-
స్ట్రాంగ్ రూంల పరిశీలన
ఆక్వాను ఆదుకోవాలి రొయ్యల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, మద్దతు ధరకు రొయ్యలు కొనాలని రొయ్యల రైతుల సంఘం నాయకులు పశ్చిమ కలెక్టర్ను కోరారు. 8లో uభీమవరం: ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పాలైన ఓట్లు లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక విష్ణు కళాశాల ఆవరణలో కౌంటింగ్ కేంద్రాలు, టేబుల్స్ ఏర్పాటు, స్ట్రాంగ్ రూంలను పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లతో కలిసి కలెక్టర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ కోసం ముందస్తు ఏర్పాట్ల ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. జూన్ 4 న కౌంటింగ్ కోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు సెగ్మెంట్లకు 14 చొప్పున, పరిశీలకులు, పోస్టల్, ఈటీపీబీఎస్ల కోసం టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ పరిశీలకు ఒక టేబుల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పార్లమెంటు నియోజక అభ్యర్థులకు పోలైన ఓట్లను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించిన బ్లాక్లలో లెక్కించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, ఈటిపిబిఎస్ ఓట్లను విష్ణు కళాశాల లైబ్రరీ హాల్లో లెక్కించనునట్లు తెలిపారు. ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ సి.వి ప్రవీణ్ ఆదిత్యతో కలిసి కలెక్టరు స్వయంగా పరిశీలించారు. -
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు
భీమవరం: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ హెచ్చరించారు. మంగళవారం భీమవరం పట్టణంలోని ఎస్ఆర్కేఆర్, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలల వద్ద ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను ఎస్పీ వేజెండ్ల అజితతో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మార్గాలను, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వీలుగా ఏర్పాటు చేసిన మార్గాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల వెబ్ కాస్టింగ్ను పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కేంద్రాలలోకి వెళ్లే మార్గాల వద్ద దిక్సూచి బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గుర్తింపు కార్డులున్నవారిని మాత్రమే అనుమతించాలన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందస్తు జాగ్రత్త చర్యల గురించి ఎస్పీ వివరించారు. హింసాత్మకమైన సంఘటనలకు పాల్పడితే సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా అటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని ఐజీ హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, డీఎస్పీ వి.నారాయణస్వామి, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎం.సత్యనారాయణ, దిశ డీఎస్పీ నున్న మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ -
పారిజాతగిరిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల అభీష్టాలు తీర్చే స్వామిగా పూజలందుకుంటున్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు విశిష్ట ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఆలయ ప్రధానార్చకుడు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయంలో విశ్వక్సేన పూజ, అంకురార్పణ, వైనతేయ ప్రతిష్ట తదితర పూజలు నిర్వహించారు. ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరు కాగా, తీర్ధప్రసాదగోష్టి, ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ఈవో మానికల రాంబాబు పర్యవేక్షించగా, ఆలయ కమిటీ, అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నేటి కార్యక్రమాలు : పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, కుంభస్థాపన, నిత్య హోమం జరుగుతాయి. సాయంత్రం స్వామికి శేష వాహన సేవ నిర్వహిస్తారు. నేడు శేష వాహన సేవ -
మద్దతు ధరకు రొయ్యల కొనుగోలుకు వినతి
భీమవరం: రొయ్యల ధరలు గణనీయంగా తగ్గడంతో ఆక్వా రైతుల పరిస్థితి దమనీయంగా మారిందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని మద్దతు ధరలకు రొయ్యలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రొయ్యల రైతుల సంఘం నాయకులు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీని కోరారు. మంగళవారం ఆక్వా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు వెంకటసుబ్బరాజు (జీకేఎఫ్), అదనపు కార్యదర్శి మళ్ల తులసీరామ్ (రాంబాబు) కలెక్టర్ సుమిత్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్వా సాగులో గతంలో ఎన్నడూలేని విధంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇటువంటి తరుణంలో రొయ్యల కొనుగోలుదారులు ధరలు తగ్గించడం వల్ల మరింత దుర్బర పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రొయ్యల పట్టుబడులు పెరిగాయని, దీనిని ఆసరాగా చేసుకుని కొనుగోలుదారులు కిలోకు రూ.20 వరకు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ అధికారులు, అప్సడా, ఫిషరీస్ అధికారుల దృష్టికి కూడా తమ సమస్యను తీసుకువెళ్లినట్టు సుబ్బరాజు, రాంబాబు చెప్పారు. మద్దతు ధరలకు రొయ్యలు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. అధికారులు స్పందించి మద్దతు ధరలకు రొయ్యలు కొనుగోలు చేసేలా కొనుగోలుదారులతో మాట్లాడాలని కోరారు. కలెక్టర్తోపాటు అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్, ఫిషరీస్ జేడీ ఆర్వీఎస్వీ ప్రసాద్కు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. సంఘం నాయకులు వెంకటేశ్వరరాజు, ఐ.సీతారామరాజు, ఎన్.మహేష్, ఎ.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. -
దానియేలు సేవలు మరువలేనివి
భీమవరం అర్బన్: దిరుసుమర్రు గ్రామాభివృద్ధికి సర్పంచ్గా గూడపాటి దానియేలు ఎంతగానో కృషి చేశారని, అటువంటి వ్యక్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు అన్నారు. భీమవరం మండలంలోని దిరుసుమర్రు గ్రామంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు మేడిది జాన్సన్, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని గూడూరి ఉమాబాలతో కలిసి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు మంగళవారం గ్రామ మాజీ సర్పంచ్ గూడపాటి దానియేలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొయ్యే మోషేన్రాజు మాట్లాడుతూ మనం చేసిన మంచి పనులే ప్రజలకు గుర్తుండిపోయేలా చేస్తాయన్నారు. మాజీ సర్పంచ్ గూడపాటి దానియేలు తన రాజకీయ చతురతతో ఎంతోమంది సమస్యలు పరిష్కరించేవారన్నారు. ఆయన చేసిన సేవలను వక్తలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మెంటే పార్థసారధి, ఐజాక్ బాబు, మాజీ సర్పంచ్ బోకూరి విజయరాజు, దానియేలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు దిరుసుమర్రులో దానియేలు విగ్రహావిష్కరణ -
కౌంటింగ్కు రాజకీయ పార్టీలు సహకరించాలి
కలెక్టర్ సుమిత్కుమార్ భీమవరం: ఓట్ల లెక్కింపులో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. మంగళవారం ఆనంద్ ఇన్ సమావేశ మందిరంలో అభ్యర్థులు, ఏజెంట్లతో ఓట్ల లెక్కింపుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో వచ్చేనెల 4న భీమవరం పట్టణంలోని విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు నియోజవర్గాలు, ఎస్ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ముందుగా 8 గంటలకు పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుందన్నారు. అనంతరం 8.30 గంటల నుంచి 7 నియోజకవర్గాల కౌంటింగ్ హాళ్లలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని కలెక్టర్ వివరించారు. పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విష్ణు కళాశాలలో మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలలో పోలైన ఓట్ల వివరాలను అభ్యర్థులు లేదా ఏజెంట్లకు ప్రతి టేబుల్ వద్ద చూపిస్తారని అభ్యంతరాలు ఉంటే వెంటనే చెప్పాలన్నారు. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎట్టి పరిస్థితులలో అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఎప్పీ వేజెండ్ల అజిత మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రతినిధులు, అనుచరులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని ముందుగానే వీడియో సందేశం పంపాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి చందన దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ క్లాసులు సద్వినియోగం చేసుకోవాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం గ్రేడ్–1 శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరం సమ్మర్ క్లాసులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కేంద్ర గ్రంథాలయం(ఏలూరు) కార్యదర్శి ఎం.శేఖర్బాబు పేర్కొన్నారు. పట్టణంలోని గ్రంథాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. శేఖర్ బాబు మాట్లాడుతూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుంటే వారి భవిష్యత్తు బంగారం అవుతుందన్నారు. విజ్ఞానంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. విశ్రాంత అధ్యాపకుడు గరికపాటి బాపయ్యశర్మ, ప్రత్తి వీరాస్వామిలచే తొలుత పుస్తక పఠనం, ఇంగ్లీషు, తెలుగు పాఠ్యాంశాలు, ఎల్ఐసీ ఉద్యోగి రామాంజనేయులు ఆధ్యాత్మిక విషయాలను నేర్పించారు. యెగా మాస్టార్ పాండు యోగా శిక్షణ అందించారు. గ్రంథాలయాధికారి వి.శ్రీనివాస్రావు పర్యవేక్షించారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షకు 2,497 మంది హాజరు భీమవరం: టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా మంగళవారం నిర్వహించిన గణిత పరీక్షకు 49.90 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.వెంకటరమణ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 5,004 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 2,497 మంది హాజరయ్యారన్నారు. క్యాన్సర్పై అవగాహన కల్పించాలి ఏలూరు (టూటౌన్): క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ శర్మిష్ట చెప్పారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాన్సర్ శిక్షణా కార్యక్రమాన్ని డీఎం అండ్ హెచ్ఓ శర్మిష్ట, వైద్యకళాశాల ప్రధాన అధ్యాపకుడు డాక్టర్ భాస్కరరావుతో కలిసి మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా అవగాహాన పెంచుకొని క్యాన్సర్ గురించి సమగ్రంగా తెలుసుకుని తెలుసుకున్న విషయాలను కింది స్థాయి వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పిలు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. వైద్య కళాశాల ప్రధాన అధ్యాపకుడు భాస్కరరావు మాట్లాడుతూ కింది స్థాయి వైద్య సిబ్బంది ప్రజల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించిన వెంటనే వారికి మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన వైద్యాన్ని అందించడానికి సహాయపడాలన్నారు. -
విత్తనశుద్ధి కర్మాగారంలో విజిలెన్స్ తనిఖీలు
● బిల్లులు లేని రూ.4.75 లక్షల విలువైన 61 క్వింటాళ్ల విత్తనాలు స్వాధీనం ● యజమాని చిట్టూరి సూర్యనారాయణపై కేసు నమోదుపెంటపాడు: రాచెర్ల గ్రామంలో ధన సీడ్స్ విత్తనశుద్ధి కర్మాగారంలో మంగళవారం విజిలెన్సు అధికారులు తనిఖీలు చేశారు. సరైన బిల్లులు లేకుండా విత్తనాలు నిల్వ చేసినట్లుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏలూరు రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరణం కుమార్ ఆదేశాల మేరకు కర్మాగారంలో తనిఖీలు నిర్వహించి సరైన బిల్లులు లేని రూ.4,75,650 విలువైన 61 క్వింటాళ్ల తెల్ల హంస, పీఆర్ 126 అనే రెండు రకాల విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యజమాని చిట్టూరి సూర్యనారాయణపై 6ఎ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ తనిఖిలో విజిలెన్సు ఇన్స్పెక్టర్ పి.శివరామకృష్ణ, విజిలెన్స్ వ్యవసాయ శాఖాధికారి పి.సురేష్, మండల వ్యవసాయ శాఖ అధికారి పార్థసారథి పాల్గొన్నారు. -
మహిళలే నిర్ణేతలు
బుధవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2024చారిత్రాత్మక విజయం ఖాయం నరసాపురం పార్లమెంట్లో వైఎస్సార్సీపీ చారిత్రాత్మక విజయం ఖాయమని పార్టీ కేడర్ ధీమా వ్యక్తం చేస్తుంది. తొలిసారి వైఎస్సార్సీపీ పార్టీ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ న్యాయవాది గూడూరి ఉమాబాల పోటీలో నిలిచి చరిత్రకెక్కారు. సామాజికవర్గాలకు అతీతంగా ఆమెకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ ఇంటి ఆడబిడ్డలా ఆదరించారు. మహిళల ఓటింగ్ పెరగడం ఉమాబాలకు కలిసొచ్చే అంశమని, ఆమె భారీ ఆధిక్యతను సాధిస్తారని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు. సాక్షి, భీమవరం: సార్వత్రిక సమరంలో అధికశాతం పోలింగ్ ద్వారా మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారారు. పురుషుల కంటే 11,534 ఓట్లు అధికంగా మహిళల ఓట్లు పోలయ్యాయి. గత ఐదేళ్లలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సానుకూలత ఈ పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ఇందుకు బలం చేకూరుస్తోంది. జిల్లాలో 14,72,923 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 7,21,532, మహిళలు 7,51,313, ఇతరులు 78 మంది ఉన్నారు. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో 6,02,543 మంది పురుషులు 6,14,077 మంది మహిళలు, 47 మంది ఇతరులు కలిపి 12,16,667 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆరు నియోజకవర్గాల్లో పురుషుల కన్నా మహిళలే అధికంగా ఓట్లు వేశారు. అత్యధికంగా తణుకులో 4648 మహిళా ఓట్లు పోలవగా, ఆచంటలో 2,998, భీమవరంలో 2,482, తాడేపల్లిగూడెంలో 1,565, పాలకొల్లులో 882, ఉండిలో 330 ఓట్లు పోలయ్యాయి. మహిళా ఓట్లు అధికంగా పోలవ్వడానికి ప్రభుత్వ సానుకూలతే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మునుపెన్నడూలేని విధంగా గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలుచేసిన అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, జగనన్న ఇళ్లు తదితర అన్ని సంక్షేమ పథకాలకు మహిళలనే లబ్ధిదారులను చేయడం, వారికి ఆర్థిక తోడ్పాటును అందించింది. కుటుంబంలో వారి ప్రాధాన్యతను మరింత పెంచింది. ఈ ఐదేళ్లలో పేదల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడ్డాయి. తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్న గట్టి పట్టుదలతో రాత్రి బాగా పొద్దుపోయినా మహిళలు క్యూలైన్లలో బారులు తీరి ఓట్లు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళల ఓట్లు ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటాయని భావిస్తున్న కూటమికి వారి పోలింగ్ శాతం పెరగడం విపక్ష అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోందంటున్నారు. మహిళల పేరిట ప్రభుత్వం పథకాలు మంజూరు చేయడం వల్ల మహిళల ఓటింగ్ పెరిగిందని ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ పేర్కొనడం విశ్లేషకుల అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. పెరిగిన మహిళ ఓట్లు వైఎస్సార్సీపీకి మేలు చేస్తాయని వారంటున్నారు. అధికారపార్టీ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడుతున్నారు. న్యూస్రీల్ జిల్లాలో 11,534 మహిళల ఓట్లు అధికంగా పోలింగ్ సంక్షేమం, ప్రభుత్వ సానుకూలతోనే పెరుగుదల బలం చేకూరుస్తున్న ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వైఎస్సార్సీపీకి కలిసి వస్తుందంటున్న విశ్లేషకులు నియోజకవర్గం మొత్తం ఓటర్లు పోలైన ఓట్లు పురుషులు మహిళలు ఆచంట 1,80,017 1,49,048 73,024 76,022 పాలకొల్లు 1,95,057 1,60,489 79,802 80,684 నరసాపురం 1,70,448 1,43,825 72,598 71,227 భీమవరం 2,53,116 2,00,857 99,174 1,01,656 ఉండి 2,24,725 1,93,722 96,695 97,025 తణుకు 2,34,575 1,92,736 94,042 98,690 తాడేపల్లిగూడెం 2,14,985 1,75,990 87,208 88,773 -
ఐటీఐ శిక్షణతో పక్కా కొలువు
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పాసైనా, ఫెయిలైనా, ఇంటర్ పాసైనా, ఫెయిలైనా ఐటీఐల్లో చేరి వివిధ కోర్సుల్లో నైపుణ్యం సాధించవచ్చని మీకు తెలుసా? ఆ నైపుణ్యంతో చిన్న వయసులోనే పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు సాధించవచ్చని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక శిక్షణ కోర్సుల్లో ఏడాది, రెండేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి ఫెయిలైనా ఆయా కోర్సుల్లో చేరి మంచి నైపుణ్యం సాధించవచ్చు. అందుబాటులో వివిధ కోర్సులు ఐటీఐ కళాశాలల్లో పరిశ్రమలకు అవసరమైన వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తారు. వాటిలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, మోటార్ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనింగ్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, వెల్డర్, కోపా వంటి కోర్సులకు పరిశ్రమల్లో ప్రాధాన్యత లభిస్తుంది. ఆయా కోర్సులు పూర్తి చేసి వాటిలో ప్రావీణ్యం కనబరిస్తే యువతకు వెంటనే ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితితో ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేస్తే గ్రామ సచివాలయం, ట్రాన్స్కో, జెన్కో, ఈపీడీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించవచ్చు. భీమవరం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ను అందుబాటులో ఉంచారు. ఫిట్టర్ కోర్సుకు డిమాండ్ ఐటీఐలో ఫిట్టర్ కోర్సు నిత్యనూతనంగా ఉంటుంది. ఈ కోర్సుకు విద్యార్థుల్లో మంచి డిమాండ్ ఉంది. ఐటీఐ కళాశాలల్లో తొలుత సీట్లన్నీ భర్తీ అయ్యేది ఈ కోర్సులోనే. రెండేళ్ళ కోర్సు పూర్తి చేస్తే అటు ప్రైవేట్ పరిశ్రమలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కోర్సు రెండేళ్ళు ఉంటుంది. నిర్మాణ రంగంలో ఈ కోర్సు చేసిన వారికి అవకాశాలు ఎక్కువ. గ్రామ, వార్డు సచివాలయల్లో భర్తీ చేసే సర్వేయర్ పోస్టులకు ఈ కోర్సు చేసిన వారు అర్హత పొందుతారు. మోటార్ వెహికల్ మెకానిక్ కోర్సు రెండేళ్ళు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే రైల్వే, ఆర్టీసీలతో పాటు వివిధ మోటార్ సైకిల్, కార్లు తయారీ సంస్థల్లో ఉద్యోగావకాశాలతో పాటు సొంతంగా మోటారు వాహనాల సర్వీస్ సెంటర్లు, ఓలా క్యాబ్ వంటి వాటిలో స్వయం ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, మెకానిక్ కోర్సు చేసిన వారికి టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు వంటి ఉత్పత్తి సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. అప్రెంటిస్షిప్కు ఎంపికై తే రూ.9,550 జమ ఐటీఐ పూర్తి చేసి అప్రెంటిస్షిప్కు ఎంపికై న విద్యార్థికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అతని ఖాతాకు రూ.9,550 జమ చేస్తాయి. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,050, కేంద్ర ప్రభుత్వం రూ.1,500 జమ చేస్తాయి. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఉన్నత చదువులకు వెళ్ళాలన్నా డిప్లొమా అర్హత పొందేందుకు బ్రిడ్జి కోర్సు అందుబాటులో ఉంటుంది. బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన విద్యార్థి నేరుగా డిప్లమో 2వ సంవత్సరం చదవడానికి అర్హత పొందుతాడు. వీటితో పాటు కోపా కోర్సు కేవలం 10వ తరగతి విద్యార్హతతో చేయవచ్చు. ఈ కోర్సు చేసిన వారికి కంప్యూటర్ ఆపరేటర్లుగా, హార్డ్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగానే లభిస్తున్నాయి. 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఏడాది మాత్రమే చదివే వెల్డర్ కోర్సులో చేరవచ్చు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి రైల్వేలతో పాటు ఓఎన్జీసీ, ఆర్టీసీల్లో, పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 37 ఐటీఐలు ఐటీఐలో చేరి వివిధ కోర్సులు చేయాలనుకునే విద్యార్థులకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 37 కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏలూరు జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలు 5 ఉండగా వివిధ ట్రేడుల్లో 876 సీట్లు, 14 ప్రైవేట్ ఐటీఐలు ఉండగా వాటిలో 1,672 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 308 సీట్లు, 16 ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2,736 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఉమ్మడి జిల్లాలో 37 ఐటీఐలు అప్రెంటిస్షిప్కు ఎంపికై తే ఖాతాలో రూ.9,550 జమ -
పల్లాలమ్మకు బంగారు నెక్లెస్ సమర్పణ
కాళ్ల: పెద అమిరం గ్రామంలో గ్రామ దేవత పల్లాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి దాతలు బంగారు నెక్లెస్ సమర్పించారు. గ్రామ పెద్దలు ముదుండి వెంకట సత్యనారాయణ రాజు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఉషాకుమారి కుమారులు సోమరాజు రూ.3 లక్షల విలువ చేసే ఐదు కాసుల బంగారు నెక్లెస్ ఆలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, గ్రామ పెద్దలు, ఆలయ నిర్వాహకులు దాతలను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వేగేశ్న జయరామకృష్ణంరాజు, కోరా రామ్మూర్తి, నడింపల్లి సుబ్బరాజు, జవ్వాది కిషోర్, గొట్టుముక్కల రామకృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపునకు ప్రజలు సహకరించాలి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పెనుగొండ: సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, భీమవరంలో జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ప్రజలు సహకరించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఆచంట, పెనుగొండ పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. అనంతరం పెనుగొండలో ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చే నెల 8వ తేదీ వరకు అమలులో ఉంటుందన్నారు. ప్రజలు గుంపులుగా ఉండటం, గ్రామాల నుంచి ప్రజలను తరలించటం, సమావేశాల నిర్వహణ తదితర కార్యక్రమాలు చేయరాదని, ప్రజలు ఇంటి వద్ద నుంచి టీవీల్లో ఎన్నికల ఫలితాలను వీక్షించాలన్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పోలీసు సిబ్బంది భద్రత చర్యలు చేపట్టారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని వివరించారు. భీమవరంలో జరిగే కౌంటింగ్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు అనుమతి ఉన్న వారే హాజరుకావాలన్నారు. ఎన్నికల నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నరసాపురం డీఎస్పీ టి.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు: భీమవరం స్పెషల్ బ్రాంచ్ సీఐ తిలక్, సీఐ ఎన్.రజనీకుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యతో సాఫ్ట్వేర్ ఉద్యోగం
భీమవరం: ఇంటర్ పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగులుగా మారే సదవకాశం, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ బిట్స్ పిలానీ, శాస్త్ర, అమిటీ లాంటి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలలో ఉన్నత చదువు కొనసాగించే సదావకాశం విద్యార్థులకు ఉందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే. చంద్రశేఖర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విద్యార్థులకు ఈ మహత్తర అవకాశం లభిస్తుందని, రాష్ట్రంలో 75 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసిన అన్ని గ్రూపుల నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు, హెచ్సీఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాలలో ఇంటర్మీడియట్ విద్యను 75 శాతం మార్కులతో పూర్తి చేసిన విద్యార్థులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఈ ఉద్యోగాల కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 500 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొన్నారని, వీరికి ఇంటర్మీడియట్ బోర్డ్, హెచ్సీఎల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 31న భీమవరంలోని ఆదిత్య జూనియర్ కళాశాలలో ఉదయం 9 నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత క్యాట్ పరీక్ష, ఇంటర్వ్యూ, చివరిగా ఇంగ్లీష్ వెర్షన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున స్టైఫండ్ ఇస్తారు. బైపీసీ, సీఈసీ, హెచ్ఐసీ, ఒకేషనల్ గ్రూపులు చదివిన విద్యార్థులు డీపీఓ విభాగంలో ఉద్యోగం పొందవచ్చన్నారు. ఉన్నత విద్యను కొనసాగించే సదవకాశాన్ని కూడా కల్పించడానికి హెచ్సీఎల్ సంస్థ ప్రణాళిక రూపొందించింది. అమిటీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉన్నత విద్యకు హెచ్సీఎల్ ఆర్థిక సహాయం అందిస్తుందని, సందేహాలు ఉంటే సాయి కిరణ్ను 9642973350 నెంబర్లో సంప్రదించవచ్చన్నారు. -
సర్వీస్ టెక్నీషియన్గా రూ.20 వేల జీతం
2020–22 మధ్య ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో శిక్షణ పొందాను. శిక్షణ కాలంలో అనేక అంశాల్లో నైపుణ్యం పెంచుకోగలిగాను. ప్రస్తుతం హైదరాబాద్లోని మేధా సర్వోడ్రైవ్స్ సంస్థలో సర్వీస్ టెక్నీషియన్గా ఉద్యోగం లభించింది. రూ. 20 వేలు జీతం వస్తోంది. – ఎస్వీఎస్పీ రవి కుమార్, ఐటీఐ విద్యార్థి మధ్యప్రదేశ్లో ఉద్యోగం నేను ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో శిక్షణ పొందాను. వివిధ అంశాల్లో పట్టు సంపాదించాను. ప్రస్తుతం మధ్యప్రదేశ్కు చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థలో సర్వీస్ టెక్నీషియన్గా పని చేస్తున్నాను. రూ. 20 వేలు సంపాదిస్తున్నాను. – ఆర్.సాయిబాబా, ఐటీఐ విద్యార్థి జూన్ 10 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు ప్రభుత్వం జూన్ 10 వరకూ గడువు ఇచ్చింది. కోర్సుల్లో ప్రవేశించిన వారికి శిక్షణ కాలంలో ప్రభుత్వం నుంచి అన్ని రాయితీలు అందుతాయి. – పీ రజిత, ఏలూరు పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రధానాధికారి ● -
రావిపాడులో ఉద్రిక్తత
పెంటపాడు: రావిపాడులో ఓ సైనికోద్యోగికి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కొందరు దళితులు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దీంతో ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచి ఎట్టకేలకు జవాన్ భూమిలో అక్రమంగా పెట్టిన అంబేడ్కర్ విగ్రహాన్ని అఽధికారుల సమక్షంలో చర్చల అనంతరం తొలగించారు. ఈ నేపథ్యంలో కొంతమంది దళితులు పోలీసులు, అధికారులపై రాళ్లురువ్వడంతో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రావిపాడు గ్రామానికి చెందిన సైనిక ఉద్యోగి పలివెల నాగేశ్వరరావు ప్రభుత్వానికి చేసుకున్న ఆర్జీ మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో 3 సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిలో జవాను కుటుంబం ఇల్లు నిర్మించుకొంటుండగా మంగళవారం కొంతమంది దళితులు, దళిత సంఘాల నాయకులు ఆ స్థలంలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టి వివాదానికి తెరలేపారు. దీంతో జవాన్ కుటుంబసభ్యులకు, దళితులకు మద్య వివాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. కొందరు దళితులు జవాన్ భార్యపై దాడి చేయడంతో అమెకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఆర్డీవో చెన్నయ్య, డీఎస్పీ మూర్తి, తహసీల్థార్ రమేష్బాబు, సీఐ రమేష్, ఎస్సై శంకర్ గ్రామంలో ఇరువర్గాలతో చర్చించారు. రాత్రి అయినా వివాదం కొలిక్కిరాలేదు. మరోసారి అధికారులు దళిత నాయకులతో చర్చల అనంతరం పోలీసులు విగ్రహాన్ని ఎట్టకేలకు తరలించారు. చర్చలలో సర్పంచ్ పెన్నాడ సూరిబాబు, సొసైటీ మాజీ చైర్మన్ దేవ వెంకటరమణ, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చీకటిమిల్లి మంగరాజు, ఉపసర్పంచ్ దాకే బుల్లబ్బాయి. ఎస్సీ నాయకులు డెక్కపాటి వెంకటరమణ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీసులు తొలగించారన్న అక్కసుతో గ్రామంలో దళితులలో కొందరు పోలీసులు, అధికారులపై రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనలో తాడేపల్లిగూడెం రూరల్ సీఐ రమేష్ చేతికి, తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సై సుధాకరరెడ్డి, తణుకు ట్రాఫిక్ కానిస్టేబుల్, రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగికి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన వైద్యం నిమిత్తం గూడెం అసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఆర్డీవో చెన్నయ్య, డీఎస్పీ మూర్తి, తహసీల్దార్ సురేష్బాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జవాన్ స్థలంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన దళితులు దళితులకు, జవాన్ కుటుంబీకుల మధ్య ఘర్షణ ఆందోళనకారులతో అధికారుల చర్చలు.. ఎట్టకేలకు విగ్రహం తొలగింపు పోలీసులపై రాళ్లదాడి.. సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లకు గాయాలు -
గత వైభవానికి ప్రతీక.. మొగల్తూరు కోట
మొగల్తూరు: రాజ్యాలు పోయాయి.. సంస్థానాలు అంతరించాయి.. కోటలు శిథిలమయ్యాయి. కానీ వాటి ఆనవాళ్లు మాత్రం మిగిలి అలనాటి వైభవాలను చాటుతున్నాయి. దాదాపు రెండు శతాబ్దాల పాలనకు కేంద్రమైన మొగల్తూరు సంస్ధాన వైభవంపై ఇప్పటికీ స్ధానిక ప్రజలు కధలుగా చెప్పుకుంటారు. మొగల్తూరు సంస్థానాన్ని 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు సంస్థానాధీశులు పాలించారు. 1608 సంవత్సరంలో జల్లిగెడల గంగరాజు మొగల్తూరు సంస్థానాన్ని స్థాపించగా, 1876 సంవత్సరం వరకు వారి వంశస్తులు ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. 800 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 300 గ్రామాలతో మొగల్తూరు సంస్థానం విరాజిల్లింది. మొగల్తూరు, ఆచంట, దొడ్డిపట్ల, ఉండి, వీరవాసరం, శివదేవుని చిక్కాల, కొవ్వూరు పరగణాలు, తూర్పుగోదావరి జిల్లాలోని పేరూరు, కృష్టా జిల్లాలోని కలిదిండి పరగణాలు ఈ సంస్థానం పరిధిలో ఉండేవి. మొగల్తూరు సంస్థానంగా, కేతకీపుర మహా సామ్రాజ్యంగా పేరు ప్రతిష్ఠలు పొందింది. ఈ కోట గోడలు 20 అడుగుల మందంతో, రెండు తాటిచెట్ల ఎత్తులో ఉండేవి. కోట గోడపై నుంచి రెండు ఎడ్ల బండ్లు వెళ్లేలా ఉండేదని, 2.5 హెక్టార్ల విస్తీర్ణంలో చుట్టూ గుండ్రని ఆకారంలో కోట గోడ ఉండేది. ఆకోటలోనే లక్కమేడను నిర్మించారు. సంస్థానానికి సంబంధించిన వారసులు శ్రీరాజా కలిదిండి రామరాజ బహుద్దూర్ కుటుంబ సభ్యులు, గోపాల కృష్ణ రాజబహుద్దూర్, శ్రీరాజా కలిదిండి స్వర్ణ కుమార్బాబులు ఇప్పటికీ ఈ కోటలోనే నివసిస్తున్నారు. మొగల్తూరు సంస్థానాన్ని ఏలిన రాజులు వీరే.. జెల్లిగెడల గంగరాజు సంస్థానాన్ని స్థాపించారు. తదనంతరం ఆయన వారసులు పెదబాపరాజు, చినబాపరాజు, పెద్దరాజు, చిన్నరాజు, సూరపురాజు, పెద గంగరాజు, చినగంగరాజు సంస్థానాన్ని పాలించారు. చివరగా తిరుపతిరాజులు అనంతరం శ్రీరాజా కలిదిండి కుమార దైవ ప్రసాద లక్ష్మీనరసింహ రాజబహుద్దూర్ (ఈయన పాలనలోనే కోటను బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్నారు) రాచరిక పాలన సమసిపోయినా శ్రీరాజా కలిదిండి దేవీకాంత లక్ష్మీకాంత రాజబహద్దూర్, శ్రీరాజా కలిదిండి కుమార లక్ష్మీ నరసింహరాజ బహుద్దూర్ (దత్తుడు)లు చెప్పిందే వేదంగా సాగేది. ఇప్పటికీ కోట సంస్థానాదీశుల వారసులకు గౌరవ మర్యాదలు, రాచరిక మర్యాదలు కొనసాగుతూనే ఉన్నాయి. చెక్కుచెదరని లక్కమేడ రాజులు ప్రజలతో మాట్లాడేందుకు లక్కమేడను, అందులోనే రాజదర్బారును నిర్మించారు. ఆనాడు నిర్మించిన లక్కమేడను చైనా ఇంజినీర్లు రూపకల్పన చేశారని, కోట నిర్మాణానికి కోడిగుడ్డు తెల్లసోన కలిపిన మట్టిని వాడారని రాజవంశస్తులు తెలిపేవారు. లక్కమేడ ముఖ్యమైన రాజదర్బార్గా విల్లసిల్లేది. భవనం సీలింగ్కు లక్క పూయడం వల్ల దీనికి లక్కమేడ అనిపేరు వచ్చింది. ఇప్పటికీ ఈ భవనం గోడలపై చేయి వేస్తే జారిపోయేంత నునుపుదనంతో ఉంటాయి. గదులలో గోడలకున్న డిజైన్లు తాజ్మహాల్ తరువాత దీనికే ఉన్నాయని రాజవంశస్తులు చెబుతుండేవారు. అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండటం ఆనాటి నైపుణ్యానికి మచ్చుతునక. వీరితోనే రథయాత్ర ప్రారంభం మొగల్తూరు కోట సంస్థానాధీశుల వారసులైన శ్రీరాజా కలిదిండి కుమార సింహ జగపతిరాజు, కుటుంబ సభ్యులు అంతర్వేది రథయాత్రకు కొబ్బరికాయ కొట్టి యాత్ర ప్రారంభిస్తుండటం విశేషం. 1608 నుంచి 1876 వరకు ఏకఛత్రాధిపత్యంగా జల్లిగెడల గంగరాజు వంశస్తుల పాలన 800 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 300 గ్రామాలతో విరాజిల్లిన మొగల్తూరు సంస్థానం ఇప్పటికీ కోట సంస్థానాధీశుల వారసులకు కొనసాగుతున్న రాచరిక మర్యాదలు -
పేదలకు గృహ‘మస్తు’
జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణాల వివరాలు సేకరించిన భూమి 892.50 ఎకరాలు మొత్తం లేఅవుట్లు 630 లేఅవుట్లలో మంజూరైన ఇళ్లు 49,817 సొంత స్థలంలో మంజూరైన ఇళ్లు 21,481 మొత్తం పూర్తయిన ఇళ్లు 27 వేలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నవి 44,298 భీమవరం (ప్రకాశం చౌక్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేదల సొంతింటి కల సాకారమైంది. పేదవాడి సొంతింటి కల నేర్చాలని వేలాది ఎకరాల భూములను సేకరించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాక ఇల్లు కట్టుకోడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. లక్షల విలువ చేసే ఇంటి స్థలాలను పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అందించి ఇళ్ల నిర్మాణం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇంతవరకు 27 వేల మంది పేదలు సొంత ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న వారిలో 90 శాతం మంది లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకున్నారు. మూడేళ్లలో 27 వేల ఇళ్లు పూర్తి.. వివిధ దశల్లో 44,298 ఇళ్లు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదవాడి సొంతింటి కలను నేరవేర్చాలని లక్ష్యంతో భూసేకరణను వేగవంతం చేశారు. అందులో భాగంగా జిల్లాలో 892.50 ఎకరాల భూములను సేకరించి వాటిని మెరక చేసి ఇళ్ల స్థలాల లేవుట్లు చేసి జిల్లాకు 71,283 ఇళ్లు మంజూరు చేశారు. అనంతరం రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి విజృంభించడంతో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. కరోనా ముప్పు తొలగడంతో లాక్డౌన్ ఎత్తివేయడంతో ప్రభుత్వం అందించిన ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.80 లక్షల చొప్పున ఇచ్చిన ఆర్థిక సాయంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మెటీరియల్ సకాలంలో అందించడంతో లబ్ధిదారులు సొంతింటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. కొన్ని ఇళ్లు కాంట్రాక్టర్లు నిర్మిస్తే, కొన్నింటిని లబ్ధిదారులే నిర్మించుకున్నారు. దీంతో గడిచిన మూడేళ్లలో జిల్లాలో 27 వేల మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేశారు. అలాగే మరో 44,298 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. జిల్లాలోని జగనన్న లేఅవుట్లలో వివిధ అవసరాల కోసం ప్రభుత్వం మొత్తం రూ.1,034 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో భూసేకరణకు రూ.433.33 కోట్లు, ఇళ్ల నిర్మాణం కోసం రూ.584.70 కోట్లు, మౌలిక వసతులకు రూ.22.04 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. తొలిగిన అద్దె బాధలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు సొంత గృహాలను నిర్మించడంతో అప్పటివరకు అద్దె ఇంటిల్లో ఉండేవారు సొంతింటికి చేరారు. దీంతో ఏళ్ల తరబడి అద్దెలు కట్టి కట్టి ఇబ్బందులు పడినవారికి సొంత ఇళ్లల్లోకి మారడంతో అద్దె బాధలు తొలిగాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అద్దె అనేది చాలా భారంగా ఉంటుందని భావించిన సీఎం వైఎస్ జగన్ వారికి సొంతిల్లు వేగంగా నిర్మించి ఇచ్చి వారి అద్దె నుంచి విముక్తి కలిగించారు. పశ్చిమలో 27 వేల మందికి నెరవేరిన సొంతింటి కల నిర్మాణ దశలో మరో 44,298 మంది లబ్ధిదారుల ఇళ్లు జిల్లాలో 892.50 ఎకరాల భూమి పేదలకు పంపిణీ రూ.1,034 కోట్ల ఖర్చుతో జగనన్న కాలనీల్లో వసతులు -
కారు ఢీకొని తాపీ కూలీ దుర్మరణం
పెనుమంట్ర: కానూరు–లంకలకోడేరు వంతెన వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తాపీ కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, తాపీ మేస్త్రికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. నెలమూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నాగరాజు రామరాజు (63) తన సొంత ఇంటి నిర్మాణం కోసం సామగ్రి తెచ్చుకునేందుకు తాపీమేస్త్రి షేక్ సత్తార్తో కలిసి మంగళవారం మోటారు సైకిల్పై కొమ్ముచిక్కాల బయలుదేరారు. కానూరు– లంకలకోడేరు వంతెన వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారు వీరి మోటార్సైకిల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రామరాజుకు తీవ్రగాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందగా, సత్తార్కు తీవ్ర గాయాలయ్యాయి. సత్తార్ను 108 వాహనంలో చికిత్స నిమిత్తం పాలకొల్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు. రామరాజు మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవీంద్రబాబు చెప్పారు. -
రాట్నాలమ్మహుండీ లెక్కింపు
పెదవేగి : రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మ వారి హుండీ లెక్కింపు సోమవారం నిర్వహించారు. రూ.11,77,408 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ చెప్పారు. లెక్కింపునకు ఏలూరు పత్తేబాద శివాలయ కార్యనిర్వహణాధికారి శంకర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరించారు. కార్యక్రమంలో మాజీ ఆలయ చైర్మన్ చల్లగొళ్ళ వెంకటేశ్వరరావు, గరికిముక్కు సర్వేశ్వరరావు, పాకలపాటి వెంకటేశ్వరరావు, మేరుగు వెంకటేశ్వరరావు, మేరుగు వెంకటేశ్వరరావు, నంబూరి జనార్ధన్రావు, ఈడా ధర్మరావు, గ్రామస్తులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తెన్నేటికి సన్మానం పాలకోడేరు : పాలకోడేరు జెడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అక్షర కిరీటి తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తిని హైదరాబాద్కు చెందిన రితిక ఫౌండేషన్ ఆదివారం విజయవాడ కవితా మార్తాండ బిరుదు ఇచ్చి బెస్ట్ నంది అవార్డు 2024తో సన్మానించింది. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నిత్యాచారి మాట్లాడుతూ తెన్నేటి మాస్టారు ఇంతవరకూ పదహారు స్వీయ రచనల పుస్తకాలు ప్రచురించారని, ఆ పుస్తకాలపై యూనివర్సిటీల్లో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందారని, ఆయనను సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ముఖ్య అతిథి కుందుర్తి నరసింహశర్మ రితిక ఫౌండేషన్ ఏటా కవులను, కళాకారులను సన్మానించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో కృష్ణ, శ్రీ పద్మిని పుర కళాపీఠం గౌరవ అధ్యక్షుడు ఆర్వీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. కవి ప్రసాద్కు స్వర్ణకంకణం తణుకు : శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఏలూరులో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ పద్య కవుల కవి సమ్మేళనంలో తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ కవి వీఎస్వీ ప్రసాద్కు స్వర్ణకంకణం బహూకరించారు. వేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్ ఆధ్వర్యంలో ఏలూరు వైఎంహెచ్ఏ హాలులో నిర్వహించిన ఈ సమ్మేళనంలో ప్రసాద్ రచించి, వినిపించిన సీస పద్యాలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏలూరు శాఖ అధ్యక్షుడు కోటి శ్రీహరి, మానవత విద్యానిధి చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు తదితరులు అభినందించారు. -
పకడ్బందీ ఏర్పాట్లకు ఆదేశం
భీమవరం(ప్రకాశంచౌక్) : జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను పగడ్బందీగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనరు రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలు ప్రకటించాలన్నారు. ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డా.సుఖ్బీర్ సింగ్తో కలసి సోమవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టరేటు వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి కలెక్టరు సుమిత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని, కౌంటింగుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని సుమిత్ కుమార్ వివరించారు. ఈవీఎంలో పోల్ అయిన ఓట్ల లెక్కింపునకు సంబంధిచి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ముందస్తుగా సరైన శిక్షణ ఇవ్వాలని రాజీవ్ కుమార్ సూచించారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు హైస్పీడు ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే విషయంలో ఆలస్యం చేయవద్దని, డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు కచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని అన్నారు. నిబంధనల మేరకు కౌంటింగ్ నిర్వహించాలి సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు బాధ్యతగా మెలగాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిబంధనలకు లోబడి మాత్రమే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుంచి పూర్తయ్యే వరకు సిబ్బంది ఎవరు కౌంటింగ్ హాలును వదిలి బయటకు రాకూడదన్నారు. ప్రత్యేకంగా భోజన విరామం ఉండదని, కౌంటింగ్ హాల్లోనే విధుల్లో ఉన్న సిబ్బందికి ఆహారం అందిస్తారన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడంతో పాటు, ప్రతి విషయాన్ని మరి ఒకసారి చెక్ చేసుకోవాలని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, తదితరులకు పాసుల జారీని జూన్ 2 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయభాస్కరరావు పాల్గొన్నారు. -
30 నుంచి నాటక పోటీలు
భీమవరం: ఈ నెల 30, 31, జూన్ 1, 2 తేదీల్లో భీమవరం డీఎన్నార్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ తెలిపారు. సోమవారం మాట్లాడుతూ.. 30న సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు డాక్టర్ పురాణం వెంకట రామ్కుమార్కు జవ్వాది రంగస్థల చైతన్య పురస్కారం, రంగస్థల నటుడు ఎస్ఎం భాషాకు మైనంపాటి రంగనాయకులు రంగస్థల చైతన్య పురస్కారం, జూన్ 2న అప్పాజ్యోసుల సత్యనారాయణకు రాయప్రోలు రామచంద్రమూర్తి రంగస్థల చైతన్య పురస్కారం, నటీమణి ఎం.రత్నకుమారికి పెనుపోతుల శేషగిరిరావు చైతన్య పురస్కారం అందిస్తామన్నారు. జూన్ 2న జరిగే కార్యక్రమానికి సినీ హాస్యనటుడు సూరంపూడి సుదర్శనరావు, దర్శకులు రాజా వన్నెంరెడ్డి తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. సమావేశంలో రాయప్రోలు శ్రీనివాసమూర్తి, పీఆర్ఓ భట్టిప్రోలు శ్రీనివాసరావు, డాక్టర్ కట్రెడ్డి సత్యనారాయణ, పెన్నాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్ పైనే.. అందరి చూపు
సాక్షి, భీమవరం: సార్వత్రిక ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న కొద్దీ అందరిలో ఉత్కంఠ పెరుగుతోంది. ఎక్కడ చూసినా కౌంటింగ్పైనే చర్చ.. ఏ ఇద్దరూ కలిసినా విజయం ఎవరిని వరిస్తుందనే అంశంపైనే విశ్లేషణలు. మరో పక్క జూన్ 4న భీమవరంలోని శ్రీవిష్ణు, ఎస్ఆర్కేఆర్ కళాశాలల్లో కౌంటింగ్కు శరవేగంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. జిల్లాలోని నరసాపురం పార్లమెంట్, భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నరసాపురం, ఉండి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2019లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగ్గా ఫలితాల కోసం 41 రోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ సారి 21 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆరు రోజులే గడువు కౌంటింగ్కు నేటికి మరో ఆరు రోజులు మాత్రమే గడువుంది. వచ్చే మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఒక్కో రౌండుకు 20 నిముషాల నుంచి అరగంట సమయం పడుతుంది. ఈ మేరకు మధ్యాహ్నం 1.30 నుంచి రెండు గంటల సమయానికి నరసాపురం ఫలితం వెలువడుతుంది. రెండున్నర గంటలకు ఆచంట, పాలకొల్లు, మూడు గంటలకు తాడేపల్లిగూడెం, తర్వాత భీమవరం, తణుకు, ఉండి ఫలితాలు వస్తాయని అంచనా. పోలింగ్ సరళిని బట్టి ఇప్పటికే పోటీలో నిలిచిన అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు గ్రామాలు, వార్డుల వారీగా తమకు వచ్చే ఓట్లుపై అంచనాల్లో ఉన్నప్పటికి గడువు సమీపిస్తుండటంతో ఉత్కంఠ పెరిగిపోతోంది. కౌంటింగ్ రోజు కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క గ్రామాలు, పట్టణాల్లో ఏ ఇద్దరు కలిసినా ఎన్నికల ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. నరసాపురం పార్లమెంట్, జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీలోని అభ్యర్థుల విజయావకాశాలు, విజయం సాధిస్తారనుకునే వారి మెజారీటీ ఎంత వరకు రావచ్చు? రాష్ట్రంలోని ముఖ్యనేతల విజయావకాశాలు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అదే విధంగా కేంద్రంలో ఏ పార్టీ సంపూర్ణ ఆధిక్యత సాధిస్తుంది? గత ఎన్నికల ఫలితాలను బేరీజు వేస్తూ పలు అంశాలపై ఎక్కడ చూసిన జోరుగా చర్చలు జరుగుతున్నాయి. విజయంపై వైఎస్సార్సీపీ ధీమా 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో 175 స్థానాలకు 151 స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రాత్మక విజయం సాధించింది. జిల్లాలోని నరసాపురం పార్లమెంట్తో పాటు ఏడు స్థానాలకు ఐదింట విజయకేతనం ఎగురవేసింది. ఈ ఐదేళ్లలో కనివినీ ఎరుగని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, కూటమిలోని అంతర్గత కుమ్ములాటలతో ఈ ఎన్నికల్లో జిల్లాలో క్లీన్స్వీప్ ఖాయమన్న ధీమాలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఉన్నారు. పోలింగ్ శాతం పెరగడం, అర్ధరాత్రి వరకు వృద్ధులు, మహిళలు క్యూలో నిలబడి ఓటు వేయడం పాజిటివ్ ఓటుకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు అందరిలోనూ ఉత్కంఠ ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే చర్చలు విజయంపై ధీమాలో వైఎస్సార్సీపీ కేడర్ శరవేగంగా ఏర్పాట్లు భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలకు పట్టణంలోని ఎస్ఆర్కేఆర్ కళాశాల, తణుకు, అచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలకు శ్రీవిష్ణు కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. అందుకోసం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్కుమార్ నేతృత్వంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి ఆర్ఓ, ఏఆర్ఓలతో పాటు కౌంటింగ్కు ఒక్కో టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్, సపోర్టింగ్ స్టాప్ తదితరులు కలిపి 1500 మంది వరకు సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొననున్నారు. ఎక్కడ పొరపాట్లకు తావులేకుండా సమర్ధవంతంగా కౌంటింగ్ జరిగేలా వివిధ స్థాయిల్లో ఉద్యోగులకు కలెక్టర్ సుమిత్కుమార్ ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తు అవసరమైన సూచనలు అందిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎస్పీ డాక్టర్ అజిత పకర్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. -
పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభం
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ 60 సీట్లు, మెకానికల్ ఇంజనీరింగ్ 60 సీట్లు ఉన్నాయని చెప్పారు. 1 నుంచి 12 వేల ర్యాంక్ వరకు సోమవారం కౌన్సెలింగ్ జరిగినట్లు తెలిపారు. జూన్ 1న జెడ్పీ సర్వసభ్య సమావేశం ఏలూరు (మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జూన్ 1న ఏలూరులోని జెడ్పీ సమావేశం మందిరంలో నిర్వహిస్తామని జెడ్పీ సీఈఓ కె. సుబ్బారావు తెలిపారు. సమావేశానికి జెడ్పీ అధ్యక్షురాలు ఘంటా పద్మశ్రీ అధ్యక్షత వహిస్తారని, సమావేశానికి జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలన్నారు. -
భానుడి భగభగలు ప్రారంభం
జిల్లాలో ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలు తణుకు: జిల్లాలో ఎండలు మండుతున్నాయి.. అల్పపీడనం, తుఫాన్ ప్రభావంతో కొద్దిరోజులుగా ఎండ తీవ్రత తక్కువగానే ఉన్నా.. సోమవారం నుంచి తీవ్రత పెరిగింది. రోహిణీ కార్తె ప్రారంభం కావడంతో భానుడి భగభగలు మరింత పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచే వడగాల్పులు వీస్తున్నాయి. తణుకులో సోమవారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తణుకు నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి, వేల్పూరు రోడ్డు, ఇతర ప్రధాన సెంటర్లు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వెలవెలబోతున్నాయి. ప్రారంభంలో ఎండల తీవ్ర అంతగా లేక అంతంతమాత్రంగా సాగిన ఏసీలు, ఎయిర్ కూలర్లు, ఫ్రిజ్ల అమ్మకాలు గత వారం రోజుల నుంచి గణనీయంగా పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. జూన్ మొదటి వారం వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.. జీవనోపాఽధిపై ప్రభావం ఉష్ణోగ్రతలు పెరగడంతో చిరువ్యాపారుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుంది. తినుబండారాలు, రోడ్డుపక్కనే ఇతరత్రా వ్యాపారాలు సాగించే చిరువ్యాపారులు ఎండ తీవ్రతకు వ్యాపారాలు చేయలేకపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే పలు కూడళ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వడగాల్పుల నేపథ్యంలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. -
ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధం
తణుకు: పట్టణంలోని ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగి క్షణాల వ్యవధిలోనే అగ్నికి ఆహుతైంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక మీనాక్షి మెడికల్స్ యజమాని జి.ముత్యాలరావుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ సోమవారం ఎన్జీవో హోం రోడ్డులోని ఎస్బీఐ ఎదురుగా పార్కింగ్ చేసి ఉండగా అకస్మాత్తుగా బ్యాటరీ నుంచి మంటలు చేలరేగాయి. తణుకు అగ్నిమాపక శాఖ అధికారి ఐ.అజయ్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాలికపై లైంగిక దాడి కేసులో వ్యక్తికి రిమాండ్ తణుకు: ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కోర్టు రిమాండ్ విధించినట్లు తణుకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ సోమవారం చెప్పారు. స్థానిక ఎన్టీఆర్ పార్కు సమీపంలో నివాసం ఉంటున్న చదలవాడ తిమోతి తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఆదివారం ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. లారీ ఢీకొని వృద్ధురాలి మృతి ఆకివీడు: అజ్జమూరులో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. అజ్జమూరుకు చెందిన పీతల నందమ్మ (65) మందు బిళ్లలు కొనేందుకు సోమవారం వెళ్లి తిరిగి వస్తుండగా, అజ్జాలమ్మ గుడి వద్దకు వచ్చేసరికి ఆకివీడు నుంచి కుప్పనపూడి వైపు వెళుతున్న ఓ లారీ వేగంగా వస్తూ వృద్ధురాలిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించార. మనవరాలి ఫిర్యాదు మేరకు ఎస్సై బి.నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కందుకూరి ఆశయ సాధనే లక్ష్యం
ఏలూరు (ఆర్ఆర్పేట): సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం ఆశయాల సాధనే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అని వక్తలు అన్నారు. కందుకూరి వీరేశలింగం వర్ధంతి సందర్భంగా స్థానిక సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సోమవారం కందుకూరి 105వ వర్ధంతి నిర్వహణ కమిటీ, సీఆర్ రెడ్డి విద్యాసంస్థలు తెలుగు విభాగం సంయుక్తంగా ‘కందుకూరి 105వ వర్ధంతి సమాలోచన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం, హేలాపురి బాలోత్సవం, మానవత, జన విజ్ఞాన వేదిక, హిందూ యువజన సంఘం, జిల్లా రచయితల సంఘం, హేలాపురి కళాకారుల సంక్షేమ సంఘం వంటి 115 సంఘాలతో కందుకూరి 105వ వర్ధంతి నిర్వహణ కమిటీ ఏర్పడింది. ఈ సందర్భంగా ఉదయం నుంచి పలు కళా ప్రదర్శనలు నిర్వహించారు. ముందుగా జన విజ్ఞాన వేదిక నాయకులు చేతిపై కర్పూరం వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాల, పుష్పాలతో నివాళులు అర్పించారు. ప్రముఖ నాట్యాచార్యులు పార్వతి రామచంద్రన శిష్యబృందం, రామానుజ నృత్యధార విద్యార్థులు, స్వర్ణ నృత్యాలయ విద్యా ర్థులు పలు నృత్య ప్రదర్శనలు చేశారు. విజయవాడకు చెందిన ప్రజా గాయకులు ఆకురాతి, ప్రజానాట్యమండలి గాయకులు పి.మంగరాజు ఆలపించిన గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి. అలాగే కళాకారుడు హమీద్ ప్రదర్శించిన కందుకూరి వీరేశలింగం ఏకపాత్రాభినయం విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం జరిగిన సదస్సుకు అధ్యక్షత వహించిన ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ 105కు పైగా సంఘాలు, పలువురు కళాకారులు, గాయకులు ఒకే వేదికపై ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నామని తెలిపారు. కందుకూరి మంచి సంఘసంస్కర్త, అభ్యుదయ వాది, పోరాటయోధుడు, కవి, ఉపాధ్యాయుడు, రచయిత అని, అన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం గొప్ప విషయమన్నారు. సీఆర్ రెడ్డి కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు ఇమ్మానుయేల్ మాట్లాడుతూ దేశంలో ఉన్న అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపటంలో కందుకూరి వీరేశలింగం ఎంతో శ్రమించారన్నారు. పత్రికలు స్థాపించి ప్రజలను చైతన్యపరిచారని, బాల్యవివాహాలు అరికట్టడంలో, వితంతు వివాహాలు జరిపించడంలో తనవంతు కృషి చేశారన్నారు. సెయింట్ థెరిసా డిగ్రీ కళాశాల తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.అరుణ మాట్లాడుతూ సీ్త్ర విద్య, వితంతు వివాహాల కోసం కందుకూరి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మాతృభాష పరిరక్షణ కోసం పరితపించిన వ్యక్తి కందుకూరి అన్నారు. సాహిత్యంలో తెలుగు పదాలు వెతుక్కునే పరిస్థితి నేడు సమాజంలో ఉందని, ఈ పరిస్థితుల్లో తెలుగు భాషా ప్రామాణికతను కాపాడే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కె.కేశవరెడ్డి రచించిన, హేలాపురి బాలోత్సవం ప్రచురించిన శ్రీకార్యశూరుడు కందుకూరిశ్రీ అనే పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. భోజనానంతరం కందుకూరి బాటలో మహిళా చైతన్యం అనే అంశంపై జరిగిన సదస్సులో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ.రమాదేవి మాట్లాడుతూ వీరేశలింగం మహిళలను చైతన్య పరిచేందుకు, వారి విద్యాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. మహిళలు కందుకూరిని స్ఫూర్తిగా తీసుకుని మహిళల హక్కుల కోసం, రక్షణ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హేలాపురి బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ సుందరయ్య, సీఆర్ఆర్ విద్యా సంస్థల కార్యదర్శి ఎంబీఎస్వీ ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ సంకు మనోరమ, సాహితీ స్రవంతి రాష్ట్ర నాయకులు వరప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరులో ‘కందుకూరి 105వ వర్ధంతి సమాలోచన’లో వక్తలు ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
కౌంటింగ్కు సర్వం సిద్ధం
373 మంది గైర్హాజరు
●భారీగా తగ్గిన దిగుబడులు
డిమాండ్ ఉండే సమయానికి కాయలు రాలేదు
జిల్లా వ్యాప్తంగా నాయకులకు బహిష్కరణ నోటీసులు
ఖరీఫ్ కార్యాచరణ అమలుకు సమాయత్తం కావాలి
ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
ఎల్ అండ్ టి ఫైనాన్స్ లిమిటెడ్ హైదరాబాద్లో పూర్తి గృహ రుణాన్ని ప్రారంభించింది
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
తప్పక చదవండి
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement