-
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభవార్త ఇది. మ్యాథ్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే జాబ్మేళాను ఈ నెల 30న స్థానిక మయూరి కూడలిలోని శ్రీసాయికాంప్లెక్స్లో హెచ్సీఎల్ టెక్–బి సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డు సంయుక్తంగా నిర్వహిస్తుందని ఇంటర్మీడియట్ ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ) ఎం.ఆదినారాయణ బుధవారం తెలిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలో 750 మార్కుల పైబడి ఉత్తీర్ణులైన మాథ్స్ సబ్జెక్టు కలిగిన అన్ని గ్రూపుల విద్యార్థులకు ఇది సువర్ణావకాశంగా పేర్కొన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 2022–23, 2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు జాబ్మేళాకు అర్హులను తెలిపారు. ఇప్పటికే 400 మంది జాబ్మేళా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్ చేయనివారు కూడా నేరుగా జాబ్ మేళాకు హాజరుకావచ్చని చెప్పారు. మూడు కేటగిరిలే కీలకం... ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంగ్లిష్ భాష ప్రావీణ్యం పరీక్షిస్తారు. మూడింటిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణలోని ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తారు. శిక్షణ అనంతరం ఏడాదికి రూ.1.70 లక్షల ప్రారంభ వార్షిక వేతనం పొందవచ్చు. ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ విద్యార్హతతో కొలువులో చేరిన విద్యార్థుల చదువు అక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో హెచ్సీఎల్ టెక్ బీ కంపెనీ ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రణాళికను రూపొందించింది. పలు యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు కింద విద్యార్థులకు చెల్లించే జీతంలో కంపెనీ ఏడాదికి రూ.15 వేలు చెల్లిస్తుంది. రిజిస్ట్రేషన్ సందేహాల నివృత్తి కోసం సంస్థ ప్రతినిధి యోగేష్ ఫోన్:63003 78377 నంబర్ను సంప్రదించవచ్చు. మ్యాథ్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సువర్ణావకాశం అర్హులైన విద్యార్థులు నేరుగా హాజరు కావచ్చు: ఆర్ఐఓ -
No Headline
పేదకుటుంబాల పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చింది. కొన్ని పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ను సైతం బోధిస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు ఆంగ్లంపై మరింత పట్టు సాధించేలా వేసవి సెలవుల్లో కొన్ని గ్రంథాలయాలు, పాఠశాలల్లో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్పై ఉన్న భయాన్ని దూరం చేసేలా శిక్షణ ఇస్తున్నారు. బాడంగి ప్రభుత్వ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల పేరిట స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ బేసిక్స్, నీతికథలు, పద్యపఠనం, చదరంగం తదితర అంశాల్లో తర్ఫీదునిస్తున్నారు. ఈ బృహత్తర క్రతువులో గ్రంథాలయాధికారి దుర్గాప్రసాద్తో పాటు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులూ భాగస్వాములవుతున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్లో శిక్షణ ఇస్తున్న పిండ్రింగివలస ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వై.రవిబాబును చిత్రంలో చూడొచ్చు. – బాడంగి శిక్షణ -
–8లో
● అవగాహన విద్యార్థులకు ‘పెన్’ నంబర్ విద్యార్థులు తమకు నచ్చిన పాఠశాలలో చేరేందుకు... చదువును చక్కగా కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రతీ విద్యార్థికి ఒక పెన్ (పర్మినె ంట్ ఎడ్యుకేషన్ నంబర్)ను కేటాయిస్తోంది. ఎండలు మండుతున్న వేళ.. వడదెబ్బకు గురికాకుండా ఉపాధిహామీ వేతనదారులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఉదయం 9 గంటల లోపు, సాయంత్రం 4 గంటల తర్వాత పనుల్లో పాల్గొనాలని సూచిస్తున్నారు. పని ప్రదేశాల్లో ప్రాథమిక వైద్యం కిట్లు, టెంట్లు, తాగునీటిని ఉంచుకోవాలని చెబుతున్నారు. రేగిడి మండలం లింగాలవలసలో ఏపీఓ హరనాథరావు ఇస్తున్న సూచనలను శ్రద్ధగా వింటున్న ఉపాధిహామీ వేతనదారులను చిత్రంలో చూడొచ్చు. – రేగిడి -
గురుదేవా ట్రస్టు సేవలు ఆదర్శప్రాయం
కొత్తవలస: దివ్యాంగులకు మంగళపాలెం గ్రామంలోని గురుదేవా చారిటబుల్ ట్రస్టు అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని ఎస్ఏఎల్పీజీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముఖేష్ అన్నారు. ట్రస్టును ఆయన బుధవారం సందర్శించారు. ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్బాబు తన జీవితాన్ని దివ్యాంగుల సేవకే అంకితం చేశారని కొనియాడారు. దేశంలో ఎక్కడా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు అందించే సంస్థలు లేవన్నారు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి జగదీష్బాబు సొంత ఆస్తులను కరగబట్టి దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ అవయవాలను అందించి వారికి చేదోడు నిలుస్తుండడం అభినందనీయమన్నారు. ముందుగా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలను సందర్శించారు. అనంతరం 20 మంది దివ్వాంగులకు కృత్రిమ అవయవాలు, చెవిటిమిషన్లు, పోలియో కాలిపర్స్ అందజేవారు. మరో 50 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఏఎల్పీజీ సీఈఓ వికాస్వర్మ, సీఎస్ఆర్ హెడ్ రామనాథ్, ట్రస్టు వైస్ చైర్మన్ డా.ఫణేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఎస్ఏఎల్పీజీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముఖేష్ -
జిందాల్ కార్మికుల చర్చలు 31కి వాయిదా
కొత్తవలస: అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ కర్మాగార కార్మికులకు, యాజమాన్యానికి మధ్య చర్చలు 31కి వాయిదా పడినట్టు కార్మిక సంఘ జేఏసీ నాయకులు తెలిపారు. గత 13 రోజులుగా ముడిసరుకు కొరతతో కర్మాగారం యాజమాన్యం లే ఆఫ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి నిరసగా కార్మికులు వంటావార్పులతో ఆందోళన చేస్తున్నారు. కార్మిక జేఏసీ నాయకులు యాజమాన్యంతో ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లభించలేదు. బుధవారం మరోమారు చర్చలు జరిపారు. ఇవి అసంతృప్తిగా ముగియడంతో ఈ నెల 31 వాయిదా వేసినట్టు చెప్పారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ కార్మికులు ఐక్యతగా ఉన్నప్పుడే యాజమాన్యం దిగివస్తుందన్నారు. జిందాల్ కార్మికులకు న్యాయం జరిగేవరకు సీపీఎం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘురాజు, కార్మిక సంఘ జేఏసీ నాయకులు పిల్లా అప్పలరాజు, పప్పల బంగారునాయుడు, గాడి అప్పారావు, నమ్మి చినబాబు తదితరులు పాల్గొన్నారు. -
అలమండ సంత లైసెన్స్ మంజూరుపై విచారణ
జామి: మండలంలోని లొట్లపల్లి పశువుల సంతలో ఎటువంటి సదుపాయాలు లేకుండా లైసెన్స్ మంజూరు చేశారని అలమండ, జామి పశువైద్యాధికారులపై జిల్లా గోసంరక్షణ సమాఖ్య సభ్యులు పశు సంవర్థక శాఖ జేడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై గంట్యాడ పశుసంవర్థక శాఖ ఏడీ రెడ్డి కృష్ణ జామి తహసీలా్ద్ర్ కార్యాలయంలో బుధవారం విచారణ జరిపారు. విచారణకు హాజరైన కమిటీ సభ్యుల నుంచి లిఖిత పూర్వక వాంగ్మూలం సేకరించారు. గో సంరక్షణ కమిటీ సభ్యురాలు రాజకుమారి మాట్లాడుతూ సంతల్లో సీసీ కెమెరాలు, ర్యాంపులు, మంచినీటి కుండీలు, గడ్డి, దాణా తదితర సదుపాయాలు ఉండాలన్నారు. అవి లేకుండా అధికారులు లైసెన్స్ల మంజూరు చేశారన్నారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఏడీ తెలిపారు. కార్యక్రమంలో అలమండ, జామి పశువైద్యాధికారులు నరేష్, అప్పలనాయుడు, ఈఓపీఆర్డీ శ్రీదేవి, వెహికల్ ఇన్స్పెక్టర్ ఐశ్వర్యలక్ష్మి, లొట్లపల్లి పంచాయతీ కార్యదర్శి ఎర్నమ్మ, ఆంధ్రప్రదేశ్ గోసంరక్షణ సమాక్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
● హెచ్చరిక
సార్వత్రిక ఎన్నికల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనుందని, పల్లె, పట్టణ ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవించాలని, అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆర్.గోవిందరావు హెచ్చరించారు. సారిపల్లి గ్రామస్తులతో బుధవారం సమావేశమయ్యారు. గ్రామాల్లో 144వ సెక్షన్ అమల్లో ఉందన్నారు. కౌంటింగ్ అనంతరం ర్యాలీలు, మందుగుండు సామగ్రి కాల్చేందుకు అనుమతులు లేవని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటమిపై బెట్టింగ్లకు పాల్పడినట్టు తెలిసినా చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో భోగాపురం సర్కిల్ సీఐ బీవీ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రామ గణేష్, తదితరులు పాల్గొన్నారు. – నెల్లిమర్ల రూరల్ -
ట్రాన్స్ఫార్మర్ చోరీ
వీరఘట్టం: మండలంలో ఇటీవల కాలంలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు జోరందుకున్నాయి. పంటపొలాలకు సాగునీరు అందించే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను టార్గెట్ చేస్తూ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. గడిచిన ఆరునెలల్లో మండలంలోని 5 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించుకుపోయారు. తాజాగా మంగళవారం రాత్రి చిదిమి రోడ్డులో సీఎస్ఆర్ పేట రెవెన్యూ పరిధిలో రైతు నల్లబిల్లి మధు పంట పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యవసాయ పంపు సెట్లకు కరెంట్ ఉంటుంది. రాత్రి పూట ఈ లైన్కు కరెంట్ ఉండదు.పంట పొలాల్లో రాత్రి పూట ఎవరూ ఉండకపోవడంతో ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించి వాటిని కాపర్వైర్లను పట్టుకుని పోతున్నారు. గతేడాది డిసెంబర్ 23న సీఎస్ఆర్ పేట వద్ద నల్లబిల్లి అంబరీసు, కర్నాకుల మన్నథరావుల ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించారు.ఈ ఏడాది మార్చి 25న ఇదే ప్రాంతంలో గడగమ్మ ఈశ్వరమ్మ, పడాల కృష్ణమూర్తిలకు చెందిన మరో రెండు ట్రాన్స్ఫార్మర్లను దొంగతనానికి గురయ్యాయి. వరుసగా ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఈ దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు. దొంగతనాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ట్రాన్స్కో ఏఈ డి.బాలాజీ తెలిపారు. -
ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులు
విజయనగరం అర్బన్: ఏపీటీఎఫ్ రాష్ట కమిటీలో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులకు చోటు దక్కింది. విజయవాడలో బుధవారం జరిగిన సంఘం రాష్ట్ర కమిటీ జనరల్ కౌన్సిల్లో సభ్యులు నూతన కమిటీని ఎన్నుకున్నారని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్వీపైడిరాజు తెలిపారు. నూతన కమిటీలో ఐఎఫ్ఈఏ సభ్యులుగా వై.సత్యం, సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎ.సదాశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా డి.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా వై.మధుసూదనరావు, ఎన్.వెంకటనాయుడు, ఎన్వీ పైడిరాజు, బి.బలరామునాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. నూతనంగా ఎన్నికై న వారికి జిల్లా కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు అభినందనలు తెలిపారు. -
రఘురాజుపై అనర్హత వేటుకు.. రంగం సిద్ధం
ఈ చిత్రంలో కనిపిస్తున్నవారంతా శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మండల స్థాయి నాయకులు. వారి మధ్యలో కూర్చున్న వ్యక్తి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. వారు వెళ్లింది ఏదో ప్రజాప్రయోజన కార్యక్రమం కోసం కాదు సుమీ... టీడీపీ టికెట్ కోసం పోటీపడిన కోళ్ల లలితకుమారి, గొంప కృష్ణ మధ్య సంధి కోసం! గత మార్చి నెలలో లోకేశ్ను కలిసేందుకు ఆయన ఇంట్లో వేచివున్న సదరు నాయకుల చిత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజకీయ ద్రోహానికి పాల్పడిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై అనర్హత వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే టీడీపీలోకి ఫిరాయించిన జంగా కృష్ణమూర్తి, సి.రామచంద్రయ్య, జనసేన పార్టీలోకి జంప్ చేసిన వంశీకృష్ణ యాదవ్పై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వేటు వేశారు. వాళ్లంతా బాహాటంగానే ఫిరాయించారు. వారికి భిన్నంగా తెరచాటు, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్న రఘురాజు గుట్టు ఆలస్యంగానైనా వెలుగులోకి వచ్చింది. లోకేశ్ సహా టీడీపీ నాయకులతో అంటకాగుతున్న వ్యవహారం, వారితో కుమ్మకై ఎస్.కోటలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును, విశాఖ లోక్సభ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మిని ఓడించేందుకు పన్నిన కుతంత్రాలు తేటతెల్లమయ్యాయి. ఈ నేపథ్యంలో రఘురాజుపై చర్యలు తీసుకోవాలని శాసనమండలిలో వైఎస్సార్సీపీ విప్ పాలవలస విక్రాంత్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 27న రావాలని మండలి చైర్మన్ మోషేన్ రాజు తాఖీదులు పంపినా రఘురాజు డుమ్మా కొట్టేశారు. ఈనెల 31న ఆఖరిసారిగా మరో అవకాశం ఇస్తున్నారు. ● పదవులిచ్చిన పార్టీకే ద్రోహం... శృంగవరపుకోట నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోళ్ల లలితకుమారికి వ్యతిరేకంగా గళమెత్తిన గొంప కృష్ణ నోరుమూయించిన వ్యవహారం వెనుక పెద్ద తతంగమే నడిచింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... గత మార్చి నెలాఖరులో గొంప కృష్ణను, ఆయన అనుచరులను నారా లోకేశ్ హైదరాబాద్లోని తన ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడ జరిగిన టికెట్ పంచాయితీకి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వెళ్లడం అప్పట్లో సంచలనమైంది. కాకపోతే ఆ భేటీ ఫొటోలేవీ అప్పట్లో బయటకు రాకపోవడంతో తాను ఇంకా వైఎస్సార్సీపీలోనే ఉన్నానంటూ రఘురాజు నటించారు. తెరవెనుక మాత్రం టీడీపీ మేలు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. అప్పటికే ఎస్.కోట మండల వైస్ ఎంపీపీ పదవికి రాజీనామా చేయకుండానే తన భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి అలియాస్ సుధారాజును టీడీపీలోకి పంపించారు. లోకేశ్తో పచ్చ కండువా వేయించారు. బడ్డువరలోని స్వగృహంలో టీడీపీ సమావేశాలన్నీ పెడుతూనే అవేవీ తనకు సంబంధం లేదని బుకాయిస్తూ వచ్చారు. భార్య, భర్త వేర్వేరు పార్టీల్లో ఉంటే తప్పేమిటని, మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉండవచ్చా? అంటూ సుధారాజు ఘాటు వ్యాఖ్యలు చేసినా ఆయన ఖండించలేదు. రాజకీయంగా అండదండలు అందించిన బొత్సపైనే విమర్శలు చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంత స్థాయి లేకపోయినా ఇచ్చిన మాట కోసం సామాజిక సమీకరణలనూ పక్కనబెట్టి ఎమ్మెల్సీని చేసిన వైఎస్సార్సీపీకే ద్రోహం చేసిన వ్యక్తి నుంచి అంతకన్నా ఏమీ ఆశించలేమని పార్టీ శ్రేణులు నివ్వెరపోయారు. ● ఎంత వారించినా తెగింపే... వాస్తవానికి పార్టీకి నష్టం చేసే పనులు చేయొద్దని, వారి రాజకీయాలకు ఇబ్బందేమీ ఉండదని రఘురాజు దంపతులకు వైఎస్సార్సీపీ అధిష్టానం నచ్చజెప్పి చేసింది. ఎంత వారించినా ‘స్థానికత’ ముసుగులో పార్టీకి ద్రోహం చేయడానికి తెగించారు. ఈ కుతంత్రంలోకి ఎస్ కోట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు కొందరినీ లాగేందుకు విఫలయత్నం చేశారు. ● ఎమ్మెల్సీ మూణ్నాళ్ల ముచ్చటే... ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం ఒక పార్టీ తరఫున చట్టసభల్లో అడుగుపెట్టిన వ్యక్తి తర్వాత సదరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం–1985 ప్రకారం అనర్హత వేటు పడుతుంది. ఈ ప్రకారం వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టిన రఘురాజు ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అతనిపై చర్యలు తీసుకోవాలని అతనిపై ఫిర్యాదు దాఖలైంది. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ మోషేన్రాజు నోటీసులు పంపించారు. ఈ నెల 31న రఘురాజు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. పార్టీకి ద్రోహం చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎన్నికల కమిషన్ అనుమతితో రఘురాజు సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం చూశారా? టికెట్ పంచాయితీ ముగిసిన తర్వాత లోకేశ్తో గొంప కృష్ణ సహా ఎస్.కోట టీడీపీ నాయకులంతా ఫోజు ఇచ్చిన ఫొటో ఇది. అప్పటివరకూ అంతా తానై నడిపించిన రఘురాజు మాత్రం ఆ ఫొటోలో కనిపించకుండా దాగుండిపోయారు. ధైర్యం ఉంటే వారితో ఫొటో దిగవచ్చు కదా? అలా చేస్తే ఆయన రఘురాజు ఎందుకవుతారని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. నిస్సిగ్గు రాజకీయాలకు రఘరాజు నిలువెత్తు నిదర్శనం శాసనమండలి చైర్మన్ సమక్షంలో వివరణ ఇచ్చేందుకు డుమ్మా రేపు విచారణకు రావాలని మరోసారి నోటీసులు సింహాసనం ఎక్కించిన వైఎస్సార్సీపీకి దంపతుల ద్రోహం పదవులకు రాజీనామా చేయకుండా టీడీపీతో అంటకాగుతున్న వైనం కోళ్ల’కు కాటు తప్పదా? వైఎస్సార్సీపీకి ద్రోహం చేసి టీడీపీ కోసం పనిచేస్తున్న రఘురాజు దంపతులతో తనకు మేలు జరుగుతుందని టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి భావిస్తున్నారు. కానీ లోకేశ్ సమక్షంలో జరిగిన పంచాయితీ గురించి తెలిస్తే ఆమె గుండె పగిలిపోవడం ఖాయమని టీడీపీ నాయకులే గుసగుసలాడుతున్నారు. తన భార్యను ఏదిఏమైనా సరే ఎమ్మెల్యే చేయాలన్నదే రఘురాజు జీవిత ఆశయమట! కడుబండి శ్రీనివాసరావును తప్పిస్తే ఆమెకే వైఎస్సార్సీపీ టికెట్ ఇప్పించాలని చేసిన ప్రయత్నాలే ఫలించలేదు. దీంతో టీడీపీని ఆశ్రయించారు. తన సామాజిక వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ చొరవతో లోకేశ్కు అత్యంత సన్నిహితుడైన దామచర్ల సత్యకు చేరువయ్యారు. గత ఎన్నికల్లో రఘురాజు పోటీచేసి 30 వేల పైచిలుకు ఓట్లు సాధించారని, ఆయనకు బలమైన ఓటు బ్యాంకు ఉందని దామచర్ల సత్యనారా లోకేశ్కు చెప్పారట! దీంతో రఘురాజుతో కలిసి వైఎస్సార్సీపీపై కుట్రకు టీడీపీ నాయకులు సిద్ధమైపోయారు. ఇందుకోసం కోళ్ల లలితకుమారికి తెలియకుండానే వారిమధ్య చీకటి ఒప్పందం కుదిరింది. 2029 నాటికి నియోజకవర్గ పునర్విభజన ద్వారా ఎస్.కోట రెండు నియోజకవర్గాలు అవుతుందని, వాటిలో ఒక టికెట్ గొంప కృష్ణకు, రెండో నియోజకవర్గంలో టికెట్ రఘురాజు భార్య సుబ్బలక్ష్మికి ఇస్తామని లోకేశ్ గట్టి హామీ ఇచ్చారట! ఇద్దరికీ రెండూ ఇచ్చేస్తే మరి కోళ్ల లలితకుమారి పరిస్థితి ఏమిటనేదీ ఆగమ్యగోచరమే. చేరదీసిన గురువుకే పంగనామాలు పెట్టడంలో సిద్ధహస్తులైనవారి వెన్నుపోటు ఆమెకు కూడా తప్పేలా లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
కౌంటింగ్కు పక్కాగా ఏర్పాట్లు ఉండాలి
విజయనగరం అర్బన్: ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీ గా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. లెండి ఇంజినీరింగ్ కళాశాల, జేఎన్టీయూ జీవీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆమె బుధవారం పరిశీలించారు. ప్రతి నియోజకవర్గ లెక్కింపు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపునకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన టేబుళ్లు, సిబ్బంది కూర్చునే విధానం, ఏజెంట్లకు చేసిన ఏర్పాట్లు, ఆర్ఓలు, అబ్జర్వర్ల సీటింగ్ ఏర్పాట్లు, వీవీప్యాట్ల లెక్కింపు గదులు, టాబ్యులేషన్, ఎన్కోర్, ఫలితాలు రాసేందుకు బోర్డులు, లెక్కింపు కేంద్రాలకు చేరుకునేందుకు ఏర్పాటుచేసిన మార్గ సూచికలు, బారికేడ్లను పరిశీలించారు. ఏజెంట్లు, సిబ్బంది వచ్చి వెళ్లేందుకు రెండు వేర్వేరు మార్గాలు ఉండాలని స్పష్టం చేశారు. తాగునీరు, టీ తదితర పానీయాలను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించేది లేదని, వాటిని గదుల బయటే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి ఈవీఎంలను నేరుగా లెక్కింపు కేంద్రాలకు తీసుకువచ్చే మార్గాన్ని పరిశీంచారు. రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేస్తూ కలెక్టర్ పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, డీఆర్ఓ ఎస్డీ అనిత, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు, వేదికల ఇన్చార్జ్లు, నోడల్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి లెక్కింపు కేంద్రాల పరిశీలన -
విద్యార్థులకు ‘పెన్’ నంబర్
విజయనగరం అర్బన్: మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే ఒక తరగతి నుంచి మరొక తరగతికి వెళ్లే విద్యార్థులు, ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో పిల్లలను చేర్చే పనిలో తల్లిదండ్రులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఒకప్పటి నిబంధనల ప్రకారం ఒక పాఠశాల నుంచి వేరే పాఠశాలలో చేరే విద్యార్థులకు టీసీ, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. విద్యార్థి నమోదును వదులుకోలేక సదరు పాఠశాలల యాజమాన్యాలు వారికి కావాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతుంటాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి జాతీయస్థాయిలో విద్యార్థులకు శాశ్వత గుర్తింపును ఇచ్చే 11 అంకెలతో కూడిన పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) విధానం అమలులోకి వస్తోంది. నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగంగా ఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే అమలులోకి తీసుకువస్తోంది. భారతీయ పౌరుడిగా గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎంత కీలకమో ఇకపై ప్రతి విద్యార్థికి జాతీయస్థాయిలో రూపొందించిన ఈ శాశ్వత గుర్తింపు నంబర్ కీలకం కానుంది. దేశంలోని విద్యార్ధులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా 11 అంకెల పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్)ను కేటాయిస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కానుండడంతో ఇకపై ప్రతి పాఠశాలలో పెన్ నంబర్ను తప్పనిసరిగా విద్యార్థులకు ఆమలు చేయాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. 2024–25 విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు మినహా మిగతా విద్యార్థులందరికీ పెన్నంబర్ తప్పని సరి చేయాలని ఆదేశించారు. పెన్ నంబర్ కేటాయింపులో నిబంధనలు గత ఏడాది వరకు పాఠశాలలో ప్రవేశానికి తప్పనిసరిగా పుట్టిన తేదీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, నేటివిటీ సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి ఆ విధానానికి స్వస్తి పలకను న్నారు. ఇప్పుడు 1వ తరగతిలో విద్యార్థులను చేర్చుకునేటప్పుడు అన్ని పత్రా లు డిజిటలైజ్ చేయనున్నారు. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ చేసేటప్పుడు ఎలాంటి పత్రాల కోసం పట్టు బట్టకూడదని నిబంధన లున్నాయి. ఈ ప్రక్రియ కోసం బదిలీ అవుతున్న స్కూల్ నుంచి తెచ్చుకున్న పెన్ నంబర్ /చైల్డ్ ఐడీతోపాటు ఆధార్ నంబర్ సమర్పిస్తే సరిపోతుంది. ఇతర రాష్ట్రాల విద్యార్థుల కోసం మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇతర అవసరమైన సర్టి ఫికెట్లను అనుసరించాల్సి ఉంది. అలాంటి విద్యార్థుల డేటా అంతా వారి రాష్ట్రంలోని యూడైస్ పోర్టల్ నుంచి డ్రాప్ చేసి, మన రాష్ట్రంలో మ్యాప్ చేయా ల్సి ఉంది. ఒకటో తరగతిలో నమోదు చేసుకునే సమయంలోనే విద్యార్థులందరికీ డిజీ లాకర్ను ప్రతి ఒక్క హెచ్ఎం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలకు విద్యార్థుల మ్యాపింగ్ విద్యార్థుల బదిలీ ప్రక్రియను సులభతరం చేయడానికి అమలు చేస్తున్న కొత్త తరహా విధానంలో కీలకమైనది పాఠశాలలకు విద్యార్థుల మ్యాపింగ్. తల్లిదండ్రులు ఇచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకోవాలంటే ఆయా పాఠశాలల ట్యాగింగ్ తప్పనిసరి. విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆప్షన్ ఫారం ప్రధానో పాధ్యాయుడు తెప్పించుకుని వాళ్ల లాగిన్లో నమోదు చేసుకోవాలి. నచ్చిన పాఠశాలను ఎంపిక చేసుకుని, అటువంటి విద్యార్థులందరినీ మ్యాప్ చేసిన తర్వాత ఆ డేటా రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి ఎంపిక చేసిన పాఠశాలకు బదిలీ చేస్తారు. ప్రమోషన్ కార్యకలాపాల సమయంలో విద్యార్థులను ఎంపిక చేసుకున్న పాఠశాలలకు బదిలీ చేస్తారు. అన్ని మేనేజ్ మెంట్ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ వారి తర్వాతి తరగతిలో చేరేలా పాఠశాలకు ట్యాగ్ చేయాలి. జిల్లాలో 2.07 లక్షల విద్యార్థులకు వర్తింపుజిల్లాలోని అన్ని యాజమాన్యాల విద్యాలయాలలోనూ పెన్నంబర్ విధానం వర్తిసుంది. జిల్లాలో గల 2,235 విద్యాలయాల్లో 2,07,127 మంది విద్యార్థుల నమోదు ఉంది. అత్యధికంగా 1,636 ఎంపీపీ, జెడ్పీ స్కూళ్లలో 94,207మంది విద్యార్థులున్నారు. వారిలో ఎవరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఈ ఏడాది నుంచి పెన్ నంబర్తోనే ఆన్లైన్లో బదిలీలు చేపడుతున్నాం. –ఎన్.ప్రేమకుమార్, డీఈఓ స్కూళ్లలో ప్రవేశాలకు శాశ్వత గుర్తింపు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు టీసీ, కులధ్రువీకరణ పత్రాలకు స్వస్తిపెన్ నంబర్ వర్తించే విధానం ఒకటో తరగతి అడ్మిషన్ సమయంలో ప్రతి విద్యార్థికి కేటాయిస్తారు. అది వారి చదువు పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. విద్యా మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వ యూడైస్ పోర్టల్ ద్వారా విద్యార్థులందరికీ ఈ పెన్ నంబర్ను అందిస్తోంది. దీనిని ఎడ్యుకేషన్ ప్రారంభ సంవత్సరంలోనే ఇస్తారు. ఇది జీవితాంతం చెల్లుబాటవుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీ డియట్ వరకు విద్యార్థులకు యూనిక్ ఐడీ తరహాలో పెన్ నంబర్ను కేటాయిస్తారు. ఈ నంబర్ ద్వారానే విద్యార్థి ఎక్కడ చదివాడో? ఉన్నత చదువులను అప్డేట్ చేస్తారు. చదువులు పూర్తయిన అనంతరం వారు ఆ తరువాత ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. -
రామతీర్థం హుండీల ఆదాయం రూ.27.36 లక్షలు
నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.27,36,578 నగదు లభించిందని ఈఓ ఇజ్జిరోతు శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు. మూడు నెలలకు గానూ స్వామి వారి ఆదాయాన్ని లెక్కించామని చెప్పారు. జిల్లాకు చెందిన శ్రీవారి సేవా భక్తులు స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించగా..దేవాదాయశాఖ తనిఖీదారు లక్ష్మి లెక్కింపును దగ్గరుండి పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. జూన్1న పర్యావరణంపై విద్యార్థులకు పోటీలువిజయనగరం రూరల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 1న పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించనున్నట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ సరిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఒక విభాగం, 8 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు మరో విభాగంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పోటీలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 1వ తేదీ ఉదయం 10 గంటలకు పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఈ నెల 30, 31 తేదీల్లో గురజాడ గ్రంథాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మన భూమి, మన భవిష్యత్తు, జనరేషన్ పునరుద్ధరణ అన్న అంశాలపై పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మామిడి చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతివీరఘట్టం: మండలంలోని కంబర గ్రామానికి చెందిన రెడ్డి మహేష్(35) మామిడి చెట్టు కాయలను తెంపేందుకు బుధవారం చెట్టు ఎక్కుతూ కాలు జారి కిందపడి మృతి చెందాడు. మృతుడికి భార్య సరస్వతి, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మామిడి కాయలు తెస్తానని తమ తోటకు వెళ్లిన భర్త శవమై తిరిగి రావడంతో భార్య, బంధువులు భోరున విలపించారు. మృతుని భార్య సరస్వతి ఫిర్యాదుపై ఏఎస్సై రెల్లయ్య కేసు నమోదు చేసి,మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అగిఉన్న లారీని ఢీకొన్న ఆటో ● ఒకరి మృతి, నలుగురికి తీవ్ర గాయాలుబొండపల్లి: అగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఆటో ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఐదుగురు వ్యక్తులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఒక వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. బుధవారం వేకువ జామున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై కె.లక్ష్మణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జాతరలో ఆటవస్తువులు ఆమ్ముకుని జీవనం సాగించే కొంతమందిని గజపతినగరం నుంచి విశాఖపట్నం తీసుకువెళ్తున్న ఆటో నెలివాడ జంక్షన్ సమీపంలో జాతీయరహదారి26పై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డొక్కా సూరిబాబు(45) మృతి చెందగా డొక్కా గాయత్రి, కిల్లి రత్నం, కిల్లి రాజేష్, కిల్లి రాజ్యలక్ష్మిలకు తీవ్ర గాయాలు కావడంతో విజయగనరంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉంగరం కాజేసిన నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: వృద్ధుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి చేతికి ఉన్న బంగారు ఉంగరం, జేబులో ఉన్న నగదు లాక్కుని వెళ్లిపోయిన ఆటోడ్రైవర్ను వన్టౌన్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వన్టైన్ సీఐ బి.వెంకటరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక చల్ల పేట గ్రామం నుంచి నడుచుకుంటూ వెళ్తున్న తనను ఒక ఆటో డ్రైవర్ ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి, చేతికి ఉన్న బంగారు ఉంగరం, రూ.1500 నగదు బలవంతంగా లాక్కున్నట్లు కోళ్ల బుచ్చయ్య చౌదరి అనే వృద్ధుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన క్రైమ్ ఎస్సై తారకేశ్వరరావు, వన్టౌన్ క్రైమ్ పోలీసులు ఆటో నంబర్ ఆధారంగా నేరానికి పాల్పడిన నిందితుడిని పాత నేరస్తుడైన గజపతినగరం మండలంలోని మధుపాడ గ్రామానికి చెందిన తాడ్డి రవిగా గుర్తించారు. స్థానిక కలెక్టరేట్ జంక్షన్ వద్ద ఆదివారం ఆటోడ్రైవర్ను అదుపులోకి తీసుకుని ఉంగరాన్ని రికవరీ చేసి, రిమాండ్కు తరలించారు. -
ఎయిమ్స్ డీఎం ప్రవేశ పరీక్షలో శ్వేతకు ఫస్ట్ ర్యాంకు
విజయనగరం అర్బన్: ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) డీఎం కోర్సుల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ (ఐఎన్ఐ) నిర్వహించిన ప్రవేశ పరీక్షలో పట్టణానికి చెందిన గుణుపూరు గాయత్రి శ్వేత ఫస్ట్ర్యాంక్ సాధించింది. డీఎం కోర్సులలోని రీప్రొడక్టువ్ మెడిసిన్ విభాగంలో ఉన్న ఒకే ఒక డీఎం సీటును 76.667/100 మార్కులతో సొంతం చేసుకుంది. ఆమె ఎయిమ్స్ ఢిల్లీలో గైనకాలజీ విభాగంలో ఇటీవల పీజీ పూర్తి చేశారు. విశాఖలోని ఆంధ్రమెడికల్ కళాశాలో చదివిన ఎంబీబీఎస్ డిగ్రీలో 5 గోల్డ్ మెడల్స్ సాధించి కళాశాల 25 సంవత్సరాల చరిత్రను అప్పట్లో తిరగరాశారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యను విజయనగరం పట్టణంలోనే అభ్యసించారు. తండ్రి సత్యం నాయుడు పంచాయతీ రాజ్శాఖ (శ్రీకాకుళం)లో డీఈగా పనిచేస్తుండగా, తల్లి రమణమ్మ అడ్వకేట్ వృత్తిలో కొనసాగుతున్నారు. పట్టణంలో స్థిరపడిన వారి స్వగ్రామం సీతానగరం మండలం కృష్ణరాయిపురం. చదువులో ప్రతిభ చూపిన గాయత్రి శ్వేతకు పలువరు అభినందనలు తెలిపారు. అంబేడ్కర్ గురుకులాల్లో 54 సీట్ల భర్తీ నెల్లిమర్ల: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలోని 54 మిగులు సీట్లు భర్తీ అయ్యాయని ప్రిన్సిపాల్ కె.ఉషారాణి తెలిపారు. నెల్లిమర్లలోని అంబేడ్కర్ గురుకులంలో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. నెల్లిమర్ల, చీపురుపల్లి, వేపాడ, వియ్యంపేట, కొమరాడ, గరుగుబిల్లి గురుకులాల్లో ఖాళీగా ఉన్న 143 సీట్లకు ఎస్సీ–38, ఎస్టీ–1, బీసీ–14, ఓసీ–1 కలిపి మొత్తం 54 సీట్లను లాటరీ విధానంలో జిల్లా సమన్వయ అధికారి టి.పద్మజ ఆధ్వర్యంలో భర్తీ చేశారు. కౌన్సెలింగ్ కార్యక్రమంలో డా.బి.ఆర్ అంబేబ్కర్ గురుకుల పాఠశాల హెచ్ఎం టి.ఎం.ఫ్లోరెన్స్, టి.జయశ్రీ, ఎ.రాణిశ్రీ, టి.రామదాసు, ఎల్.పద్మావతి, సంధ్య పాల్గొన్నారు. ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలవండి ● సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ విజయనగరం ఫోర్ట్: ఆపదలో ఉన్నామని వచ్చిన మహిళలకు అండగా నిలవాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ ఎ.విజయ ఆదేశించారు. స్థానిక దిశ వన్స్టాప్ సెంటర్ను బుధవారం ఆమె పరిశీలించారు. వన్స్టాప్ సెంటర్లో సేవల రికార్డులను తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. అవసరమైన వారికి వైద్య సహాయం చేయాలన్నారు. సంరక్షణతో పాటు రక్షణ కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ నోడల్ అధికారి విజయకుమారి, వన్స్టాప్ సెంటర్ పోలీస్ ఫెసిలిటేషన్ అధికారి శోభరాణి, కౌన్సిలర్ రమాదేవి, టి.అనిత, ఆర్.వెంకటలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చర్యలు ● జిల్లా వ్యవసాయ అధికారి రామారావు చీపురుపల్లి: ఖరీఫ్ సీజన్ ఆసన్నమైన తరుణంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఎమ్మార్పీ ధరలకు మాత్రమే విక్రయించాలని, నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి కె.టి.రామారావు హెచ్చరించారు. స్థానిక వ్యవసాయశాఖ సబ్ డివిజినల్ కార్యాలయంలో సబ్ డివిజన్ పరిధిలోని ఎరువుల దుకాణాల డీలర్లు, వ్యవసాయశాఖ సిబ్బందితో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల దుకాణాల డీలర్లందరూ నిబంధనలు పాటించాలన్నారు. విత్తనాలు, పురుగు మందులు బ్లాక్చేసి ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయించి రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవన్నారు. విత్తనాలకు సంబంధించి డీలర్లు ముందుగా మొలక శాతం ధ్రువీకరించిన తర్వాత మాత్రమే విక్రయించాలన్నారు. ఎరువులు దుకాణాలు ఎమ్మార్పీ ధరల పట్టిక ప్రదర్శించాలన్నారు. సబ్ డివిజిన్ పరిధిలోని ఐదు మండలాల్లోని రైతుభరోసా కేంద్రాల సిబ్బంది ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. కార్యక్రమంలో ఏడీఏలు ఎన్.కోటీశ్వరరావు, అన్నపూర్ణ, ఏఓ సీహెచ్.రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు. -
కొండెక్కిన చికెన్ ధరలు
రామభద్రపురం: చికెన్ ధరలు అమాంతం పెరగడంతో మాంసాహార ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మాంసం విక్రయదారులు చికెన్ ధర పెంచి విక్రయిస్తుండడంతో కొనుగోలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో ఆ వేడికి బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, దాణాను తీసుకునేందుకు కోళ్లు ఇష్టపడకపోవడంతో అవి బరువు పెరగడం లేదని, వీటి కారణంగా ధరలు పెరుగుతున్నాయని ఫౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. మరోవైపు లైవ్ కోడి కిలో రూ.180 వరకు ధర పలుకుతుండగా, దీనికితోడు కోడిగుడ్డు ధర కూడా రూ.7కు చేరుకుంది. వేసవి వేడి కారణంగానే కోళ్లు, గుడ్లు ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోందని, రోజురోజుకూ పెరుగుతున్న ఎండలకు చాలా కోళ్లు చనిపోతున్నాయని కోళ్లఫారం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ముగిసే సరికి ఇప్పుడున్న కిలో చికెన్ ధర మరో రూ.50 వరకు పెరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆకాశాన్నంటుతున్న చికెన్ ధరలు చూసి, కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. లేయర్స్(గడ్లు పెట్టే కోళ్లు) విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలకు లేయర్ కోళ్లు గుడ్లు అంతగా పెట్టడం లేదు. దీంతో కోడిగుడ్లు ధర కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం 100 కోడిగుడ్లు ధర రూ.500 నుంచి రూ.550 వరకు ఉంటోంది. దుకాణాల వద్ద ఒక్కో గుడ్డు రూ.6 నుంచి రూ.7 వరకు విక్రయిస్తున్నారు. కనీసం గుడ్డు తినేందుకు కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు. ఇంత ధర అయితే ఎలా కొనుగోలు చేసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతలతో తగ్గిన కోళ్ల ఉత్పత్తి ధరల పెరుగుదలతో బెంబేలెత్తుతున్న కొనుగోలుదారులు -
రోగులకు చికిత్స త్వరగా ప్రారంభించాలి
● 108 జిల్లా మేనేజర్ నజీర్ హుస్సేన్ విజయనగరం ఫోర్ట్: ఆపదలో ఉన్న రోగికి వెంటనే చికిత్స ప్రారంభించాలని108 జిల్లా మేనేజర్ నజీర్ హుస్సేన్ సూచించారు. ఈ మేరకు స్థానిక 108 సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన 108లో పనిచేస్తున్న ఈఎంటీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడు తూ రోగులను సకాలంలో ఆస్పత్రికి చేర్చడం వల్ల ప్రాణాలు కాపాడ వచ్చన్నారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయాలని స్పష్టం చేశారు. గుండెజబ్బులు వచ్చినప్పడు చేయాల్సిన ప్రథమ చికిత్స గురించి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఓజేటీ ఎ. శ్రీనివాసరావు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్స్ సాయి షణ్ముఖ, రవికుమార్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. బడి ఈడు పిల్లలు బడిలోనే ఉండాలిపార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలని కార్మికశాఖ జిల్లా ఇన్చార్జ్ అధికారి, సహాయ కమిషనర్ కె. రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర కార్మికశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కార్మికశాఖ, ఇతర ప్రభుత్వశాఖలు సంయుక్తంగా జిల్లాలో జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకు చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 14 సంవత్సరాల వయస్సు లోబడిన పిల్లలు షాప్స్, సంస్థలు, వాణిజ్య సంస్థలు, హోటల్స్, సినిమా హాల్, మెకానిక్ షెడ్స్, రెడీమేడ్ దుకాణాలు, కిరాణా షాప్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, వెల్డింగ్ షాప్స్, తోపుడు బండ్లు, మోటార్ రవాణా వంటి ప్రమాద రహిత ప్రదేశాల్లో పని చేయరాదని, ప్రమాదకరమైన ప్రదేశాల్లో 18 సంవత్సరాల లోపు బాలబాలికలను పనిలో పెట్టుకోకూడదని స్పష్టం చేశారు. కార్మికశాఖ చట్టాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా బాలబాలికలు పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తిస్తే అందుకు కారణమైన సదరు యాజమాన్యంపై బాల కార్మికుల చట్టం 1986 అనుసరించి తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాను బాలకార్మిక రహిత జిల్లాగా మార్చడమే కార్మికశాఖ ముఖ్యఉద్దేశమని చెప్పారు. -
మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్
రాజాం సిటీ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేశామని ఎస్ఈబీ సీఐ బి.శ్రీధర్ బుధవారం తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడిచేసి రేగిడి పోలీస్స్టేషన్ పరిధిలో ఒక ట్రాక్టర్, రాజాం టౌన్లో రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. 13.5 టన్నుల ఇసుకతోపాటు మూడు ట్రాక్టర్లను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు అప్పగించామని తెలిపారు. ఎస్ఈబీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశామని టౌన్ సీఐ డి.మోహనరావు తెలిపారు. -
హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ
విజయనగరం ఫోర్ట్: హైరిస్క్ గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు వైద్యాధికారులకు సూచించారు. ఈ మేరకు మాతాశిశు మరణాలపై మంగళవారం సాయంత్రం ఆయన తన చాంబర్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణులను గుర్తించిన నాటి నుంచి వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. శిశు మరణాలు తగ్గించే విధంగా గర్భిణి దశ నుంచి తగు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మాతాశిశు మరణాలు పూర్తిగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మాతాశిశు మరణాలు జరిగిన ప్రాంతంలో అందుకు గల కారణాలను అన్వేషించాలని సూచించారు. ప్రసవ తేదీకి ముందుగానే హైరిస్క్ గర్భిణులను ఆస్పత్రిలో చేర్పించాలని, హైరిస్క్ తీవ్రతను తగ్గించడానికి అవసరమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ బి. గౌరీశంకర్, ఘోషా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ శుభశ్రీ, పిడియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత దేవి, అనస్తీషియా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.స్వాతి, డాక్టర్ ఎ.కృష్ణ కుమార్, డాక్టర్ ఎన్. సూర్యనారాయణ, డీపీహెచ్ఎన్ఓ మామిడి సత్యవతి, డెమో చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భాస్కరరావు -
విహారంలో విషాదం
వారసులైన వారు అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడంతో ఆయా కుటుంబాల్లో పెనువిషాదం అలుముకుంది. బాగా చదువుకుని స్థిరపడి భవిష్యత్తులో ఆదుకుంటారని ఆశించిన పిల్లలకు అంతిమ సంస్కారం తామే చేయవలసి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో రోజూ కలిసి ఆడుకుంటున్న విద్యార్థులు సరదాగా విహారానికి వచ్చి నదిలో మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నదిలో గాలిస్తున్న ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు జామి: వేసవిసెలవులు కావడంతో విజయనగరం జిల్లాకేంద్రంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన ఆరుగురు విద్యార్థులు సరదాగా జామి–జాగరం చెక్డ్యాం దగ్గర వాటర్ఫాల్స్కు విహారానికి వచ్చారు. ఇక్కడి చెక్డ్యాం నుంచి నీరు గోస్తనీ నదిలోకి వాటర్ ఫాల్స్లా పారుతుంది. దీంతో అనేక మంది విహారానికి ఈ ప్రాంతానికి వచ్చి స్నానాలు చేస్తూ సరదాగా గడుపుతుంటారు. అదే ూదిరిగా విజయగనగరానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు జామి చెక్డ్యాం వద్దకు వచ్చి సరదాగా గడిపి వాటర్ఫాల్స్లో స్నానాలు చేశారు. వారిలో ముగ్గురు బయటకు వచ్చేయగా మిగిలిన మరో ముగ్గురు మహ్మద్ అస్సాఫ్(17), మహ్మద్ షాకీత్ఖాన్ (16), గుల్లపాటి అనిల్ (14) గోస్తనీ నదిలోనుంచి బయటకు వస్తున్న సమయంలో నదిలో సుమారు 16 అడుగుల లోతు ఉన్న గోతిలో అనిల్ మునిగిపోతుండగా అస్సాఫ్ కాపాడే ప్రయత్నం చేస్తూ నీటమునిగిపోయాడు. వారిద్దరినీ కాపాడదామని ప్రయత్రించిన షాకీత్ఖాన్ కూడా నదిలోకి వెళ్లి నీట మునిగాడు. వారితో వచ్చిన ముగ్గురు యువకులు పెద్దగా కేకలు వేయగా కొంతదూరంలో ఉపాధి పనులు చేస్తున్న స్థానికులు పరుగుపరుగున వచ్చినదిలో గాలించారు. ఈలోగా ప్రమాద సమాచారం పోలీసులకు అందడంతో ఎస్సై వీరబాబు, సీఐ ఉపేంద్ర ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. స్థానికులతో గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఏపీఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పైర్ సిబ్బందిని రప్పించగా వారు రంగంలోకి దిగి గాలింపు చేపట్టడంతో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చాలా సమయం తరువాత మూడవ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి పోస్ట్మార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి ఎంపీడీఓ తిరుమలరావు, ఆర్ఐ శ్రీదేవి, పలువురు వీఆర్వోలు వచ్చి గాలింపు చర్యల్లో సహాయ సహకారాలు అందజేశారు. మృతిచెందిన ముగ్గురూ విద్యార్థులే విజయగనరం కంటోన్మెంట్కు చెందిన మహమ్మద్ అస్సాఫ్(17), కణపాక చెందిన షాకీద్ ఖాన్(17)లు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, అనిల్ 8వతరగతి చదువుతున్నారు. మృతుల తల్లిదండ్రులు అన్వర్, సిరాజ్ఖాన్, కుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు. గతంలో పలువురి మృత్యువాతఈప్రాంతానికి విహారానికి వచ్చిన వారు గతంలో కూడా పలువురు మృత్యువాత పడ్డారు. ఇక్కడ వాటర్ఫాల్స్ మాదిరిగా ఉండడంతో వేసవిలోను, కార్తీకమాసంలోనే అనేక మంది ఈప్రాంతానికి వచ్చి సరదాగా గడుపుతుంటారు. గోస్తనీ నదిలో పెద్దగోతులు ఉండడంతో విషయం తెలియక నదిలో దిగిన వారు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 8మంది మృతిచెందారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది ఇప్పటికై నా అప్రమత్తమై ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్ధానికులు కోరుతున్నారు. గోస్తనీ నదిలో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి శోకసంద్రంలో తల్లిదండ్రులు -
లింగ నిర్ధారణ పరీక్షలు నేరం
పార్వతీపురంటౌన్: గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని డీఎంహెచ్ఓ డాక్టర్ విజయ పార్వతి స్పష్టం చేశారు. స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లు, ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని, లింగ నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు రుజువైతే సంబంధిత వైద్యులు, స్కానింగ్ సెంటర్ల యజమానులు, అందుకు ప్రోత్సహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘సత్య’ విద్యార్థికి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్విజయనగరం టౌన్: స్థానిక తోటపాలెంలో ఉన్న సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో బీబీఏ కోర్సు విద్యార్థిని కె.రమ్య 9.07 గ్రేడ్ పాయింట్లతో ఆంధ్రాయూనివర్సిటీ–2024 పరీక్ష ఫలితాల్లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో బీబీఏ కోర్సులో 2024 యూనివర్సిటీ పరీక్షా ఫలితాల్లో రమ్యకు తొలిస్థానం, ఊర్మిక 8.86 గ్రేడ్ పాయింట్లతో రెండోస్థానం సాధించారని చెప్పారు. భవిష్యత్తులో రమ్య, ఊర్మికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి.సాయిదేవమణి, సీతం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామమూర్తి, 2 ఆంధ్రా గర్ల్స్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ గోపేందర్, విద్యార్థులు పాల్గొన్నారు. సీతంలో ఎన్సీసీ వార్షిక శిక్షణవిజయనగరం అర్బన్: గాజులరేగలోని సీతం కళాశాలలో ఎన్సీసీ 2(ఎ) గర్ల్స్ బెటాలియన్ శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. క్యాంప్ కమాండింగ్ ఆఫీసర్ కల్నాల్ గోపేంద్ర పర్యవేక్షణలో 10 రోజుల పాటు ఈ శిక్షణ జరుగుతుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యువత భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని దేశ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. శిబిరంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ కెప్టెన్ మీసాల సత్యవేణి, సుబేదార్ మేజర్ బొడ్లే, పరమేశ్వర్ సింగ్, అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్స్ లెఫ్ట్నెంట్ మజ్జి వరలక్ష్మి, థర్డ్ ఆఫీసర్ వెంకట రత్నం, లెఫ్ట్నెంట్ సంతోషి, థర్డ్ ఆఫీసర్ ఎ.వరలక్ష్మి, తులసి, లక్ష్మీప్రసన్న, గౌరి, వెంకట రమణమ్మ, ధనశ్రీ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన 600 మంది ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. పైడితల్లికి మామిడి పండ్ల నివేదనవిజయనగరం టౌన్: కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి భక్తులు మధుర ఫలాలతో నివేదన చేశారు. పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్థానిక మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి, రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి మంగళవారం భక్తులతో పోటెత్తాయి. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం, అర్చన చేశారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్, మూలా పాపారావు తదితరులు ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమ, ఘటాలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి డీవీవీ.ప్రసాదరావు పర్యవేక్షించారు. -
మరో ఆరు రోజులే..!
సాక్షి, పార్వతీపురం మన్యం: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు తెరపడడానికి సమయం దగ్గర పడుతోంది. మరో ఆరు రోజుల్లో అందరి సందేహాలు, పార్టీల అంచనాలు, గెలుపు లెక్కలు తేలిపోనున్నాయి. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న పార్వతీపురం మన్యం జిల్లాలోని ఉల్లిభద్రలో గల ఉద్యాన కళాశాల వద్ద ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. లెక్కింపు సమయంలో ఎన్నికల కమిషన్ నియమించిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు పరిశీలకులుగా హాజరు కానున్నారు. మరోవైపు సమయం దగ్గర పడుతున్నకొద్దీ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. తీర్థయాత్రలు, విహార యాత్రలకు వెళ్లిన అభ్యర్థులు జిల్లాకు చేరుకుంటున్నారు. పార్టీ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపార్వతీపురం మన్యం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 29 మంది, అరకు పార్లమెంట్ పరిధిలో ఎంపీ స్థానానికి 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నాలుగు నియోజకవర్గాల పరిధిలో 7,83,440 మంది ఓటర్లుండగా.. 6,04,064 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో 22,500కుపైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వాటి లెక్కింపు కోసం ఒక గది, 20 వరకు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 20 మంది జిల్లా అధికారులను సహాయ ఎన్నికల అధికారులుగా నియమించారు. వారితోపాటు ఒక గెజిటెడ్ అధికారి, ఇతర సిబ్బంది ఉంటారు. ఉదయం 8 గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈవీఎంల ప్రారంభానికి అరగంట ముందే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభిస్తారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు కోసం ఎనిమిది గదులను గుర్తించారు. ప్రతి నియోజకవర్గానికీ 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. శాసనసభ నియోజకవర్గం ఓట్ల కేంద్రంలో రిటర్నింగ్ అధికారి వేదిక వద్ద రెండు టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ వద్ద అభ్యర్థి గానీ, ప్రధాన ఏజెంట్ గానీ ఉండవచ్చు. ఈవీఎం ఓట్ల లెక్కింపు వద్ద ఒక్కో ఏజెంట్ ఉండొచ్చు. ప్రతి టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. రిటర్నింగ్ అధికారి వద్ద జరిగే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వద్ద ఇద్దర సూక్ష్మ పరిశీలకులు ఉంటారు. మొత్తం 200 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, ఇతర సిబ్బంది ఉంటారు. సాయంత్రం 4 గంటల్లోగా తుది ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి 17 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసి తొలి ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి లెక్కింపు అత్యధికంగా 20 రౌండ్లు ఉంటుంది. 144 సెక్షన్ అమలుఫలితాలు వెల్లడయ్యే రోజు ఎటువంటి అల్లర్లూ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల పార్కింగ్, ప్రవేశాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంచుతున్నారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ అనంతర పరిస్థితుల దృష్ట్యా చర్యలు తీసుకుంటారు. 158 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్లు నిరంతరం నిఘాలో ఉంటాయి. దీంతోపాటు..ర్యాలీలు, బాణసంచా వినియోగం, విడి పెట్రోల్ అమ్మకంపైనా నిఘా పెట్టారు. గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు జల్లెడ పడుతున్నారు. అనుమానిత వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచారు. కార్డన్సెర్చ్ పేరిట తనిఖీలు చేపడుతున్నారు. పేలుడు పదార్థాలు, మారణా యుధాయులపైనా నిఘా ఉంచారు. కాలం చెల్లిన, ఇతర ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. నో ఫ్లయింగ్ జోన్గా ఓట్ల లెక్కింపు కేంద్రంఉల్లిభద్రలో గల ఉద్యాన కళాశాల పరిసరాలను ‘‘నో ఫ్లయింగ్ జోన్’’గా ప్రకటించారు. మానవ రహిత వైమానిక వాహనాలు(యూఏవీ), డ్రోన్, బెలూన్లు మొదలైన వాటితో సహా ఎలాంటి విమానయాన పరికరాలనూ ఎగురవేయడాన్ని నిషేధించారు. అరకు (ఎస్టీ)పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో సహా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జూన్ నెల 4న ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లలో జరుగుతుంది. ఇప్పటికే ఇక్కడి స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ హాళ్ల భద్రత దష్ట్యా ఉల్లిభద్రలో గల ఉద్యాన కళాశాల పరిసరాలను తదుపరి ఆదేశాల వరకు ‘నో ఫ్లయింగ్ జోన్’గా ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిషాంత్కుమార్ తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం కౌంటింగ్ కేంద్రాల్లోకి ఆ రోజున ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలనూ అనుమతించరు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వాచ్లు తదితరాలను నిషేధించారు. ఏజెంట్లు పెన్ను, పెన్సిల్, 17సీ ఫారం, తెల్ల కాగితం మాత్రమే తీసుకువెళ్లాలి. ఎన్నికల ఫలితాలకు సమీపిస్తున్న సమయం అభ్యర్థుల్లో పెరుగుతున్న ఉత్కంఠ ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం అల్లర్లు జరగకుండా విస్తృతంగా తనిఖీలు -
ఘనంగా డిప్యూటీ స్పీకర్ జన్మదిన వేడుకలు
విజయనగరం: శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు, బంధువులు వివిధ ఆలయాల్లో ఉదయం పూజలు చేశారు. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని వేడుకున్నారు. అనంతరం నగరంలోని కోలగట్ల నివాసంలో పార్టీ నియోజకవర్గం నాయకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, పార్టీ జోనల్ ఇన్చార్జ్లు కృష్ణారావు, తమ్మన్నశెట్టిలు కలిసి భారీ కేక్ను కట్ చేసి, కోలగట్లకు బర్త్డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు మాట్లాడుతూ మంచి మనసున్న నేతగా, ఆయన సేవా కార్యక్రమాలతో అందరి ఆత్మబంధువుగా వెలుగొందుతున్న కోలగట్ల వీరభద్రస్వామి పుట్టిన రోజును సంబరంలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కోలగట్ల బర్త్ డే సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ శెట్టివీరవెంకట రాజేశ్వరరావు, పార్టీ జోనల్ ఇన్చార్జ్ బొద్దాన అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీలో విలువైన కోర్సులు అందించడమే లక్ష్యం
చీపురుపల్లి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ఉపయోగపడే విలువైన కోర్సులు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జీఏడీ కార్యదర్శి, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. స్థానిక పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో జోన్–1 పరిధిలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న 40 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్న గ్రూపుల ఆధారంగా కళాశాలలను మూడు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. పది కంటే ఎక్కువ గ్రూపులు ఉన్న కళాశాలలను కేటగిరీ–1 గాను, ఐదు నుంచి పది గ్రూపులు ఉన్న కళాశాలలను కేటగిరీ–2 గాను, అంతకంటే తక్కువ గ్రూపులు ఉన్న కళాశాలలను కేటగిరీ–3 గాను విభజించినట్లు చెప్పారు. ఆయా కళాశాలల్లో రానున్న విద్యా సంవత్సరంలో ఎలాంటి కోర్సులు కొనసాగించాలి, ఇంకా ఎలాంటి కోర్సులు అవసరం ఉంది, కోర్సులకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఎంత అవసరమనే విషయాలను చర్చించుకుని, ప్రభుత్వానికి ప్రతిపాదనలను నివేదించేందుకే ఈ సమీక్ష చేపట్టామన్నారు. డిగ్రీలో ఫస్టియర్లో చేరే విద్యార్థులు మూడేళ్ల పాటు కోర్సులో కొనసాగాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో మధ్యలో ఎలాంటి మార్పులు లేకుండా విద్యా సంవత్సరం ఆరంభంలోనే అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుని, మూడేళ్ల కోర్సు నిరంతరాయంగా జరగాలన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఎలాంటి కొత్త విధానాలు అమలు చేయాలన్నా ఇప్పుడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఆర్ట్స్, సైన్స్, కంప్యూటర్ గ్రూపులకు సంబంధించి కొత్త కోర్సులు కావాలన్నా, అధ్యాపకులు అవసరమైనా, సిబ్బంది అవసరమైనా ఇప్పుడే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులు ఏ రకమైన కోర్సులపై ఆసక్తి చూపిస్తున్నారో వాటినే అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సంప్రదాయంగా వస్తున్న కోర్సులపై విద్యార్థులు ఆసక్తి కనబరచకపోతే వాటిని తొలగించాలన్నారు. కార్యక్రమంలో కాలేజీయేట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ డా.ఎస్.శోభారాణి, అకడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డా.తులసీ మస్తానమ్మ, కళాశాల ప్రిన్సిపాల్ డా.పివి.కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు. జీఏడీ కార్యదర్శి, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ -
తిరుమల శ్రీవారి సేవలో డిప్యూటీ స్పీకర్
విజయనగరం: తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మంగళవారం దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా సతీసమేతంగా శ్రీవారి సన్నిధికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి, అర్చకులతో స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు. స్వామి వారి శేషవస్త్రాన్ని స్వీకరించిన అనంతరం మీడియాతో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వరస్వామి కృపాకటాక్షాలు ప్రజలందరిపైనా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుడిని వేడుకున్నట్లు తెలిపారు. అలాగే స్వామి వారి ఆశీర్వాదంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని, ఆయననే మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. అంతకుముందు కోలగట్ల తన కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి, అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో కోలగట్ల వీరభద్రస్వామి సతీమణి రమణి, పార్టీ నాయకులు జి.శ్రీనివాస్, పైడితల్లమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఎం.కె.బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి
- Lok Sabha Election 2024: ఏడో విడతలో టఫ్ ఫైట్
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
Advertisement