-
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తొర్రూరు రూరల్: తొర్రూరు ఎకై ్సజ్ అధికారులు తనను వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ మండలంలోని కపూర్య తండాకు చెందిన భీముడు బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడి కథనం ప్రకారం.. తొర్రూరు ఎకై ్సజ్ అధికారులు బుధవారం తండాలో గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు. ఈ సమయంలో అదే తండాకు చెందిన భీముడుని గతంలో తనపై గుడుంబా విక్రయించిన కేసు ఉందని పోలీసుస్టేషన్ రావాలని వేధింపులకు గురి చేశారు. ఈ ఘటనపై మనస్తాపం చెందిన భీముడు ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే తొర్రూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అనంతరం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ ఎదుట భీముడి బంధువులు, తండావాసులతోపాటు జెడ్ప్ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న సివిల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. కాగా, భీముడిని వేధింపులకు గురి చేశామని ఆరోపించడం సరికాదని తొర్రూరు ఎకై ్సజ్ ఎస్సై తిరుపతి అన్నారు. కపూర్య తండాలో గుడుంబా స్థావరాలపై దాడులు చేశామని, ఈ దాడుల్లో భీముడికి చెందిన గుడుంబా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో పోలీసుస్టేషన్ రమ్మన్నామన్నారు. కావాలనే ఎకై ్సజ్ అధికారులను బాక్ల్ మెయిల్ చేసేలా తండా వాసులు వ్యవహరించారన్నారు. -
మరో పోరాటానికి సిద్ధం కావాలి
హన్మకొండ: రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపు సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా 80శాతం దాటిందన్నారు. ఈ మేరకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వర్గాలను మోసం చేస్తుందని విమర్శించారు. చేవెళ్ల సభలో ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేశారు. బీసీల కులగణన పేరుతో కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు అడుగులు వేయడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సిద్ధ రామయ్యతో చేయించిన డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. జూన్ 11వ తేదీ లోపు రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే యుద్ధం ప్రారంభిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులు, సంఘాలు, రాజకీయ నాయకులను సమీకరిస్తామని, రిజర్వేషన్ల పెంపు సాధనకు పోరాటం చేస్తామన్నారు. ఈ పోరాటానికి ఎమ్మార్పీఎస్ సమన్వయకర్తగా వ్యవహరిస్తుందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకులు వేల్పుల సూరన్న కాపు, మంద కుమార్ మాదిగ, పుట్ట రవి, బండారి సురేందర్ మాదిగ, గద్దల సుకుమార్ మాదిగ, జన్ను దినేష్, మంద రాజు, గంగారాపు శ్రీనివాస్, అంకిళ్ల రాజు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
ముద్ద ముద్దగా అన్నం.. నీళ్ల మజ్జిగ
● కేయూ కామన్మెస్ విద్యార్థుల ఆందోళన కేయూ క్యాంపస్: భోజనం నాణ్యత లేదని, అన్నం మెత్తగా అయిందని ఆరోపిస్తూ బుధవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్కు బియ్యం సరఫరా చేసే వ్యాిపారికి మూడునెలలుగా బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. దీంతో అతను బుధవారం బియ్యం సరఫరా చేయలేదు. క్యాంపస్లోని పద్మాక్షి మహిళా హాస్టల్నుంచి బియ్యాన్ని తీసుకొచ్చి కామన్మెస్లోని విద్యార్థులకు వంటచేసి వడ్డించారు. బియ్యం నూకలు నూకలుగా ఉండటంతో కూడా అన్నం మెత్తగా అయిందని తెలుస్తోంది. రాత్రి విద్యార్థులు భోజనం నాణ్యతగాలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మజ్జిగా నీళ్లలాగా ఉందని ఆరోపించారు. అక్కడే ఉన్న సిబ్బంది హాస్టళ్ల డైరెక్టర్ గాదె సమ్మయ్యకు సమాచారం ఇచ్చారు. ఆయన రావడం కొద్దిగా ఆలస్యం కావటంతో విద్యార్థులు అన్నం, మజ్జిగను తీసుకొని కేయూ మొదటి గేట్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అక్కడికి సమ్మయ్య చేరుకొని అన్నం, మజ్జిగ పరిశీలించారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రిజిస్ట్రార్ మల్లారెడ్డి కూడా అక్కడికి చేరుకొని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. వెంటనే రిజిస్ట్రార్ సంబంధిత వ్యాపారితో ఫోన్లో మాట్లాడి బిల్లులు చెల్లిస్తామని నాణ్యతతో కూడిన బియ్యం సరఫరా చేయాలని తెలిపినట్లు సమాచారం. ఆ తరువాత విద్యార్థులు ఆందోళన విరమించారు. నేల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి హన్మకొండ : నేల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు పచ్చి రొట్ట ఎరువును వాడుతూ ప్రతి సంవత్సరం భూసార పరీక్ష చేయించుకోవాలని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమారెడ్డి అన్నారు. నాబార్డు ఆధ్వర్యంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ‘దీర్ఘకాలిక పంట ఉత్పాదన కోసం నేల ఆరోగ్య పరిరక్షణ’ అనే అంశంపై రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట పండించడానికి నేల సహజసిద్ధ వనరని, నేల మొక్కకు కావాల్సిన పోషకాలు, నీరు అందిస్తుందన్నారు. ఈ క్రమంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే కావాల్సిన పంట దిగుబడులు సాధించుకోవాలన్నారు. నాబార్డు డీడీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ శిక్షణ నెలకు ఒక్కటి చొప్పున 2024 మే నుంచి 2025 ఫిబ్రవరి వరకు జరుగుతుందన్నారు. వరంగల్ డాట్ సెంటర్ కోఆర్డినేటర్ దిలీప్ కుమార్, వ్యవసాయ అధికారి నగేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
రామన్నపేట : రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోవంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం మట్టెవాడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వరంగల్ డాక్టర్ కాలనీ సమీపంలోని సుర్జీత్నగర్కు చెందిన నరేశ్(34) ఆరునెలల క్రితం భార్య నుంచి విడాకులు పొందాడు. అనంతరం తల్లి లక్ష్మితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. శస్త్రచికిత్స చేసిన ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీన తల్లి.. బంధువుల ఇంటికి వెళ్లింది. 27వ తేదీన సాయంత్రం ఇంట్లోకి వెళ్లిన నరేష్ బయటకు రాలేదు. ఈ క్రమంలో ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తల్లికి సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి బుధవారం ఉదయం తలుపులు తీయగా నరేశ్ ఉరేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తుమ్మ గోపి తెలిపారు. రైలు కిందపడి మరో యువకుడు.. కాజీపేట రూరల్ : కాజీపేట – పెండ్యాల రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం గుర్తు తెలియని యువకు డు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజీ పేట జీఆర్పీ ఎస్సై మొహినొద్దీన్ కథనం ప్రకారం.. గుర్తు తెలియని సుమారు 35 ఏళ్ల వయసు గల యువకుడు అయోధ్యపురం రైల్వేగేట్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి ఎడమ చేతిపై ఏఏ అని, కుడి చేతికి రబ్బర్ బ్యాండ్ ఉందని తెలిపారు. మృతుడు నలుపు రంగుతో 5.6 అడుగుల ఎత్తు, గోధుమ రంగు ప్యాంట్, తెలుపు రంగు షర్ట్ ధరించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్సై మొహినొద్దీన్ తెలిపారు. కాటారంలో ఇంకో యువకుడు.. కాటారం: అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు .. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం కాటారంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రంలోని బొమ్మనగూడేనికి చెందిన బండం రమేశ్(38) నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. రూ. నాలుగు లక్షలు ఖర్చు చేసి మూడుసార్లు మోకాళ్ల భాగంలో ఆపరేషన్, ఒక్కసారి కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇటీవల మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో డాక్టర్ల వద్దకు వెళ్లగా మరోసారి ఆపరేషన్ చేయాలని సూచించారు. రమేశ్ భార్య జ్యోతి నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లగా ఒంటరిగా ఉన్న రమేశ్ తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉద యం గమనించిన స్థానికులు భార్య, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం రమేశ్ మృతదేహాన్ని మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. మృతుడికి భార్య, కుమారుడు రిశ్వంత్ ఉన్నా డు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్కు చెందిన ముగ్గురు యువకులు ఆత్మ హత్యకు పాల్పడ్డారు. వరంగల్ డాక్టర్ కాలనీ సమీపంలోని సుర్జీత్నగర్లో ఒకరు, అయోధ్యపురం రైల్వేగేట్ సమీపంలో మరొకరు, కాటారం మండల కేంద్రంలో ఇంకొకరు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
మత్తు నివారణకు పటిష్ట చర్యలు
అదనపు కలెక్టర్ రాధికా గుప్తా హన్మకొండ అర్బన్: జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మత్తు పదార్థాల నియంత్రణపై వివిధ శాఖల అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, రానున్న రోజుల్లో చేపట్టే కార్యాచరణ వివరాలపై ఆయా శాఖల అధికారులతో ఆమె మాట్లాడారు. ఎవరూ మత్తు పదార్థాల బారిన పడొద్దని సూచించారు. పొగాకు, గంజాయి, తదితర మత్తు పదార్థాలకు బానిసలైన వారికి వైద్య సేవల కోసం టెలీ మానస్ నంబర్ 14416 సంప్రదించవచ్చని తెలిపారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో 20 బెడ్లతో రిహాబిలిటేషన్ సెంటర్ అందుబాటులో ఉందని, దీని ద్వారా బాధితులకు 30 రోజుల పాటు ఉచిత వైద్య సేవలందిస్తారని తెలిపారు. ప్రజలు గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖకు చెందిన 70130 36629 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో.. యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ, నార్కోటిక్స్, విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పీఆర్సీ వర్తింపజేయాలి
● కేయూ ఎన్జీఓ వినతి కేయూ క్యాంపస్: సర్వే చేయించిన అనంతరం కాకతీయ యూనివర్సిటీకి ప్రహరీ నిర్మాణం చేపడుతామని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణ అన్నారు. ఈ మేరకు బుధవారం పరిపాలన భవనంలో ఉద్యోగులు, విద్యార్థులతో సెనేట్హాల్లో సమావేశం నిర్వహించారు. ఆయా ఉద్యోగ, విద్యార్థి సంఘాల బాధ్యులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని తెలిపారు. కేయూలోని 90 మంది ఉద్యోగులకు పీఆర్సీ వర్తింపజేయాలని ఎన్జీఓ జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి కోరగా సమస్య త్వరలోనే పరిష్కరిస్తానని కరుణ హామీ ఇచ్చారు. సూపరింటెండెంట్ పదోన్నతులకు ఒకే చెప్పారు. అలాగే, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లారు. పీహెచ్డీ కోర్సుల ఫీజులు తగ్గించాలని, అన్ని విభాగాల తరగతుల గదులను డిజిటలైజేషన్ చేయాలని, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆ కళాశాల నుంచి హాస్టల్ వరకు బస్సు సదుపాయం కల్పించాలనే తదితర సమస్యలు విన్నవించారు. స్పందించిన ఇన్చార్జ్ వీసీ.. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యూనివర్సిటీలో పారిశుధ్య లోపంపై కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డిని పిలిపించారు. పారిశుధ్య నిర్వహణ, లైబ్రరీ, హాస్టళ్లలో మంచి నీటి సదుపాయంపై పూర్తిస్థాయిలో నివేదిక అందజేయాలని ఆదేశించారు. -
విత్తన ఎంపిక కీలకం
హన్మకొండ: అధిక దిగుబడులకు విత్తన ఎంపిక కూడా ముఖ్యమే. నాణ్యమైన, శ్రేష్టమైన విత్తనాన్ని ఎంచుకోవడం కీలకం. వానాకాలం పంటల సాగుకు విత్తనాల ఎంపిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి వినూత్నంగా అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రత్యేక సమావేశాలతో పాటు ఎక్కడ పది మంది ఉంటే అక్కడ, చివరకు రచ్చబండల వద్ద కూడా వ్యవసాయ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. భౌగోళిక, వాతావరణ, శీతోష్ణస్థితి పరిస్థితులను అనుసరించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ రంగంలో అనుభవమున్న రైతుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే మొలకెత్తకపోవడం, ఎక్కువగా తెగుళ్లు, చీడపీడలు ఆశించడం.. తద్వారా పంటనష్టం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లూజుగా ఉన్న సంచుల్లోని విత్తనాలను కొనుగోలు చేయొద్దు. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ప్యాక్ చేసిన, లేబుల్ వేసిన విత్తనాలను మాత్రమే కొనాలి. గడువు ముగిసిన విత్తనాలు కొనుగోలు చేయొద్దు. విత్తనాలు కొనుగోలు చేసే ముందు గ్రామం, మండలం, జిల్లాలో అధీకృత డీలర్ల వివరాలు తెలుసుకోవాలి. విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత తీసుకున్న రశీదు మీద విత్తన కంపెనీ పేరు, విత్తనం రకం, బ్యాచ్, లాట్ నంబర్, ధర వివరాలు చూసుకోవాలి. విత్తన ప్యాకెట్లపై తయారీ తేదీ, పత్తి విత్తనాలైతే జీఈఏసీ నంబర్ చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే పంట నష్టం జరిగినప్పుడు వ్యవసాయ అధికారులను సంప్రదించి నష్టపరిహారం పొందొచ్చు. పక్క జిల్లాలు, రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి నకిలీ విత్తనాలు విడిగా అమ్మితే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. తక్కువ ధరకు లభిస్తున్నాయని కొనుగోలు చేసి నష్టపోవద్దు. హైబ్రీడ్ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విత్తనరకం, భౌతిక స్వచ్ఛత, మొలకెత్తే స్వభావం, జన్యుపర నాణ్యత లేబుల్ మీద ఉన్నాయో లేదో చూడాలి. విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఇంటి వద్దే మొలక శాతాన్ని పరీక్షించుకున్న తర్వాత సంతృప్తికరంగా ఉంటేనే పొలంలో విత్తుకోవాలి. విత్తనంలో మొలకశాతం తక్కువగా ఉంటే కొనుగోలు చేసిన దుకాణదారుడి దగ్గరకు తీసుకువెళ్లి పరిస్థితిని వివరించి వేరే విత్తనం తీసుకోవాలి. విత్తన లోపాన్ని వివరించిన తర్వాత వ్యాపారి సరైన రీతిలో స్పందించకపోతే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలి. తద్వారా పరిహారం పొందొచ్చు. పంటకు నష్టం జరిగితే రైతుకు రశీదే కీలక ఆధారం. కాబట్టి పంట కాలం పూర్తయ్యే వరకు కొనుగోలు చేసిన రశీదు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. వ్యవసాయ శాఖ విస్తృత ప్రచారం రైతు వేదికలు, రచ్చబండ వద్ద అవగాహనవ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలిరైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న దుకాణాల్లోనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలి. గ్రామాల్లోకి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి విత్తనాలు అమ్మితే కొనవద్దు. అలాంటి వారిపై వ్యవసాయాధికారులకు సమాచారం అందించాలి. –రవీందర్ సింగ్, హనుమకొండ డీఏఓ -
దస్తావేజులతోనే భూ హక్కు..
కాజీపేట అర్బన్ :‘మనిషి జీవితం శాశ్వతం కాదు.. భూదస్తావేజులు(ల్యాండ్ డీడ్స్) మాత్రం శాశ్వతం’ అనే కొటేషన్ (సూక్తులు)లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దర్శనమిస్తుంటాయి. అవును.. ఆ కొటేషన్ నిజమేనని అనాలి. ఎందుకంటే మాట కంటే.. ధ్రువపత్రంపై రాసుకున్న అక్షరాలనే న్యాయస్థానం నమ్ముతుంది. ధ్రువపత్రమే సాక్ష్యాధారం అవుతుంది. అందుకే దస్తావేజుల ద్వారానే భూ క్రయవిక్రయాలు సాగుతాయి. ఈ పత్రాలు రూపొందించే క్రమంలో ఏమాత్రం ఏమరపాటు చేసిన సమస్యలు ఉత్పత్నమవుతాయి. అందుకే భూక్రయవిక్రయాల్లో దస్తావేజులు క్షుణ్ణంగా పరిశీలించడం, సరైన పద్ధతిలో రూపొందించడం అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో మార్కెట్ విలువ ఆధారంగా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతో రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. భూ దస్తావేజుల రకాలు ఇలా.. సేల్ డీడ్(విక్రయ దస్తావేజు).. తమ భూమిని ఇతరులకు విక్రయించిన తరుణంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ నిమిత్తం సేల్ డీడ్(విక్రయ దస్తావేజు) ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. ఇందుకు గాను సేల్ డీడ్కు 7. 5 శాతం స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చలాన్ రూపంలో చెల్లించాలి. గిఫ్ట్ డీడ్( బహుమతి దస్తావేజు).. ఒక వ్యక్తి తన భూమి లేదా ఆస్తిని తనకు నచ్చిన వారికి బహుమతిగా ఇచ్చేందుకు గాను గిఫ్ట్ డీడ్ ద్వారా బదలాయింపు చేస్తారు. ఇందుకు గాను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గిఫ్ట్ డీడ్కు 3 శాతం రుసుం స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో తనకు నచ్చిన వారికి ఇచ్చిన బహుమతి తిరిగి తీసుకునే హక్కు దాతకు ఉంటుంది. పార్టీషన్ డీడ్ (పంపకాల దస్తావేజు).. తన తండ్రి లేదా వారసత్వంగా వస్తున్న ఆస్తిని వారసులు పంచుకునేందుకు గాను పార్టీషన్ డీడ్ను ఉపయోగిస్తారు. పార్టీషన్ డీడ్ ద్వారా తమ ఆస్తిని పంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు గాను 0.5 స్టాంప్ డ్యూటీ రూ. 2వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. వారసులు కాకుండా ఇతరులకు ఆస్తిలో పంపకాలు జరిపేందుకు గాను 2.5 రుసుం రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. రెక్టిఫికేషన్ డీడ్(తప్పుల సవరణ దస్తావేజు).. భూ దస్తావేజుల్లో ఏమైనా తప్పులు దొర్లినప్పుడు వాటిని సరిచేసుకునేందుకు గాను రెక్టిఫికేషన్ డీడ్ తోడ్పడుతుంది. రూ. 2 వేల రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రూ. 100 స్టాంప్ డ్యూటీగా చెల్లించాలి. జీపీఏ లేదా ఎస్పీఏ డీడ్ (భూహక్కు లేదా పవర్ దస్తావేజు).. సాధారణంగా తమ ఆస్తిపై తమకు నచ్చిన వారికి హక్కును కల్పించేందకు గాను జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) దస్తావేజు ద్వారా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు. జీపీఏ చేసిన వ్యక్తి జీవించి ఉన్నంత కాలం జీపీఏ వర్తిస్తుంది. తదనంతరం వర్తించదు. తమకు నచ్చిన వారికి తమ ఆస్తిపై హక్కు కల్పించేందుకు గాను ఎస్పీఏ(స్పెషల్ పవర్ ఆఫ్ ఆటార్నీ) దస్తావేజు ద్వారా హక్కు కల్పిస్తారు. కాగా, ఎస్పీఏ కేవలం 150 రోజుల కాలపరిమి తితో మాత్రమే హక్కు కల్పిస్తుంది. ఇందుకు గాను రిజిస్ట్రేషన్ శాఖకు జీపీఏ, ఎస్పీఏకు గాను 1 శాతం స్టాంప్ డ్యూటీ, 0.5 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆదాయ వనరు.. రిజిస్ట్రేషన్ శాఖ.. రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ ద్వారా రుసుం ఖజానాకు చేరుతుంది. దీంతో ప్రభుత్వం అన్ని శాఖల కంటే రిజిస్ట్రేషన్ శాఖపై ఎక్కువ మక్కువ కనబరుస్తుంది. దస్తావేజుల తయారీతో ఉపాధి.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టు నిరుద్యోగ యువత ఉపాధి నిమిత్తం డాక్యుమెంట్ రైటర్లుగా కొనసాగుతున్నారు. భూక్రయవిక్రయదారులకు దస్తావేజులు రూపొందిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఉపాధి పొందుతున్నారు.క్రయవిక్రయాల్లో ఈ పత్రాలే కీలకం లేనిపక్షంలో చెల్లుబాటు కావు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా నిలుస్తున్న రిజిస్ట్రేషన్ శాఖ దస్తావేజుల తయారీతో నిరుద్యోగులకు ఉపాధిలే అవుట్తోనే భూమికి భద్రతభూమి కొనుగోలు అంశంలో జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. లేఅవుట్ ప్లా ట్లనే కొనుగోలు చేయాలి, తద్వారా భూమికి భద్రత ఉంటుంది. భూమి కొనుగోలు చేసేటప్పుడు దస్తావేజులను క్షుణ్ణంగా పరిశీలించాలి, స్వయంగా దస్తావేజులు రూపొందించుకునేందుకు teanfana.refirtration.gov.in అను వెబ్సైట్ను సంప్రదించాలి. ఆన్లైన్లో భూమి మార్కెట్ విలువ ఆధారంగా చలాన్ చెల్లించి, రూపొందించుకున్న దస్తావేజులతో నేరుగాసబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తాం. –రాజు, సబ్ రిజిస్ట్రార్, వరంగల్ ఆర్ఓ -
దైవ దర్శనానికి వెళ్తూ.. అనంతలోకాలకు
దామెర: మేడారం సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యా యి. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్కు చెందిన కల్లూరి రాణి, తన తల్లి జనరాసుపల్లి లక్ష్మి, బంధువులు చెన్నమ్మ, ఊరడి అనంతమ్మ మంగళవారం రాత్రి సాధుల ప్ర భుకు చెందిన ఆటోలో మేడారం బయలుదేరారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఊరుగొండ శివారు పెట్రోల్బంక్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో లక్ష్మి(68)కి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. రాణి, చెన్నమ్మ, అనంతమ్మ, ఆటో డ్రైవర్ ప్రభు కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108లో ఎంజీఎం తరలించారు. వారిలో చెన్నమ్మ (78) చికిత్స పొందుతూ చనిపోయింది. క్షతగాత్రురాలు రాణి ఫిర్యాదు మేరకు అజాగ్రత్త.. అతివేగంతో ఆటో నడిపిన ప్రభుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతున్న వారిని ఎస్సై అశోక్ కలిసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదుపుతప్పి ఆటో బోల్తా.. ఇద్దరు మృతి ముగ్గురికి గాయాలు ఊరుగొండ వద్ద ఘటన -
వనదేవతల స్థలం ఆక్రమించొద్దు
ఎస్ఎస్తాడ్వాయి: భద్రకాళి దేవస్థాన అధికారులు.. మేడారం సమ్మక్క, సారలమ్మకు కేటాయించిన స్థలం ఆక్రమించుకునే ప్రయత్నం విరమించుకోవాలని, సమ్మక్క– సారలమ్మ ధార్మిక భవనంగా నామకరణం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మేడారంలో వనదేవతల పూజారులు ధర్నా చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు చందా రఘుపతి, కొక్కెర రమేశ్ మాట్లాడుతూ 1993లో అప్పటి మంత్రి జగన్నాయక్ మేడారం ఈఓ కార్యాలయం భవన నిర్మాణం కోసం వరంగల్ సెంట్రల్ జైల్ సమీపంలో వెయ్యి గజాల స్థలం అమ్మవార్లకు కేటాయించారన్నారు. సుమారు 30 ఏళ్ల నుంచి ఆ స్థలం కాపాడుకున్నామన్నారు. ఇటీవల ఆ స్థలంలో ధార్మిక భవనం నిర్మించారని, ఆ భవనంలో మేడారం ఈఓ కార్యాలయం, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇంజనీరింగ్ కార్యాలయాలు కొనసాగుతున్నాయన్నారు. వేద పాఠశాల ఏర్పాటు చేయడంతోపాటు సదరు స్థలాన్ని భద్రకాళి దేవస్థానం లాక్కునేందుకు ఈ కార్యాయాలను ఖాళీ చేయాలని అధికారులపై ఒత్తిడి చేయిస్తున్నారన్నారు. ఈ విషయంపై ఇటీవల దేవాదాయశాఖ కమిషనర్తో మాట్లాడినా ఆ అధికారి నుంచి ఎలాంటి హామీ రాలేదన్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసన చేపడుతున్నామన్నారు. ప్రత్యేక జీఓ తీసుకువస్తాం: మంత్రి సీతక్క మేడారంలో పూజారులు చేపట్టిన ధర్నా వద్దకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేరుకున్నారు. పూజారులతో మాట్లాడారు. ఈవిషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆధారాల చూపించి భవనానికి సమ్మక్క, సారలమ్మ ధార్మిక భవనంగా నామకరణం చేయించి మేడారం కార్య నిర్వాహణాధికారి పరిధిలోకి వచ్చేలా ప్రత్యేక జీఓ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. దీంతో పూజారులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో పూజారులు మునీందర్, కాక సారయ్య, సిద్ధబోయిన స్వామి, అనిల్, కాక వెంకటేశ్వర్లు, భుజంగారావు, అమృత, దబ్బగట్ల గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. ప్రధాన ప్రవేశ మార్గం గేట్కు తాళం ధర్నా సందర్భంగా పుజారులు.. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే ప్రధాన ప్రవేశ మార్గం గేట్కు తాళం వేశారు. దీంతో భక్తులను పోలీసు క్యాంపు దారి నుంచి అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఇచ్చారు. మేడారం పూజారుల డిమాండ్ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన మంత్రి హామీతో ధర్నా విరమణ -
ట్రాక్టర్ ఢీకొని వృద్ధురాలి మృతి
స్టేషన్ఘన్పూర్: ట్రాక్టర్ ఢీకొని ఓ వృద్ధురాలి మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని సముద్రాలలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాడూరి కాశమ్మ(73) రోజూ మాదిరిగానే మంగళవారం తన ఇంటి ఎదుట కూర్చుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కట్ల యాదగిరికి చెందిన ట్రాక్టర్ను అతడి కుమారుడు రాజ్కుమార్ రివర్స్ తీసేందుకు స్టార్ట్ చేశాడు. నిర్లక్ష్యంగా వెనుకకు తీస్తుండగా ట్రాక్టర్.. కాశమ్మను ఢీకొంది. ఈ ఘట నలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది.దీంతో ఆమెను తన అల్లుడు వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి అల్లుడు పరశురాములు ఫిర్యాదు మేరకు రాజ్కుమార్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ముస్క రాజు బుధవారం తెలిపారు. -
పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి
వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య వరంగల్: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలని వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. వరంగల్ మండలం మట్టెవాడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, గ్రెయిన్ మార్కెట్ ప్రభుత్వ ప్రా థమిక పాఠశాల, ఏనుమాములలోని సుందరయ్యనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, క్రిస్టియన్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించా రు. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. యూనిఫాం తయారీ కేంద్రం పరిశీలన వరంగల్ శివనగర్లోని తెలుగుతల్లి మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిఫాం తయారీ కేంద్రాన్ని కలెక్టర్ అంతకుముందు సందర్శించారు. ఈసందర్భంగా టీఎల్ఎఫ్లు నిర్వహిస్తున్న రికార్డులు, యూనిఫాం స్టిచింగ్ వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా 70 శాతం దుస్తులను కుట్టించి సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందించినట్లు కలెక్టర్ వెల్లడించారు. జూన్ 10లోగా యూనిఫాం విద్యార్థులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఈఓ వాసంతి, మెప్మా డీఎంసీ రేణుక, ఈఈ శ్రీనివాస్, ఇంజనీరింగ్ అధికారులు, ఎంఈఓ, ఎంఎన్ఓ, టీఎల్ఎఫ్లు పాల్గొన్నారు. 3 నుంచి బడిబాట : డీఈఓ వరంగల్ జిల్లాలో వచ్చేనెల 3 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో తెలిపారు. మండలస్థాయి, పాఠశాల స్థాయిలో –సంసిద్ధతా కార్యక్రమాల యాక్షన్ ప్లాన్ కోసం ఈనెల 31న సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
‘తోరణం’.. పాలన వైభవానికి నిదర్శనం
ఖిలా వరంగల్: రాష్ట్ర పాలన వైభవానికి కాకతీయ కళా తోరణం నిదర్శనమని, సమైక్య వాది సీఎం రేవంత్రెడ్డి.. తెలంగాణ సంస్కృతి,కళలు, చరిత్రను కనుమరుగు చేయాలని కుట్రలు చేస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చేస్తున్న మార్పులను నిరసిస్తూ బుధవారం సాయంత్రం ఖిలావరంగల్ మధ్యకోట శిల్పాల ప్రాంగణంలోని కాకతీయుల కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసన, ధర్నా చేపట్టారు. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం మారిస్తే ఊరుబోమని, ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప సంహరించుకునే వరకు నిరసనలతో కూడిన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈసందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వెనక తెలంగాణ వ్యతిరేక శక్తులు పని చేస్తున్నాయని, సమైక్యవాదుల కుట్రల వల్లనే ఈనాడు రాష్ట్ర చిహ్నం మార్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. అనుమతులు లేకుండా మార్పులు చేస్తే హైకోర్టులో కేసు వేస్తామని పేర్కొన్నారు. జూన్ 2న సోనియాగాంధీని తీసుకొచ్చి ఆవిర్భావ దినోత్సవంలో రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంలో మార్పులు చేయాలని చూస్తున్నారని, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలో తెచ్చిన జాతీయ చిహ్నంలో మార్పులు చేసారా? అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ నేతలను కేంద్ర పురావస్తుశాఖ అధికారులు, ఏసీపీ నందిరామ్నాయక్, ఇన్స్పెక్టర్ మల్లయ్య అడ్డుకున్నారు. పోలీసులకు, నాయకులకు తోపులాట జరగడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కాకతీయ తోరణం ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా రాష్ట్ర చిహ్నం మారిస్తే ఊరుకోబోమని హెచ్చరిక -
‘పగుల’కొట్టారు
తాగునీటి పైపులైన్లకు సీసీ రోడ్డు ధ్వంసంరేయింబవళ్లు జనం నడిచే సీసీ రోడ్డును తాగునీటి పైపులైన్ పేరుతో బద్ధలు కొట్టేసి కష్టాలు మిగిల్చిన ఇంజనీర్ల పనితనమిది. సాధారణంగా రోడ్డుకు ఎడమ, కుడి వైపులా తవ్వకాలు జరపాలి. కానీ రోడ్డు మధ్యలో తవ్వేసి ప్రజలకు ప్రమాదాలు,కష్టాలు, కన్నీళ్లు మిగిల్చారు. ఇది ఎక్కడో కాదు. నగర నడిబొడ్డున ఉన్న వరంగల్ ఎల్లంబజార్ రోడ్డు. పలు కాలనీలకు ఇది అంతర్గత రహదారి. అమృత్ పథకంలో భాగంగా తాగునీటి పైపులైన్లను వేస్తున్నారు. ఈ సీసీ రోడ్డు మధ్య జేసీబీతో భారీగా తవ్వకాలు చేసి పైపులైన్లను వేశారు. కొంతమేరకు గుంతలను పూడ్చారు. కానీ రెండు చోట్ల పైపులైన్ల అనుసంధానంతో గుంతలతో వదిలేశారు. దీంతో వాహనదారులు, బాటసారులు అవస్థల పాలవుతున్నారు. – వరంగల్ అర్బన్ -
గురువారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2024
– 8లోuసెలెక్టెడ్ పొలిటికల్ లీడర్ల సంభాషణలు విన్నారు.. ● అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల కట్టడే లక్ష్యం ● ఫోన్ ట్యాపింగ్తోనే డబ్బు, మద్యం గుట్టు రట్టు ●●●●● జేఏసీ, విద్యార్థి సంఘాల నేతల ఫోన్లపైనా నిఘా●● భుజంగరావు, తిరుపతన్న నేతృత్వం.. ప్రణీత్రావు, మరికొందరు పాత్రధారులు ● కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వివాదంపై క్లారిటీ ● ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి ప్రభాకర్రావు నీరుకుళ్ల వాసి సాక్షిప్రతినిధి, వరంగల్ : రోజుకో మలుపు తిరుగుతూ కొత్త అంశాలను తెరమీదకు తెస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల వాంగ్మూలాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈవ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఉమ్మడి వరంగల్ జిల్లా నీరుకుళ్ల్లకు చెందిన వ్యక్తి కాగా.. ఈప్రాంతం నేతలు కూడా ట్యాపింగ్ నుంచి తప్పించుకోలేకపోయారు. జేఎస్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా ఉన్న భుజంగరావు, మరో అదనపు ఎస్పీ తిరుపతన్న నేతృత్వంలో ఏసీపీ ప్రణీత్రావు ఆధ్వర్యాన బృందాలు ఉమ్మడి వరంగల్పై దృష్టి పెట్టడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్టాపిక్ మారింది. ‘స్టేషన్’ వివాదంపై స్పష్టత ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇందులో భాగమై ఉన్నారని, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఈ ఆపరేషన్కు ఇన్చార్జ్గా ఉన్నారని అంగీకరించిన మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్రావు.. పలువురు ముఖ్యనేతలు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి వరంగల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార, విపక్ష నేతల వైఖరిపై నిఘా వేసినట్లు తెలిసింది. ఈక్రమంలో స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలన్న నిర్ణయం వివాదం కావడంపైనా ట్యాపింగ్ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. మాజీ మంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య గ్రూపు తగాదాలు, పరస్పర ఆరోపణలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు, వీరి వర్గాలకు చెందిన ముఖ్య నేతల ఫోన్ సంభాషణల తీరును పరిశీలించి ఇచ్చిన నివేదిక మేరకు కడియం శ్రీహరికి ‘బీ’ఫామ్ ఇచ్చి వివాదానికి తెర వేసినట్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పర్యటన, సభలు, సమావేశాలు, సంభాషణలపైనా ఆరా తీసినట్లు తేలిందని ‘సిట్’ రిపోర్టులో పేర్కొంది. న్యూస్రీల్రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు..ఎస్ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్రావు ఆదేశాలతోనే తాము ట్యాపింగ్, దాడులు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా వారు చెప్పిన వాస్తవాలు, రిమాండ్ రిపోర్టులో అంశాలు ఉమ్మడి వరంగల్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలకంగా పనిచేసినట్లు అంగీకరించారు. మరో మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్రావు కూడా అంశాల వారీగా కొన్నింట్లో సలహాలు, సూచనలు చేసినట్లు వారు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్, బండి సంజయ్తో పాటు కమలాపూర్ ప్రాంతానికి చెందిన కొందరు కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు వెల్ల డించారు. ఆ సమయంలో వరంగల్ కేంద్రంగా ఇద్దరు సీఐలతో కలిసి పనిచేసిన ఏసీపీ ప్రణీత్రావు బృందం ఇచ్చిన సమాచారం మేరకు డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయగలిగామని తెలిపారు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నర్సంపేట, జనగామ ప్రాంతాల్లో సుమారు రూ.2.18 కోట్ల నగదు పట్టుకున్న సంఘటనలతోపాటు పాలకుర్తి అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ తిరుపతన్న తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు రిమాండ్ రిపోర్టు చెబుతోంది. ములుగు, భూపాలపల్లి, పాలకుర్తి తదితర ప్రాంతాల్లో కొందరి ఫోన్ల ట్యాపింగ్తో మద్యం రవాణా గుట్టు విప్పినట్లు పేర్కొన్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడవుతుండడంతో అందరూ విస్తుపోతున్నారు. -
పోలీస్ ప్రతిష్టను దిగజార్చొద్దు..
సీపీ అంబర్ కిషోర్ ఝా వరంగల్ క్రైం : పోలీస్ విభాగం కీర్తి ప్రతిష్టలను దిగజార్చొద్దు.. దిగజార్చేలా వ్యవహరిస్తే సహించేది లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. బుధవారం కమిషనరేట్ పోలీస్ అధికారులతో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా కమిషనరేట్ పరిధి శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. అలాగే జూన్ 4న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అలాగే జూన్ 9న జరిగే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలపై సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నాసిరకం విత్తనాల విక్రయాలపై స్థానిక పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ.. రైతులు అక్రమార్కుల బారిన పడకుండా చూడాలన్నారు. పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించే అధికారులు నిజాయితీగా ఉండాలని చెప్పారు. సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి ఫిర్యాదులను పరిష్కరించేలా పని చేయాలన్నారు. శాంతి భద్రతల సమస్య ఉంటే ప్రజలు ముందుగా సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అక్కడ సరైన న్యాయం జరగకుంటే 87126 85070 నంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేస్తే తగిన చర్యలు తీసుకోనున్నట్లు సీపీ పేర్కొన్నారు. అనంతరం పార్లమెంట్, ఎమ్మెల్సీ ఉప ఎన్నికను సజావుగా నిర్వహించడానికి కృషి చేసిన పలువురు పోలీస్ అధికారులకు సీపీ ప్రశంస పత్రాలు అందజేశారు. సమావేశంలో డీసీపీలు అబ్దుల్బారీ, రవీందర్, ఏఎస్పీ అంకిత్, అదనపు డీసీపీలు రవి, సంజీవ్, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అకడమిక్ సమస్యలు పరిష్కరిస్తా..
కేయూ క్యాంపస్: ‘నేను ఇన్చార్జ్ వీసీగా ఉండేది కొద్దిరోజులు మాత్రమే.. వర్సిటీలోని అకడమిక్ పరంగా ఉండే సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తాను’ అని కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణ అన్నారు. ఇన్చార్జ్ వీసీగా ఈనెల 22న బాధ్యతలు స్వీకరించిన ఆమె తొలిసారి బుధవారం వర్సిటీకి వచ్చారు. తొలుత పరిపాలనాభవనంలోని సెనేట్హాల్లో అధ్యాపకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం ఒక దేవాలయం.. దాని డిగ్నిటీని కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించకుందామన్నారు. వర్సిటీ పూర్వవైభానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆమె.. మీ సమస్యలు తెలియజేయాలని అధ్యాపకులను కోరగా.. అకుట్ బాధ్యులు సమస్యలు వివరించడంతోపాటు వినతి పత్రం అందజేశారు. జాతీయ స్థాయిలో ఫెల్లోషిప్ కలిగిన దివ్యాంగులకు మొదటి కేటగిరీ పీహెచ్డీ అడ్మిషన్లు కల్పిస్తామని ఇన్చార్జ్ వీసీ ప్రకటించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డికి సూచించారు. శునకాల సమస్యపై కమిషనర్కు ఫోన్ వర్సిటీ హాస్టళ్ల మెస్ ప్రాంతాల్లో శునకాల సమస్య తీవ్రంగా ఉందని హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య సమ్మయ్య పేర్కొన్నారు. ప్రధానంగా పద్మాక్షి మహిళా హాస్టల్లో శునకాల స్వైరవిహారంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. స్పందించిన వీసీ కరుణ వరంగల్ మున్సిపల్ కమిషనర్కు ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యలపై ఏకరువు.. అకుట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మామిడాల ఇస్తారి మాట్లాడుతూ గత వీసీ తన ఇష్టారాజ్యంగా అధ్యాపకులను బదిలీలు చేశారన్నారు. కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల నుంచి పలువురి అధ్యాపకులను డిప్యూటేషన్ మీద తీసుకొచ్చి వారికి ఇక్కడ పరిపాలనాపదవులు ఇచ్చారని ఇది సరికాదని డిప్యూటేషన్పై వచ్చినవారిని వెనక్కిపంపాలన్నారు. దీంతోపాటు మరికొందరు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. సమావేశంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాధురాజేశ్, పార్ట్టైం లెక్చరర్ల అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ తిరుణహరిశేషు, కాంట్రాక్టు లెక్చరర్ల అధ్యాపకులసంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్కుమార్లోథ్ పాల్గొన్నారు. కల్యాణ మండపం పునర్నిర్మాణం గొప్ప అనుభూతిహన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయం కల్యాణ మండపం పునర్నిర్మాణం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని, నా చిరకాల కోరిక నెరవేరిందని పురావస్తుశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రభుత్వ కార్యదర్శి, కేయూ ఇన్చార్జ్ వైస్ చాన్స్లర్ వాకాటి కరుణ అన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని వాకాటి కరుణ సందర్శించారు. శ్రీరుద్రేశ్వరస్వామి వారికి అష్టోత్తరశతనామార్చనలు నిర్వహించిన అనంతరం కరుణకు మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను ‘కుడా’ చైర్పర్సన్గా ఉన్న సమయంలో దేవాలయ ముందుభాగం అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పురాణపండ శ్రీనివాస్ రచించిన శ్రీమాలిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వాకాటి కరుణ భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఉదయం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. నాణ్యమైన పరిశోధనలు చేపట్టాలి ఫెల్లోషిప్ కలిగిన దివ్యాంగులకు పీహెచ్డీ అడ్మిషన్లు కేయూ ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణ -
జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలకు ఐష
వరంగల్ స్పోర్ట్స్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో జూన్ 6 నుంచి నిర్వహించే జాతీయ స్థాయి రోలార్ స్కేటింగ్ పోటీలకు హనుమకొండకు చెందిన ఐష మర్యం ఎంపికై ంది. ఈనెల 28న గోదావరిఖని ఎన్టీపీసీలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–7 విభాగం స్పీడ్ క్విడ్ స్కేట్స్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించింది. బాలసముద్రంలోని చిల్డ్రన్స్ పార్కులో కోచ్ జోయెల్ వద్ద శిక్షణ పొందుతు న్న ఐష నయీంనగర్లోని తేజస్వీ హైస్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది. సబ్జూనియర్స్ కేటగిరీలో ఓపెన్ నేషనల్స్కు ఎంపికవడంపై పాఠశాల యాజమాన్యం అభినందించింది. నేడు డయల్ యువర్ డీఎంహన్మకొండ: ప్రయాణికుల సలహాలు, సూచనలు, సమస్యలు తెలుసుకునేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ వంగల మోహన్ రావు తెలిపారు. ఈనెల 30న హనుమకొండలోని వరంగల్–1 డిపో కార్యాలయం నుంచి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్, నిజ మాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలు తెలపాలని కోరారు. ప్లాస్టిక్ విక్రయ షాపుల్లో దాడులువరంగల్ అర్బన్: వరంగల్ పిన్నవారి వీధి, బీట్ బజార్లో బుధవారం ప్లాస్టిక్ విక్రయ షాపుల్లో అధికారులు దాడులు నిర్వహించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన 10 కేజీల ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకొని, రూ.17వేల జరిమానా విధించినట్లు బల్దియా శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్రెడ్డి తెలిపారు. బల్దియా ప్రజారోగ్యం విభాగం, కాలుష్య నియంత్రణ మండలి, వరంగల్, హనుమకొండ జిల్లాల వినియోగదారుల సంఘాల సమాఖ్య ప్రతినిధులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. నిషేధిత, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, స్పూన్లు, కప్లు, ట్రేలు తదితర వస్తువుల్ని విక్రయిస్తున్న షణ్ముఖ, హనుమాన్, లేపాక్షి, సుధ, ఎస్ఆర్, ఉత్తమ్, భవాని, హరి ఓం, హరీశ్ దుకాణాల్లో సోదాలు చేశారు. ఈతనిఖీల్లో ప్రతినిధులు డాక్టర్ ఠాకూర్ రతన్సింగ్, గిరగాని సుదర్శన్గౌడ్, కొడిమ్యాల శ్రీనివాస్రావు, మైస వసంత, నాగెల్లి సారంగం, బెజ్జంకి ప్రభాకర్, సిలువేరు శ్రీనివాస్, కుమారస్వామి, వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో 580 మంది గైర్హాజరు విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 580 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 10,236 మంది విద్యార్థులకుగాను 9,765 మంది హాజరుకాగా.. వారిలో 471 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ గోపాల్ తెలిపారు. ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో 2,131 మందికిగాను 2,022 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 109 మంది గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలివిద్యారణ్యపురి: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని టీపీటీఎఫ్ కార్యదర్శి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ బాలసముద్రంలోని కార్యాలయంలో టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి మనోజ్గౌడ్, బాధ్యులు బైరి స్వామి, కుమారస్వామి, రమేశ్, ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా.. తొలుత టీపీటీఎఫ్ పతాకాన్ని టీపీటీఎఫ్ సీనియర్ బాధ్యుడు పురుషోత్తమ్రావు ఆవిష్కరించారు. -
డీటీఓపై ఏసీబీ దాడులు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం (డీటీఓ.. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు ఆఫీస్)లో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఇందులో ఏజెంట్ల నుంచి రూ.45,100, డీటీఓ డ్రైవర్ నుంచి రూ.16,500, జూనియర్ అసిస్టెంట్ (జేఏ) నుంచి రూ.895 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వివరా లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కొద్దిరోజులుగా అవకతవకలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు రాష్ట్ర అవి నీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ సీవీ.ఆనంద్ ఆదేశాలతో దాడులు నిర్వహించామని తెలిపారు. ఇందులో డీటీఓ కార్యాలయంలో అనధికారికంగా ఉ న్న ఆరుగురు ఏజెంట్లు, జిల్లా రవాణా శాఖ అధి కారి గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆరుగురు ఏజెంట్లు విశ్వప్రసాద్, రహీంపాషా, వెంకటయ్య, వీరేందర్, లక్ష్మీనారాయణ, విజయ్ కుమార్ వద్ద నుంచి రూ.45, 100 నగదు, డీటీఓ డ్రైవర్ సుబ్బారావు వద్ద నుంచి రూ.16,500 నగదు, నూతన లైసెన్స్ పత్రాలు, రెన్యూవల్స్, ఫిట్నెస్కు సంబంధించిన ధ్రువపత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ (జేఏ) రవీందర్ వద్ద నుంచి రూ.895 నగదు స్వాధీనం చేసుకోగా కార్యాలయ కిటికీలో రూ.300 నగదు లభ్యమైందన్నారు. డీటీఓ కార్యాలయంలో డబ్బులు వసూలు చేస్తున్న ట్లు తెలుసుకున్నామన్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద ప్రభుత్వ రిజిస్టర్లో ఉండాల్సిన డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైందన్నారు. రా వాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థ లేదని, డ్రైవర్లు, అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉండొద్దన్నారు. డీడీలు, చెక్కులే ఉండాలన్నారు. అందుకు విరుద్ధంగా వారి వద్ద నగదు ఉందన్నారు. దీంతో డీటీఓ గౌస్ పాషా, ఎంవీఐ వెంకటపుల్లయ్య, జేఏ రవీందర్, ఇద్దరు డ్రైవర్లు అలెక్స్, సుబ్బారావుపై కేసు నమోదు చేశామన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటా మని తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు శ్యాంసుందర్, ఎల్.రాజు, ఎస్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఏజెంట్ల నుంచి రూ.45,100, డ్రైవర్ నుంచి రూ.16,500, జేఏ నుంచి రూ.895 నగదు స్వాధీనం డీటీఓ, ఎంవీఐ, జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు వివరాలు వెల్లడించిన వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య -
అధ్యాపకులు సిలబస్కే పరిమితం కావొద్దు
కేయూ క్యాంపస్: అధ్యాపకులు సిలబస్కే పరిమి తం కావొద్దని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం కేయూలోని గణితశాస్త్ర విభాగం సెమినార్హాల్లో రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ఇంగ్లిష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, గణిత విభాగాల అధ్యాపకులకు మూడు వారాల ఇండస్ట్రీయల్ శిక్షణ ప్రోగ్రాం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు తరగతి గదిలో సబ్జెక్టుతోపాటు ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు, ఇన్నోవేషన్లు, కొత్త ఆవిష్కరణల గురించి వివరించాలన్నారు. అప్లికేషన్ ఓరియంట్గా బోధన ఉండాలని సూచించారు. పాలిటెక్నిక్ అధ్యాపకులు పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నా లెడ్జ్ ట్రాన్స్ఫర్ జరగాలన్నారు. అప్పుడే విద్యార్థికి ఉపయోగం ఉంటుందన్నారు. యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ లాల్ మాట్లాడుతూ ఈ మూడువారాల శిక్షణలో మొదటి వారం కామన్ సబ్జెక్టులపై ఉంటుందన్నారు. అనంతరం విభాగాల వారీగా రెండు వారాల శిక్షణ ఉంటుందన్నారు. కృత్రిమ మేధా ప్రవేశం నేపథ్యంలో విద్యార్థులు ఉపాధి పొందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నా రు. ఫిజిక్స్ విభాగం అధిపతి సీజే శ్రీలత మాట్లాడుతూ మూడు వారాల ఇండస్ట్రీయల్ శిక్షణలో థి యరీ, ప్రాక్టికల్స్ బోధన ఉంటుందన్నారు. కెమిస్ట్రీ విభాగం అధిపతి సవితాజ్యోత్స్న మాట్లాడుతూ కెమిస్ట్రీ సబ్జెక్టులో వస్తున్న మార్పులకు అనుగుణంగా అడ్వాన్స్లు, ప్రయోగ పూర్వక బోధన నిష్ణాతులతో ఉంటుందన్నారు. ఇంగ్లిష్ విభాగం అధిపతి దీపాజ్యోతి మాట్లాడుతూ విద్యార్థి భాషానైపుణ్యాలు, మార్కెట్ అవసరాలు, సామర్థ్యాల పెంపుపై దృష్టిసారించేలా ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ ఉంటుందన్నారు. సమావేశంలో ఎం రవీందర్రెడ్డి మాట్లాడా రు. కార్యక్రమంలో కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ బ్రహ్మేశ్వరి, ఆచార్య హనుమంతు, కంప్యూటర్ సైన్స్ విభాగం డాక్టర్ మంజుల, గణిత విభాగం డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ రాజు పాల్గొన్నారు. -
యునెస్కో పీస్ మెసెంజర్ అవార్డుకు ‘గోకా’ ఎంపిక
నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన వనప్రేమికుడు, ప ర్యావరణ వేత్త గోకా రామస్వామి యు నెస్కో పీస్ మెసెంజర్ అవార్డుకు ఎంపికయ్యారు. యునెస్కో కార్యక్రమాల్లో భాగంగా రామస్వామి నాలుగేళ్ల నుంచి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పలు సేవలందించారు. దీంతో యునెస్కో సెక్రెటరీ జనరల్ యోగేష్ కులశ్రేష్ట.. రామస్వామిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. జూన్ 7, 8, 9 తేదీల్లో అస్సాంలో జరిగే 18బై అన్యూవల్ కాన్ఫరెన్స్లో అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా గోకా రామస్వామి మాట్లాడుతూ జూన్ 5న గౌహతిలో జరిగే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్లో, జూన్ 7న ఢిల్పుగర్ కాన్ఫరెన్స్లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఇందులో 40 మంది యునెస్కో ప్రతినిధులు పాల్గొంటారని, తెలంగాణ నుంచి ధర్మపురి రాజగోవింద్, గోకా నాగేశ్వర్రావుకు ఆహ్వానం అందిందని తెలిపారు. మార్కెట్కు వరుసగా 6రోజులు సెలవు వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు లోక్సభ – 2024 సాధారణ ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా వరంగల్, హనుమకొండ కలెక్టర్ల ఆదేశాల మేరకు మార్కెట్ యార్డునకు శనివారం నుంచి గురువారం వరకు వరుసగా 6రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి జి.రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 1వ తేదీ(శనివారం)వారాంతపు యార్డు బంద్, 2వ తేదీ(ఆదివారం)వారాంతపు సెలవు, 3వ తేదీ(సోమవారం)నుంచి 5వ తేదీ వరకు(కౌంటింగ్), 6వ తేదీ అమావాస్య(గురువారం)తో సెలవు ప్రకటించినట్లు తెలిపారు. 7వతేదీ(శుక్రవారం)న మార్కెట్ పునఃప్రారంభమవుతుందన్నారు. జిల్లాలోని రైతులు, వ్యాపారులు, గుమస్తా, దడువాయి, కార్మికులు గమనించి తమ వ్యవసాయ ఉత్పత్తులను బంద్ రోజుల్లో మార్కెట్కు తీసుకురావొద్దని కోరారు. కంపెనీ యాజమాన్యం వేధింపులు తాళలేక..● రైలు కిందపడి యువకుడి ఆత్మహత్యరఘునాథపల్లి: కంపెనీ యాజమాన్యం వేధింపులు తాళలేక ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని నిడిగొండ రైల్వే బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన కొలిపాక తరుణ్కుమార్ (29) వరంగల్లో హైదరాబాద్ హిందుస్తాన్ టవర్స్ కంపెనీలో ఫీల్డ్ సపోర్ట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల కంపెనీ యాజమాన్యం వేధింపులకు గురి చేయడంతో జీవితంపై విరక్తి చెందిన తరుణ్కుమార్.. సోమవారం రాత్రి నిడిగొండ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ ఆర్ రమణారెడ్డి, కానిస్టేబుల్ నరేశ్ తెలిపారు. -
వరంగల్ ఆర్టీఏకు ఏసీబీ భయం..!
● అప్రమత్తమైన అధికారులు ● వాహనదారులకు మాత్రమే కార్యాలయానికి అనుమతి ● మూతపడిన దళారుల సెంటర్లు ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా రవాణాశాఖకు ఏసీబీ భయం పట్టింది. యథేచ్ఛగా అవినీతి సాగుతుందన్న ఆరోపణలపై మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంపై మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈవిషయం తెలిసిన వెంటనే వరంగల్ ఆర్టీఏ కార్యాలయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏసీబీ అధికారులు బృందాలుగా వీడిపోయి ఉన్నారని, ఏ క్షణమైనా ఇతర జిల్లాల ఆర్టీఏ కార్యాలయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని ప్రచారం కావడంతో అధికారులు భయం..భయంతో పనులు చేశారు. పర్సులు, జేబులు, డిస్క్ డ్రాలో నగదు లేకుండా జాగ్రత్త పడ్డారు. దళారుల సెంటర్లపై కూడా ఏసీబీ అధికారులు నిఘా వేశారని, దాడులు చేసి వాహనదారుల ఫైల్స్ను పరిశీలించే అవకాశం ఉందని, ఫైళ్లు ఉంటే కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటారని తెలిసి నిమిషాల్లో సెంటర్లన్నీ మూసివేశారు. అంతేకాదు ప్రధాన గేటు వద్ద విధులు నిర్వహించే హోంగార్డులను అధికారులు అప్రమత్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇతర పనులకు వచ్చే వాహనదారులను మాత్రమే అనుమతించాలని హోంగార్డులకు ఆర్టీఓ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఫైల్స్ ఉన్నవారిని మాత్రమే కార్యాలయానికి అనుమతించారు. జీరో కౌంటర్లల్లో జరుగుతున్న అవినీతి దందాపై ఏసీబీ అధికారులు ఆరాతీసినట్లు సమాచారం. ఒక్కో అధికారి ఒక అసిస్టెంట్ను నియమించి వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. -
ఉద్యోగాల పేరిట రూ.4కోట్లకు టోకరా
చుంచుపల్లి : నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గ్రూపు – 2, సింగరేణి, ఇతర ప్రభు త్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.4 కోట్ల మేర వసూలు చేసిన నిందితులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి వివరాలను సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై గడ్డం ప్రవీణ్కుమార్ వెల్లడించారు. వరంగల్ రంగశాయిపేటకు చెందిన దాసు హరికిషన్ హైదరాబాద్ ఎర్రమంజిల్లో ఆర్ అండ్ బీ శాఖలో డీఈగా పనిచేస్తున్నానని పలువురిని నమ్మించాడు. ఈయన తన కుటుంబ సభ్యులు కలిసి గతంలో రైస్ పుల్లింగ్ ముఠాతో తిరిగినప్పుడు రుహత్ బేగ్, భీమవరం శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. వీరికి తోడు వరంగల్ రంగశాయిపేటకే చెందిన దాసు హర్ష, చిరుమర్తి సంజయ్, కొత్తగూడెంలోని రామాంజనేయ కాలనీకి చెందిన గుండా వినోద్కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 60 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సుమారు రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే, డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో, నిందితుల నుండి సమాధానం రాకపోవడంతో బాధితులు పలువురు చుంచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈమేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామాంజనేయ కాలనీలోని వినోద్కుమార్ ఇంట్లో ఉన్నారనే సమాచారంతో హరికిషన్, హర్ష, సంజయ్, వినోద్కుమార్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రుహత్ బేగ్, భీమవరం శ్రీనివాస్ పరారీలో ఉండగా.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ముఠాకు సహకరించిన మిగతా వారిని సైతం గుర్తించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పే వ్యక్తులను నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 60మంది నుంచి వసూళ్లు పోలీసుల అదుపులో నలుగురి ముఠా -
రియల్టర్కు నోటీసులు
హసన్పర్తి: గ్రామాల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు.‘సాక్షి’లో ఈ నెల 27వ తేదీన ‘యథేచ్ఛగా రియల్ దందా’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై పంచాయతీ అధికారులు స్పందించారు. ఈమేరకు గ్రామాల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులపై ఉక్కు పాదం మోపడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా హసన్పర్తి మండలం మడిపల్లిలో వెంచర్ ఏర్పాటుకు సిద్ధమైన ఓ రియల్ట ర్కు నోటీసులు ఇచ్చారు. స్థానిక పంచాయతీ అధికారి వెంకన్న సదరు వెంచర్ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా ప్లాట్లు చేసి హద్దులు నిర్ధారిస్తే వాటిని తొలగించడమే కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో సీఏ రేగొండ(కొత్తపల్లిగోరి): కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన సీఏ..సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. మండల కేంద్రంలోని ఏపీజీవీబీలో సీఏగా పని చేస్తున్న కొత్తపల్లిగోరికి చెందిన సీఏకు తెలియకుండా సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ నుంచి ఈ నెల 26న రూ.15 వేలు, 28న రూ.10 వేలు తస్కరించారు. ఖాతా నుంచి నగదు పోగోట్టుకున్న సదరు సీఏ మోసపోయానని గ్రహించి మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
దుబాయ్ వెళ్లేందుకు చోరీలు
వరంగల్ క్రైం: ఇంటి నిర్మాణంతో పాటు దుబాయ్ వెళ్లేందుకు చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను సీసీఎస్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. నిందితుడి నుంచి రూ. 22 లక్షల విలువైన 270 గ్రాముల బంగారంతోపాటు రెండు ద్విచక్రవాహనాలు, రూ.50 వేల నగదు, ఒక ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీపీ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన జింక నాగరాజు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలలో నివాసముంటూ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. మెకానిక్గా పని చేస్తూనే ద్విచక్రవాహనాల క్రయవిక్రయాలు చేపడుతున్నాడు. అయితే తన జల్సాలకు ఇందులో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో పెద్ద మొత్తంలో డబ్బును సులభంగా సంపాదించాలని ఆలోచించి బైక్ చోరీలకు పాల్ప డాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 2011 నుంచి కరీంనగర్, జమ్మికుంట, కామారెడ్డి, సిద్దిపేట, వేములవాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ద్విచక్రవాహన చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలు జీవితం గడిపాడు. జైలులో జీవితం అనంతరం కుడా నాగరాజు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా, ద్విచక్రవాహనాలు చోరీలకు స్వ స్తి పలికి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. 2016 నుంచి 2022 వరకు వరంగల్, జనగామ, సిద్దిపేట, భూపాలపల్లి జిల్లాలో మొత్తం 38కి పైగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్ప డడంతో పోలీసులు పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా గత సంవత్సరం మార్చిలో జైలు నుంచి విడుదలై తన సొంత ఇంటి నిర్మాణంతో పాటు దుబాయి వెళ్లేందుకు అవసరమైన డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా మరోమారు చోరీలకు పాల్పడుతున్నాడు. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు జగిత్యాల, యాదాద్రి జిల్లాలో మొత్తం 20 చోరీలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో నాగరాజు కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. మంగళవారం చోరీ చేసిన బంగారం అమ్మేందుకు ద్విచక్రవాహనంపై వస్తున్నట్లు సమాచారం రావడంతో సీసీఎస్, మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా ఆర్ఎన్టీ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. బైక్ను తనిఖీ చేయగా బంగారం, పెద్ద మొత్తంలో నగదు లభించింది. దీంతో విచారించగా తాను చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు సీపీ అంబర్కిశోర్ ఝాతెలిపారు. అధికారులకు అభినందన.. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ట్రైనీ ఐపీఎస్ శుభం నాగ్తో పాటు సెంట్రల్ జోన్ డీసీసీ అబ్దుల్బారి, అదనపు డీసీపీ రవి, వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, సీసీఎస్, మట్టెవాడ ఇన్స్పెక్టర్లు అబ్బయ్య, గోపి, అసిస్టెంట్ అనాటికల్ ఆఫీసర్ సల్మాన్పాషా, సీసీఎస్ ఏఎస్ఐ శివకుమార్, హెడ్కానిస్టేబుళ్లు నజీం, ఆహ్మద్, జంపయ్య, సిబ్బందిని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందించారు. అంతర్జిల్లా దొంగ అరెస్ట్ వివరాలు వెల్లడించిన సీపీ అంబర్ కిశోర్ ఝా
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
కౌంటింగ్కు సర్వం సిద్ధం
373 మంది గైర్హాజరు
●భారీగా తగ్గిన దిగుబడులు
డిమాండ్ ఉండే సమయానికి కాయలు రాలేదు
జిల్లా వ్యాప్తంగా నాయకులకు బహిష్కరణ నోటీసులు
ఖరీఫ్ కార్యాచరణ అమలుకు సమాయత్తం కావాలి
ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
ఎల్ అండ్ టి ఫైనాన్స్ లిమిటెడ్ హైదరాబాద్లో పూర్తి గృహ రుణాన్ని ప్రారంభించింది
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
తప్పక చదవండి
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement