Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement

A to Z మూవీ న్యూస్‌

Advertisement

గాసిప్స్

View all

రివ్యూలు

View all
Advertisement

సినీ ప్రపంచం

kamal Haasan Latest Movie Indian 2 latest Update
కమల్‌హాసన్‌- శంకర్‌ కాంబో.. లేటేస్ట్‌ అప్‌డేట్‌ ఇదే!

శంకర్‌ డైరెక్షన్‌లో కోలీవుడ్‌ స్టార్ కమల్‌హాసన్‌ నటిస్తోన్న చిత్రం ఇండియన్‌-2. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై భారీస్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ను ఈనెల 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ ట్వీట్ చేశారు.కాగా.. కమల్‌ హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందించిన భారతీయుడుకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 12 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. Vanakkam INDIA! 🇮🇳 The 1st single from INDIAN-2 in Rockstar ANIRUDH musical is dropping on May 22nd! 🥁 Get ready to welcome the comeback of SENAPATHY! 🤞🏻 Releasing worldwide in cinemas 12th July 2024! 🎬🤩#Indian2 🇮🇳 #Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh… pic.twitter.com/9xcsaDTVf5— Lyca Productions (@LycaProductions) May 19, 2024

This Week Ott Releases List From May 20th To 26th
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!

చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు కావడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండడంతో పెద్ద సినిమాలన్నీ దాదాపు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఓటీటీల్లోనే సినిమాలు ఆడియన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్‌ అయ్యేలా కనిపించడం లేదు. గెటప్‌ శ్రీను నటించిన రాజు యాదవ్‌తో సహా చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో సుహాస్ ప్రసన్నవదనం, పృథ్వీరాజ్‌ సుకుమార్‌ ఆడుజీవితం కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి మీరు ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి. నెట్‌ఫ్లిక్స్‌గారోడెన్న్‌ది వే ఆఫ్‌ ది లోన్‌ ఉల్ఫ్(యానిమేషన్‌)- మే 23ఇల్లూజన్స్‌ ఫర్‌ సేల్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23ఇన్‌ గుడ్‌ హ్యాండ్స్‌-2(ఇంగ్లీష్‌ సినిమా)- మే 23 ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్‌(ఇంగ్లీష్ సిరీస్)- మే 23అట్లాస్‌ (సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌)- మే 24ముల్లిగన్‌ పార్ట్‌-2 (యానిమేషన్ సిట్‌కామ్‌)- మే 24మై ఓని గర్ల్‌(యానినేషన్ చిత్రం)- మే 26 అమెజాన్ ప్రైమ్‌ది వన్‌పర్సెంట్‌ క్లబ్‌ సీజన్‌-1- మే 23ది బ్లూ ఎంజెల్స్‌(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23డీఓఎం సీజన్‌-2(వెబ్ సిరీస్‌)- మే 24బాంబ్‌సెల్‌- మే 25డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌డోరామ్యాన్‌ సీజన్-19 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20షిన్‌ చిన్‌ సీజన్-16 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20మార్వెల్‌ స్టూడియోస్:అసెంబుల్డ్‌: ది మేకింగ్‌ ఆఫ్‌ ఎక్స్‌మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22పాలైన్-(జర్మన్ సినిమా)- మే 22ది కర్దాషియన్స్- సీజన్-5(ఇంగ్లీష్ సినిమా)- మే 23ది బీచ్‌ బాయ్స్‌(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24ఆడుజీవితం(ది గోట్‌ లైఫ్‌) (మలయాళ సినిమా)- మే 26(రూమర్‌ డేట్)రోలాండ్‌ గారోస్ (ఇంగ్లీష్‌ స్పోర్ట్స్‌ సినిమా)- మే 26ఆహాప్రసన్నవదనం(తెలుగు సినిమా) మే 24యాపిల్ టీవీ ప్లస్ట్రైయింగ్‌ సీజన్‌-4- మే 22

Tamil Star Raghava Lawrence Shares Adorable Video Goes Viral
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్

తమిళ స్టార్‌ హీరో, డైరెక్టర్‌ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు సమాజసేవలోనూ దూసుకెళ్తున్నారు. మాత్రం సంస్థ పేరుతో తమిళనాట సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పదిమంది పేద రైతు కుటుంబాలకు ట్రాక్టర్లు అందజేశారు. వారిని ప్రత్యేకంగా కలిసి మరి రాఘవ లారెన్స్‌ ట్రాక్టర్ తాళాలు అందించారు.తాజాగా తాను సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు. దాదాపు 20 ఏళ్లుగా వారి అన్నీ తానే నడిపిస్తున్నారు. ఆ విద్యార్థులంతా చదువుల్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసి రాఘవ లారెన్స్‌ ఎమోషనల్ అయ్యారు. తాను కూడా వారితో పాటు కలిసిపోయి ఆటలు ఆడారు. వారిని చూస్తే తనకు గర్వంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. వారిని కలిసి సమయం వెచ్చించడం నా హృదయం సంతోషంతో నిండిపోయిందంటూ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ మీరు గ్రేట్ సార్‌ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. The seeds I planted 20 years ago have now grown into these beautiful souls and are being a good example in society. I’m extremely proud of my boys and girls for the kind of persons they have grown into. My heart is so full after spending some beautiful and quality time with them.… pic.twitter.com/XjytGqj2OW— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2024

Heeramandi Actress Husband Whose Net Worth In Crores Of rupees
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!

బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్‌ 'హీరామండి: ది డైమండ్ బజార్'. మే 1న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్‌కు ఆడియన్స్‌ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఓటీటీలో టాప్‌ ట్రెండింగ్‌తో దూసుకెళ్తోంది. ఈ సిరీస్‌లో ఏకంగా ఆరుగురు హీరోయిన్లు నటించారు. ఇందులో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరి, సోనాక్షి సిన్హా లాంటి స్టార్స్‌ కనిపించారు. స్వాతంత్య్రానికి ముందు పాకిస్తాన్‌ లాహోర్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి షర్మిన్ సెగల్. సంజయ్‌ లీలీ మేనకోడలైన ఆమె తనదైన నటనతో మెప్పించింది. ఆడియన్స్‌ నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందుకుంది. అయితే తాజాగా షర్మిన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె భర్త అమన్ మెహతా ఓ బిలినీయర్‌ అన్న వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది.ప్రముఖ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్‌లో అమన్ మెహతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ అంతర్జాతీయ కంపెనీకి కో-ఛైర్మన్లుగా అతని తండ్రి సుధీర్ మెహతా, మామ సమీర్ మెహతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సంస్థ బ్లూమ్‌బెర్గ్ 2024- ఇండెక్స్ ప్రకారం సుధీర్ మెహతా, సమీర్ మెహతా నికర విలువ దాదాపు రూ. 53,800 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమన్, అతని తండ్రి సమీర్‌ కంపెనీ ఫార్మాస్యూటికల్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక్క టోరెంట్ ఫార్మా దాదాపు రూ.38,412 కోట్లు రాబట్టిందని ఫోర్బ్స్ అంచనా వేసింది.కాగా.. సంజయ్ లీలా భన్సాలీకి మేనకోడలు అయిన షర్మిన్ సెగల్.. వృత్తిరీత్యా వ్యాపారవేత్త అయిన అమన్ మెహతాను నవంబర్ 2023లో వివాహం చేసుకుంది. షర్మిన్ సెగల్ తల్లి బేలా సెగల్ ఫిల్మ్ ఎడిటర్‌గా, ఆమె తండ్రి దీపక్ సెగల్ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కంటెంట్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంజయ్ లీలా బన్సాలీకి చెల్లెలు అయిన బేలా సెగల్ 2012లో షిరిన్ ఫర్హాద్ కి తో నికల్ పాడి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. View this post on Instagram A post shared by Sharmin Segal Mehta (@sharminsegal)

Prithviraj Sukumaran's Aadujeevitham OTT Release Date Goes Viral
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?

పృథ్వీరాజ్‌ సుకుమార్, ‍ అమలాపాల్ జంటగా నటించిన చిత్రం ఆడుజీవితం(ది గోట్‌ లైఫ్‌). మార్చి 28న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం కేవల 25 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.అయితే ఈ సినిమా రిలీజై రెండు నెలల కావొస్తున్నా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. గతంలో చాలాసార్లు ఓటీటీ స్ట్రీమింగ్‌పై రానుందని వార్తలొచ్చాయి. కానీ మేకర్స్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరోసారి ఓటీటీకి సంబంధించిన నెట్టింట వైరలవుతోంది. ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్‌ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీపై కూడా చిత్రబృందం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఈ మూవీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు. దీంతో ఈ సారైనా ఓటీటీకి వస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.అసలు కథేంటంటే..?కేరళకు చెందిన నజీబ్‌ అనే వ్యక్తి కథే ఈ చిత్రం. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని ఆడు జీవితం చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన నజీబ్‌ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో తెలియజేస్తూ బెన్యామిన్‌ ‘గోట్‌ డేస్‌’ అనే నవలను రచించారు. దీని ఆధారంగానే ఈ సినిమాను మేకర్స్‌ నిర్మించారు. నజీబ్‌ పాత్ర కోసం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ 31 కిలోల బరువు తగ్గారు. అంతే కాకుండా కొన్ని సీన్స్‌ కోసం 72 గంటలపాటు భోజనం లేకుండా మంచి నీళ్ల సాయంతోనే ఆయన ఉన్నారు. ఈ సినిమా కోసం ఆయన పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.

Rakhi Sawant's Tumour Surgery Is Successful
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!

బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌ ఇటీవల తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ముంబయిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. అయితే రాఖీసావంత్‌ గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చిందని ఆమె మాజీ భర్త రితేశ్ సింగ్ తెలిపారు.ప్రస్తుతం రాఖీ సావంత్‌కు శస్త్రచికిత్స విజయవంతంగాపూర్తైనట్లు ఆమె మాజీ భర్త తెలిపారు. తాజాగా ఆమెకు ఆపరేషన్‌ చేసిన వైద్యులు దాదాపు 10 సెంటిమీటర్ల కణతిని తొలగించారని పేర్కొన్నారు. మే 18న శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారని వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతర ఆమె అపస్మారక స్థితిలో ఉందని మాజీ భర్త చెప్పారు. రాఖీ గర్భాశయంలో కణితి చాలా పెద్దదిగా ఉందని.. దాదాపు అరచేతి పరిమాణంలో ఉందని రితేశ్ తెలిపారు. మొదటిసారి అది చూసి తాను షాకయ్యానని చెప్పారు. ఆమెకు దాదాపు మూడు గంటల పాటు ఆపరేషన్‌ జరిగినట్లు వివరించారు. రాఖీ కోలుకోవాలంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Kangana Ranaut: I Will Quit Bollywood After Winning Lok Sabha Elections
నేను గెలిస్తే సినిమాలు మానేస్తా.. కంగనా సంచలన నిర్ణయం

ముక్కుసూటిగా మాట్లాడే హీరోయిన్లలో కంగనా రనౌత్‌ ఒకరు. ఏదీ దాచకుండా, దేనికీ భయపడకుండా డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. అందుకే ఈమెను బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ అంటుంటారు. ఈ బ్యూటీ ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగింది.గెలిస్తే అంతే!తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా తన సినీప్రయాణంపై షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. 'నేను ఎంపీగా గెలిస్తే సినిమాలకు గుడ్‌బై చెప్తాను. ఎందుకంటే ఈ సినీ ప్రపంచం అనేది అంతా ఒక అబద్ధం. కనిపించేంత అందంగా, వాస్తవికంగా ఉండదు. పైగా నాకు ఒకే పని ఎక్కువకాలం చేయాలనిపించదు. అందుకే హీరోయిన్‌గా బోర్‌ కొట్టినప్పుడు కథలు రాస్తుంటాను. సినిమాలను డైరెక్ట్‌ చేస్తుంటాను, నిర్మిస్తాను. ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తాను' అని చెప్పుకొచ్చింది.ఆ చిత్రాలతో ఫేమస్‌గ్యాంగ్‌స్టర్‌ సినిమాతో హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్‌ క్వీన్‌, తను వెడ్స్‌ మను, తను వెడ్స్‌ మను రిటర్న్స్‌ వంటి సినిమాలతో ఫేమస్‌ అయింది. ఆమె దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీలో కంగనా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది. ఇది కాకుండా సీత: ద ఇన్‌కార్నేషన్‌, నోటి బినోదిని, అలాగే మాధవన్‌తో ఓ థ్రిల్లర్‌ సినిమా ఆమె చేతిలో ఉన్నాయి.చదవండి: 40 ఏళ్లుగా కాపురం.. మా బంధం సక్సెస్‌ అవడానికి అదే కారణం!

Star Heroes Turns As A Villains
నేనే హీరో..నేనే విలన్‌..తగ్గేదేలే అంటున్న స్టార్స్‌

సినీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్తదనం ఉంటేనే థియేటర్స్‌కి వెళ్తున్నారు. అందుకే మన హీరోలు కూడా రొటీన్‌గా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో హీరో పాజిటివ్‌గా ఉంటే..విలన్‌ నెగటివ్‌గా ఉండేవాడు. కానీ ప్రస్తుతం హీరోనే విలన్‌గాను మారుతున్నాడు. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో రెచ్చిపోయి నటిస్తున్నారు. ఒకే సినిమాలో నాయకుడిగా..ప్రతి నాయకుడిగానూ నటిస్తూ తమలో దాగిఉన్న మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఎప్పుడూ చేసిందే చేస్తే ఏం బావుంటుందబ్బా... అప్పుడప్పుడూ కొత్తగా చేయాలి అంటున్న ఈ స్టార్‌ హీరోలపై ఓ లుక్కేయండి.

Shabana Azmi Reveals Secret Behind Her Successful Marriage With Javed Akhtar
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న జంట నిండు నూరేళ్లు కలిసి కాపురం చేయడం గగనమైపోయింది. చాలామంది రెండు మూడేళ్లకే మాకొద్దీ భాగస్వామి అని విడాకులు తీసుకుంటున్నారు. మరికొందరేమో లేటు వయసులోనూ విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో బాలీవుడ్‌లో 40 ఏళ్లుగా ఏ చీకూచింతా లేకుండా అన్యోన్యంగా కలిసి కొనసాగుతున్నారు అలనాటి హీరోయిన్‌ షబానా అజ్మీ- గేయ రచయిత జావెద్‌ అక్తర్‌.సీక్రెట్‌ అదే!తాజాగా నటి షబానా తమ వైవాహిక బంధం ఇంత స్ట్రాంగ్‌గా ఉండటానికి గల కారణాన్ని వెల్లడించింది. 'మేమిద్దరం ఎవరి పనిలో వాళ్లం బిజీగా ఉంటాం. దీనివల్ల మేము తరచుగా కలుసుకోలేము. అందుకే మా వైవాహిక బంధం సక్సెస్‌ఫుల్‌ సాగుతుందని జావెద్‌ అంటుంటాడు. ఆయన తండ్రి, మా నాన్న ఇద్దరూ కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కవులు, కమ్యూనిస్టులే! మా పేరెంట్స్‌ లాగే మా ఇద్దరి ఆలోచనలు కూడా చాలా విషయాల్లో ఒకే విధంగా ఉంటాయి.మేమిద్దరం బెస్ట్‌ ఫ్రెండ్స్‌సంతోషకరమైన విషయం ఏంటంటే.. మా బంధం అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉంది. చెప్పాలంటే ఇంకా ధృడంగా తయారైంది. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తాడు.. షబానా నా బెస్ట్‌ ఫ్రెండ్‌. పెళ్లి వల్ల ఆ బంధమైతే మారలేదనేవాడు!' అని చెప్పుకొచ్చింది. కాగా జావెద్‌ అక్తర్‌ గతంలో హనీ ఇరానీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జోయా, ఫర్హాన్‌ అని ఇద్దరు పిల్లలు సంతానం. హనీతో విడిపోయిన అనంతరం జావెద్‌ 1984లో షబానాను పెళ్లాడాడు.చదవండి: భయపెట్టేందుకు రెడీ అయిన సూపర్‌ హిట్‌ హారర్‌ మూవీ.. ఓటీటీలో ఎప్పుడంటే?

Producer Ishari Ganesh Opens About Rajinikanth 172 Movie
రజనీ 172వ సినిమా లైన్‌లో..! గ్రీన్‌ సిగ్నల్‌ పడితే..!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవలే తన 170వ చిత్రం వేట్టైయాన్‌ను పూర్తిచేశారు. ఇందులో ఈయన మాజీ పోలీస్‌ ఎన్‌కౌంటర్‌గా నటించినట్లు సమాచారం. అమితాబ్‌బచ్చన్, రానా వంటి ప్రముఖ నటులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే రజనీ 172 మూవీ!ప్రస్తుతం రజనీకాంత్‌ తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్‌పైకి వెళ్లనుంది. తాజాగా రజనీకాంత్‌ 172వ చిత్రానికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. దీన్ని వేల్స్‌ ఫిలింస్‌ ఇంటర్‌నేషనల్‌ పతాకంపై ఐసరి కే.గణేశ్‌ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శింబు గురించి ఏమన్నారంటే?ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన ప్రస్తుతం హిప్‌హాప్‌ ఆది హీరోగా పీటీసార్‌ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు గురించి అడిగిన ప్రశ్నకు ఐసరి గణేశ్‌ బదులిస్తూ శింబు తన చిత్రం 'కరోనాకుమార్‌'లో నటిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు.గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే షురూఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే త్వరలో రజనీకాంత్‌ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగానే తలైవా 172వ చిత్రం ప్రారంభం అవుతుందని ఐసరి గణేశ్‌ పేర్కొన్నారు.

Advertisement


Advertisement
Advertisement