-
Lok Sabha Election 2024: గోరఖ్పూర్లో స్టార్ వార్!
ఉత్తరప్రదేశ్లో శనివారం పోలింగ్ జరగనున్న స్థానాల్లో గోరఖ్పూర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. బీజేపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ రవికిషన్ శుక్లా, ఇండియా కూటమి తరఫున బరిలో ఉన్న ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్ ఇద్దరూ భోజ్పురి స్టార్లే కావడం అందుకు కారణం... రవికిషన్కు పీఠం మద్దతు... భోజ్పురి సినిమాల్లో సూపర్స్టార్గా వెలుగొందుతున్న రవి కిషన్ అసలు పేరు రవీంద్ర శుక్లా. కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో జౌన్పూర్ నుంచి పోటీ చేసి ఓడారు. 2017లో బీజేపీలో చేరారు. 2019లో 3 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. కానీ ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో కనిపించనే లేదనే విమర్శలున్నాయి. ప్రతిపక్షాలు ఆయనను ‘బయటి వ్యక్తి’గా అభివర్ణిస్తున్నాయి. దాంతో పీఎం మోదీ, సీఎం యోగి చరిష్మానే నమ్ముకున్నారు. గోరఖ్పూర్లో తనకు ఇల్లుందని, ఇక్కడే ఉంటున్నానని చెప్పుకొస్తున్నారు. యువకులతో కుస్తీ పడుతూ, స్థానికులతో సెల్ఫీలు దిగుతూ ప్రచారం జోరుగా చేశారు. రవి కిషన్కు గోరక్షనాథ్ పీఠం మద్దతు కూడా ఉంది. నిషాద్ ఓట్లను నమ్ముకున్న కాజల్ భోజ్పురి నటి, ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్కు ఇది నాలుగో ఎన్నిక. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్పూర్ రూరల్ నుంచి కాంగ్రెస్ టికెట్పై, కాంపియర్గంజ్ నుంచి ఎస్పీ తరఫున పోటీ చేసి ఓడారు. మేయర్ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూశారు. రాజకీయాల్లో చురుకుగా ఉండే ఆమెకు ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. తన సామాజికవర్గమైన నిషాద్ ఓట్లనే నమ్ముకున్నారు. అయితే 2019 మాదిరిగా ఈసారి కూడా ఎస్పీ ఓట్లను బీఎస్పీ గట్టిగానే చీల్చేలా కని్పస్తోంది. 1990ల నుంచి బీజేపీ హవా.. గోరఖ్పూర్ స్థానంలో 1984 దాకా కాంగ్రెస్దే హవా. రామమందిర ఉద్యమ నేపథ్యంలో 1989 నుంచీ గోరక్షనాథ్ పీఠం ఆధిపత్యం మొదలైంది. అప్పటినుంచి 1996 దాకా వరుసగా మూడుసార్లు గోరక్షనాథ్ పీఠాధిపతి మహంత్ అవైద్యనాథ్ ఇక్కడినుంచి గెలిచారు. 1998 నుంచి 2014 దాకా ఐదుసార్లు ప్రస్తుత పీఠాధిపతి యోగి గెలిచారు. సీఎం అయ్యాక ఆయన రాజీనామాతో 2018లో జరిగిన ఉప ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థగా ఎస్పీ నేత ప్రవీణ్ నిషాద్ బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర శుక్లాను ఓడించారు. కానీ ఈ ఆధిపత్యాన్ని ఎస్పీ నిలబెట్టుకోలేకపోయింది. కుల సమీకరణాలదే కీలకపాత్ర..గోరఖ్పూర్లో అగ్రవర్ణ ఓట్లు 6 లక్షలున్నాయి. 9 లక్షల ఓబీసీ, 4 లక్షల నిషాద్, 2 లక్షలకు పైగా యాదవ ఓట్లున్నాయి. 2.5 లక్షల దళిత ఓట్లు, 2 లక్షల ముస్లిం ఓట్లూ తనకేనని కాజల్ చెబుతున్నారు. నిషాద్లూ తన వెంటే ఉన్నారంటున్నారు. బీజేపీ కూడా నిషాద్ల ఓట్ల కోసం ముమ్మర ప్రయత్నాలు చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సాయిబాబా ఆలయంలో చోరీ
ముదిగొండ: మేడేపల్లిలోని సాయిబాబా దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఆలయంలోని సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామిల పంచలోహ విగ్రహాలు, సాయిబాబా వెండి పాదుకలు చోరీ చేశారని ఆలయ పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. ఆలయ పూజారి వెంకట శ్రీనివాసచార్యులు గురువారం ఉదయం దేవాలయానికి వెళ్లగా.. గేటుకు వేసిన తాళం పగులగొట్టి ఉంది. దీంతో ఆలయంలోపలికి వెళ్లగా రూ.75వేలు విలువైన సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి పంచలోహ విగ్రహాలు, సుమారు రూ.25వేలు విలువైన వెండి పాదుకలను గుర్తు తెలియన వ్యక్తులు చోరీ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరి గడ్డి దిండ్లు దగ్ధం.. నేలకొండపల్లి: వరి గడ్డి దిండ్లు దగ్ధమైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని సుర్ధేపల్లి గ్రామానికి చెందిన ఎం.లలితకు చెందిన వరిగడ్డి దిండ్లకు గురువారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దిండ్లు ఇళ్లకు ఆనుకుని ఉండడంతో గ్రామస్తులు భయాందోళన చెంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఈదురు గాలులకు మంటలు వ్యాపించాయి. దీంతో ఫైరింజన్కు సమాచారం ఇవ్వగా.. వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే 200 వరి గడ్డి దిండ్లు పూర్తిగా కాలిపోయాయి. -
మావోయిస్టు మిలీషియా దంపతుల లొంగుబాటు..
కొత్తగూడెంటౌన్ / చర్ల : సీపీఐ నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన మడకం లింగా, మడవి గంగి అనే మిలీషియా దంపతులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గురువారం కొత్తగూడెంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రోహిత్రాజు లొంగిపోయిన దంపతులు మిలీషియా సభ్యులుగా కొనసాగిన వారి వివరాల ను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుసుమ జిల్లా పొట్టేమంగు గ్రామం, చింతగుప్ప కృష్టారం పీఎస్ పరిధిలకు చెందిన వారు సీఆర్పీఎఫ్ 81 బెటాలి యన్, 141 బెటాలియన్, జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. మడకం లింగా 2009 ఏడాదిలో మిలిషియా కమాండర్ ఏర్రా సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరారని, 2010 వరుకు మిలీషియా సభ్యుడిగా చేసిన అనంతరం 2014 వరకు హరిభూషన్ టీం ప్రొటెక్షన్కు బదిలీ చేశారన్నారు. 2014లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది మణుగురు ఏరియా ఎల్జీఎస్ కమాండర్గా ఇప్పటి వరకు కొనసాగాడని చెప్పారు. అదేవిధంగా మడవి గంగి 2011లో చర్ల మిలీషియా కమాండర్ అయిన పోడియం జయరాం సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరి 2013 ఏడాది వరకు సీఎన్ఎం (చైతన్య నాట్యం మండలి)లో సభ్యురాలిగా, 2014 వరకు చర్ల ఏరియా మిలీషియా సభ్యురాలిగా ఉందని తెలిపారు. 2014 నుంచి 2018 వరకు హరిభూషన్ ప్రొటెక్షన్ టీంలో 2018 వరకు పని చేసిందని ఆ తరువాత మడకం లింగాను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. తరువాత ఏరియా కమిటీ సభ్యురాలిగా పదోన్నతిని పొంది ఇప్పటి వరకు సీపీఐ నిషేధిత మావోయిస్టు పార్టీలో కొనసాగిందన్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు వేధింపులు తాళలేక, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఆపరేషన్ చేయూతతో ఆకర్షితులై లొంగిపోయినట్లు దంపతులు తెలిపినట్లు చెప్పారు. లొంగిపోయిన వారు ప్రశాంత జీవితం గడపాలనుకునే దళం సభ్యులు వారి కుటుంబ సభ్యులు ద్వారా కాని స్వయంగా తమ దగ్గరలోని పోలీసు స్టేషన్లో, జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించాలని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు జీవనోపాధిని కల్పించడం, పునరావసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందించాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ రోహిత్రాజు అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మట్టి మాఫియా..!
అక్రమ మట్టి దందారాయుళ్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కుంటలు, చెరువులను వదలకుండా వాటిని గుల్ల చేస్తున్నారు. కనిపించిన మట్టి గుంటల వద్ద యంత్రాల సాయంతో మట్టిని తోడేస్తూ.. ఇళ్ల నిర్మాణాలు, వెంచర్ల ఏర్పాటుకు తరలిస్తూ.. దళారులు జేబులు నింపుకుంటున్నారు. చెరువుల మట్టి తోలకాలతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి కనిపిస్తున్నా.. ఇరిగేషన్, మైనింగ్ అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంరూరల్: మండలంలోని ఏదులాపురం చెరువులో గత కొంతకాలంగా అక్రమార్కులు జోరుగా సాగిస్తున్న ఈ మట్టి దందా.. అక్రమార్కులపై కాసుల వర్షం కురిపిస్తోంది. గత దశాబ్దకాలంగా ప్రభుత్వ భూములు, గుట్టల్లో దశలవారీగా తవ్వి అక్రమార్కులు మట్టిని భారీ మొత్తంలో తరలించారు. పగలు, రాత్రి వేళల్లో బహిరంగంగానే యథేచ్ఛగా చెరువు మట్టిని వెంచర్లకు తరలిస్తున్నా.. సంబంధిత అధికారుల్లో ఏమాత్రం చలనం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏకంగా పెద్ద జేసీబీలను పెట్టి టిప్పర్లు, ట్రాక్టర్లలో భారీగా మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టి విలువ రూ. 800 నుంచి రూ.1,000 వరకు, టిప్పర్కు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఇదే పనిగా మట్టిని తరలిస్తున్నారు. నిరంతరాయంగా మట్టి తరలింపు.. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన కొందరు అక్రమార్కులు 400 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఏదులాపురం చెరువు నుంచి పది జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా చెరువు మట్టిని సమీపంలో వెంచర్లకు తరలిస్తున్నారు. గత నెల రోజులుగా నిరంతరాయంగా తరలిస్తున్నా.. సంబంధిత అఽధికారులు తమకేమి పట్టనట్లు ఉండడంతో ఇదంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందనే ఆరోపణలున్నాయి. మట్టి దందారాయుళ్లు కేవలం పేరుకే ఇద్దరు రైతులతో తమ పొలాలకు మట్టి కావాలని దరఖాస్తు చేయించి.. ఆ చిన్న సాకుతో భారీ ఎత్తున మట్టిని తరలించి వ్యవసాయ పొలాలకు కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇళ్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు. ఇలా రోజుకు దాదాపు 1,200 ట్రిప్పులు మట్టిని తరలిస్తున్నారంటే గత నెల రోజులు నుంచి ఎంతమేర మట్టిని తరలించారో అర్థం చేసుకోవచ్చు. దాదాపు కోట్ల రూపాయలు దందారాయుళ్ల జేబుల్లోకి వెళ్లాయని తెలుస్తోంది. ప్రభుత్వాదాయానికి భారీ గండి? ఇదిలా ఉండగా మట్టిని తరలించడానికి అన్ని అనుమతులు తీసుకుని మట్టి తీసుకెళ్లాల్సిన అక్రమార్కులు.. అనుమతులు లేకుండానే తరలించడంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండిపడినట్లయింది. నిబంధనల మేరకు ప్రభుత్వానికి రుసుం చెల్లించి మట్టి తరలిస్తే.. గత నెల రోజుల వ్యవధిలో దాదాపు రూ.60 లక్షల వరకు ఆదాయం వచ్చి ఉండేది. యథేచ్ఛగా అక్రమ మట్టి తోలకాలు రైతుల పేరుతో అనుమతులకు దరఖాస్తు మంజూరు కాకుండానే మట్టి తరలింపు ఇళ్ల నిర్మాణాలు, వెంచర్లకు తరలిస్తున్న వైనం కాసులు కురిపిస్తున్న అక్రమ దందా ప్రభుత్వ ఆదాయానికి గండి పట్టించుకోని మైనింగ్, ఇరిగేషన్ అధికారులునిబంధనలు ఇలా.. ఏదైనా ప్రభుత్వ భూమిలో మట్టిని తవ్వి ఇతర ప్రదేశాలకు తరలించాలంటే ముందుగా రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. తాము ఇంత విస్తీర్ణంలో చెరువు మట్టిని తీసుకెళ్తామని దరఖాస్తు చేసుకుంటే అధికారులు ఆ దరఖాస్తును పరిశీలించి క్యూమిక్ మీటర్ల ప్రకారం రుసుం కట్టించుకుని అనుతిస్తారు. అధికారులు అనుమతిచ్చిన మేరకే మట్టిని తరలించాల్సి ఉంటుంది. ఒక వేళ రైతులు తమ పొలాలకు చెరువు మట్టిని తరలించాలనుకున్నా.. ఈ మూడు శాఖల నుంచి అనుమతి తప్పక తీసుకోవాలి. కాకపోతే రైతులు ప్రభుత్వానికి ఎలాంటి రుసుం చెల్లిచాల్సిన అవసరం ఉండదు. అధికారి ‘సాక్షి’గా చెరువుమట్టి తరలింపు.. చెరువులో మట్టి తరలిస్తున్న విషయం తెలుసుకున్న ‘సాక్షి’గురువారం క్షేత్రస్థాయికి వెళ్లగా.. అక్కడ సంబంధిత ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉండగానే మట్టి దందారాయుళ్లు మట్టిని తరలించడం గమనార్హం. బాబూ పైఅధికారులు వస్తున్నారు.. తవ్వడం ఆపేసి పక్కకు పెట్టండి అంటూ దందారాయుళ్లను వర్క్ ఇన్స్పెక్టర్ బతిమిలాడటం విశేషం. అక్రమంగా మట్టిని తరలిస్తున్న యంత్రాలను సీజ్ చేసి పోలీస్స్టషన్కు తరలించి కేసు నమోదు చేయించాల్సిన వర్క్ ఇన్స్పెక్టరే ఇలా చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలి. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ
యువకుడికి తీవ్ర గాయాలు నేలకొండపల్లి: నేలకొండపల్లికి చెందిన చిన్నపొంగు క్రాంతి అనే యువకుడు గురువారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి బైక్పై కూసుమంచి రహదారిలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సమీపంలోని రహదారి వద్దకు వెళ్లాడు. అదే సమయాన మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు ఆ ప్రాంతానికి వచ్చి క్రాంతి బైక్పై కూర్చున్నారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగగా.. క్రాంతి చెవి తెగి తీవ్ర గాయం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి ఆపై ఖమ్మం తరలించారు. కాగా, బాధితుడు తండ్రి వీరస్వామి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని బీరు బాటిల్తో దాడి చేయడంతో చెవి పూర్తిగా తెగిందని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైలుకింద పడి రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య చింతకాని: మండల పరిధిలోని రామకృష్ణాపురం రైల్వే స్టేషన్ సమీపాన కర్లపూడి నాగభూషణం(59) అనే రిటైర్డ్ ఉద్యోగి గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం బీకే బజారుకు చెందిన నాగభూషణం ఖమ్మం ఎస్డీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేసి పదవీ విరమణ పొందాడు. ఆయన కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతూ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనారోగ్య సమస్యను తట్టుకోలేక గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. మృతదేహాన్ని అన్నం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు బృందం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పంతులు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఎండీ అబ్దుల్ హకీం విదేశీ పర్యటనకు వెళ్తున్న క్రమంలో తేజావత్ పంతులుకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. పంతులు సంఘంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవంతో పాటు రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యుడిగా ఉన్న నేపథ్యాన పంతులుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు హకీం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పంతులు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కొండగట్టు అంజన్నకు రామయ్య వస్త్రాలుభద్రాచలం: జగిత్యాల జిల్లా కొండగట్టులో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం తరఫున గురువారం పట్టువస్త్రాలు అందజేశారు. జూన్ 1న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రామాలయ ఈఓ ఎల్.రమాదేవి పట్టువస్త్రాలతో కొండగట్టుకు వెళ్లారు. అక్కడి అర్చకులు ఆలయ మర్యాదలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ భవానీ రామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు.తహసీల్ ఎదుట రైతు హల్చల్ కూసుమంచి: కూసుమంచిలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ఓ రైతు పురుగుమందు డబ్బాతో హల్చల్ చేశాడు. మండలంలోని గన్యాతండాకు చెందిన గుగులోత్ శ్రీను అనే రైతు తన తండ్రి తన వాటాగా రావాల్సిన భూమిని తన సోదరుడి పేరున రిజిస్ట్రేషన్ చేయించేందుకు సిద్ధం అయ్యాడని, అట్టి రిజిస్ట్రేషన్ను నిలిపివేయాలంటూ ఆందోళనకు దిగాడు. దీనిపై పూర్తి విచారణ నిర్వహించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతు ఆందోళనను విరమించాడు. అత్తగారింటి వద్ద పురుగుల మందు తాగి అల్లుడు మృతి పాల్వంచరూరల్: అత్తగారి ఇంటికి వచ్చిన అల్లుడు భార్య కాపురానికి రావడంలేదని మనస్థాపం చెంది పురుగుమందు తాగి మృతిచెందిన సంఘటన కారెగట్టులో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కారెగట్టు గ్రామానికి అశ్వాపురం మండలం గొందిగూడెంకు చెందిన కొమరం రాము(32) బుధవారం అత్తగారింటికి వచ్చాడు. భార్య అరుణ కాపురానికి రావడంలేదని పురుగు మందు తాగగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో ఏరియా ఆస్పత్రికి ఆపై కొత్తగూడెంకు తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందాడు. కొమరం పెద్దగుండురాజులు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. కొత్తగూడెంరూరల్: పాల్వంచ మండలం గట్టాయిగూడెం గ్రామానికి చెందిన శెట్టి తరుణ్ (23) తన స్నేహితుడిని కలవడానికి ఇల్లెందుకు స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టి పల్లిగ్రామం వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆధ్యాత్మిక ప్రయాణం
ఒక సినిమా షూటింగ్ ఆరంభించే ముందు... లేదా సినిమా పూర్తయ్యాక ఆధ్యాత్మిక యాత్ర చేస్తుంటారు రజనీకాంత్. ఆయన ఎక్కువగా హిమాలయాలకు వెళ్లే విషయం తెలిసిందే. అక్కడి మహావతార్ బాబాజీ గుహలో రజనీ ధ్యానం చేస్తుంటారట. తాజాగా రజనీకాంత్ మరోసారి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. దాదాపు పది రోజులు హిమాలయాల్లో గడిపి, తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. చెన్నై చేరుకున్న వెంటనే తన తాజా చిత్రం ‘కూలీ’ చిత్రీకరణలో పాల్గొంటారు రజనీకాంత్.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. మరోవైపు రజనీకాంత్ నటించిన చిత్రం ‘వేట్టయాన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వేట్టయాన్’లో రజనీకాంత్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ ఏడాది అక్టోబరులో ఈ చిత్రం విడుదల కానుంది. -
ప్రాణం తీసిన మద్యం మత్తు..
ఖమ్మంక్రైం: తాను తాగిన మద్యం మత్తే అతడికి శపమైంది. పొట్టచేతితో పట్టుకొని రాష్ట్ర సరిహద్దులు దాటివచ్చిన అతడు మత్తులో విగతజీవిగా మారాడు. వనటౌన్ సీఐ ఉదయ్కుమార్ కథనం ప్రకారం.. రాజస్థాన్కు చెందిన అమిత్కుమార్ (27) కొంతకాలంగా నగరంలోని కమాన్బజార్లో నివాసం ఉంటూ పచ్చబొట్టు షాపులో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను గతంలో ఉన్న తనరూమ్ను ఖాళీ చేసి ఇటీవల తనతో పాటు పనిచేసే దీపక్కుమార్ రూమ్లో ఉంటున్నాడు. అయితే బుధవారం రాత్రి కూడా మద్యం సేవించి వచ్చిన అతను కిటికీ అద్దాలను బలంగా కొట్టడంతో చేతికి తీవ్ర గాయమైంది. మద్యం మత్తులో ఉన్న అతడి స్నేహితుడు గమనించకపోవడంతో ఆ రాత్రి తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు వదిలాడు. గురువారం ఉదయం లేచిన దీపక్కుమార్ రక్తపు మడుగులో అమిత్కుమార్ కనిపించడంతో వెంటనే స్థానికులను పిలవగా వారు వచ్చి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహన్ని మార్చురికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
33 కేవీ విద్యుత్ లైన్ పనులు ప్రారంభం
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సరఫరాను మెరుగుపర్చేందుకు పమ్మి 132/33 కేవీ సబ్ స్టేషన్ నుంచి కమలాపురం 33/11 కేవీ సబ్ స్టేషన్ వరకు 33 కేవీ విద్యుత్ లైన్ పనులను గురువారం నుంచి ప్రారంభించారు. పమ్మి నుంచి కమలాపురం వరకు ఉన్న 4.9 కిలో మీటర్ల పొడవున నిర్మించే కేవీ విద్యుత్ లైన్ పనులకు టీజీ ఎన్పీడీసీఎల్ రూ. 23.13 లక్షలను మంజూరు చేయగా.. జిల్లా ఎన్పీడీసీఎల్ సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ఈ ఎ.సురేందర్ పర్యవేక్షణలో కన్స్స్ట్రక్షన్స్ డీఈ హీరాలాల్, ఏడీఈ కిరణ్ చక్రవర్తి, ముదిగొండ ఆపరేషన్స్ ఏడీఈ భీమ్సింగ్, ఏఈ ప్రసాద్, పమ్మి సబ్ స్టేషన్ ఏఈ నారాయణలను పనులను ప్రారంభించారు. నూతన 33 కేవీ విద్యుత్ లైన్ నిర్మాణంతో కమలాపురం, బాణాపురం, వల్లభి విద్యుత్ సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా మెరుగు పడుతుందని ఎస్ఈ సురేందర్ తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. -
అండమాన్లో యాక్షన్
కొద్ది రోజుల పాటు అండమాన్కు మకాం మార్చనున్నారు హీరో సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే సూర్య అండమాన్ వెళ్లనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ అండమాన్లో ప్రారంభం కానుంది.నవ్వు, యుద్ధం, ప్రేమ అంశాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను జూన్లో ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. అండమాన్లో ఆరంభించే ఈ తొలి షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది.