-
ప్రాణదానం
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం పరిధిలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో ఆదివా రం మరోసారి అవయవదానం జరిగింది. దీనికి సంబంధించిన వివరాల ను జెమ్స్ వైద్యులు స్థానిక విలేకరులకు తెలియజేశారు. ఈ నెల 16వ తేదీన కళింగపట్నంలో గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు ఉద్యోగం చేస్తున్న పప్పు సుశీల(30) విధు లు ముగించుకుని శ్రీకాకుళం వస్తుండగా తూలుగు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే రిమ్స్కు తరలించారు. అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి చేరుకుంది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వెంటిలేటర్పై చికిత్స పొందినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయ్యిందని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు తమ కుమార్తె అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆ ప్రక్రియ పూర్తి చేసి కిడ్నీ, లివర్లను విశాఖపట్నం తరలించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లిదండ్రులు గోవిందరావు, జ్యోతిలు మాట్లాడుతూ తమ కుమార్తె అవయవాలను వేరొకరిలో చూసుకుంటామని కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు. మృతదేహానికి జెమ్స్ వైద్య సిబ్బంది, విద్యార్థులు కలిసి అధికార లాంఛనాలతో నివాళులు అర్పించారు. -
రూ.10 లక్షలతో ఉడాయింపు
పోలీసులమని చెప్పి సారవకోట: మండలంలోని ధర్మలక్ష్మిపురం గ్రామానికి సమీపంలో శనివారం కొందరు పోలీసులమని నమ్మించి రూ.10 లక్షలతో ఉడాయించారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ విశాఖపట్నంలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఒడిశాకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తితో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. సారవకోట మండలంలోని బొంతు, ధర్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం భూమి కొనుగోలు చేస్తే భవిష్యత్లో మంచి ధర పలుకుతుందని శ్రీధర్ నమ్మబలికారు. శ్రీధర్ చెప్పిన మాటలను నమ్మిన మణికంఠ తనతో పాటు మరో ఇద్దరు కలసి శనివారం ధర్మలక్ష్మిపురం గ్రామ సమీపానికి రూ.10 లక్షలు నగదు పట్టుకుని వచ్చి శ్రీధర్కు ఫోన్ చేశారు. తాము ధర్మలక్ష్మీపురం గ్రామానికి సమీపంలో నిరీక్షిస్తున్నామని చెప్పడంతో శ్రీధర్ తనతో మరో ఇద్దరిని పట్టుకుని వచ్చాడు. కాసేపటికి పాతపట్నం నుంచి మహేంద్ర వాహనంలో కొంతమంది వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని, ఎన్నికల సమయంలో ఇంత నగదు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించి, ఈ నగదును డీఎస్పీ కార్యాలయానికి అప్పగిస్తామని చె ప్పి నగదును తీసుకుని వెళ్లడంతో పాటు శ్రీధర్ను, శ్రీధర్తో పాటు వచ్చిన మరో ఇద్దరిని కూడా కారు లో తీసుకుని వెళ్లారు. అనంతరం మణికంఠ జరిగిన దానిపై ఆరా తీసుకుని డీఎస్పీ కార్యాలయం వివరా ల కోసం శ్రీధర్కు ఫోన్ చేయగా శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో తాము మోసపోయామని గ్రహించి సారవకోట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
దాడులు సహించబోము
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జలుమూరు: వైఎస్సార్ సీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూసి ఓర్వలేని టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వీటిని సహించబోమని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన ఆది వారం మండల పరిధిలోని లింగాలవలస, అంధవ రం పంచాయతీల్లో బుక్కా లక్ష్మణరావు, సవలాపురపు రాములను పరామర్శించి మాట్లాడారు. ప్రజలు ధర్మం వైపు ఉన్నారని, రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంధవరంలో వైఎస్సార్సీపీకి ఉదయం నుంచి ప్రజలు అంతా ఓట్లు వేస్తున్నారని గ్రహించిన టీడీపీ నాయకులు సవలాపురపు రాముపై దాడిచేసిన సంగతి తెలిసిందే. లింగాలువలసలో కూడా తోపులాట జరిగింది. బాధి తులను పరామర్శించిన వారిలో ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం, సచివాలయ కన్వీనర్ ధర్మాన జగన్, అల్లాడ, చల్లవానిపేట సొసైటీ అధ్యక్షులు ఎం.శ్యామలరావు,పి.రాజప్పలనాయుడు, రేగాన శ్యామ్, ఆదిబాబు, గోవిందరావు తదితరులు ఉన్నారు. -
సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి
కొత్తూరు: కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ నేత పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్క కామ్రేడ్ కృషి చేయాలని సీపీఎం జిల్లా నాయకులు గంగరాపు సింహాచలం పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని కొత్తూరులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి గంగరాపు సింహాచలం సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సిర్ల ప్రసాద్తో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగరాపు సింహచలం, సిర్ల ప్రసాద్లతో పాటు పలువురు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో సుందరయ్య కీలక పాత్ర పోషించినట్లు చెప్పా రు. భారత పార్లమెంట్లో మొదటి ప్రతి పక్షనేతగా వ్యవహరించిన సుందరయ్య బడుగ, బలహీన వర్గాల కోసం రాజీ లేని పోరాటాలు చేసినట్లు చెప్పా రు. కార్యక్రమంలో సీపీఎం నేతలు నిమ్మక అప్పన్న, పి.కృష్ణ, సింహాచలంతో పాటు పలువురు పాల్గొన్నారు. -
చేపల వ్యర్థాలతో మీనామృతం
ఇచ్ఛాపురం రూరల్: ఆకుచుట్టి తినే పురుగును పూర్తిగా అరికట్టే సామర్థ్యం చేపల వ్యర్థాలతో చేసే మీనామృతం ద్రావణానికి ఉందని ఐసీఆర్పీ కందా ల కుమారి అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో భా గంగా ఆదివారం పాయితారి పంచాయతీలో చేపల వ్యర్థాలతో మీనామృతం తయారీ విధానంపై స్థానిక రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక క్రిమిసంహార కారకాలకు దీటైన లేదా పోల్చదగిన ప్రత్యామ్నాయం చేప ద్రావణమ ని అన్నారు. చేప కషాయం, చేప అమైనో ఆమ్లాలు ఉద్యానవన పంటల్లో చీడపీడల యాజమాన్యంలోనూ, పోషకాలను, వృద్ధి కారకాలను అందించడంలోనూ, భూసారాన్ని పెంపొందించడంలో రైతులకు ప్రయోజనకారిగా ఉంటాయని అన్నారు. -
వ్యక్తి ప్రాణాలు కాపాడిన సత్యసాయి భక్తులు
కాశీబుగ్గ: ఉద్దాన ప్రాంతం గుడ్డిబద్ర గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో సత్యసాయి బాబా భక్తులు ఆయన ప్రాణా లు కాపాడారు. పలాస మండలం రామకృష్ణాపురం శ్రీసత్యసాయి విద్యావిహార్ వారి సహకారంతో అందిస్తున్న అత్యవసర సేవల్లో భాగంగా ఆదివారం గుడ్డిభద్ర గ్రామం చేరుకుని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్తో కృత్రిమ ఆక్సిజన్ అందించారు. కృత్రిమ శ్వాస ఉచితంగా అవసరం ఉన్నవారు సత్యసాయి భక్తులను సంప్రదించాలని కోరారు. మెడలో ఆభరణాలు చోరీ బూర్జ: మండలంలో గల ఉప్పినివలస పంచాయతీ ఏబీసీ పేట గ్రామంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గంగాడ రాజు అనే మహిళ మెడలో ఉన్న దాదాపు రెండు తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. పుస్తెలతాడు, శతమానం, పుస్తెలు, ఆంజనేయ స్వామి బిళ్ల చోరీ చేశారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజు భర్త రమణ రజక వృత్తితో పాటు కూలి పనులు చేస్తుంటారు. శనివారం సాయంత్రం ఆయన ఆమదాలవలస వెళ్లారు. వీరికి కొడుకు వర్ధన్, కూతురు పుష్పలత ఉన్నారు. రాత్రి భోజనం తర్వాత కొడుకు వర్ధన్ ఇంటి మేడ మీద పడుకున్నాడు. తల్లి రాజు ఇంటిలోనే నిద్రపోయారు. కొడుకు వస్తాడని తలుపులు వేయలేదు. అర్ధరాత్రి మెలకువ వచ్చి చూసే సరికి ఆమె మెడలో బంగారు ఆభరణాలు కనిపించలేదు. గట్టిగా కేకలు వేసి చూస్తే ఎవరూ లేరు. కొడుకును పిలిచి వెతికినా ఎవరూ కనిపించలేదు. విషయం భర్తకు చెప్పగా ఆయన ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్చార్జి ఎస్ఐ–2 ఐ.నాగరాజు కేసు నమోదు చేపి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్యాణం.. కమనీయం
గార: శ్రీకూర్మనాథుని కల్యాణోత్సవం ఆదివారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరిగిన ఈ కల్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరించారు. ముందుగా స్వామి కల్యాణమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలకు వేర్వేరు వాహనాల్లో తిరువీధి నిర్వహించారు. మత్స్యనారాయణ ఆలయం సమీపంలో పెళ్లి చూపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా స్వామివారు, అమ్మవార్ల గుణగణాలను, వధువు, వరుడు వర్గా లు విడిపోయిన వైదికులు సందర్భోచితంగా, భావయుక్తంగా కీర్తనల రూపంలో ఆలపించారు. ఈ కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. ఆస్థాన మంటపంలో అలంకరించిన వేదికపై కల్యాణమూర్తులను వేంచింపచేసి కల్యాణ ఘట్టాన్ని పండితులు ప్రారంభించారు. ఆలయ ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు, దాసుబా బు, శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, కిశోర్బాబుల తో పాటు వేదపండితుల వేదమంత్రాల నడుమ కల్యాణోత్సవం జరిగింది. తొలుత విశ్వక్షేన పూజ, కంకణధారణ, కన్యాదానం, సుముహుర్తాన బెల్లంతో కలిపిన జీలకర్ర ధారణ జరిగింది. అనంతరం మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు, మంగళహారతి ఘట్టాలు కమనీయంగా జరిగాయి. ఆలయ ఈఓ జి. గురునాథం, ఎంపీపీ గొండు రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు సన్నద్ధం
శ్రీకాకుళంభక్తజన జాతరఅరసవల్లి భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇసకేస్తే రాలనంత మంది జనం వచ్చారు. –8లోసోమవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2024విత్తనాలు.. ఎకరాకు ఇలా వరి సన్న రకాలు 25 కిలోలు సరిపడగా, ముదుగ రకాలు 30 కిలోలు, మొక్కజొన్న హైబ్రిడ్ 8 కిలోలు, పత్తి 1 కిలో, పెసర 16 కిలోలు, జీలుగు 12 కిలోలు చొప్పున అవసరం ఉంటాయి. దీని కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ● ఖరీఫ్కు సిద్ధమవుతున్న రైతులు, వ్యవసాయశాఖ అధికారులు ● 1.60లక్షల హెక్టార్లలో వరిసాగు ● గతం కంటే పెరగనున్న సాగు విస్తీర్ణం ● ఆర్బీకేల్లో అందుబాటులో విత్తనాలు, ఎరువులు ● అన్నిరకాల పంటలు 1.75లక్షల హెక్టార్లలో సాగు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): తొలకరి ముందస్తు పలకరింపు సూచనలు కనిపిస్తుండడంతో రైతులు సేద్యానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది తొలకరి ముందే పలకరిస్తుందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులకు రైతులు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వ్యవసాయానికి నెల రోజులు ముందుగానే అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలోనికి వంశధార, నాగావళి, మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల కాలువలు శుభ్రంగా తయారు చేసుకుని శివారు ఆయకట్టుకి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది అన్ని పంటలు కలిపి 1.75లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశా రు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్బీకేలు, విత్తన కేంద్రాల్లో విత్తనా లు, ఎరువులు సరఫరా చేసేందుకు ఇప్పటికే తగినన్ని సిద్ధం చేశారు. ఇప్పటికే నరసన్నపేట, పలాస, రాజాం, పాలకొండ, ఆమదాలవల సల్లో హబ్స్తో పాటు ఏపీ సీడ్స్ గోదాంలలో విత్త నాలు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటిని రైతు భరో సా కేంద్రాల నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయానికి పెట్టుబడి రుణాలు అందించేందుకు బ్యాంకర్లతో కలెక్టర్ మాట్లాడి రుణాలు అందించనున్నారు. జూన్ మొదటివారం నుంచే పనులు ప్రారంభం కానుండడంతో ఈ నెల నుంచే రైతులు వ్యవసాయం పను లకు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు, ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పొలం సత్తువ పెంచేందుకుగాను పచ్చిరొట్ట విత్తనాలు 50శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. గిరిజన మండలాలు పాతపట్నం, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి, మందసలలో గిరిజనులకు 90శాతం రాయితీపై విత్తనాలు అందించనున్నారు. గిరిజనులకు 2220 క్వింటాళ్లు విత్తనాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. విత్తనాలు అంచనా (క్వింటాళ్లలో) రకం క్వింటాళ్లు బీపీటీ–5204 4745 బీపీటీ–3291 760 ఎంటీయూ–7029 3993 ఎంటీయూ–1061 9903 ఎంటీయూ–1224 2387 ఎంటీయూ–1121 7683 ఎంటీయూ–1064 3273 ఎంటీయూ–1318 909 ఆర్జీఎల్–2537 2661 మొత్తం 36314 సిద్ధం చేసిన ఎరువులు ఎరువు పేరు మెట్రిక్ టన్నులు యూరియా 15,157 కాంప్లెక్స్ 1,531 ఎంఓపీ 571 డీఏపీ 5202 ఎస్ఎస్పి 143 ఈ ఏడాది సాగు లక్ష్యాలు(హెక్టార్లలో) పంట అంచనా వరి 1.60లక్షల మొక్కజొన్న 10,550 పత్తి 1848 చెరుకు 1820 వేరుశనగ 533 ఎకరాకు కావాల్సిన ఎరువు యూరియా 72కిలోలు కాంప్లెక్స్ 50 ఎంఓపీ 60 డీఏపీ 50 ఎస్ఎస్పీ 110 న్యూస్రీల్ రైతు సేవకు సిద్ధం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు ముందే తొలకరి పలకరించనుంది. విత్తనాలు, ఎరువు లు, పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుభరో సా కేంద్రాల నుంచే అందించనున్నాం. జిల్లాలో కలెక్టర్ చొరవతో వంశధార, నాగావళి నదీ జలాలు రైతులకు అవసరమైనంతంగా అందించేందుకు కావాల్సిన పనులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీచేసి ఉన్నారు. ఈ ఏడాది గత ఏడాది కన్నా వరి, పత్తి సాగు విస్తీర్ణం పెంచుతున్నాం. గిరిజనులకు 90శాతం రాయితీపై విత్తనాలు అందించనున్నాం. – కె.శ్రీధర్, జిల్లా వ్యవసాయాధికారి, శ్రీకాకుళం -
నేడు తత్కాల్ స్కీమ్ ద్వారా ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు
శ్రీకాకుళం న్యూకాలనీ: వివిధ కారణాలతో ఇంట ర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజులను చెల్లించలేని విద్యార్థులకు ప్రభుత్వం ఆఖరి అవకాశాన్ని అందించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ మార్కులను పెంచుకునేందుకు/ఉత్తీర్ణత కాని సబ్జెక్టుల్లో పరీక్ష రాసేందుకు తత్కాల్ స్కీమ్ కింద నేడు ఒక్కరోజు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఈ తత్కాల్ స్కీమ్ కింద మీసేవ/ఈసేవ ఆన్లైన్లో రూ.3వేల అపరాధ రుసుంతోపాటు పరీక్ష ఫీజులను యథావిధిగా చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్బోర్డు స్పష్టంచేసింది. ఇంకా పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు చొరవ తీసుకుని వంద శాతం ఫీజులు చెల్లించేలా చూడాలని ఆయన కోరారు. -
టీడీపీ మూకల మృత్యుదాహం
● టీడీపీ కార్యకర్తల చేతిలో దాడికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త మల్లేష్ మృతి ● మల్లేష్ కుమారుడు వైఎస్సార్సీపీ పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్నాడనే కక్షతో దాడి ● గ్రామదేవత పండగను ఆసరాగా చేసుకున్న టీడీపీ కార్యకర్తలు ● నిమ్మాడలో అడ్డూ అదుపు లేని అచ్చెన్న, ఆయన సోదరుడు హరివరప్రసాద్ దాష్టీకాలు వైఎస్సార్సీపీ కార్యకర్త మల్లేష్ మృతి, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన హత్యేనని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఓ ప్రకటనలో మండిపడ్డారు. సుమారు 40 ఏళ్లుగా నిమ్మా డ పంచాయతీలో శాంతియుతంగా ఎన్నికలు జరగలేదని ఈ సారి ఎన్నికల్లో రిగ్గింగ్లకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో అచ్చెన్నాయుడుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో చిన్నవెంకటాపురంలో పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించిన వైఎస్సార్సీపీ కార్యకర్త మాధవరావు తండ్రిపై దాడికి పాల్పడి హత్య చేశారని ఆయన దుయ్యబట్టారు. నిమ్మాడ పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ తరఫున బూత్ ఏజెంట్గా వ్యవహరించిన కింజరాపు అప్పన్నను చంపే స్తామని బెదిరించారని దువ్వాడ ఆరోపించా రు. మల్లేష్ మృతికి బాధ్యులుగా అచ్చెన్నా యుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్తో పాటు టీడీపీ వర్గీయులను అరెస్టు చేయాలని దువ్వాడ డిమాండ్ చేశారు. కింజరాపు కుటుంబం నియంత పాలనకు నిదర్శనంగా ఉన్న నిమ్మాడ పంచాయతీలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే కక్షతో వైఎస్సార్సీపీ కార్యకర్త తోట మల్లే ష్ను ఘోరంగా చంపేశారని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ నేతృత్వంలో టీడీపీ వర్గీయులు పక్కా పథకం వేసి మల్లేష్పై దాడి చేసి హత్య చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి అచ్చెన్నాయుడుతో పాటు ఆయన సోదరుడు హరివరప్రసాద్, దాడికి పాల్పడిన టీడీపీ వర్గీయులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. టెక్కలి: టీడీపీ మూకల మృత్యుదాహానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. కింజరాపు కుటుంబం దశాబ్దాలుగా సాగిస్తున్న దాష్టీకానికి నిదర్శనంగా మరో మనిషి ప్రాణం పోయింది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ చిన్నవెంకటాపురానికి చెందిన తోట మల్లేష్పై ఇటీవల టీడీపీ మూ కలు దాడి చేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజు లు ప్రాణాల కోసం పోరాడిన మల్లేష్ ఆదివారం కన్నుమూశారు. మల్లేష్ కుమారుడు మాధవరావు అక్కడ వైఎస్సార్ సీపీ తరఫున బూత్ ఏజెంట్గా పనిచేశాడు. ఈ కక్షతోనే టీడీపీ కార్యకర్తలు మల్లే ష్పై దాడికి తెగబడ్డారు. కింజరాపు కుటుంబం డైరెక్షన్లోనే.. టెక్కలిలో దశాబ్దాలుగా జరుగుతున్న టీడీపీ కార్యకర్తల ఆగడాలను ఎదురించే వారు లేకపోయారు. అలాంటిది ఈ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలను ఎదురించి మరీ నిలబడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను మట్టుపెట్టాలని ప్లాన్ వేసుకున్నా రు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరివరప్రసాద్ డైరెక్షన్లో ఈ నెల 16న గ్రామదేవత పండగను ఆసరా చేసుకుని వైఎస్సార్సీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ మాధవరావు తండ్రి మల్లేష్పై తీవ్రంగా దాడి చేశారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు పూతి లక్ష్మణరావు, పూతి భానుచందర్, పూతి కర్రెన్న, పూతి రమణ తదితరులు తోట మల్లేష్పై తీవ్రంగా విరుచుకుపడి దాడి చేశారు. దీంతో మల్లేష్ అపస్మారక స్థితికి వెళ్లిపోగా.. కుటుంబ సభ్యులు ముందుగా కోటబొమ్మాళి ఆస్పత్రి, ఆ తర్వాత శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. అక్కడ పరిస్థితి మరింత విషమించడంతో చివరకు విశాఖపట్టణం కేజీహెచ్లో చేర్పించారు. నాలుగు రోజుల పాటు ప్రా ణాల కోసం పోరాటం చేసిన మల్లేష్ తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉండగా చిన్నవెంకటాపురం గ్రామంలో అమ్మవారి ఆలయం వద్ద మొక్కులు చెల్లించే విషయంలో జరిగిన తగాదాలో తోపులాటలో మల్లేష్ కింద పడిపోవడంతో గాయపడ్డాడని, దీని పై ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సంఘటనలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘అచ్చెన్న నేతృత్వంలోనే హత్య జరిగింది’ -
‘వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు వినియోగించుకోండి’
పాతపట్నం: జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పీడీ శేఖర్బాబు అన్నారు. ఆదివారం పాతపట్నం మినీ స్టేడియంలో క్రికెట్, అథ్లెటిక్స్ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. వేసవి సెలవుల్లో చిన్నారులు, యువత కోసం ప్రత్యేక వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామని శేఖర్ తెలిపారు. కార్యక్రమంలో కోచ్ సురేష్, పీఈటీలు లోకేష్, కృష్ణ, క్రీడాకారులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ –2024 (ఏపీ ఈఏపీ సెట్) కొనసాగుతోంది. బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు పూర్తి కాగా, ఈనెల 18 నుంచి ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులు ఒక షిఫ్టులో పరీక్షలు జరిగాయి. నాలు గు పరీక్ష కేంద్రాల్లో ఆదివారం 1036కి 998 మంది హాజరు కాగా, 38 మంది గైర్హాజరయ్యా రు. మొత్తం ఈ నెల 16 నుంచి ఆదివారం వరకు 6,136కి 5,751 మంది హాజరు కాగా, 390 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలు వారీగా ఆదివారం హాజరు పరిశీలిస్తే నరసన్న పేట కోర్ టెక్నాలజీలో 329కి 315, టెక్కలి ఐతంలో 300కి 288, చిలకపాలేంలోని శ్రీ శివానీలో 230కి 224, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్లో 177కి 171 మంది హాజరయ్యారు. హెచ్ఐవీ బాధిత కుటుంబాలను ఆదుకోవాలి కొత్తూరు: హెచ్ఐవీ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వైద్యాధికారి స్నేహ, ఐసీటీసీ కౌన్సిలర్ సీహెచ్ భాస్కరరావు కోరారు. అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్స్ లైట్ స్మారక దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ వల్ల మృతి చెందిన వారిని గుర్తు చేసుకుంటూ ఆదివారం కొత్తూరులో కొవ్వొత్తులతో ర్యాలీని కౌన్సిలర్ భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎయిడ్స్ బారిన పడిన వారు సక్రమంగా మందులు వాడుకోవాలని, హెచ్ఐవీ రాకుండా త గు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ జనార్ధనరావు సీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికులతో కాంప్లెక్స్ కిటకిట శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కిటకిట లాడుతూ కనిపించింది. ఏకాదశి పర్వదినం సందర్భంగా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు దూరప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు, ప్రయాణికులతో ఆర్టీసీ కాంప్లెక్స్ రద్దీగా కనిపించింది. అదేవిధంగా దర్శనానంతరం తిరుగుప్రయాణం కావడంతో కాంప్లెక్స్కు చేరుకున్న ప్రయాణికులు టికెట్ల కోసం నాన్స్టాప్ కౌంటర్ వద్ద బారులు తీరు తూ కనిపించారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు రోజువారీ నడిచే ఆర్టీసీ నాన్స్టాప్ బస్సులతో పాటు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి, శ్రీకాకుళం రెండో డిపో నుంచి అదనంగా బస్సులు నడిపి ప్రయాణికులను తరలించారు. -
నేత్రపర్వంగా వెంకన్న కల్యాణోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: పట్టణంలోని నారాయణ తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ అర్చకులు గురుగుబెల్లి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శ్రీభూనీలా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలతో అలంకరింపచేసి ఆలయ మహామండపంలో ప్రత్యేకంగా పూలతో అలంకరించిన ఆసనంపై కొలువుదీర్చారు. అనంతరం వివా హ వేడుకలను వేదమంత్రాల మధ్య పాంచరాత్ర ఆగమానుసారం నిర్వహించారు. ఎదురుగా భక్తులు కూర్చొని వివాహ వేడుకలను తిలకించారు. స్వామి ఉదయం వజ్రకవచ ధారణలో దర్శనమిచ్చారు. -
అక్రమంగా కంకర తరలిస్తున్న మూడు లారీలు సీజ్
పొందూరు: పొందూరు పైడికొండ 42 సర్వే నంబర్లో అనుమతులు లేకుండా అక్రమంగా కంకర తవ్వి తరలిస్తున్న మూడు టిప్పర్ లారీలను రెవె న్యూ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని బొడ్డేపల్లి వద్ద జరుగుతున్న ట్రాక్ పనుల కోసం కంకరమట్టిని తరలిస్తున్నారు. అయితే ఇందుకు ఎలాంటి అనుమతులను రెవెన్యూ యంత్రాంగం మంజూరు చేయలేదు. పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోగా రశీదు ఇచ్చారు. దీన్నే అనుమతిగా చూపుతూ అక్రమంగా కంకర మట్టిని 10 రోజులుగా భారీగా తరలిస్తున్నా రు. కొద్ది రోజుల కిందట హెచ్చరించినా యథావిధిగా కంకర తరలింపు చేస్తున్నారు. దీంతో శనివారం తహసీల్దార్ కిరణ్పాల్కు ఫిర్యాదు రావడంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బందితో కలిసి దాడి చేసి టిప్పర్ లారీలను పట్టుకొని సీజ్ చేశారు. పైడికొండపై భారీగా తవ్వకాలు జరపడంతో కిందనున్న పంట పొలాలకు వర్షాకాలంతో నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. -
‘లెక్కింపు ముగిసే వరకు ప్రత్యేక నిఘా వేయాలి’
టెక్కలి: సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక నిఘా వేయాలని టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ వెల్లడించారు. పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బందితో ఆదివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇటీవల టెక్కలి నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చిన్న పాటి సంఘటనలు తప్ప మిగిలిన పోలింగ్ ప్రక్రియ ఎంతో ప్రశాంతంగా జరిగిందని, ఈ విషయంలో పోలీసుల సేవలు అభినందనీయమన్నారు. అలాగే లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల వాతావరణం ఉందనే విష యం ప్రజలకు తెలియాలన్నారు. ప్రతి మండలంలో అల్లర్లకు అవకాశం ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే అను మానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు చోటు చేసుకోకుండా ప్రతి రోజు సుమా రు పది గ్రామాల్లో పోలీసులు ప్రత్యేక పహారా నిర్వహించాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో పోస్టల్ బ్యాలెట్ పత్రాలను భద్రపరచిన నేపథ్యంలో ప్రత్యేక నిఘా వేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల అల్లర్లు జరుగుతున్నాయని, టెక్కలి నియోజకవర్గంలో ఎలాంటి అల్లర్లు లేకుండా పోలీస్ సిబ్బంది ప్రత్యేక చొ రవ చూపాలని నూరుల్ కమర్ పేర్కొన్నారు. లెక్కింపు ముగిసే వరకు ఎక్కడా ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా విధులు నిర్వర్తించాలని సబ్ కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ బాలచంద్రారెడ్డి, ట్రైనీ డీఎస్పీ రాజా, సీఐ పైడయ్య, ఎస్ఐలు వెంకటేశ్వర్రావు, సిద్దార్థకుమార్, కిశోర్ వర్మ, డీటీలు అనిల్, రాము, హరి, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని తిరువీధి జలుమూరు: వైశాఖ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం సాయంత్రం శ్రీముఖలింగంలో వెలసిన మధుకేశ్వరుని తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి పల్లకిలో ఆశీనులుగా చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ తిరువీధి నిర్వహించగా భక్తులు హారతులిచ్చారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. ఘనంగా ఆదిత్యుని కల్యాణం అరసవల్లి: వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో స్వామి వారి కల్యాణ వేడుక ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం ఆలయ అనివెట్టి మండపంలో నిర్వహించిన ఈ ఉత్సవాన్ని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మలు జరిపించారు. కార్యక్రమంలో భాగంగా స్వామి దేవేరుల ఉత్సవమూర్తులను కల్యాణ మూర్తులుగా అలంకరించి ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. అలాగే కల్యాణ సేవలో పాల్గొనే భక్తదంపతులకు స్వామి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్.చంద్రశేఖర్ అరు ణ దంపతులు, సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు, వేదపండితులు కన్నయ్య, పార్ధశారధి, శ్రీనివాస శర్మ తదితరులున్నారు. చోడవరంలో 30 మేకలు చోరీ నరసన్నపేట: మండలంలోని చోడవరం ఎస్సీ కాలనీకి చెందిన బక్క నీలం పెంచుకుంటున్న 30 మేకలు శనివారం రాత్రి చోరీకి గురయ్యా యి. గుర్తు తెలియని వ్యక్తులు లగేజీ వాహనంలో వచ్చి ఆ ఇంటి ఆవరణలో ఉన్న మేకలను తీసుకువెళ్లిపోయారు. ఉదయానికి తన ఇంటి ముందు మేకలు లేకపోవడంతో నీలం లబోదిబోమన్నారు. నరసన్నపేట పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు ఇచ్చినట్లు నీలం తెలిపారు. పోలీసులు వచ్చి పరిశీలించారు. చోరీకి గురైన 30 మేకలు రూ. 2 లక్షల విలువ చేస్తాయని అంచనా. -
భక్తజన జాతర
అరసవల్లి: ఆదిత్యుని క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా స్వామి దర్శనానికి భారీగా తరలివచ్చారు. వైశాఖ మాస రెండో ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో ప్రసిద్ధ ఆరోగ్యక్షేత్రం అరసవల్లి భక్తజనంతో పులకరించిపోయింది. వేకువజా ము 5 గంటల నుంచే ఇంద్రపుష్కరిణి పరిసరాలన్నీ భక్తులతో రద్దీగా మారడంతో వైశాఖ మాస ప్రత్యేక త స్పష్టంగా కనిపించింది. రథసప్తమి ఉత్సవం జరుగుతుందా... అన్నట్లుగా భక్తులు పోటెత్తారు. భక్తుల కోసం ఆలయ ఈఓ ఎస్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో టెంట్లు, షామియానాలు, మంచినీటి పంపిణీ వంటి చర్యలు చేపట్టినా సరిపోలేదు. ఉదయం 9 గంటల నుంచి ఒంటి గంట వరకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. ఎన్నడూ లేనివిధంగా ప్రత్యే క (రూ.100), విఽశిష్ట (రూ.500) దర్శనాలకు భారీ గా బారులు తీరడంతో అప్పటికప్పుడు ఆలయ ఈఓ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఎక్కువ మంది బందోబస్తు విధులకు రాకపోవడంతో దర్శన ప్రాంతాల్లో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక పూజలు.. మొక్కుల చెల్లింపులు వైశాఖమాసం సందర్భంగా స్వామికి ఆలయ ప్రధా న అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆదివారం కావ డంతో పూర్తిగా ఆర్జిత సేవలను రద్దు చేసి, ఉదయం 6 గంటల నుంచే సర్వదర్శనాలకు అవకాశమిచ్చా రు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు సూర్యోదయ సమయానికి పవిత్ర ఇంద్రపుష్కరిణి వద్ద ప్రత్యేక సంప్రదాయ పూజలు చేసి, స్వామికి ప్రసాదాలను నివేదించారు. అనంతరం దర్శనాలకు బారులు తీరారు. చెరుకు, బెల్లం, వడపప్పు, పెసల మొలకలు, మామిడిపళ్లు, కొబ్బరి తదితర ప్రసాదాలను నివేదించారు. అలాగే పలువురు భక్తులు తల నీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా సూర్యనమస్కార పూజలు చేయించుకున్నారు. ఎండను దృష్టిలో ఉంచుకుని కొందరు స్వచ్ఛందంగా భక్తులకు స్థానికంగా ఉచితంగా నీరు, మజ్జిగను పంపిణీ చేశారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులకు ఆలయంలో నిత్యాన్నదాన ప్రసాదం ఎంతో సంతృప్తినిచ్చింది. ఎండలకు ఇబ్బంది భానుని ప్రతాపానికి భక్తులు విలవిల్లాడిపోయారు. సుమారు 40డిగ్రీల ఎండలో బారులు తీరిన భక్తులకు ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేకపోయారు. ముఖ్యంగా ఉచిత దర్శనానికి వచ్చిన భక్తుల పరిస్థితులను పట్టించుకోలేదంటూ భక్తులు తీవ్రంగా విమర్శించారు. దీనికితోడు ఎన్నడూ లేని విధంగా ఉచిత దర్శనాలతో పోటీగా ప్రత్యేక, విశిష్ట దర్శనాల కోసం భక్తులు బారులు తీరడంతో అన్ని వర్గాల భక్తులకు కూడా అవస్థలు తప్పలేదు. ఆలయంలో ప్రసాదాల మండపంతో పాటు పలుచోట్ల క్యూలైన్ల వద్ద ఫ్యాన్లు పనిచేయకపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. కేశఖండన శాల వద్ద భక్తులను అధికారులు, పోలీసులు కూడా ఎవ్వరూ పట్టించుకో లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తలనీలాల చెల్లింపునకు టిక్కెట్టు ధర అదనంగా వసూళ్లు చే శారంటూ భక్తులు ఫిర్యాదులు చేశారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద వీవీఐపీలంటూ కొందరు హల్చల్ చేశారు. విధుల్లోకి వచ్చిన పోలీసులు కేవలం తమ వారి కుటుంబాలకు దర్శనాలు చేయించుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో భక్తులు తీవ్రంగా విమర్శించారు. అరసవల్లిలో ‘వైశాఖ’ సందడి భారీగా తరలివచ్చిన భక్తులు ఒక్కరోజులో ఆలయ ఆదాయం రూ.19.33 లక్షలు ఆలయ ఆదాయం రూ.19.33 లక్షలు అరసవల్లి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.19,33,775 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ ఎస్.చంద్రశేఖర్ తెలియజేశారు. భారీగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ప్రత్యేక, విశిష్ట దర్శన టిక్కెట్ల విక్రయా ల ద్వారా రూ.13,04,100, సూర్యనమస్కారా ల టిక్కెట్లు, పలు విరాళాల ద్వారా రూ. 1,21,675, తలనీలాల టిక్కెట్లు (రూ.40) ద్వారా రూ.1,78 లక్షలు, లడ్డూ,పులిహోర ప్ర సాదాల ద్వారా రూ.3.30 లక్షలు మేరకు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సారవకోట: మండలంలోని చిన్నకిట్టాలపాడు పంచాయతీ కురిడింగి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఒడిశా లోని పర్లాకిమిడి సమీపంలో ఉన్న రాణిపేటకు చెందిన ఎ.కాంతారావు, కె.యోగేశ్వరరావులు శ్రీకాకు ళం నుంచి రాణిపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కురిడింగి సమీపంలో ద్విచక్ర వాహనం బోల్తా పడటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని అర్లి టోల్గేట్ దగ్గర ఉన్న హైవే అంబులెన్స్లో పర్లాకిమిడి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం తరలించినట్లు అంబులెన్స్ డ్రైవర్ రాము తెలిపారు. -
నాగావళిలో మునిగి బాలుడు మృతి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ఉన్న నాగావళి నదిలో మునిగి ఓ బాలుడు చనిపోయాడు. స్థానిక యువత బాలుడి ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్థానికులు, ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని బాదుర్లపేటకు చెందిన పెంటబోయిన గుర య్య ఆటో నడుపుతూ భార్య, కుమారుడు, కుమార్తెతో జీవిస్తున్నాడు. గురయ్య కుమారుడు రమేష్ (17) స్టిక్కరింగ్ షాపులో పనిచేస్తున్నాడు. ఆదివా రం సెలవు దినం కావడంతో ముగ్గురు స్నేహితుల తో కలిసి ఉదయం 11:30 గంటలకు కలెక్టర్ బంగ్లా సమీపంలోని వెంకటరమణమూర్తి గుడి వద్ద నాగా వళి నదిలోకి స్నానానికి వెళ్లాడు. అలా ఇసుకలో నడుచుకుంటూ కృష్ణమందిరం (ఇస్కాన్ టెంపుల్) వద్దనున్న నాలుగో పిల్లర్ సమీప ఒడ్డున ఇద్దరు స్నేహితులు ఉండిపోగా రమేష్ పవన్కుమార్ అనే మరో మిత్రునితో కలిసి నదిలో దిగాడు. పవన్ అవతలి ఒడ్డుకు ఈతకొట్టుకుంటూ వెళ్తుండగా ఈతరాని రమేష్ ఒక్కసారిగా లోతట్టు ప్రాంతం ఎదురవ్వడంతో ఊబిలో చిక్కుకుపోయి నీట మునిగాడు. ఈ హ ఠాత్పరిణామానికి ఒడ్డున ఉన్న ఇద్దరు స్నేహితులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ముంతా గణేష్ అనే యువకుడు మరికొందరి యువకులతో కలిసి నదిలో దిగి వెదుకులాట ప్రారంభించారు. అరగంట సేపు వెతికాక నీటి అడుగున రమేష్ మృతదేహం పది అడుగుల లోతులో తగలడంతో మెల్లగా ఒడ్డుకు తీసుకొచ్చి సీపీఆర్ చేశారు. అప్పటికే సమాచారం తెలుసుకున్న రమేష్ తల్లిదండ్రులు అక్కడికి చేరి చలనం లేకుండా పడి ఉన్న కుమా రుడిని చూసి భోరున విలపించసాగారు. సీపీఆర్ చేసేటప్పుడు నోటి నుంచి నురగ వచ్చి చిన్న కదలిక వచ్చినట్లు అనిపించడంతో యువత ద్విచక్రవాహనంపై హుటాహుటిన రిమ్స్కు తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు రిమ్స్ వైద్యులు ధ్రువీకరించడంతో ఎస్ఐ కామేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
సారా తయారీ స్థావరంపై పోలీసుల దాడులు
మెళియాపుట్టి: మండలంలోని భరణికోట పంచాయతీ జక్కరపేట గ్రామంలో డీటీఎఫ్, ఎస్ఈబీ, ఇంటెలిజెన్స్ బృందాలు సమన్వయంతో ఆదివారం సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించా యి. ఈ దాడుల్లో 1100 లీటర్ల పులిసిన బెల్లపు ఊ టలను ధ్వంసం చేశారు. శ్రీకాకుళం ఎస్ఈబీ జేడీ గంగాధరం సూచనల మేరకు దాడులు నిర్వహించినట్లు సిబ్బంది తెలిపారు. దాడుల అనంతరం అక్కడి ప్రజలకు నాటుసారా తయారీ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. సారా తయారీ, క్రయ విక్రయాలు మానుకోవాలని పిలుపునిచ్చారు. టెక్కలి ఎస్ఈబీ సీఐ రాజశేఖర్ నాయుడు, పలువురు సిబ్బంది ఉన్నారు. -
టీడీపీ గుండాలు ప్రాణం తీశారు!
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. ఓటమిని ఊహించి.. ఎన్నికల పోలింగ్ రిగ్గింగ్కు ప్రయత్నించింది. ఈ క్రమంలో హింసకు తెర లేపింది. వైఎస్సార్సీపీ నేతలను, పోలింగ్ ఏజెంట్లను, కార్యకర్తలను, పార్టీ సానుభూతిపరుల్ని.. ఆఖరికి ఓటేసిన వాళ్లను సైతం వదలకుండా దాడులకు తెగబడింది. ఈ క్రమంలో శ్రీకాకుళంలో టీడీపీ గుండాల చేతిలో ఓ నిండు ప్రాణం బలైంది. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్ తండ్రి ఒకరు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాధితుల్ని తోట మల్లేశ్వరరావుగా పోలీసులు ప్రకటించారు. దాడికి పాల్పడింది టీడీపీ నేత అచ్చెన్నాయుడి అనుచరగణమేనని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయితీ బూత్-228లో మాధవరావు అనే వ్యక్తి వైఎస్సార్సీపీ తరఫున పోలింగ్ ఏజెంట్గా వ్యవహరించారు. అయితే మాధవరావు కుటుంబాన్ని టీడీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. గురువారం గుడిలో పూజ చేస్తుండగా మాధవరావు తండ్రి మల్లేష్పై అచ్చెన్నాయుడి వర్గీయులు దాడికి తెగబడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మల్లేష్ రావును శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మల్లేష్ కన్నుమూశారు. తన తండ్రి మరణానికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని మాధవరావు డిమాండ్ చేస్తున్నారు. -
No Headline
బడులకు సెలవులు ఇచ్చేశారు. స్నేహితులతో కాలక్షేపం చేద్దామంటే బంధువుల ఊళ్లకు, విహార యాత్రలకు చెక్కేశారు. పోనీ ఇరుగు పొరుగు పిల్లలతో ఆరుబయట ఆడుకుందామంటే ఎండలు మాడు పగులగొడుతున్నాయి. దాంతో ఏమీ తోచక సెలవు రోజులను నిస్సారంగా గడిపేస్తున్న పిల్లలకు ఆ దిగులు లేకుండా చేస్తున్నారు ఇద్దరు గురువులు. తమకు కరతలామలకం అయిన గీత (డ్రాయింగ్) కళతో ఔత్సాహిక విద్యార్థుల సెలవులను సారవంతం చేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసినా కళా బోధనకు, కళా సేవకు విశ్రాంతి లేదని చాటి చెబుతున్నారు ఈ ఇద్దరు డ్రాయింగ్ టీచర్లు. గత రెండు దశాబ్దాలుగా తమ ‘గీత’సారాన్ని పిల్లలకు ఆరారా నూరిపోస్తున్నారు. చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ పేరుతో జిల్లా కేంద్రంలో పిల్లలకు కళలు బోధిస్తున్నారు.శ్రీకాకుళంఆదివారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2024న్యూస్రీల్ -
అంబేడ్కర్ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తి
ఎచ్చెర్ల క్యాంపస్: ఉమ్మడి జిల్లాలో అంబేడ్కర్ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ పూర్తిచేశారు. దుప్పలవలస, కొల్లివలస, కంచిలి, ఉంగరాడమెట్ట బాలుర జూనియర్ కళాశాలల్లో 320 సీట్లకు 65 ఖాళీలు మిగిలాయి. బాలికల గురుకుల కళాశాలలు ఎచ్చెర్ల, పెద్దపాడు, తామరాపల్లి, నందిగాం, మందస, పాతపట్నం, వంగర, భామినిల్లో 720 కి 156 ఖాళీలు ఉన్నాయి. ఆ వివరాలను కోఆర్టినేటర్ బాలాజీకి అందజేశారు. ప్రవేశాల మార్గదర్శకా లు వచ్చిన తర్వాత ప్రవేశాలు చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్ష ర్యాంకుతో సంబంధం లేకుండా పదో తరగతి మార్కులు ఆధారంగా ప్రవేశించే అంశం పరిశీలిస్తున్నారు. ‘అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలి’ హిరమండలం: వన్ధన్ వికాస కేంద్రాలకు అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ను కల్పించాలని సీతంపేట వైకేపీ ఏపీడీ సన్యాసిరావు అన్నారు. ఆయన శనివారం స్థానిక వెలుగు (వైకెపి)కార్యాలయలంలో ఏపీఎం వి.శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో సీసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మా ట్లాడుతూ మండలంలో ఆరు వన్ధన్ వికాస్ కేంద్రాలు ఉన్నాయని, వాటికి అటవీ ఉత్పత్తులై న జీడి, చీపురు, రాగులుకు తగు మార్కె టింగ్ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవా లని ఏపీఎంను ఆదేశించారు. అలాగే డ్వాక్రా స్వయంశక్తి సంఘాలకు సంబంధించిన సర్వే పూర్తి చేయాలన్నారు. అలాగే సంఘాల అప్పు లు వంద శాతం వసూలు చేయాలని సూచించారు. సంఘాలు గ్రేడింగ్ను పెంచి బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీసీ లు శ్రీదేవి, అప్పన్న, జయంతి, అసిరయ్య, సుజాత వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ‘కొత్త క్రిమినల్ చట్టాలకు సిద్ధం కావాలి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన క్రిమినల్ చట్టాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు కానున్నాయని, అందుకు న్యాయవాదులు సిద్ధం కావాలని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్, ఎస్సీ, ఎస్టీ కోర్టు స్పెషల్ పీపీ మెట్ట మల్లేశ్వరరావు తెలిపారు. జిల్లా కోర్టుల సముదాయంలోని ప్రాసిక్యూషన్ కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిమినల్ చట్టాలపై ఇటీవల హైదరాబాద్లోని సెంట్రల్ డిటెక్టివ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇచ్చినట్లు గుర్తు చేశా రు. సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాన కృష్ణచంద్, టి.శివప్రసాదరావు, సీహెచ్ శ్రీకాంత్, కె.తిరుమలరావు, కె.శంకరరావు, ఎల్వీ రమణ, సీహెచ్ సత్యనారాయణ, కె.ఉషారాణి, ఉషా కిరణ్, కిమిడి సూర్యకుమార్, ఎల్.నాగభూషణం, పి.సుశీల, కె.సుధారాణి, జి.ప్రియదర్శిని, ఆర్.శాంతి, సంతోషి, వి.విజయలక్ష్మి, డి.హరిప్రియ, ఎల్.రఘునాథ్ కార్యాలయ సిబ్బంది భాగ్యలక్ష్మి, పోలీస్ లైజన్ ఆఫీసర్స్ ఆనందరావు, హరికృష్ణ, సురేష్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన శ్రీకాకుళం, శ్రీకాకుళం అర్బన్: ఇటీవల గుండె నొప్పి కేసులు పెరుగుతున్నాయని, అవగాహనతో వాటిని నియంత్రించవచ్చని చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కుర్మాన వినోద్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ) ఆధ్వర్యంలో గుండె పోటు ముంద స్తు జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ సరైన సమయంలో సీపీఆర్ ప్ర క్రియతో ఆగిన గుండెను బతికించవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా సీపీఆర్పై తర్ఫీదునిచ్చి అవగాహన కల్పించారు. గుండెపోటు వచ్చిన రోగికి సత్వరం సీపీఆర్ అందివ్వడం ద్వారా మాత్రమే ఈ ఆకస్మిక, అకాల మరణాలు తగ్గించగలమని తెలిపారు. కార్యక్రమంలో జేసీఐ అధ్యక్షుడు బగాది ప్రవీణ్ కుమార్, సెక్రటరీ సింగూరు ప్రవీణ్, వాకర్స్ సభ్యులు ఇందిరా ప్రసార్, జోగినాయుడు, లక్ష్మి, మల్లిబాబు, మోహన్, దేవీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అవిశ్రాంత యోధులు
కళా సేవలో చిన్నారులంటే నాకు ఇష్టం చిన్నారులంటే నాకు చాలా ఇష్టం. వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం మా ఉద్దేశం. లాఫింగ్ క్లబ్కు నా వంతు సహకారం అందిస్తున్నాను. చిన్నారుల బాల్యానికి మెరుగు దిద్దుతున్న ఇద్దరు స్నేహితులకు అండగా ఉంటున్నాను. – నటుకుల మోహన్, క్లబ్ నిర్వాహకులు శ్రీకాకుళం కల్చరల్: ిపల్లలు హాయిగా నవ్వాలి. నవ్వుతూ ఆడుకోవాలి. ఆడుతూ నేర్చుకోవాలి. నేర్చుకుంటూ పైకి ఎదగాలి.. చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ ఉద్దేశమిదే. ఇక్కడ డ్రాయింగ్ నేర్చుకున్నా, సంగీత సాధన చేసినా, నృత్యం చేసినా.. దాని ఉద్దేశం సెలవులను సరైన రీతిలో ఉపయోగించుకోవడమే. ఇప్పటికే రెండు వందల మందికిపైగా పిల్లలు ఈ క్లబ్లో చేరి తమకు ఇష్టమైన అంశాలను నేర్చుకుంటున్నారు. ఈ క్లబ్ నిర్వహణ వెనుక ముఖ్యంగా ఇద్దరి కృషి ఉంది. 70 ఏళ్ల వయసు దాటినా ఇంకా చురుగ్గా పనిచేస్తున్న ఇద్దరు మాస్టార్ల జీవితముంది. వీరిద్దరిలో ఒకరు మిమిక్రీ కళలో జాతీయ స్థాయి కళాకారుడిగా పేరు తెచ్చుకుంటే మరొకరు సాంఘిక నాటికలకు ఉత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. పట్టణానికి చెందిన రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్లు లోకనాథం నందికేశ్వరరావు, బీఎంఎస్ పట్నాయిక్ (బెహరా మధుసూదన పట్నాయిక్)లు కలసి గత 20 ఏళ్లుగా చిన్నారుల్లో ఉన్న సృజన వెలికి తీసేందుకు విశేష కృషి చేస్తున్నారు. వీరికి వచ్చిన చిరు ఆలోచనతో చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ను తమ మిత్రులు మిమిక్రీ శ్రీనివాస్, నటుకుల మోహన్ల సహకారంతో ఏర్పాటు చేశారు. చిన్నారులను ఒక చోటకు చేర్చి వారికి ఆటలు, పాటలు, జీకే, వ్యాసరచనలు ఇలా వారి భవిష్యత్కు ఉపయోగ పడే ఎన్నో విషయాలపై తర్ఫీదు ఇస్తున్నారు. ఎప్పుడో రిటైరైనా.. పాతశ్రీకాకుళానికి చెందిన లోకనాథం నందికేశ్వరరావు 1979 నుంచి డ్రాయింగ్ టీచరుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేశారు. చిన్నతనం మిమిక్రీలో నైపుణ్యం చూపేవారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా సత్కారం పొంది, గుర్తింపు పొందారు. 2010లో ఉద్యోగ విరమణ చేశారు. కళింగపట్నానికి చెందిన బీఎంఎస్ పట్నాయిక్గా గుర్తింపు పొందిన బెహరా మధుసూదన పట్నాయిక్ అక్కడ నాటకాల సేవలో నిరంతరం ఉండేవారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ములుగులో డ్రాయింగ్ టీచరుగా 1966లో పనిచేశారు. ఆంధ్రాకు వచ్చి 1970 నుంచి ఉద్యోగం చేసి 2001లో పదవీ విరమణ చేశారు. 2011లో బాలలతో రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవ పోటీల్లో ‘దాడి’ నాటికకు దర్శకత్వం వహించి బంగారు నంది సాధించారు. ఇప్పటికీ నంది నాటకాలకు దర్శకత్వం వహిస్తున్నారు. 20 ఏళ్లుగా లాఫింగ్ క్లబ్ సేవలు చిన్నారుల కోసం 2003లో ఒక లాఫింగ్ క్లబ్ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రస్తుత రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ ఎల్.నందికేశ్వరరావు తాను ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచే దీనికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి కొందరు మిత్రులతో కలసి పట్టణంలోని రివర్ వ్యూ పార్కులో ప్రతి మొదటి, మూడు ఆదివారాల్లోని సాయంత్రం వేళల్లో చుట్టు పక్కల ఉండే చిన్నారులను ఒక చోట చేర్చి వారికి ఆటలు, పాటలు, వ్యాసరచనలు, వక్తృత్వ పోటీలు ఏర్పాటు చేసి దాతల సహకారంతో వారికి బహుమతులు ఇస్తూ క్లబ్ నిర్వహిస్తున్నారు. 2012లో మొదటి సారిగా వేసవి శిబిరాలు ఈ ఇద్దరు డ్రాయింగ్ టీచర్లు రిటైరయ్యాక.. డ్రాయింగ్ను ఇతరులకు పంచాలనే మంచి ఆలోచనతో వేసవి శిక్షణ శిబిరాలను కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న తమ ఇంటి వద్ద ప్రారంభించారు. ప్రస్తుతం విద్యార్థులు పెరుతున్నందున అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. చిన్నారులకు ఉచితంగా డ్రాయింగ్ బోధన చేస్తు వారిలో ఉన్న టాలెంట్ను పెంచుతున్నారు. 2011, 2012 నుంచి వేసవిలో డ్రాయింగ్ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కొందరు యువ డ్రాయింగ్ టీచర్ల సహాయం కూడా తీసుకున్నారు. అప్పటి కలెక్టర్ నరసింహం సలహా మేరకు ఒక్క డ్రాయింగ్లోనే కాకుండా ఇతర అంశాలైన పేపర్ క్విల్లింగ్, కూచిపూడి నృత్యం, సంగీతం, పెయింటింగ్పై శిక్షణలు ఇస్తున్నారు. వేసవి శిబిరంలో పాల్గొని నేర్చుకున్న డ్రాయింగ్ విద్య ద్వారా ఇప్పటికే ఐదుగురు ఉద్యోగాలను సాధించారు కూడా. రిటైరయ్యాక కూడా బోధిస్తున్న టీచర్లు చిన్నారులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న వైనం శ్రీకాకుళంలో చిల్డ్రన్ లాఫింగ్ క్లబ్ నిర్వహణ ప్రతి వేసవిలో 200మందికి విద్యార్థులకు శిక్షణ ఏడాదికి 200 మంది చిన్నారులు... వేసవి సెలవులు వచ్చాయంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడకు పంపడం మొదలు పెట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాలనుంచి చిన్నారులు వచ్చి చేరుతున్నారు. ప్రతి ఏడాది అన్ని విభాగాలలో కలిపి మొత్తంగా 200 మంది చిన్నారులు వారి అభిరుచి మేరకు నేర్చుకుంటున్నారు. నందికేశ్వరరావుతోపాటుగా రిటైర్డ్ డ్రాయింగ్ టీచర్ బీఎంఎస్ పట్నాయిక్, ప్రస్తు తం ఉద్యోగంచేస్తున్న దుర్గా ప్రసాద్, సాయి ప్రసా ద్, దీప్తి కూడా తమ సేవలను అందిస్తున్నారుచిన్నారులు గీసిన చిత్రాలు -
వైఎస్సార్సీపీకి ఓటేశారని వ్యక్తిపై దాడి
పోలాకి: మండలంలోని సంతలక్ష్మీపురం పంచాయతీ పరిధి సన్యాసిరాజుపేట గ్రామానికి చెందిన ఉప్పాడ శ్రీనివాసరావు అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన బొడ్డేపల్లి జగన్నాథం దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలాకి ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. బాధితుడు రైల్వే గ్యాంగ్మెన్గా పనిచేస్తున్నాడు. ఎన్నికల నేపథ్యంలో గ్రామానికి వచ్చాడు. అయితే వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఓటేశాననే అక్కసుతో తనపై దాడి చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీనివాసరావును మండల పరిషత్ సలహాదారు ముద్దాడ భైరాగినాయుడు, వైఎస్సార్సీపీ మండల పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రెంటికోట త్రినాథరావు శనివా రం పరామర్శించారు. పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. -
కిర్గిస్థాన్లో వైద్య విద్యార్థులు క్షేమం
సరుబుజ్జిలి: మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థినులు వైద్య విద్య కోసం కిర్గిస్థాన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ అల్లర్లు జరగడంతో కొన్ని రోజులుగా వారి తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యారు. అయితే వైద్యవిద్యార్థులంతా క్షేమంగా ఉన్నట్లు అక్క డి నుంచి సమాచారం రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జలీలాబాద్ యూనివర్సిటీలో చదువుతున్న తన కుమార్తె మాధురి క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించిందని తండ్రి కూన జగన్నాథం తెలిపారు. మరో వర్సిటీలో చదువుతున్న డోల శ్వేత కూడా ఇంటికి క్షేమ సమాచారం అందించిందని తండ్రి డోల రామకృష్ణ తెలిపారు. భారత ప్రభుత్వం స్పందించి తమ పిల్లలను స్వదేశాలకు రప్పించే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. తజికిస్తాన్లో చిక్కుకొన్న వైద్య విద్యార్థి రణస్థలం: మండల కేంద్రంలో నివాసం ఉంటున్న శ్రీదేవి మహంతి కుమార్తె అనన్య తజికిస్తాన్లో మెడిసిన్ చదువుకునేందుకు రెండేళ్ల క్రితం వెళ్లారు. అక్కడ వైద్య విద్యార్థులపై దాడులు జరుగుతున్నా యి. దీంతో కుమార్తె క్షేమ సమాచారంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనన్య అక్కడ మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతోంది. భారత ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట భద్రత
● శివానీలో స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఎచ్చెర్ల క్యాంపస్: స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. శివానీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన 18 స్ట్రాంగ్ రూమ్లను శనివారం ఆయన పరిశీలించారు. భద్రత ఏర్పాట్లు పరిశీలించి, పలు సూచనలు చేశారు. సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించారు. మూడంచెల భద్రత వ్యవస్థను పరిశీలించారు. రిజిస్టర్ నిర్వహణ, అధికారుల పర్యవేక్షణ, భద్రత సిబ్బంది నిర్వహణ, సీసీ కెమె రాల ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం ప్రకృతి విపత్తు లు, వర్షాలు, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ చర్య లు వంటివి పరిశీలించారు. అనంతరం రికార్డులు పరిశీలించి జిల్లా ఎన్నికలు అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, ఎస్పీ రాధికలతో సమీక్ష నిర్వహించారు. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పొలిటికల్ పార్టీల ప్రతినిధుల పరిశీలనకు అన్ని స్ట్రాంగ్ రూమ్ల సీసీ కెమెరాల పుటేజ్, సీసీ కెమెరాలు లైవ్ అంతరాయం లేకుండా అందుబాటులో ఉంచాలని సూచించారు. తలుపుల నాణ్యత, గడియలు నాణ్యత, తాళాలు, తాళాలకు వేసిన సీళ్లు సైతం పరిశీలించారు. అనధికార వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాంతంలోకి అనుమతించ వద్దని అన్నారు. మూడంచెల భద్రత పటిష్టంగా ఉండాలని చెప్పారు. అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమా అన్సారియా, సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, డీపీఓ వెంకటేశ్వరరావు, రిటర్నింగ్ అధికారులు భరత్ నాయక్, గంగయ్య, అప్పారావు, లక్ష్మణమూర్తి, సుదర్శన్ దొర, రామ్మోహన్రావు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement