-
మహారాష్ట్రలో స్కానింగ్.. కర్ణాటకలో గర్భవిచ్ఛిత్తి
● రాష్ట్రంలో ఆగని భ్రూణహత్యలు ● ఒక మహిళకు గర్భస్రావం చేస్తుండగా మృతి యశవంతపుర: భ్రూణహత్యలకు అంతం లేకుండా ఉంది. మండ్యలో జరిగిన భ్రూణహత్యల ఉదంతం మరువక ముందే బాగలకోటెలో అలాంటి ఘోరం వెలుగు చూసింది. మహారాష్ట్రలో స్కానింగ్ చేసి, రాష్ట్రంలో గర్భఽవిచ్ఛిత్తి చేస్తున్నట్లు మహారాష్ట్ర పోలీసులు బాగలకోటె పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాంగ్లి కొల్లాపురకు చెందిన సోనాలి (33) అనే గర్భిణికి స్కానింగ్ చేయగా అడ శిశువు ఉన్నట్లు కనుగొన్నారు. మహాలింగపుర పట్టణంలోని ఆస్పత్రిలో కవిత అనే మాజీ ఆయా సోనాలిని తన ఇంటికి తీసుకెళ్లి గర్భవిచ్ఛిత్తికి యత్నించింది. అధికంగా రక్తస్రావం కావటంతో సోనాలి మృతి చెందింది. మృతదేహాన్ని సాంగ్లి జిల్లాకు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మీరజ్ పోలీసులు తనిఖీ చేయగా ఈ ఉదంతం వెలుగు చూసినట్లు మహరాష్ట్ర ఉప పోలీసు ఉన్నతధికారి అణ్ణాసాహేబ్ జాధవ్ తెలిపారు. -
మైసూరులో స్నాచింగ్.. నాగ్పూర్లో పట్టివేత
మైసూరు: మైసూరులో వివిధ ప్రాంతాల్లో చైన్స్నాచింగ్కు పాల్పడిన దొంగని మహారాష్ట్రలో నగర పోలీసులు అరెస్టు చేశారు. టెలికాం లేఔట్ నివాసి మధుర అనే మహిళ మెడలోని గొలుసును ఓ దొంగ లాక్కెళ్లాడు. ఆమె గొలుసును పట్టుకోవడంతో సగం తెగిపోయి 30 గ్రాములు భాగం దొంగ చేతికి దొరికింది. ఈ ఘటనపై మధుర సరస్వతిపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ, ఇతర మూలాల ద్వారా పోలీసులు దర్యాప్తు చేయగా ఆ దొంగ మహారాష్ట్రకు పారిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా మైసూరులో 50కి పైగా క్రిమినల్ కేసులు అతనిపై ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల బృందం ఒకటి నాగ్పూర్కు వెళ్లి దొంగను అరెస్టు చేసి తీసుకొచ్చారు. -
చిక్కలో వరుసగా మిస్సింగ్లు
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం తాలూకా నంది గ్రామంలో ఓ అమ్మాయి, కల్లుకుంటె గ్రామంలో మరో యువతి అదృశ్యం కావడం సంచలనం కలిగిస్తోంది. జిల్లాలో ఇటీవల అమ్మాయిల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడంపై ప్రజలు కలవరం చెందుతున్నారు. వివరాలు.. నంది గ్రామానికి చెందిన శిల్ప (23) ఓ ఆన్లైన్ షాపింగ్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 23వ తేదీ నుంచి ఆమె కనబడడం లేదు. అలాగే కల్లుకుంటెవాసి తేజస్విని (20) బీఏ రెండో ఏడాది చదువుతోంది. ఆమె కూడా రెండు రోజులుగా జాడ లేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిస్తే తెలియజేయాలని చిక్కబళ్లాపురం పోలీసులు విజ్ఞప్తి చేశారు. బీజేపీకి 22 సీట్లు ఖాయం: యడ్డి శివమొగ్గ: ఈ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 20–22 స్థానాల్లో విజయం సాధించబోతోందని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప జోస్యం చెప్పారు. శివమొగ్గలోని స్వగృహంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డాక్టర్ సర్జికి ప్రజల్లో మంచి పేరుందని, పరిషత్ ఎన్నికల్లోనూ అధిక స్థానాలను దక్కించుకుంటామని చెప్పారు. పార్టీ మాజీ ఎమ్మెల్యే రఘుపతి భట్ నైరుతి పట్టభద్రుల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ, ప్రజలే మంచి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇక వాల్మీకి అభివృద్ధి నిగమ మండలి అధికారి చంద్రశేఖర్ ఆత్మహత్య ఒక దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో చట్టప్రకారం చర్యలు తీసుకుని, ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు యశవంతపుర: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్టు అధికారుల పాలనా భవనం, సిబ్బంది ఉంటున్న భవనాన్ని బాంబులతో పేల్చేస్తామని అక్కడ బాత్రూంలోని ఒక అద్దంపై రాసి ఉంది. అది చూసినవారు అధికారులకు చెప్పగా, తక్షణం విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు జాగిలాలతో తనిఖీలు చేశారు. ఎక్కడా ఎలాంటి పేలుడు వస్తువులు దొరకలేదు. ప్రారంభం రోజునే బడికి తాళంయశవంతపుర: పాఠశాల ప్రారంభం రోజునే బడికి తాళం వేసిన ఘటన బెళగావి జిల్లా తంగడగిలో జరిగింది. వివరాలు...గ్రామంలోని పాఠశాల ముఖ్యోపాధ్యాయుడు ఎంఎస్ చౌగలెని బదిలీ చేయాలని ఎస్డీఎంసీ గతంలో తీర్మానించింది. అయితే వేసవి సెలవులు రావడంతో అధికారులు ఆయనపై చర్యలు తీసుకోలేదు. కాగా బుధవారం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో గదులను శుభ్రం చేయాలని ఉపాధ్యాయులు వచ్చారు. కానీ ఎస్డీఎంసీ సభ్యులు వచ్చి బడికి తాళం వేసుకొని వెళ్లారు. అధికారులు వచ్చి పాఠశాలను పరిశీలించారు. ముఖ్యోపాధ్యాయుడిని బదిలీ చేయాలని ఎస్డీఎంసీ కమిటీ సభ్యులు డిమాండ్ చేయగా ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి సర్దిచెప్పారు. అనంతరం బడికి తాళం తెరిపించారు. బీసీ మోర్చా నిరసన మండ్య: వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ కోటాను తగ్గించి అందులోని వాటాను ముస్లింలకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి సిద్ధమైందని బీజేపీ బీసీ మోర్చా ఆరోపించింది. దీనిపై మోర్చా కార్యకర్తలు ఇండియా కూటమిని వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ముందు బుధవారం ధర్నా చేశారు. జేసీ సర్కిల్ నుంచి నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా సాగారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించరాదని డిమాండ్ చేశారు. ఎస్ఐ సస్పెన్షన్ మండ్య: బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించడంలో నిర్లక్ష్యం చేసిన నాగమంగల తాలూకా బేళ్లూరు ఎస్ఐ బసవరాజు చించోళిని ఎస్పీ ఎన్.యతీశ్ బుధవారం సస్పెండ్ చేశారు. ఈనెల 25న అభిలాష్ అనే వ్యక్తి బైక్లో వెళ్తుండగా యువకుల గుంపు బైక్లో వచ్చి ఢీ కొట్టింది. దీన్ని ప్రశ్నించిన సమయంలో మాటల యుద్ధం జరిగి అభిలాష్పై దాడికి పాల్పడ్డారు. పైగా అభిలాష్ ఇంటికి వెళ్లి బెదిరించారు. ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బెళ్లూరు పోలీసు స్టేషన్ వెళ్లాడు. అయితే ఫిర్యాదు తీసుకోకుండా ఎస్ఐ బసవరాజు నిర్లక్ష్యం చేశారు. దీంతో బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
No Headline
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా పొన్నాచి గ్రామ పంచాయతీ అధ్యక్షురాని కుమారుడు అత్యాచారానికి పాల్పడినట్లు మహదేశ్వర బెట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. పొన్నాచి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు నీలాంబిక కొడుకు వైదేశ్ (29) నిందితుడు. వివరాలు.. 25 ఏళ్ల మహిళ ఇంటి స్థలం కావాలని వెళ్లగా వైదేశ్ ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఫోన్ చేసి లైంగికంగా సహకరిస్తేనే ఇంటిని త్వరగా ఇప్పిస్తానని చెప్పగా ఆమె నిరాకరించింది. మరోసారి వెళ్లినప్పుడు దుస్తులు విప్పాలని బలవంతంగా వేధించాడని తెలిపింది. చివరికి ఇంటి కోసం తాను మనస్సు చంపుకొని అంగీకరించినట్లు పేర్కొంది. తనను లైంగికంగా వినియోగించుకుని ,. మొబైల్తో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి బెదిరించాడని, తాను ఎంత వేడుకున్నా డిలిట్ చేయలేదని తెలిపింది. ఆ ఫోటోలు, వీడియోలను పెట్టుకుని తన అన్న, భర్తకు పంపిస్తానని , సోషల్మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడి తరచూ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. శివమ్మ, బసమ్మణి, వైదేశ్లు తన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన పరువుకు భంగం కలిగించారని వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహదేశ్వర బెట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆస్పత్రికి తీసుకెళ్లాలని... చికిత్స కోసం తీసుకెళ్లిన మహిళపై ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దక్షిణ కన్నడ జిల్లా కద్రిలో ఈ సంఘటన జరిగింది. వివరాలు... ఒక మహిళ అనారోగ్యానికి గురి కాగా, తెలిసిన వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమైపె అత్యాచారం చేసి నగ్నపోటోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడసాగాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆవేదన చెందిన బాధితురాలు కద్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేరళకు చెందిన సజిత్ (32) ను బుధవారం అరెస్ట్చేసి విచారణ చేపట్టారు. ఇతడు ఓ ప్రైవేటు ఆసుపత్రి, హోటల్లో మహిళపై తరచూ లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. రాష్ట్రంలో ఒకేరోజు పలుచోట్ల వనితలపై అఘాయిత్యాలు చామరాజనగర, దక్షిణ కన్నడలో అత్యాచారాలు, వీడియోలు శిడ్లఘట్టలో బాలికపై హెడ్మాస్టర్ అకృత్యం రాష్ట్రంలో ఘోరకృత్యాలు అవసరాన్ని, అసహాయతను అలుసుగా చేసుకొని కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన పంచాయతీ అధ్యక్షురాలి కొడుకు, స్నేహితుని ముసుగులో ఓ యువకుడు, చదువులు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు కామంతో తెగించారు. మహిళలు, బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. హెడ్మాస్టర్ దాష్టీకం వల్ల బాలిక ఏకంగా గర్భవతి అయ్యింది. రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఈ ఘోరాలు వెలుగుచూశాయి. -
అమ్మో.. భారీ ఉడుము
బెంగళూరు టిన్ ఫ్యాక్టరీ వద్ద పట్టుబడిన ఉడుము కృష్ణరాజపురం: ఉద్యాన నగరంలో పెద్ద ఉడుమును వన్యజీవి సంరక్షకులు క్షేమంగా పట్టుకున్నారు. ఉడుము మాంసాన్ని ఆరగించేవారికి దొరకక ముందే దానిని రక్షించారు. కేఆర్ పురం వద్ద టిన్ఫ్యాక్టరీ దగ్గర పెద్ద ఉడుము కనిపించింది. సమాచారం అందుకున్న వన్యజీవి సంరక్షకుడు కుమార్, అతని బృందం గాలించి దానిని క్షేమంగా పట్టుకుని అటవీ సిబ్బందికి అందజేశారు. ఇది చాలా పెద్ద సైజులో, టీవీలలో చూపించే కొమొడొ డ్రాగన్ మాదిరిగా ఉందని తెలిపారు. ఇలాంటివి ఇక్కడ దొరకడం చాలా అరుదని, వన్యజీవులను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. మాంసం కోసం ఉడుములను చంపడం తగదని చెప్పారు. -
వంచక జంటకు సంకెళ్లు
యశవంతపుర: షేర్ మార్కెట్లో పెట్టుబడులు అని నమ్మించి జనం నుంచి రూ. కోట్లు వసూలు చేసిన దంపతులను కలబురగి పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాపిటల్ గ్రీ లర్న్ ట్రేడింగ్ సంస్థను స్థాపించిన ఉత్కృష్ఠ వర్థమానె, భార్య సావిత్రిని కలబురగి జెఎంఎఫ్సి–2లో హాజరు పరచగా 14 రోజుల పాటు జుడిషియల్ కస్టడీ విధించింది. ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక జైలుకు తరలించారు. అధిక లాభాల పేరుతో ప్రజల నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఉపాధ్యాయుడు వీరేశ భీమాశంకర ఇచ్చిన ఫిర్యాదుతో రోజా ఏరియా పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. రూ. 30 కోట్ల వసూలు స్కాం.. -
హెడ్మాస్టర్ వల్ల బాలికకు గర్భం
చిక్కబళ్లాపురం: ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిని భయపెట్టి తరచూ అత్యాచారానికి పాల్పడుతున్న కామాంధ హెడ్మాస్టర్ని పోలీసులు అరెస్టు చేశారు. చిక్కబళ్లాపురం జిల్లాలోని శిడ్లఘట్ట తాలూకాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం వెంకటేశ్ (47) నిందితుడు. తన పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బాలికపై కన్నేసి ఆమెను భయపెట్టి తన గదిలోనే అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు. బాలిక గర్భం దాల్చడంతో అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు ఏమైందోనని ఆస్పత్రికి తీసుకెళ్లగా 3 నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. బాలికను ప్రశ్నించగా హెచ్ఎం వెంకటేశ్ దారుణాల గురించి వివరించింది. పోలీసులు బాలిక నుంచి వివరాలను నమోదు చేశారు. కేసు నమోదు చేసి కామాంధున్ని అరెస్టు చేశారు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన దుర్మార్గున్ని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. -
విమానాశ్రయంలోనే అరెస్టుకు ప్లాన్
బనశంకరి: అత్యాచారం, అశ్లీల వీడియోల కేసులో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాగానే అరెస్ట్ చేయడానికి సిట్ అధికారులు బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మకాం పెట్టారు. విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్ 31వ తేదీ ఉదయం 10.30 కు సిట్ ముందు హాజరుఅవుతానని వీడియోలో చెప్పగానే అలజడి ఆరంభమైంది. వ చ్చీరాగానే అరెస్టు చేయాలని, లేనిపక్షంలో దేశంలోనే ఎక్కడైనా తలదాచుకోవచ్చని సిట్ అనుమానిస్తోంది. లుఫ్తాన్సా విమానంలో బిజినెస్ క్లాస్లో ప్రజ్వల్ టికెట్ బుక్ చేసుకున్నారు. ఈ విమానం కెంపేగౌడ విమానాశ్రయంలోని టెర్మినల్–2లోకి వస్తుంది. విమానం నుంచి దిగి ఇమ్మిగ్రెంట్ డెస్క్కు వచ్చి పాస్పోర్టుపై స్టాంప్ వేసుకోవాలి. ప్రస్తుతం లుక్అవుట్ నోటీస్ అమల్లో ఉండటంతో ఇమ్మిగ్రెంట్ అధికారులు ప్రజ్వల్ ను అక్కడే అదుపులోకి తీసుకుంటారు. తరువాత సిట్ పోలీసులు సంప్రదింపులు జరిపి అరెస్టు ప్రక్రియ చేపడతారు. దీంతో లుఫ్తాన్సా విమానాల్లో వచ్చే ప్రయాణికులపై సిట్ బృందాలు నిఘా వేసి ఉంచాయి. బెయిలు అర్జీ వాయిదా ఎంపీ ప్రజ్వల్కు ముందస్తు బెయిల్ కోసం ఆయన వకీళ్లు బుధవారం బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు విచారణను 31వ తేదీకి వాయిదా వేసింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కావాలని కోరారు. హంగేరి నుంచి ఆ వీడియో 31వ తేదీన సిట్ ముందు హాజరవుతానని ప్రజ్వల్ 27వ తేదీన వీడియో విడుదల చేయడం తెలిసిందే. ఈ వీడియో ఎక్కడి నుంచి విడుదల చేశారనేది సిట్ కనిపెట్టింది. యూరప్లోని హంగేరి దేశం నుంచి వీడియో విడుదలైంది. మొబైల్ ఐపీ అడ్రస్ను బట్టి కనిపెట్టింది. వీడియో రికార్డు చేసిన చేసిన రెండు రోజుల తరువాత వదిలారని పేర్కొంది. నవీన్, చేతన్లకు సిట్ కస్టడీ ప్రజ్వల్ వీడియోల పెన్డ్రైవ్ను తయారుచేసి లీక్ చేశారనే కేసులో అరెస్టు చేసిన నవీన్గౌడ, చేతన్కు మూడురోజుల పాటు సిట్ కస్టడీకి బుధవారం హాసన్ 2వ అదనపు సివిల్, జెఎంఎఫ్సీ కోర్టు అనుమతించింది. దీంతో వారిద్దరినీ విచారించి పెన్డ్రైవ్ పూర్వాపరాలపై సిట్ వివరాలు సేకరించనుంది. సిట్ ఎదురుచూస్తోంది: హోంమంత్రి ఎంపీ ప్రజ్వల్ బెంగళూరు విమానాశ్రయంలోకి అడుగుపెట్టగానే సిట్ అధికారులు అరెస్ట్ చేస్తారని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బుధవారం నగరంలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ వారంటు ఉన్నందున సిట్ అధికారులు విమానాశ్రయంలో వేచి చూస్తున్నారని, రాగానే అరెస్టు తథ్యమని చెప్పారు. పెన్డ్రైవ్ కేసులో ఏ పార్టీ వారున్నా అరెస్ట్ చేస్తామని చెప్పారు. వాల్మీకి అభివృద్ధి మండలిలో అక్రమ నగదు బదిలీ కేసులో మంత్రి నాగేంద్ర రాజీనామా చేసే అవసరం లేదు. బీజేపీ నేతలు అన్నింటికీ రాజీనామా అడుగుతారు, దీనిపై విచారణ జరుగుతుంది, నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన అధికారి చంద్రశేఖర్ ఎక్కడా మంత్రి నాగేంద్ర పేరు చెప్పలేదని అన్నారు. ఎంపీ ప్రజ్వల్ కోసం వేచి ఉన్న సిట్ బృందాలుప్రజ్వల్ దిండు, పరుపు సీజ్ఎంపీ ప్రజ్వల్ అత్యాచారం, అశ్లీల వీడియోల కేసులో సిట్ పోలీసులు హాసన్, హొళేనరసిపుర లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు తనిఖీలు చేశారు. హాసన్లో ఎంపీ ప్రజ్వల్ నివాసం, హొళేనరసిపురలో హెచ్డీ.రేవణ్ణ నివాసాన్ని పరిశీలించారు. సిట్, ఫోరెన్సిక్ అధికారులు కొత్త సాక్ష్యాధారాల కోసం గాలింపు జరిపారు. ప్రజ్వల్ ఇంట్లో బెడ్, దిండు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
కాసరగోడులో లవ్ జిహాద్?
యశవంతపుర: మంగళూరు వద్ద కేరళ సరిహద్దుల్లో కాసరగోడులోని ప్రైవేట్ స్కూలులో టీచర్ అయిన నేహా, యువకుడు తన్వీర్ మిర్థాద్లు ప్రేమించుకుని కొన్ని రోజుల కిందట వెళ్లిపోయారు. ఇప్పుడు స్థానిక పోలీసుల ముందు హాజరయ్యారు. నేహ ఇష్ట ప్రకారం ప్రేమించి అతనితో వెళ్లిపోయినట్లు చెప్పింది. తాము 25న రిజిస్టర్ పెళ్లి చేసుకున్నట్లు పత్రాలను చూపించారు. ఇది లవ్ జిహాద్ అని, ఒక వర్గం అమ్మాయిలను టార్గెట్ చేశారని హిందూ సంఘాల నేతలు ఆరోపించారు. తమ కూతురిని తమతో పంపాలని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. కానీ ఆమె ప్రియునితోనే ఉంటానని స్పష్టంచేసింది. -
మోసకారి అధికారి
మైసూరు: మహిళా, శిశు సంక్షేమ శాఖలో మీ కూతురికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ప్రభుత్వ అధికారి ఒకరు మహిళను మోసం చేశాడు. మైసూరు విజయనగరలో మహిళ, శిశు సంక్షేమ శాఖలో అధికారి కె.సోమయ్యకు.. మైసూరు కొప్పలూరు నివాసి, గ్రామ పంచాయతీ మాజీ సభ్యురాలు అయిన కమలాక్షితో పరిచయం ఉంది. మూడేళ్ల క్రితం ఫోన్ చేసి మీ కూతురికి మా శాఖలో క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తానని, ఇందుకు రూ. 10 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. ఆమె సరేనని రూ. 7 లక్షలను ఇచ్చింది. ఏళ్లు గడిచిన ఉద్యోగం ఊసు లేదు, డబ్బులూ తిరిగి ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన కమలాక్షి.. విజయనగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆర్బీఐ ఇంజినీరు ఇంట్లో లూటీ మైసూరు: ఇంటి తలుపులు పగులగొట్టి బంగారు నగలతో పాటు రూ. 8.97 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. ఈ ఘటన మైసూరు మేటగళ్లి లోకనాయకనగరలో జరిగింది. ఆర్బీఐలో ఇంజినీర్గా పని చేసే ఎం.కార్తీక్ పాఠశాలలకు సెలవులు కావడంతో చైన్నెలో ఉండే తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా దొంగతనం జరిగిఉంది. రూ. 18.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, వెండి వస్తువులు, ఇంకా విలువైన సామాగ్రిని దొంగలు దోచుకెళ్లారు. మేటగళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ అరెస్ట్ బనశంకరి: బిట్కాయిన్ కుంభకోణానికి సంబంధించి సీఐ చంద్రధర్ను బుధవారం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015లో కెంపేగౌడనగర పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో శ్రీకిని అరెస్ట్చేయగా బిట్కాయిన్ కేసు వెలుగులోకి వచ్చింది. 2020లో సుమారు రూ.వెయ్యి కోట్ల కుంభకోణం వెలుగు చూసింది. ఘనంగా అంబరీశ్ జయంతి యశవంతపుర: కన్నడ సినీ రంగంలో, రాజకీయాల్లో రెబెల్ స్టార్గా పేరుగాంచిన దివంగత నటుడు అంబరీశ్ 72వ జయంతిని బుధవారం అభిమానులు, కుటుంబసభ్యులు ఘనంగా జరుపుకొన్నారు. సతీమణి సుమలత, తనయుడు అభిషేక్లు బెంగళూరు కంఠీరవ స్టూడియోలోని అంబరీశ్ సమాధికి పూజలు చేశారు. అనేకమంది చిత్ర ప్రముఖులు, అభిమానులు పాల్గొని నివాళులర్పించారు. అంబరీశ్ అప్పాజీ శాశ్వతంగా అందరి మనస్సులో ఉంటాడని నటుడు దర్శన్ స్మరించుకున్నారు. -
నా హస్తం ఏమీ లేదు: ఎమ్మెల్యే
హొసపేటె: తాగునీటి సరఫరాకు వచ్చిన ట్యాంకర్ లారీని నగరసభ అధికారి అడ్డుకోవడం వెనుక తన హస్తం ఏమీ లేదని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ విషయాన్ని జిల్లాధికారి చూసుకుంటారని ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల చిత్తవాడిగి జాతీయ రహదారి బైపాస్ రహదారిలో ఉన్న మున్సిపల్ వాటర్ ట్యాంక్ వద్ద మాజీ మంత్రి ఆనంద్సింగ్ ట్యాంకర్ లారీ మంచి నీరు తీసుకెళ్లేందుకు రాగా నగరసభ అధికారి చంద్రప్ప అడ్డుకోగా మాజీ మంత్రి ఆనంద్సింగ్ ట్యాంకర్ వద్దకు చేరుకొని నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు. తాను అధికారం చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనుల గురించి త్వరలో క్షుణ్ణంగా తెలియజేస్తానన్నారు.మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఖండనీయం హుబ్లీ: పశ్చిమ బెంగాల్లో ఓబీసీ రిజర్వేషన్లను అక్కడి హైకోర్టు రద్దు చేసినా కొనసాగిస్తామని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ బీసీ వర్గాల మోర్ఛా జిల్లా శాఖ పదాధికారులు బుధవారం ఆందోళన చేపట్టి మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆక్రోశం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓబీసీ కోటా–2010 ద్వారా కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించడం చట్ట వ్యతిరేకం అని కోల్కతా హైకోర్టు వాటిని రద్దు చేసిందన్నారు. అయినా కోర్టు ఆదేశాలను అమలు చేయబోమంటూ అక్కడి సీఎం చెప్పడం ఖండనీయం అని మోర్ఛా నేతలు సతీష్, రత్నమూర్తి కులకర్ణి, ప్రభు, మల్లప్ప తెలిపారు. ఆందోళనలో అరుణ, వినాయక ఆళ్వా, బసవరాజ్, లక్ష్మీకాంత్, అనురాధ, జగదీష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
విత్తనాల ధరల పెంపు తగదు
హుబ్లీ: ఈ సారి రాయితీ ధరలతో పంపిణీ చేస్తున్న సాగు విత్తనాల ధరలు భారీ ప్రమాణంలో పెరిగాయి. గత ఏడాది కరువుతో విలవిలాడిన అన్నదాతలపై ఈసారి విత్తనాల ధర పెంపు పుండు మీద కారం చల్లినట్టుగా ఉందని బీజేపీ నేత, రైతు పోరాట యోధుడు పీహెచ్ నేరళకేరి ఆరోపించారు. బుధవారం ఆయన ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సాగు విత్తనాల ధరలను 60 నుంచి 70 శాతం పెంచిందని తెలిపారు. ఉత్తర కర్ణాటక ప్రముఖ పంటలైన కంది, పెసలు, మొక్కజొన్న విత్తనాల ధరలు పెంచారని తెలిపారు. గత ఏడాది సబ్సిడీ పోను జనరల్ వర్గాలకు మొక్కలను 5 కేజీల ప్యాకెట్కు రూ.501, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు రూ.438 ధర ఉండగా ఈసారి రూ.805, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ.742గా ధర నిర్ణయించారని, దీంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ఏడాది వానలు లేక సరిగా పంటల దిగుబడి రాలేదని, ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని కోరారు. అలా చేయకుండా విత్తనాల ధర పెంచడం రైతులకు తీరని శరాఘాతం అన్నారు. గత ఏడాది కరువు తీవ్రత వల్ల రైతులు ఇక్కట్ల పాలయ్యారని, సబ్సిడీని పెంచి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా
రాయచూరు రూరల్: జిల్లాలో కృష్ణా నది తీర ప్రాంతం వెంట అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోందని అంబేడ్కర్ సేన అధ్యక్షుడు విశ్వనాథ్ పట్టి ఆరోపించారు. మంగళవారం తాలూకాలోని కరేకల్ వద్ద నిల్వ ఉంచిన ఇసుక నిల్వల వద్దకు అధికారులతో కలిసి వెళ్లి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాయచూరు, యాదగిరి జిల్లాల్లో యథేచ్ఛగా ఇసుక రవాణా దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందన్నారు. టిప్పర్ల ద్వారా రాత్రికి రాత్రే ఇసుకాసురులు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్నాయన్నారు. అక్రమ ఇసుక రవాణాదారులపై పోలీస్, రెవిన్యూ, ఆర్టీఓ అధికారులు దాడి చేసి 50 టన్నుల మేర ఇసుకను స్వాధీనం చేసుకున్నారన్నారు. జేసీబీలు, హిటాచీల గర్జన, ట్రాక్టర్లు, టిప్పర్ల రాకపోకలతో యాదగిరి, రాయచూరు జిల్లాల్లోని గూగల్, గుర్జాపూర్, దేవదుర్గ, వడగేర, సురపుర, భీమరాయన గుడి, శహాపురలతో పాటు తెలంగాణలోని జూరాల వంటి ప్రాంతాల్లో చెక్పోస్టులున్నా వాటి కళ్లుగప్పి అక్రమ ఇసుక రవాణా సాగుతోందన్నారు. ఒక టిప్పర్ ధర రూ.55 వేల నుంచి రూ.60 వేలు, కలబుర్గి జిల్లాలో రూ.80 వేలు, ఇతర రాష్ట్రాలకై తే రూ.1.50 లక్షల వరకు ధర ఉంది. నిత్యం 400 టిప్పర్ల మేర రవాణా అవుతోంది. ప్రతి టిప్పర్లో 35 టన్నుల మేర ఇసుక రవాణాతో రోజు రూ.2 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయన్నారు. యాదగిరి జిల్లా ఇంచార్జి మంత్రి శరణ బసప్ప దర్శనాపుర, దేవదుర్గ ఎమ్మెల్యే కరెమ్మ నాయక్ నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా వాహనాల సంచారం అధికమైందన్నారు. -
అక్రమాల్లో మంత్రి పాత్ర లేదు
బళ్లారిఅర్బన్: ఎస్టీ మండలిలో జరిగిన అక్రమాలను ప్రతిపక్ష నేతలు మంత్రి నాగేంద్రకు అంటగడుతూ లేని పోని ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ రంగు పులమడం సరికాదని రాష్ట్ర లిడ్కర్ సంస్థ అధ్యక్షుడు ముండ్రగి నాగరాజ్ మండిపడ్డారు. బుధవారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రముఖ వాల్మీకి నాయకుడిగా చెప్పుకుంటున్న శ్రీరాములు అసెంబ్లీ ఎన్నికల్లో నాగేంద్ర చేతిలో ఓటమి చవిచూశారన్నారు. లోక్సభ ఎన్నికల్లో కూడా శ్రీరాములుకు ఓటమి తప్పదన్నారు. ఈ కారణాలతోనే రాష్ట్ర, జిల్లా బీజేపీ నేతలు అనవసరంగా మంత్రి నాగేంద్రపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నాగేంద్రకు చెడ్డ పేరు తేవడానికే ఈ కుట్రలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆత్మహత్య కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు అప్పగించిందన్నారు. డెత్నోట్లో పేర్కొన్న ముగ్గురు అధికారులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. అంతేగాక రూ.87.62 కోట్ల నిధుల దుర్వినియోగంపై సంబంధిత బ్యాంక్ అధికారులపై కేసులు నమోదయ్యాయన్నారు. తక్షణమే ఆ సొమ్మును కార్పొరేషన్ ఖాతాకు తిరిగి చెల్లించేలా బ్యాంక్ అధికారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన మంత్రి నాగేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులు ఎంత పెద్దవారైనా కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, ఆ పార్టీ ప్రముఖులు హుమయూన్ఖాన్, హుస్సేన్పీరా, అభిలాష్, మేయర్ శ్వేత, ఉపమేయర్ జానకమ్మ, మాజీ మేయర్ రాజేశ్వరి, కార్పొరేటర్ రాజశేఖర్, మానయ్య తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిని తొలగించాలని ర్యాలీ
బళ్లారిఅర్బన్: కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లో జరిగిన రూ.187 కోట్ల అవకతవకలకు బాధ్యతగా రాష్ట్ర మంత్రి బీ.నాగేంద్రను కేబినెట్ నుంచి తొలగించాలని జిల్లా బీజేపీ శాఖ కార్యకర్తలు బుధవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రం అందజేశారు. ముందుగా నగర ఆరాధ్య దేవత కనకదుర్గమ్మ దేవస్థానం నుంచి రాయల్ సర్కిల్ మీదుగా జిల్లాధికారి కార్యాలయం వరకు ఈ ప్రదర్శన జరిపారు. ఆ కార్పొరేషన్ అకౌంటెంట్ చంద్రశేఖర్ ఆత్మహత్యకు మంత్రి నాగేంద్ర నేరుగా కారకులైనందున ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రాయల్ సర్కిల్ వద్ద నాగేంద్ర దిష్టిబొమ్మను దహనం చేసి ఆక్రోశం వెళ్లగక్కారు. పార్టీ ప్రముఖులు రవికుమార్, గురులింగనగౌడ, ఓబులేష్, గుత్తిగనూరు విరుపాక్షి గౌడ, రామలింగప్ప, సాధన హిరేమఠ, డాక్టర్ మహిపాల్, సోమశేఖర్గౌడ, నాగవేణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
హత్యోదంతాలపై సీఐడీ డీజీపీ సమీక్ష
హుబ్లీ: స్థానిక బీవీబీ కళాశాల ఆవరణలో గత ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠ హత్యకు గురైన స్థలంతో పాటు ఆమె నివాసాన్ని రాష్ట్ర సీఐడీ డీజీపీ ఎంఏ సలీం బుధవారం సందర్శించి కేసు గురించి వివరాలు తెలుసుకున్నారు. రెండు రోజులకే నేహా, అంజలి హత్య కేసుల దర్యాప్తు బృందానికి డీజీపీ సలీం తగిన మార్గదర్శనం చేశారు. మంగళవారం అంజలి నివాసానికి వెళ్లిన ఆయన బుధవారం నేహా హత్య స్థలాన్ని దర్యాప్తు బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలమహజరు, ఫైళ్లు, నిందితుల వాంగ్మూలం, సేకరించిన శాసీ్త్రయ సాక్ష్యాధారాలు, సాక్షుల వివరాల గురించి సమీక్షించారు. అనంతరం స్థానిక బిన్నాళలోని నేహా నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసు గురించి నేహా తండ్రి నిరంజనయ్య హిరేమఠను అడిగి ఘటన వివరాలను తెలుసుకున్నారు. నిందితుడు ఫయాజ్ గురించి సీఐడీ బృందం ఇప్పటికే సేకరించిన వివరాల ఆధారంగా కొంత సమాచారాన్ని తీసుకున్నట్లు తెలిసింది. అనంతరం నిరంజనయ్య మీడియాతో మాట్లాడుతూ నేహా హిరేమఠ హత్య ప్రణాళికాబద్ధంగా జరిగిన హత్య అని ప్రారంభం నుంచి చెబుతున్నానన్నారు. సీఐడీ విచారణ వేళ కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించానన్నారు. సీఐడీ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతుందని భావిస్తున్నానన్నారు. సీఐడీ డీజీపీ సలీం కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కేసు ఉదంతాన్ని ఒక నమూనాగా తీసుకొని సమాజానికి హెచ్చరిక సందేశం ఇవ్వడంతో పాటు త్వరలో కోర్టుకు చార్జిషీట్ సమర్పిస్తామని, ఆశించినట్లుగా దర్యాప్తు జరుగుతోందని డీజీపీ తెలిపినట్లు వివరించారు. కాగా అంజలి హత్య గురించి 2021లో బెండిగేరి స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి సమతాసేన, వివిధ దళిత సంఘాల నేతలు డీజీపీ సలీంకు విజ్ఞప్తి చేసిన తక్షణమే ఆయన స్పందించి అతిథిగృహంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జంట నగరాల పోలీస్ కమిషనర్ రేణుకా సుకుమార, డీసీపీలు కుశాల్ చౌక్సీ, రవీశ్ సీఆర్, ఏసీపీ శివప్రకాష్ నాయక్తో చర్చించారు. అనంతరం 2020–21 నాటి కేసు దర్యాప్తు ఫైళ్లను పరిశీలించి అవసరమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. -
రుతుక్రమంపై అవగాహన అవసరం
హొసపేటె: 11 నుంచి 14 ఏళ్ల వయస్సులో వచ్చే రుతుక్రమంపై బాలబాలికలందరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ శంకర్ నాయక్ అన్నారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ రుతుక్రమ పరిశుభ్రత దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. బహిష్టు సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏటా నిర్వహించే ఈ దినోత్సవ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. జిల్లా ఆర్సీహెచ్ అధికారి డాక్టర్ జంబయ్య మాట్లాడుతూ మూఢనమ్మకాలను వీడాలన్నారు. జిల్లా డీఎంఓ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కమలమ్మ ప్రత్యేక ఉపన్యాసం చేస్తూ బాలికలు యుక్తవయస్సులో వచ్చే రుతుక్రమాన్ని తెలుసుకోవాలన్నారు. మహిళలు పౌష్టికాహారం తినాలని అన్నారు. బహిష్టు సమయంలో పాత దుస్తులను వాడకూడదన్నారు. ముఖ్యంగా పరిశుభ్రతను పెంపొందించుకోవాలన్నారు. -
పల్లెల్లో దాహాకారాలు
రాయచూరు రూరల్: జిల్లాలోని లింగసూగూరు తాలూకా కాళాపూర్లో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తుండగా మరోవైపు నీటి ఎద్దడి అధికమైంది. సమస్య నివారణపై అధికారులు మౌనం వహిసున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు తాగునీటి ఎద్దడి సమస్య తీఏర్చ విషయంలో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బుధవారం తాలూకాలోని కాళాపూర్లో వారం రోజులుగా కొళాయిల్లో తాగునీరు సరఫరా కాకపోవడంతో చేదబావి వద్ద నీటిని తోడుకుని పట్టుకెళ్లారు. చేసేది లేక ప్రజలు నీటి కోసం చేదబావిపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తాగునీటి సమస్యను పరిష్కరించడంపై అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. -
క–కలో భారీగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
రాయచూరు రూరల్: విద్యా రంగంలో వెనుక బడిన కళ్యాణ కర్ణాటక(క–క)లో మంచి ఫలితాలు సాధించాలనే తపన కలగానే మిగిలింది. కళ్యాణ కర్ణాటకలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలకు గాను కలబుర్గి జిల్లాలో హైస్కూళ్లు 450, ప్రాథమిక పాఠశాలలు 1640, రాయచూరు జిల్లాలో హైస్కూళ్లు 826, ప్రాథమిక పాఠశాలలు 3304, యాదగిరి జిల్లాలో హైస్కూళ్లు 661, ప్రాథమిక పాఠశాలలు 2363, కొప్పళ జిల్లాలో హైస్కూళ్లు 489, ప్రాథమిక పాఠశాలలు 1852, బీదర్ జిల్లాలో హైస్కూళ్లు 330, ప్రాథమిక పాఠశాలలు 497, బళ్లారి జిల్లాలో హైస్కూళ్లు 396, ప్రాథమిక పాఠశాలలు 1250, విజయనగర జిల్లాలో హైస్కూళ్లు 343, ప్రాథమిక పాఠశాలలు 760 ఉండగా పీఈటీ, డ్రాయింగ్ ఉపాధ్యాయులు 2645, విషయ పరిశీలకుల పోస్టులు 398తో కలిపి మొత్తం 17443 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఈ ప్రాంతంలో ఉపాధ్యాయుల పోస్టులను పొందిన ఏడాదికే మైసూరు, తుమకూరు, విజయపుర, బాగల్కోటె, గదగ్, హాసన్, హావేరి, మండ్య, రామనగర, శివమొగ్గ, దావణగెరె వంటి జిల్లాలకు తిరిగి బదిలీలపై వెళ్లిన వారి స్థానంలో కొత్తగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడంలో ప్రభుత్వ ఉదాసీనత వల్ల నేడు పదవ తరగతిలో ఫలితాలు తక్కువగా వచ్చాయి. కళ్యాణ కర్ణాటకలో 48 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు మంత్రులున్నా విద్యా రంగం అభివృద్ధిపై చిత్తశుద్ధిని చూపడంలో నిరాసక్తతను కనబరుస్తుండటం శోచనీయం. పదిలో తక్కువ శాతం ఫలితాలే నిదర్శనం మౌనం దాల్చిన అమాత్యులు, ఎమ్మెల్యేలు -
స్వచ్ఛ భీమాకు శ్రీకారం
రాయచూరు రూరల్: భీమా నదిలో స్వచ్ఛతకు యువ బ్రిగేడ్ శ్రీకారం చుట్టింది. బుధవారం కలబుర్గి జిల్లా అఫ్జల్పుర వద్ద భీమా నదిలో పడి ఉన్న చెత్త చెదారం, ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు, పాత దుస్తులు, ఇతరత్ర వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. వర్షాకాలం ప్రారంభానికి మునుపే వర్షపు నీరు వచ్చి బ్యారేజీలో చేరక ముందే 15 మందితో కూడిన బృందం నదితో పాటు తీర ప్రాంతాన్ని శుభ్రపరిచినట్లు అఫ్జల్పుర యువ బ్రిగేడ్ సంచాలకుడు రాజేంద్ర తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య రాయచూరు రూరల్: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని సింధనూరు తాలూకా సాలగుందలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గిరియప్ప(45) అనే రైతు వ్యవసాయం కోసం ఐసీఐసీఐ బ్యాంక్లో రూ.18 లక్షలు, బూదివాళ బ్యాంక్లో రూ.2 లక్షలు, మహేంద్ర ఫైనాన్స్లో రూ.లక్ష, చేబదులు కింద రూ.7 లక్షలు అప్పులు చేశాడు. అయితే పంట నష్టం వాటిల్లడంతో చేసిన అప్పులు తీర్చే దారి కానరాక అప్పులిచ్చిన వారి వేధింపులు అధికమై జీవితంపై విరక్తి చెంది పొలంలో విషం తాగాడు. ఆయనను టీపీ మాజీ సభ్యుడు వెంకోబ, జీపీ సభ్యుడు నిరుపాది తదితరులు కలిసి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించినట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు. కౌంటింగ్కు ఏర్పాట్ల పరిశీలన రాయచూరు రూరల్: జూన్ 4న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో ఎన్నికల అధికారి, జిల్లాధికారి చంద్రశేఖర్ నాయక్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. బుధవారం నగరంలోని ఎల్వీడీ కళాశాలలో ఈవీఎం యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లాధికారి పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సలహా సూచనలు చేశారు. -
శుభ్రతతో డెంగీని అరికడదాం
గౌరిబిదనూరు: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగీని అరికడదామని తా.పం. ఈఓ జీకే హోన్నయ్య అన్నారు. డెంగీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టీపీ కార్యాలయం ఆవరణలో బుధవారం ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, తొట్టెల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలన్నారు. ఆరోగ్యాధికారి చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ తాలూకాలోని తొండేబావి, అలీపుర, జగరెడ్డిపల్లి, నామగొండ్లు, నక్కలపల్లి, మంచేనహళ్లిలో 8 డెంగీ కేసులు వెలుగు చూశాయన్నారు. పట్టణంలో ఈ వ్యాధి విస్తరించలేదన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని దోమ కాటుకు గురికాకుండా ఉండాలని సూచించారు. డాక్టర్ మురళీధర్, మూకాంబిక పాల్గొన్నారు. బైక్లు ఢీకొని ఒకరి మృతి మైసూరు: రెండు బైక్లు ఢీకొని ఒక ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన నంజనగూడు తాలూకా గీకహళ్లి గ్రామం వద్ద జరిగింది. నంజనగూడు తాలూకా ఆలంబూరు మంటి గ్రామానికి చెందిన ఎం.ప్రవీణ్ కుమార్ (19) బైక్లో స్వగ్రామం నుంచి నంజనగూడు వైపు వెళుతుండగా అటుపక్క నుంచి అత్యంత వేగంగా వచ్చిన పల్సర్ బైక్ ఢీ కొట్టింది. ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ తలకు తీవ్రంగా గాయమైంది. తాలూకా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బిళిగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారంగౌరిబిదనూరు: ఆగ్నేయ ఉపాధ్యాయ నియోజకవర్గానికి బీజేపీ మద్దతుతో బరిలో ఉన్న వైఏ నారాయణస్వామి తరఫున ఆ పార్టీ నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. పట్టణంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి ఉపాధ్యాయులను కలిసి నారాయణస్వామికి మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ నాయకుడు డాక్టర్ శశిధర్ మాట్లాడుతూ నారాయణస్వామి 18 సంవత్సరాలుగా పరిషత్లో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడారన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. రవినారాయణరెడ్డి, మార్కెట్ మోహన్, రమేశ్ రావ్ పాల్గొన్నారు. వైద్య విద్యార్థిని బెదిరించి దోపిడీ మైసూరు: దుండగులు ఓ వైద్య విద్యార్థిని బెదిరించి రూ. 25 వేలను దోచుకున్నారు. ఈ ఘటన మైసూరులో జరిగింది. ఆర్యన్ పండిత్ అనే యువకుడు నగరంలోని జేఎస్ఎస్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. కాలేజీకి కాలి నడకన వెళ్తుండగా బైక్లో వచ్చిన ఇద్దరు దుండగులు అడ్డుకొని పార్కులోకి లాక్కెళ్లారు. విద్యార్థినిని వేధిస్తున్నావని, విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్నావని దుండగులు బెదిరించారు. రూ. 25 వేలు ఇస్తే వదిలేస్తామని చెప్పారు. తన వద్ద డబ్బు లేదని ఆర్యన చెప్పగా ఫోన్పే ద్వారా రూ. 25 వేలు తమ ఖాతాకు బదిలీ చేసుకున్నారు. పోలీసులకు ఈ విషయం చెబితే చంపేస్తామని బెదిరించి ఉడాయిచారు. ఘటనపై నరసింహరాజు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులను చూసి ఉడాయించిన దొంగలు మైసూరు: చోరీకి పాల్పడిన దొంగలు పోలీసులను చూసి నగలు, బైక్ వదిలేసి పారిపోయారు. ఈఘటన మైసూరు విజయనగరలో జరిగింది. విజయనగర కానిస్టేబుళ్లు అనంతు, హేమంత్లు గస్తీ నిర్వహిస్తుండగా అంజనాద్రి రోడ్డులో ముగ్గురు యువకులు బైక్లో అనుమానాస్పదంగా వెళ్తుండటాన్ని గమనించి వెంబడించారు. పసిగట్టిన ఆ ముగ్గురూ ఒక బ్యాగ్ను అక్కడే వదిలేసి పారిపోయారు. పోలీసులు వెళ్లి బ్యాగు తెరిచి చూడగా అందులో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. ఈ ముగ్గూరు ఎక్కడో చోరీకి పాల్పడి ఉంటారని నిర్ధారించి వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అవార్డు ప్రదానం మైసూరు: వీర సావర్కర్ జన్మదినం సందర్భంగా నగరంలోని కళామందిరంలో ప్రముఖ యువ బ్రిగేడ్ సంస్థాపకుడు చక్రవర్తి సొలిబెలెకు వీర సావర్కర్ సమ్మాన్ అవార్డును ప్రదానం చేశారు. మైసూరు వీర సావర్కర్ ప్రతిష్టాన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఎస్ఎల్ భైరప్ప.. చక్రవర్తికి వీరసావర్కర్ సమ్మాన్ అవార్డును అందించి గౌరవించారు. చక్రవర్తి సొలిబెలె మాట్లడుతూ వీర సావర్కర్ గోపూజ చేయడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చేశారని, ఆయన్ను స్ఫూర్తి తీసుకొని ఈ అవార్డుతో వచ్చిన రూ. లక్షను గో సంరక్షణార్థం గోశాలకువిరాళంగా ఇస్తానని ప్రకటించారు. -
కారు అద్దాలు ధ్వంసం చేసి చోరీ యత్నం
మండ్య: కారులోని రూ. 7 లక్షల నగదు దోచుకుని పారిపోతున్న దొంగలను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మండ్య నగర శివార్లలోని అమరావతి హోటల్ వద్ద జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. కల్లహళ్లి లేఔట్కు చెందిన మధు అనే వ్యక్తి నగరంలోని కెనరా బ్యాంకు నుంచి రూ.7 లక్షలు డ్రా చేసి కారులో బయల్దేరి అమరావతి హోటల్ వెనుక పార్కింగ్ చేసి స్నేహితులను కలిసేందుకు లోపలికి వెళ్లాడు. తిరిగి వెనక్కి వచ్చి చూడగా ఓ వ్యక్తి కారు కిటికీ అద్డాలు పగులగొట్టి నగదు తీసుకునేందుకు యత్నిస్తున్నాడు. వెంటనే మధు తేరుకుని గట్టిగా దొంగ దొంగ అంటూ కేకలు వేశాడు. తక్షణమే నిందితుడు హోటల్ గోడ దూకి పారిపోయేందుకు యత్నించాడు. మధు కేకలు విన్న స్థానికులు ఆ దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ పోలీసులకు అప్పగించారు. మండ్య గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. దొంగను చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు -
మహిళపై నిందలు వేసి వేధింపులు
మైసూరు: తన శీలంపై నింద వేయడంతో మనస్తాపానికి గురైన వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఉదంతం మైసూరు గాంధీనగరలో జరిగింది. మైసూరు ఎన్ఆర్ పోలీసుల కథనం మేరకు.. దడదహళ్లిలో విజయలక్ష్మి (40) అనే వివాహిత నివాసం ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన నాగరాజు విజయలక్ష్మిపై కన్నేసి ఆమె శీలంపై అవాస్తవాలు ప్రచారం చేసేవాడు. అసభ్యపదజాలంతో దూషించేవాడు. దీంతోవిజయలక్ష్మి కుమారుడు అభి పలుమార్లు నాగరాజుతో గొడపడ్డాడు. దీంతో నాగరాజు తన స్నేహితులతో కలసి విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడు. చివరికి వీరి గొడవ కోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి తన కుటుంబాన్ని శివమొగ్గకు మార్చింది. మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లేందుకు విజయలక్ష్మి కుటుంబ యత్నించింది. ఇందుకోసం గ్రామీణ పోలీసుల సాయం కూడా కోరింది. వారి సూచనలతో కడకోళ పోలీసు స్టేషన్కు వెళ్లగా నాగరాజు తదితరులు వ్యతిరేకిస్తూ మళ్లీ విజయలక్ష్మి గురించి అవాస్తవాలు ప్రచారం చేశారు.అనంతరం గ్రామానికి వెళ్లలేక విజయలక్ష్మి మైసూరు గాంధీనగరలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. సిద్ధార్థ పార్కులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి నాగరాజు, రాజమ్మ, గోవిందరాజు, నంజుండ, నారాయణ, నంజప్ప, స్వామిలు కారణమని మైసూరు ఎన్ఆర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అవమానంతో ఉరివేసుకొని ఆత్మహత్య -
వడదెబ్బతో నరేగ కూలి మృతి
రాయచూరు రూరల్: జిల్లాలో నరేగ పథకంలో పనులు చేస్తున్న కూలి వడదెబ్బతో మృతి చెందిన ఘటన జిల్లాలోని లింగసూగూరు తాలూకాలో జరిగింది. బుధవారం ఈచనాళలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(నరేగ) పనుల్లో ఉన్న మహంతేష్(34) అనే వ్యక్తి ఆకస్మికంగా స్పృహ తప్పి కుప్పకూలాడు. వెంటనే కూలీలు అతనిని లింగసూగూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడని పోలీసులు తెలిపారు. కాగా మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్ రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో విద్యాశాఖ ప్రాధికారను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి వేదిక సంచాలకురాలు విద్యా పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024–25వ విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కొన్ని సర్కారీ ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో జూన్ 1 నుంచి పాఠశాలలను ఏ విధంగా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. జిల్లాలో 160 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక మూతపడే అవకాశాలున్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రుల వెంట కూలి పనులకు వెళుతున్నారన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. మోక్ష మ్మ, శివరామరెడ్డి, మారెమ్మ, హఫీజుల్లాలున్నారు. -
అనుమతి లేని స్కూళ్లను రద్దు చేయాలి
తుమకూరు: జిల్లాలోని అనధికార స్కూళ్లను మూసివేయాలని డిమాండ్ చేస్తూ మానవ హక్కుల సేవా కేంద్రం ఆందోళన చేపట్టింది. అయితే వీరి ఆందోళనను వ్యతిరేకిస్తూ కర్ణాటక రూప్సా కూడా ఆందోళన చేయడంతో రెండు సంఘాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాలూకాలోని 14 పాఠశాలలు అనధికారికంగా నిర్వహిస్తున్నారని తుమకూరు తాలూకా బీఈవో గుర్తించారు. నెల రోజులు గడిచినా చర్యలు తీసుకోలేదని, ఇప్పటికై నా స్పందించి ఆ స్కూళ్ల రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని మానవ హక్కుల సేవా కేంద్రం సంప్థాపక అధ్యక్షుడు సిద్ధలింగేగౌడ నేతృత్వంలో డీడీపీఏ కార్యాలయం వద్ద బుధవారం ఆందోళన జరిగింది. అయితే వీరి ఆందోళన సరికాదని, కేవలం ప్రచారం కోసం పోరాటం చేస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రైవేటు స్కూళ్ల మేనేజ్మెంట్ అసోసియేషన్ (రూప్సా) అధ్యక్షుడు హాలేనూరు లేపాక్ష నేతృత్వంలో పోటీగా ధర్నా జరిగింది. ఈ సమయంలో రెండు సంఘాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మానవ హక్కుల సేవా కేంద్రం నాయకుల ధర్నా వీరికి వ్యతిరేకంగా (రూప్సా) ఆందోళన
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- త్వరలోనే టీమిండియాలో నా ఎంట్రీ: ఐపీఎల్ స్టార్
- తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు: కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి వ్యక్తిగత ఆహ్వానం
- పిన్నెల్లి పిటిషన్పై సీఈసీకి హైకోర్టు ఆదేశం
- కుల్దీప్ యాదవ్కు ఊహించని షాక్!
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- ఎవరు పడితే వాళ్లు కోచ్ కాలేరు?.. గంగూలీ పోస్ట్ వైరల్
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
Advertisement