసీజీ వ్యాక్సిన్తో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఏడీఎంహెచ్ఓ బ్రిజిత పేర్కొన్నారు. నార్తురాజుపాళెంలో బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. 60 ఏళ్లుపైబడిన వారు బీసీజీ వ్యాక్సిన్ను విధిగా వేయించుకోవాలని కోరారు. దీని వల్ల క్షయ రాకుండా ఉండటంతో పాటు బీపీ, షుగర్ అదుపులో ఉంటాయని చెప్పారు. షుగర్ బాధితులై 18 నుంచి 60 ఏళ్లలోపు వారు వ్యాక్సిన్ను వేయించుకోవచ్చని తెలిపారు. పీహెచ్సీల ద్వారా వ్యాక్సిన్ను ప్రతి గురువారం వేయనున్నారని వివరించారు. కొడవలూరు పీహెచ్సీ వైద్యాధికారి రామకృష్ణ, సీహెచ్ఓ సోమశేఖర్, ఎమ్మెల్హెచ్పీలు సరోజ, స్నేహ, ఏఎన్ఎం దీనమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కాయ్.. రాజా.. కాయ్
కోవూరు: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీకి సిద్ధిస్తుందనే అంశంపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. పోలింగ్ శాతం పెరగడం.. విజయంపై ఇరు పార్టీ లు ధీమా వ్యక్తం చేస్తుండటంతో పందెంరాయుళ్లు రంగంలోకి దిగారు. పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లోనూ బెట్టింగ్లు తారస్థాయిలో నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏయే జిల్లాల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు పోలయ్యాయనే అంశంపై ఇప్పటికే పలువురు ఆరాతీశారు. ఈ తరుణంలో ఎవరి అంచనాలతో వారు పందేలను కాస్తున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకంటే మరోసారి సీఎం ఎవరవుతారనే అంశంపైనే బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. పందేల్లో కొత్త పోకడ కొన్ని చోట్ల రూ.లక్షలు.. అక్కడక్కడా రూ.కోట్లల్లో పందేలు కాస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా భూములనే పణంగా పెడుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక తేడాలు రాకుండా అగ్రిమెంట్లను ముందస్తుగానే చేసుకుంటున్నారు. కోవూరు నియోజకవర్గంలో రూ.ఐదు లక్షల నుంచి రూ.50 లక్షల వరకు బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఇక్కడి ఓ గ్రామంలో వైఎస్సార్సీపీ.. కూటమి నేతలు తమ పంట పొలాలను పెట్టి పందెం కాశారు. ఈ మేరకు సాక్ష్యుల సమక్షంలో స్టాంప్ పేపర్లపై ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. కావలి, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరిలోనూ ఇదే తంతు నడుస్తోంది. మరోవైపు ఎన్నికలకు ముందు వరకు పందేల్లో ముందున్న కూటమి శ్రేణులు.. పోలింగ్ తర్వాత వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో గెలుపుపై ధీమాతో ఉన్న వైఎస్సార్సీపీ అభిమానులు మాత్రం దూకుడుగా ఉన్నారు. ఎన్నికల్లో విజయంపై జోరుగా పందేలు లక్షల నుంచి కోట్లల్లో బెట్టింగ్లు కొన్ని చోట్ల భూములను సైతం.. తేడా రాకుండా ముందుగానే అగ్రిమెంట్లు -
దిగజారిన నిమ్మ ధరలు
● పెరిగిన దిగుబడి పొదలకూరు: వేసవిలోనూ నిమ్మధరలు దిగజారాయి. వాతావరణం చల్లబడటం.. తోటల్లో దిగుబడులు పెరగడంతో ధరలు పతమవుతున్నాయని వ్యాపారులు తెలిపారు. ఇప్పటి వరకు గిట్టుబాటు ధరలకు ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే నాలుగు రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని రైతులు చెప్తున్నారు. మరింత తగ్గేందుకు అవకాశం మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ.30 నుంచి రూ.85 వరకు ప్రస్తుతం పలుకుతున్నాయి. వేసవి తాపం తగ్గే కొద్దీ కాయల ధరలు మరింత పడిపోయే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది నిమ్మ రైతులు ఆశించిన స్థాయిలో లాభాలను ఆర్జించలేకపోయారు. ధరలున్న సమయంలో దిగుబడి లేకపోవడం.. ధరలు పడిపోయిన వేళ దిగు బడి పెరగడం రైతులకు ఇబ్బందిగా మారింది. బయటి ప్రాంతాల్లో నిమ్మకాయల దిగుబడి పెరగడం.. వాతావరణం అనుకూలించకపోవడంతో డిమాండ్ లేకుండా పోయిందని వ్యాపారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ విస్తారంగా సాగు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలోని బిజాపూర్లోనూ నిమ్మ సాగు విస్తారంగా ఉంది. రాష్ట్రంలోని ఏలూరు, తెనాలి తదితర ప్రాంతాల నుంచి కాయల ఎగుమతి పెరిగింది. దీంతో ఢిల్లీ మార్కెట్కు ఎగుమతులు ఎక్కువయ్యాయి. ఉత్తరాదిలో అడపాదడపా కురుస్తున్న వర్షాలతో నిమ్మ వాడకం తగ్గిపోయింది. ఫలితంగా నిమ్మ ధరలు దిగజారుతున్నాయి. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద అప్రమత్తత అవసరం
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ నెల్లూరు(దర్గామిట్ట): ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ ఆదేశించారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని కనుపర్తిపాడులో గల ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ను గురువారం ఆయన పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు వీక్షించేందుకు వీలుగా సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను మానిటరింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఏర్పాట్ల పరిశీలన నెల్లూరు(బారకాసు): కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను నెల్లూరు సిటీ నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ వికాస్ మర్మత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను ఈ కేంద్రం ద్వారా ప్రకటించనున్నామని తెలిపారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత
● ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. గురువారం ఆయన కళాశాలలోని స్ట్రాంగ్రూమ్ల వద్ద భద్రతా చర్యలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్ట్రాంగ్రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతతోపాటు నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశామన్నారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు, మూడో అంచెలో స్థానిక పోలీసులు 24 గంటలపాటు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారన్నారు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టామన్నారు. భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏఆర్ ఏఎస్పీ శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ఎస్బీ, నెల్లూరు రూరల్, సంతపేట ఇన్స్పెక్టర్లు కె.రామకృష్ణారెడ్డి, మారుతీకృష్ణ, ఎ.సుబ్బరాజు, ఆర్ఐ అంకమరావు తదితరులున్నారు. -
టీబీ వ్యాక్సినేషన్ను విజయవంతం చేద్దాం
● డీఎంహెచ్ఓ పెంచలయ్య నెల్లూరు(అర్బన్): వయోజనులకు తొలిసారిగా వేస్తున్న టీబీ వ్యాక్సినేషన్ను విజయవంతం చేద్దామని డీఎంహెచ్ఓ పెంచలయ్య, జిల్లా టీబీ నివారణ అధికారి ఖాదర్వలీ పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలతోపాటు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంపిక చేసిన వారికి టీబీ నివారణకు ముందస్తు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ప్రారంభమైంది. గురువారం నెల్లూరు వెంగళరావు నగర్ – ఎన్బీటీ కాలనీలోని పట్టణ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎంహెచ్ఓ, క్షయ నివారణ అధికారి మాట్లాడారు. మధుమేహం ఉన్నవారికి, పొగతాగే వారికి, 60 ఏళ్లు నిండిన వారికి, ఊబకాయులకు, టీబీకి గురైన వారికి, వారి ఇంటి సభ్యులకు తొలిదశలో ఈ వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ను మూడు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
19 నుంచి పెంచలకోనలో బ్రహ్మోత్సవాలు
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 19న శ్రీవారి ఉత్సవమూర్తులు గోనుపల్లినుంచి పెంచలకోనకు చేరుకుంటారు. రాత్రి అంకురార్పణ, 20న ఉదయం 9.36 గంటలకు ధ్వజారోహణ, సాయంత్రం ఐదు గంటలకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం, 6 గంటలకు సహస్రదీపాలంకరణ సేవ, 9 గంటలకు శేషవాహనసేవ, 21న ఉదయం 8 గంటలకు హంస వాహనసేవ, 11.30కు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు సహస్రదీపాలంకరణసేవ, రాత్రి 10 గంటలకు బంగారు హనుమంతసేవ, 22న ఉదయం 8 గంటలకు సింహ వాహనసేవ, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణసేవ, రాత్రి 11 గంటలకు బంగారు గరుడవాహన సేవ, 23న ఉదయం 9.30 గంటలకు కల్యాణం, సాయంత్రం 6 గంటలకు రఽథోత్సవం, రాత్రి 9 గంటలకు గజవాహనసేవ, 24న ఉదయం 9 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకు తెపోత్సవం, రాత్రి 9 గంటలకు అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. 25న స్వామి, అమ్మవార్లు గొనుపల్లికి చేరుకుంటారు. అక్కడ క్షేత్రోత్సం నిర్వహిస్తారు. జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంపొదలకూరు: పట్టణంలో ఫ్రెండ్స్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఆర్గనైజర్ మన్నవరపు రవికుమార్ యాదవ్ ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ బహుమతుల కింద రూ.20 వేలు, రూ.10 వేలు నగదును అందజేయడం జరుగుతుంది. 16 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ బహుమతులను పలుకూరు మురళీరెడ్డి, వెడిచర్ల లీలావతి జ్ఞాపకార్ధం వెడిచర్ల మురళి అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, ఆల్రౌండర్ బహుమతులు కూడా ఉంటాయన్నారు. పిడుగుపడి ఎనిమిది మేకలు మృతిఅనుమసముద్రంపేట: పిడుగుపడి ఎనిమిది మేకలు మృతిచెందాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని చౌటభీమవరం గ్రామానికి చెందిన రైతులు కృష్ణయ్య, హజరత్తయ్య, చిన్నయ్య గురువారం తమ మేకలను మేత నిమిత్తం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వారు తమ జీవాలను చెట్టు కిందకు తోలారు. ఈ సమయంలో పిడుగుపడి ఎనిమిది మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. వాటి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. పాపం మూగజీవాలు ● విద్యుదాఘాతానికి గురై గేదెలు మృతి సీతారామపురం: మండలంలోని పబ్బులేటిపల్లి గ్రామంలో గురువారం మద్దినేని రమణయ్య అనే వ్యక్తికి చెందిన రెండు గేదెలు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాయి. బాధితుడి కథనం మేరకు.. బుధవారం తోటలో విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. ఈ ఆ విషయాన్ని రమణయ్య విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేసినా వారు పట్టించుకోలేదు. గురువారం ఉదయం మేతకు వెళ్లిన గేదెలకు తెగిపడిన విద్యుత్ తీగలడంతో మృతిచెందాయి. వాటి విలువ రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. విద్యుత్ సిబ్బంది సకాలంలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి వీడాలని కోరుతున్నారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.85 సన్నవి : రూ.35 పండ్లు : రూ.25 -
అధిక రక్తపోటు.. తెస్తుంది చేటు
నెల్లూరు(అర్బన్): బీపీ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. జిల్లా జనాభాలో సుమారు 5 లక్షల మంది ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు అంచనా. ప్రభుత్వం ఆదేశాలతో గత నెల వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పీహెచ్సీల పరిధిలో స్క్రీనింగ్ చేయించగా అందులో 1,01,172 మంది అధిక బీపీతో ఉన్నట్లు తెలిసింది. వీరే కాకుండా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఆత్మకూరు జిల్లా ఆస్పత్రి, కావలి, కందుకూరు ఏరియా ఆస్పత్రి, కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్ల పరిధిలో కలిపితే మరో 4 లక్షల మంది వరకు రోగులున్నారు. వీరిలో చాలామంది అధిక రక్తపోటును నియంత్రించేందుకు మందులు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం మంది రోగులున్నారు. నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు లాంటి పట్టణాల్లో సుమారు 20 శాతం మందికి పైగా బీపీతో బాధపడుతున్నారని అధికారుల అంచనా. కారణాలివి.. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులు, వ్యాపారస్తులు నిత్యం పనిఒత్తిడిలో టెన్షన్ పడుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు తమ లక్ష్యాలను సాధించేందుకు అదనంగా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో సరైన నిద్రలేకపోవడంతోపాటు పనిఒత్తిడిలో జీవనం సాగిస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, స్థూలకాయం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, నిద్రలేమి ఇవన్నీ హైబీపీకి కారణాలుగా మారాయి. అధిక ఉప్పుతో కూడిన కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం మరొక కారణం. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. దీనిని మెడికల్ పరిభాషలో హైపర్టెన్షన్గా పేర్కొంటారు. ఆహారపు అలవాట్లు, పనిఒత్తిడి, ఆందోళన తదితర కారణాలతో వచ్చే బీపీ విషయంలో నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ చాలామంది బీపీని పట్టించుకోరు. దీంతో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటుంటారు. అధిక రక్తపోటు (బీపీ) పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బీపీని నియంత్రణలో ఉంచుకుంటే మనిషి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా నిర్లక్ష్యం వహించి సక్రమంగా మందులు వాడకపోతే ప్రమాదానికి దారి తీయొచ్చు. బీపీ నియంత్రణకు మందులుతోపాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లున్నాయి. తక్కువ ఖర్చుతోనే అదుపులో ఉంచుకోవచ్చు. సరైన వ్యాయామం, ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవడం, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. బీపీ ఉన్న వారు క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. నేడు వరల్డ్ హైపర్టెన్షన్ డే నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు అవగాహన, జాగ్రత్తలతో బీపీకి చెక్ జిల్లాలో 20 శాతం మంది బీపీ రోగులు -
పాలవ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
● న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన కందుకూరు: పాలవ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో తీవ్రగాయాలైన ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మహదేవపురం శ్రీనివాసకాలనీకి చెందిన కె.కిశోర్ (21) బుధవారం సింగరాయకొండ నుంచి మోటార్బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో కందుకూరు నుంచి మహదేవపురం వైపు పాలవ్యాన్ వెళ్తోంది. మహదేవపురం అడ్డరోడ్డు వద్ద అది బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కిశోర్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. తర్వాత కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బంధువులు రాత్రి ఒంగోలు రిమ్స్కు తరలించారు. పరిస్థితి మరింత విషమించి కిశోర్ మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన పాలవ్యాన్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు గురువారం ఉదయం ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని డీఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చి డ్రైవర్ను అరెస్ట్ చేయాలని, తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ నఫీజ్బాషా ఆందోళన కారులకు సర్దిచెప్పారు. ప్రమాదానికి కారణమైన పాలవ్యాన్ డ్రైవర్ను ఇప్పటికే అరెస్ట్ చేశామని, అతడిని కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, కచ్చితంగా పోలీస్ పరంగా అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు తమ ఆందోళనను విరమించారు. -
నిర్లక్ష్యంగా ఉంటే..
బీపీని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి తీవ్ర హానికరం. నియంత్రించకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. పక్షవాతం ఏర్పడవచ్చు. కిడ్నీలు దెబ్బతింటాయి. లివర్ పాడవుతుంది. హైబీపీ మెదడుపై ప్రభావం చూపి జ్ఞాపకశక్తి తగ్గిపోవడం జరుగుతుంది. అవగాహన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2006 నుంచి మేనెల 17వ తేదీని వరల్డ్ హైపర్టెన్షన్ డేగా ప్రకటించి అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోనూ బీపీపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
డెంగీ నివారణ అందరి బాధ్యత
నెల్లూరు(అర్బన్): డెంగీని నివారించడం అందరి బాధ్యత అని డీఎంహెచ్ఓ పెంచలయ్య పేర్కొన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయం నుంచి సంతపేటలోని బీఈడీ కళాశాల వరకు అవగాహన ర్యాలీని వైద్యాధికారులు, సిబ్బంది గురువారం నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దోమ కాటుతో డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్గున్యా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. వీటికి దూరంగా ఉండేందుకు దోమలను నియంత్రించాలని కోరారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ, డెమో అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ పరీక్షలకు 813 మంది గైర్హాజరు వెంకటాచలం: విక్రమ సింహపురి వర్సిటీ (వీఎస్యూ) పరిధిలోని అనుబంధ కళాశాలల్లో గురువారం నిర్వహించిన డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలకు 813 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణాధికారి డాక్టర్ మధుమతి ఒక ప్రకటనలో తెలిపారు. 8958 మందికి గానూ 8145 మంది హాజరయ్యారని చెప్పారు. ఈఏపీసెట్ ప్రారంభం నెల్లూరు(అర్బన్): ఇంజినీరింగ్, కొన్ని రకాల వైద్య కోర్సులు, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీసెట్ జిల్లాలో ప్రశాంతంగా గురువారం ప్రారంభమైంది. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యా హ్నం 12 వరకు.. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకున్నారు. మెటల్ డిటెక్టర్తో క్షుణ్ణంగా పరిశీలించాకే విద్యార్థులను లోపలికి అనుమతించారు. కాగా ఈఏపీసెట్కు జిల్లాలో 16 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక నేడు నెల్లూరు(స్టోన్హౌస్పేట): విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్న బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే బాలబాలికల జిల్లా జట్లను శుక్రవారం ఎంపిక చేయనున్నామని బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గాదం వాసు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వీఆర్ హైస్కూల్ గ్రౌండ్స్లో సాయంత్రం ఐదు గంటలకు ప్రక్రియను నిర్వహించనున్నామని వివరించారు. 2008, జనవరి ఒకటి తర్వాత జన్మించిన వారు అర్హులని, వయస్సుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 94408 79884 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కరెన్సీ కౌంటింగ్ యంత్రం విరాళం తిరుమల: తిరుమలలోని వేంకటేశ్వరస్వామివారి పరకామణికి రూ.9.33 లక్షల విలువైన కరెన్సీ కౌంటింగ్ యంత్రాన్ని విరాళంగా గురువారం అందజేశారు. నెల్లూరుకు చెందిన కాకులూరు వసంతకుమార్, కర్పగవల్లి దంపతులు ఈ యంత్రాన్ని పరకామణి డిప్యూటీ ఈఓ మల్లికార్జునకు అందజేశారు. దాతలను టీటీడీ అధికారులు అభినందించి, శ్రీవారి ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. జాయింట్ – 2 సబ్ రిజిస్ట్రార్గా జాఫర్ నెల్లూరు సిటీ: నెల్లూరు ప్రధాన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కార్యాలయంలో జాయింట్ – 2 సబ్ రిజిస్ట్రార్గా జాఫర్ను డిప్యుటేషన్పై నియమిస్తూ అధికారులు ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. జాయింట్ – 2 సబ్ రిజి స్ట్రార్గా పనిచేస్తున్న సంజయ్కుమార్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఈ క్రమంలో ముత్తుకూరు సబ్ రిజిస్ట్రార్ జాఫర్ ఇక్కడ నియమితులయ్యారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement