-
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
నారాయణపేట: ఎవరికి కేటాయించిన విధులను వారు సమర్థవంతంగా నిర్వహించాలని నారాయణపేట ఆర్డీఓ సి.హెచ్. మధుమోహన్ సూచించారు. బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలోని సమావేశపు హాలులో నారాయణపేట నియోజకవర్గంలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడారు. జూన్ 4న మహబూబ్నగర్లోని పీయూ లో నారాయణపేట జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, నారాయణపేట నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ అధికారులు, ఉద్యోగులకు లెక్కింపు కేంద్రంలో అప్పగించిన పనిని ఎలాంటి పొరపాటు జరగకుండా పూర్తి చేయాలన్నారు. 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు.. మొత్తం 14 టేబుళ్లకుగాను ఏడు ఒకవైపు, మరో ఏడు ఇంకోవైపు ఏర్పాటు చేస్తారని, నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాలను బట్టి 19రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే టేబుళ్ల వారీగా రెవెన్యూ అధికారులు, ఉద్యోగులకు విధులు కేటాయించడం జరిగిందన్నారు. జూన్ 4న తెల్లవారు జామున 3గంటలకు అధికారులు, ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకోవాలని, ఇక్కడి నుంచి బస్సులో అందరూ మహబూబ్నగర్ లోని పీయూకు బయలుదేరి ఉదయం 7 గంటల వరకు అందరూ ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఏఓ, అధికారులు, సిబ్బంది, జిల్లాలోని తహసీల్దారులు, ఆర్ఐలు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు ఆర్డీఓ మధుమోహన్ -
అన్ని రకాల విత్తనాలు సిద్ధం
జిల్లాలో పత్తి విత్తనాల కొరత లేదు ● జూన్ 4వ తేదీ నాటికి జిల్లాకు చేరనున్న జీలుగ విత్తనాలు ● రైతులు ఆందోళన చెందవద్దు ● డీఏఓ జాన్సుధాకర్ నారాయణపేట: ఈ ఏడాది వానాకాలంలో జిల్లాలో 1,85,000 ఎకరాలలో పత్తి పంట సాగు అవుతుందన్న అంచనాలలో 70,000 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా జిల్లాలో ఇప్పటి 3,62,516 ప్యాకెట్లు 245 విత్తన దుకాణాలలో రైతులకు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్సుధాకర్ స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రైతు ఆగ్రోస్ కేంద్రాన్ని ఆయన సందర్శించి పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రైతులు 1,19,197 పత్తి ప్యాకెట్లు కొనుగోలు చేశారన్నారు. ఇంకనూ జిల్లాలో 2,43,319 ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అన్ని పత్తి హైబ్రిడ్ రకాలకు నారాయణ పేట జిల్లా నేలలు అనుకూలమైన బీఈఏసీ సిఫారసు చేయబడి, 19–2–2 సాంకేతికతో రూపొందించబడ్డ విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. దాదాపు అన్ని రకాల పత్తి హైబ్రిడ్ల దిగుబడి ఇంచుమించుగా ఒకేలా ఉంటాయని రైతులు గుర్తించాలన్నారు. తేలికపాటి నేలలో 50 ఏం.ఏం, బరువు నెలలో 70 ఏం.ఏం.వర్షపాతం పడి నమోదు అయినట్లు అయితే రైతులు విత్తనాలు విత్తుకోవాలని ఆయన సూచించారు. లేదంటే విత్తన సరిగ్గా మొలకెత్తక వాడిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుందన్నారు. విత్తనాల కొనుగోళ్ల విషయంలో రైతులు లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ల నుండి తగిన రశీదును పొంది విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. పంటవేసిన తర్వాత విత్తన సంచులను, బిల్లులను పంటకాలం పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా వుంచుకోవాలన్నారు.లూజ్ విత్తనాలు, ప్యాకింగ్ లేని విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని ఆయన సూచించారు. -
No Headline
నర్వ: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య, ఉప కేంద్రాలలో ఇప్పటికే అందిస్తున్న 5 రకాల వైద్య సేవలతో పాటు మరో 7 రకాల కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ఈ దిశగా వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. మానసిక సమస్యలు, చెవి, ముక్కు, గొంతు, కళ్లు, దంత చికిత్సలు అందుబాటులోకి వస్తే ప్రజలకు వచ్చే దాదాపు రుగ్మతలన్నింటికి వైద్యం అందించినట్లు అవుతుంది. జిల్లా కేంద్రాలకు వెళ్లకుండానే పీహెచ్సీలలో మెరుగైన వైద్యసేవలు ప్రజలకు అందనుంది. 25 కేంద్రాల్లో అదనపు సేవలు జిల్లా ఆసుపత్రితో పాటు రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 87 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఉండగా ఇందులో 59 సబ్సెంటర్లను పల్లె దావాఖానాలుగా మార్చి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో మూడో వంతు మాతా, శిశు సంరక్షణ టీకాలు, కుటుంబ నియంత్రణ, అంటువ్యాదుల నియంత్రణ, సాధారణ వ్యాధులకు చికిత్సలు అందజేస్తున్నాయి. జాతీయ అసాంక్రమిక వ్యాధుల ప్రాజెక్టు(నాన్ కమ్యూనికేబుల్ డిసిజెస్ (ఎన్సీడీ) లో భాగంగా ఇక నుంచి జిల్లాలో అదనంగా ప్రత్యేక సేవలు అందిస్తారు. మరికొన్ని రోజుల్లో ఏడు రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. జిల్లాలోని పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(మద్దూరు మినహా) మరో 15 ఆరోగ్య ఉప కేంద్రాల్లో కొత్తగా ఏడు రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సర్జఖాన్పేట, గుడిగండ్ల, మంథన్గోడ్, కల్వాల్, అప్పంపల్లి, రాకొండ, చిన్నజట్రం, పల్లెర్ల, కొమ్మూరు, జాధవరావుపల్లి, కాన్కుర్తి, చెర్లపల్లి, జాజాపూర్, భూనీడ్, కొల్పూర్, గ్రామ ఆరోగ్య ఉప కేంద్రాలను కొత్త వైద్య సేవలకు ఎంపిక చేశారు. మానసిక సమస్యలు, చెవి ముక్కు, గొంతు, కళ్లు, దంత చికిత్సలతో పాటు వయస్సు దాటిన వృద్ధులకు సైతం ఎలర్జీ హెల్తకేర్, తక్షణ ఉపశమన వైద్యం, తదితర సేవలు మొదటి విడతలో అందిస్తారు. కొత్తగా చేపట్టనున్న వైద్య సేవలపై వైధ్యాధికారులకు సరైన అవగాహన లేకపోవడంతో శిక్షణ ఇప్పించారు. కేంద్రాలకు వచ్చే రోగులకు వైద్య సేవలు అందించే విధానం తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు వైద్యాధికారులు తెలిపారు. మానసిక సమస్యలు, చెవి, ముక్కు, గొంతు, కళ్లు, దంత చికిత్సలు మొదటి విడతగా 25 కేంద్రాలు ఎంపిక జిల్లాలో ఇదివరకే వైద్య సిబ్బందికి శిక్షణ -
కబ్జాకు పాల్పడుతున్న వారిపై చర్య తీసుకోవాలి
నారాయణపేట రూరల్: ప్రభుత్వ ఆస్తులు, భూములను కబ్జా చేసిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజి డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగిల్విండో దుకాణాలు అక్రమంగా నిర్మించారని, ఇందుకు సహకరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలన్నారు. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ స్థలంలో నిర్మించిన దుకాణాలు కోర్టు పరిధిలో ఉన్న కబ్జాచేసి వ్యాపారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్డీసీకి చెందిన 6 ఎకరాల స్థలంలో కోర్టు కేసును ధిక్కరించి తాత్కాలిక షెడ్లు వేయించి వ్యాపారాలు చేయిస్తున్న బడా నాయకులపై దృష్టి పెట్టాలని కోరారు. ఇదిలాఉండగా, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, జిల్లా కేంద్రంలో మరో రెండు నెలల్లో బీజేపీ పార్టీ సొంత కార్యాలయం ఏర్పాటు కాబోతుందని నామాజీ తెలిపారు. -
గ్రామీణులకు ఎంతో మేలు
గ్రామీణ ప్రజలకు అదనపు వైద్య సేవల ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నికల ఫలితాల అనంతరం గతంలోని 5 రకాల సేవలతోపాటు మరో 7 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలు అందించేందుకు అవసరమైన ఇక్విప్మెంట్ (పరికరాలు) ఇన్డెంట్ ప్రతిపాదనలు పంపించాం. పరికరాలు అందగానే సేవలను ప్రారంభిస్తాం. ఇందుకోసం వైద్య సిబ్బందికి తగిన శిక్షణను అందించాం. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. – డా. సాయిరాం, ప్రాజెక్టు అధికారి ● -
వెయ్యి క్వింటాళ్ల జీలుగ విత్తనాలకు ప్రతిపాదనలు
వానాకాలం 2024కు గాను జిల్లాకు 1700 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు కేటాయించగా జిల్లాలోని ఆగ్రో రైతు సేవాకేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా ఈ నెల 29 వరకు 999.60 క్వింటాళ్ల విత్తనాలు 60శాతం సబ్సిడీపై (రూ.55,77,768 సబ్సిడి) 1619 మంది రైతులకు ఇప్పటి వరకు సరఫరా చేయడం జరిగిందని డీఏఓ తెలిపారు. మిగిలిన 700 .40 క్వింటాళ్ల విత్తనాలను వచ్చే వారం లోపల రైతులకు సరఫరా చేయబడతాయన్నారు. మరో వెయ్యి క్వింటాళ్ల జిలుగ విత్తనాలు కావాలని ప్రతిపాదనలు పంపామని జూన్ 4 నాటికి అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. జిలుగ విత్తనాల కై రైతులు బెంగపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు కొంతమేర పడినప్పటి ఇంకా పూర్తిస్థాయిలో నేల ఉష్ణోగ్రతలు తగ్గలేదని, ఇంక నేల ఉష్ణోగ్రతలు 35ని పైబడే ఉన్నాయని తెలిపారు. జీలుగ విత్తనాలు వేయడానికి నేల ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల కన్నా తక్కువ ఉండాలని, రైతులు తొందర పడకుండా నేల ఉష్ణోగ్రత తగ్గిన తర్వాతనే విత్తుకోవాలన్నారు. డీఏఓతో పాటు ఏఓ శరత్చంద్ర ఉన్నారు. -
వాతావరణం
రోజులో ఎక్కువ భాగం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. మిన్నంటిన రోదనలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రాఘవేంద్రచారి, వెంకటేష్, మహేష్ పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు తరలిరావడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా కిటకిటలాడింది. వారి రోదనలతో ఆస్పత్రి పరిసర ప్రాంతాలు హృదయ విదారకంగా మారాయి. పరామర్శించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను చూసి మృతుల తల్లిదండ్రులు కాళ్లమీద పడి బోరున విలపించారు. దీంతో ఎమ్మెల్యే వారిని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. ఆస్పత్రిలోనే మృతదేహాలకు పోస్టుమార్గం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ చెప్పారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
కోస్గిలో వికారాబాద్ టాస్క్ఫోర్స్ దాడులు..
గతేడాది ప్రత్యేక నిఘా ఉంచడంతో వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, దౌల్తాబాద్తోపాటు కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా విక్రయాలు బయటపడ్డాయి. జిల్లా పోలీసులు కొడంగల్లో పట్టుబడిన గుట్కాకు సంబందించి విచారణ జరపగా కోస్గి కేంద్రంగా అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో వికారాబాద్ జిల్లా టాస్క్ఫోర్స్ బృందం కోస్గిలో అక్రమ గుట్కా వ్యాపారం చేస్తున్న వ్యాపారి ఇళ్లు, గోదాంలపై ఆకస్మీకంగా దాడులు చేయగా రూ.లక్షల విలువైన గుట్కా పట్టుబడింది. కోస్గిలో అక్రమ దందాలకు సంబందించి వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే. అధికార యంత్రాంగం సక్రమంగా దృష్టి సారిస్తే నిషేదిత కల్తీ కల్లు మందు విక్రయాలు, పేకాట స్థావరాలు, బెల్లం విక్రయాలు, బెల్టు దుకాణాలతోపాటు ఎన్నో అక్రమ దందాలు వెలుగులోకి వస్తాయనేది జనమెరిగిన సత్యం. ఇప్పటికై న పోలీసు శాఖ ఏర్పాటు చేసిన నిఘా విభాగం ఈ అక్రమ బాగోతాలపై దృష్ఠి సారించాలని పలువురు కోరుతున్నారు. -
గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు
మరికల్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అనురాధ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బీపీసీ, ఎంఈసీ, సీఈసీ, వొకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో రూ.100 ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షలకు 85మంది గైర్హాజరు నారాయణపేట రూరల్: ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు మంగళవారం కొనసాగాయి. జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలలో మూడవరోజు గణితం, బాటనీ, సవిక్స్ పరీక్షలు జరిగాయి. ఉదయం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సంబందించి జనరల్ విభాగంలో 1696కి 1643మంది, ఒకేషనల్ విభాగంలో 60కి 58మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన సెకండియర్ పరీక్షకు రెగ్యులర్ విభాగంలో 715కు 685మంది, ఒకేషనల్ విభాగంలో 19కు 16మంది హాజరయ్యారు. ఉదయం డీఈసీ బృందం నారాయణపేట, మక్తల్, కోస్గి, ఫ్లయింగ్ స్కాడ్ ధన్వాడ, మద్దూర్, సిట్టింగ్ స్వ్కాడ్ నారాయణపేట, మద్దూర్, మధ్యాహ్నం డీఈసీ బృందం మద్దూర్, నారాయణపేటలో, ఫ్లయింగ్ స్వ్కాడ్ నారాయణపేట, సిట్టింగ్ స్వ్కాడ్ కోస్గి, నారాయణపేటలో తనిఖీలు చేశారు. డీఐఈఓ రియాజ్హుస్సేన్, పరీక్షల విభాగం అధికారి సుదర్శన్ పట్టణంలోని కేంద్రాలు పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు నారాయణపేట రూరల్: జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శైలజ హెచ్చరించారు. స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల డైరెక్టర్లతో సమీక్ష చేపట్టారు. ప్రైవేటు ఆస్పత్రులలో సాధారణ కాన్పులను ప్రోత్సహించాలని, సిజరిన్ ఆపరేషన్ల సంఖ్య పెరగకుండా చూసుకోవాలన్నారు. డబ్బుల కోసం మోసపూరిత చర్యలకు పాల్పడరాదన్నారు. రికార్డుల నిర్వహణ సరిగ్గా ఉండాలని సూచించారు. అంతకుముందు హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్పై అవగాహన కల్పించారు. ప్రతీ నెల 1 నుంచి 30 వరకు ఆస్పత్రులలో నిర్వహించే సేవలను హెచ్ఎమ్ఐఎస్ పోర్టల్లో తప్పకుండా నమోదు చేయాలన్నారు. ఆన్లైన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు.. సమావేశానికి హాజరైన జిల్లా ఫైర్ అధికారి మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రతీ ఆస్పత్రిలో తప్పకుండా అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆస్పత్రులకు నేరుగా వచ్చి ఫైర్ ప్రికాషన్ మిషన్లు పరిశీలిస్తామని, మౌక్ డ్రిల్ ద్వారా ఆస్పత్రి సిబ్బందికి అవగాహన కల్పిస్తామన్నారు. సమావేశంలో వైద్యశాఖ అధికారులు అశోక్కుమార్, శ్రీనివాసులు, స్నేహలత, ఆస్పత్రుల డైరెక్టర్లు పాల్గొన్నారు. వ్యక్తిపై దాడి.. నగదు చోరీ నారాయణపేట రూరల్: బంగారు దుకాణం మూసివేసి.. బైక్పై ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేయడంతోపాటు అతని వద్ద నుంచి నగదుతో కూడిన బ్యాగును దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి 9గంటల సమయంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సత్యసాయికాలనీకి చెందిన వినోద్చౌద్రి స్థానిక సరాఫ్బజార్లో బంగారం దుకాణం ఉంది. రోజు మాదిరి మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో దుకాణానికి తాళం వేసి తన స్కూటీపై ఇంటికి బయలుదేరాడు. అయితే, నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు అతని వెనుకగా ఫాలో అయ్యారు. వినోద్చౌద్రి ఇంటికి చేరుకొని వాహనం దిగిన వెంటనే అతనిపై నలుగురు దాడికి పాల్పడ్డారు. స్కూటీ డిక్కీలోని బ్యాగును లాక్కొని పారిపోయారు. అంతలోనే కాలనీవాసులు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. దొంగలను పట్టుకొనేందుకు సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అయితే, చోరీ చేసిన బ్యాగులో నగదు, దుకాణ తాళాలు, సెల్ఫోన్ ఉన్నట్లు తెలిసింది. -
చిన్నపాటి నిర్లక్ష్యం.. భారీ మూల్యం
బస్సు, బైక్ ఢీకొని.. ముగ్గురు యువకుల దుర్మరణం ● ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం,అతివేగమే ప్రమాదానికి కారణం ● నారాయణపేట జిల్లా మక్తల్లోవిషాదం నింపిన ఘటన ● శోకసంద్రంలో కుటుంబాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రతిరోజు వారు కలిసి తిరుగుతూ.. కష్టసుఖాలను పంచుకునేవారు.. శుభకార్యాల్లో ఫొటోలు, వీడియోలు తీస్తూ జీవనం సాగించారు.. జీవితకాలం ఇలాగే సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారి.. కాటికి సాగనంపింది.. నిబంధనలను బేఖాతర్ చేస్తూ.. హెల్మెట్ లేకుండా ముగ్గురు కలిసి ఒకే బైక్పై అతివేగంగా వెళ్లి.. ఎదురుగా వచ్చిన బస్సును అదుపు తప్పి ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం మక్తల్ పట్టణంలో విషాదం నింపింది. హెల్మెట్ లేకపోవడం, మితిమీరిన వేగంతో వాహనం నడపడం వల్ల ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. – మక్తల్ -
జూన్ 7 వరకు ‘ప్రజావాణి’ రద్దు
నారాయణపేట రూరల్: జిల్లాకు సంబందించిన అధికారులు ఎన్నికల ఓట్ల లెక్కింపు విధులకు హాజరవుతున్న సందర్భంగా జూన్ 7వరకు కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కోయశ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2న మహబూబ్నగర్ ఎమ్మెల్సీ, జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడించడానికి పోలింగ్కు సంబందించిన ఓట్లను లెక్కించే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. పలు శాఖల జిల్లా అధికారులు పాలమూరులో విధులు నిర్వహిస్తుండటంతో స్థానికంగా అందుబాటులో ఉండటంలేదని, ప్రజలు ఫిర్యాదులతో వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుందనే కారణంతో ప్రజావాణి రద్దు చేశామని, తదుపరి నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. -
ఓట్ల లెక్కింపును పకడ్బందీగా చేపట్టాలి
నారాయణపేట రూరల్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని నారాయణపేట ఆర్డీఓ మధుసూదన్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవరం కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లుతో సమీక్ష చేపట్టారు. ఎన్నికల సంఘం సూచించిన నియమావళిని అనుసరించి ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించాలన్నారు. ఎలాంటి చిన్న తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ పోలింగ్ ఏజెంట్లతో తీసుకోవాల్సిన సంతకాలు, వివిద సెక్షన్లు 64, 65, 66, 67, 129, 136లతో పాటు ఫామ్ 13 ఏ, సీడీలపై శిక్షణ ఇచ్చారు. మైక్రో అబ్జర్వర్లకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో కృష్ణమాచారీ, సాయినాథ్ పాల్గొన్నారు. ఏర్పాట్లపై వీసీ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబందించి చేపట్టిన ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ వికాస్రాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ కోయశ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అశోక్కుమార్, ఎస్పీ యోగేష్గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, భద్రతతో పాటు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. గుర్తింపుకార్డుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, అనుమతిలేనిది ఎవరిని లోపలికి పంపించరాదన్నారు. అసెంబ్లీ సెగ్మెంటుల వారిగా లెక్కింపుకు తగిన చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు కౌంటింగ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభించాలని, ఆలస్యమైతే వివరణ ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలితాల వెల్లడి తర్వాత నిబందనల ప్రకా రం వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. -
అక్రమాల అడ్డా..
నేరం ఎక్కడైనా.. మూలాలు మాత్రం కోస్గిలోనే.. సంచలనం రేపిన ఘటనలు ఇలా.. ¢ నకిలీ పత్తి విత్తనాలకు సంబందించిన కేసును పరిశీలిస్తే మొదట గతేడాది మండలంలోని ముంగిమళ్ల గ్రామ శివారులో రూ.5 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. పట్టుబడిన వ్యక్తి మద్దూర్ మండలంలో ఫెర్టిలైజర్ అండ్ సీడ్ దుకాణం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించి సదరు వ్యాపారితోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ¢ ఇదే క్రమంలో గతేడాది మండల పరిధిలోని కొత్తపల్లిలో రూ. 1.38 లక్షల విలువైన పత్తి విత్తనాలు, హకీంపేటలో 10 కిలోల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. ¢ నకిలీ పత్తి విత్తనాల కేసులో సమగ్ర వివరాలు సేకరించిన పోలీసులకు ఈ అక్రమ వ్యాపారానికి కోస్గిని అడ్డాగా చేసుకొని నెల్లూర్ జిల్లాకు చెందిన కొండప్ప నాయుడు మూల కేంద్రంగా గుర్తించారు. ¢ కోస్గిలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో గతేడాది ప్రముఖ కంపెనీకి చెందిన విలువైన పురుగుల మందు పేరుతో నకలీ మందు తయారు చేయించి విక్రయిస్తూ పట్టుబడ్డారు. తాజాగా నిషేదిత పురుగుల మందును విక్రయిస్తూ మరోమారు టాస్క్ఫోర్స్ అధికారులకు పట్టుబడ్డారు. కోస్గి: నకిలీ పత్తి విత్తనాలు.. నకిలీ పురుగు మందులు.. నిషేదిత గుట్కాతోపాటు ఏదైన అక్రమ వ్యాపారంలో ఎవరైన పట్టుబడ్డా.. ఆ అక్రమ నేరాలకు మూల కేంద్రం కోస్గిగా బయట పడుతుంది. గతేడాది వికారాబాద్ జిల్లా కొడంగల్ పోలీసులు కర్ణాటక సరిహద్దులో తనిఖీలు చేయగా రూ.లక్షల విలువైన కల్తీ చాయిపత్తితోపాటు గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. పోలీసుల దర్యాప్తులో పట్టుబడిన వాహనం, కల్తీ సరుకు కోస్గి మున్సిపల్ పరిధిలోని సంపల్లి కేంద్రంగా వ్యాపారం జరుపుతున్న ఓ వ్యక్తిగా నిర్ధారించారు. గతంలో పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు దౌల్తాబాద్ మండలంలో పట్టుబడగా నెల్లూరుకు చెందిన సదరు వ్యాపారి కోస్గిలో ఉంటూ తన అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా కొడంగల్ మండలం హస్నాబాద్లో రూ.16.77 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడగా సదరు వ్యాపారి ప్రకాశం జిల్లాకు చెందిన వేణుబాబు కోస్గి మండలం సర్జఖాన్పేటలో నివాసం ఉంటూ తన అక్రమ దందాను కొనసాగించాడు. ఇలా నారాయణపేట జిల్లాతోపాటు పక్కన ఉండే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ మధ్య జరిగిన పలు సంఘటనలు పరిశీలిస్తే అక్రమ దందాలకు కోస్గి పట్టణం కేరాఫ్ అడ్రస్గా మారిందని అధికారులే చర్చించుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రధాన సూత్రదారిపై పీడీ యాక్టు అప్పట్లో అక్రమదందాకు మూల కారణమైన కొండప్ప నాయుడిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నించగా.. అతనిపై అప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసి పరిగి జైలుకు పోలీసులు తరలించినట్లు తెలుసుకున్నారు. దీంతో నాటి ఎస్పీ చేతన పీడీ యాక్టు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కోస్గి పోలీసులు పరిగి సబ్ జైలు నుంచి కొండప్ప నాయుడిని హైద్రాబాద్లోని చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. అయి తే, ఇన్ని కేసులు ఉన్నా కోస్గిలో అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగించడం సంచలనం రేపింది. నాయకులు, అధికారుల అండదండలతోనే.. తాజాగా ఈ నెల 27న కోడంగల్ మండలం హస్నాబాద్లో పెద్ద మొత్తంలో పట్టుబడిన నకిలీ విత్తనాలు కోస్గి మండలం సర్జఖాన్పేటలో గతకొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటూ ప్రకాశం జిల్లాకు చెందిన వేణు బాబు నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. అమాయక రైతులను బురిడీ కొట్టించి అద్దె ఆశ చూపి విత్తనాలు రైతుల ఇంట్లో నిల్వ ఉంచి తమ అక్రమ దందాపై అనుమానం రాకుండా తమ వ్యాపారం కొనసాగించడం నకిలీ విత్తన వ్యాపారుల ప్రధాన ఎత్తుగడగా అధికారుల విచారణలో బయట పడింది. కాగా స్థానికంగా కొందరు రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతోనే ఈ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో నకిలీ చాయిపత్తి, భారీ గుట్కా నిల్వల పట్టివేత తాజాగా పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు అధికారులు దృష్టి సారిస్తే మరెన్నో వెలుగులోకి.. పీడీయాక్టు నమోదు చేస్తాం నకిలీ విత్తనాలను అడ్డుకోవడానికి ప్రతి మండలంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాం. అలాగే, టాస్క్ఫోర్స్ పోలీసులు సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయించినా, అందుకు సహకరించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అయినా వారిలో మార్పు రాకపోతే పీడీయాక్టు నమోదు చేస్తాం. – జాన్సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
No Headline
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ శివారులోని ఎల్లమ్మకుంటకు చెందిన ఫొటోగ్రాఫర్ రాఘవేంద్రచారి (30), వెంకటేష్(29), మహేష్కుమార్(21) వీడియో గ్రాఫర్గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో మక్తల్ మండలంలోని కాచ్వార్ గ్రామంలో ఓ ఇంట్లో శుభకార్యంలో ఫొటోలు తీసేందుకు మంగళవారం ఉదయం వెళ్లారు. తర్వాత కొద్దిసేపు విరామం దొరకడంతో మక్తల్కు వచ్చి.. తిరిగి మధ్యాహ్నం సమయంలో ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై మళ్లీ బయలుదేరారు. ఈ క్రమంలో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామం సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారి–167పై మహబూబ్నగర్ నుంచి రాయచూర్ వెళ్తున్న కర్ణాటక బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేష్, రాఘవేంద్రచారి అక్కడికక్కడే మృతిచెందగా.. మహేష్ కాలు విరిగి తలకు తీవ్రగాయాలు కావడంతో 108లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. -
తనిఖీల కలకలం
మహబూబ్నగర్ క్రైం: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. అసలు కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలియక చాలామంది వాహనదారులు కంగారు పడ్డారు. ఎవరైనా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారా.. అంటూ ఆరాతీశారు. మహబూబ్నగర్లోని ఆర్టీఏ కార్యాలయంలో మంగళవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ అధికారుల బృందం కార్యాలయానికి వచ్చిన క్షణాల వ్యవధిలో ఎంవీఐల డ్రైవర్లు, ప్రైవేట్ అసిస్టెంట్లు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది టెన్షన్ పడుతూ.. ఏం అడుగుతారో.. ఏం ప్రశ్నిస్తారో అని ఆందోళనకు గురయ్యారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఏసీబీ అధికారులు విస్తృతంగా రికార్డులు, రిజిస్టుర్లు, కొన్ని రకాల డాక్యుమెంట్లను పరిశీలించారు. ప్రధానంగా ఎంవీఐలు వాడుతున్న కార్లను నిశితంగా గమనించారు. ఆ సమయంలో సదరు కారు డ్రైవర్లు లేకపోవడం విశేషం. కార్యాలయంలో పనిచేసే ఎంవీఐల దగ్గరి నుంచి కింది సెక్షన్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి వివరాలు సేకరించారు. కాగా.. డీటీసీ శివలింగయ్య, డీటీఓ రఘుకుమార్ సెలవులో ఉన్నారు. సేవలు నిలిపివేత ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన నూతన వాహనాల తనిఖీ, ఇతర కార్యాలయ పనులు నిలిచిపోయాయి. చాలామంది వాహనదారులు మంగళవారం స్లాట్ బుక్ చేసుకుని కార్యాలయానికి వచ్చారు. దీంతో అలాంటి వారి పనులు పూర్తి కాకపోవడంతో అవస్థలు పడ్డారు. భయం గుప్పిట్లో సుమారు 20 ఏళ్ల క్రితం మహబూబ్నగర్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు జరిగితే.. మళ్లీ ఇప్పుడు ఏసీబీ తనిఖీలు చేపట్టారు. ఇన్ని రోజుల పాటు ఆర్టీఏ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు, ఏజెంట్లు దందా నడిపించుకున్నారు. ఒక్కసారిగా తనిఖీల పేరుతో అధికారులు సోదాలు చేయడంతో ఏం జరుగుతుందో అని అధికారులు, ప్రైవేట్ ఏజెంట్స్ ఆందోళనకు గురయ్యారు. కార్యాలయం బయట ఉండి లోపల ఏం జరుగుతుందో అని ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు ఉదయం 11.30 నుంచి రాత్రి 7 గంటల వరకు సోదాలు సెక్షన్స్, అప్లికేషన్స్, రిజిస్లర్ల నిశిత పరిశీలన ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు పట్టుబడినట్లువెల్లడించిన డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఏసీబీ బృందాన్ని చూసి కార్యాలయంనుంచి పరారైన ప్రైవేట్ వ్యక్తులు, ఏజెంట్లు అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ఆర్టీఏ కార్యాలయాల్లో ఇటీవల అవినీతి పెరిగిందనే ఫిర్యాదులతోపాటు కార్యాలయాలకు అధికారులు, సిబ్బంది సక్రమంగా రాకపోవడం, సమయపాలన పాటించడం లేదని వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టామని ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ వెల్లడించారు. కార్యాలయంలో ఉన్న పలు రకాల సెక్షన్స్, అప్లికేషన్స్, డాక్యుమెంట్స్ అన్నింటిని పరిశీలించామని చెప్పారు. ట్రాక్ దగ్గర నిర్వహించే డీఎల్ పరీక్షలో ప్రైవేట్ కారు ఏర్పాటు చేసి ఒక్కొక్కరి దగ్గర రూ.200 వసూలు చేస్తున్నట్లు గుర్తించామని, ఈ వ్యవహారంలో ఇద్దరు ఏజెంట్లు మహ్మద్ అతీక్, లతీఫ్ ఖాన్, డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ వెంకటేష్ వ్యక్తి పట్టుబడ్డారని వారిపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. కార్యాలయంలో అక్రమంగా ఎలాంటి నగదు పట్టుబడలేదని రిజిష్టర్లో ఉన్న ప్రకారం ఫీజుల రూపంలో వచ్చిన నగదు మాత్రం ఉందన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు టీచర్ల సస్పెన్షన్
నారాయణపేట రూరల్: జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని బీవండీకాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఇద్దరు ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనుల విషయంలో నిర్లక్ష్యం వహించడంతో కలెక్టర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ప్రాథమిక పాఠశాలలో 20మంది విద్యార్థులు సైతం లేకున్నా.. ఇద్దరు టీచర్లు ఫర్హిన్బాను, జ్యోతి విధులు నిర్వహించేవారు. వీరు ఇద్దరికి మొదటి నుంచి ఒకరంటే ఒకరికి పడదు. సీనియర్ అయినప్పటికీ ఫర్హిన్బాను హెచ్ఎం బాధ్యతలు తీసుకోకుండా తనకు ఉన్న పలుకుబడితో జూనియర్ అయిన జ్యోతికి ఆ బాధ్యతలు ఇప్పించారు. అటు తర్వాత వర్క్ అడ్జెస్ట్మెంట్లో తక్కువ పిల్లలు ఉన్నారనే కారణం చూయిస్తూ మరికల్కు డిప్యూటేషన్పై వెళ్లింది. కొద్దికాలం తర్వాత హెచ్ఎం జ్యోతి అనారోగ్యంతో మెడికల్ లీవ్ పెట్టినా.. ఫర్హిన్భాను తన సొంత పాఠశాలకు రాకుండా.. డీఈఓ ఫోన్ చేసి చెప్పినా మరికల్లోనే విధులు కొనసాగించింది. అనంతరం సైతం నీవు సీనియర్ అంటే.. నీవే హెచ్ఎం కదా అంటూ పనులు ఒకరిమీద మరొకరు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చారు. గత మూడు నెలలుగా జీతాలు చేసుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. చెక్ పడింది ఇలా.. ఇదిలాఉండగా, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలలకు చెందిన కమిటీ ఏర్పాటు చేయకపోగా అకౌంట్ ఓపెన్ చేయడంలోను నిర్లక్ష్యం వ్యవహరించారు. ఒకరిపై మరొకరు తోచివేసుకుంటూ గ్రాండ్స్ సైతం డ్రా చేయలేకపోయారు. దీనిపై ఎంఈఓ ఫిర్యాదు మేరకు కటెక్టర్ శ్రీహర్ష అనుమతితో డీఈఓ ఎండీ అబ్దుల్ఘని ఇరువురిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. 31న మెగా జాబ్ మేళా పెబ్బేరు రూరల్: హైదరాబాద్ రాణిగంజ్లోని గుజరాతి ఉన్నత పాఠశాలలో ఈ నెల 31న పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకి ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (గ్రీన్ ల్యాండ్స్) సంయుక్తంగా మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గద్దె భాస్కర్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయత్రం 5 వరకు జరిగే జాబ్ మేళాలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఇతర పేరొందిన 25 సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. 10వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదివిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువత సెల్నంబర్ 95424 33427లో సంప్రదించాలన్నారు. -
సివిల్ ఫిర్యాదులు కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి
నారాయణపేట: సివిల్ ఫిర్యాదులను కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ బాధితుల నుంచి స్వయంగా స్వీకరించారు. భూ తగాదాలకు సంబంధించి–5 ఫిర్యాదులు, కుటుంబ గొడవలు–2, డబ్బులకు సంబంధించి ఒక ఫిర్యాదు రాగా వాటిని చట్టప్రకారం పరిశీలించవలసిందిగా సీఐ , ఎస్ఐలకు సూచించారు. భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు. అలాగే, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయంలో డయల్ 100 లేదా 1930 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. కళలకు నిలయం బాలకేంద్రం నారాయణపేట రూరల్: అంతరించిపోతున్న భారతీయ కళలకు పునర్జీవాన్ని బాలకేంద్రం పోస్తుందని లయన్స్క్లబ్ డిస్టిక్ కో ఆర్డినేటర్ ఆత్మారాం అన్నారు. పట్టణంలోని బాలకేంద్రంలో జరుగుతున్న శిక్షణ తరగతులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. వేసవిలో చిన్నారులు గాత్రం, నృత్యం, తబల, చిత్రలేఖనం తదితర అంశాలపై తర్ఫీదు పొందడానికి చక్కటి అవసకాశముందన్నారు. పిల్లల కోసం బాలకేంద్రం సమయంలో సైతం మార్పులు చేసి మరింత సేవలను అందిస్తుందన్నారు. సాయంత్రం వేళల్లో 5 నుంచి 7గంటల వరకు పాల్గొనవచ్చన్నారు. 41రోజులపాటు జరిగే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పరిక్షప్యాడ్లు, స్నాక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి, నర్సింహులు, వసంత్, రామకృష్ణ, శకుంతల తదితరులు పాల్గొన్నారు. పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్నగర్ క్రీడలు: కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారి నుంచి పద్మ పురస్కారాల కోసం దరఖాస్తులను (నామినేషన్లు) ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యు వజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ సోమ వారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ట్, సోషల్ వర్క్, సైన్స్ ఇంజనీరింగ్, టేడ్, ఇండస్ట్రీస్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, మెడిసిన్, సివిల్ సర్వీసెస్ తదితర అంశాల్లో సాధించిన లక్ష్యాలు, చేసిన కృషిని రెండు పేజీలకు 800 పదాలకు మించకుండా పేర్కొంటూ నిర్ణీత ఫార్మాట్లో వచ్చేనెల 3వ తేదీలోగా జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియం జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో హార్డ్కాపీ, సాఫ్ట్కాపీలను ఇవ్వాలని కోరారు. మిగతా వివరాల కోసం https://padmaawards. gov.in వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం చిన్నచింతకుంట: బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని నారాయణపేట పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుందర్రావు తెలిపారు. సోమవారం మండలంలోని రెడ్డి బీడీ, వస్తాద్ బీడీ ఫ్యాక్టరీలను సందర్శించి కార్మికుల సమస్యలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికుల పీఎఫ్ సమస్యలు ఎన్నో ఉన్నాయన్నారు. అవి ఇప్పుడే మా దృష్టికి వచ్చాయని తెలిపారు. త్వరలోనే నిధి ఆప్కే నికట్లో పీఎఫ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు నరేష్, సాయులు, బీడీ కార్మిక సంఘం నాయకులు కోళ్ల వెంకటన్న, దేవదానం, అరుణ్కుమార్, చంద్రన్న పలువురు ఉన్నారు. -
No Headline
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ఆ గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన మైనింగ్ అనుమతులు.. కాలుష్య కారక పరిశ్రమ ఏర్పాటు ఆ పల్లెల్లోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తమ సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలిపినా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటింగ్కు ఆ రెండు గ్రామాల ఓటర్లందరూ దూరంగా ఉండడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయినా పాలక యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో న్యాయ పోరాటం కొనసాగుతుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పాల్గొనేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. అంతేకాదు వివిధ ప్రజా సంఘాలు, మేధావి వర్గాల మద్దతు కూడగట్టి.. ఉద్యమం ఉధృతం చేసేలా పోరుబాట కార్యాచరణకు సన్నాహాలు చేస్తున్నారు. ‘ఉమామహేశ్వర’ పరిస్థితి ఏమిటో.. మరోవైపు రూ.4,500 కోట్లతో తలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్ను ఈ గుట్టను ఆనుకుని నిర్మించాలని నిర్ణయించారు. ఇలాంటి చోట మైనింగ్ చేపడితే రిజర్వాయర్ నిర్మాణాలకు నష్టం వాటిల్లదా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గుట్టకు ఆనుకునే గ్రామం ఉన్నా.. ఎన్ఓసీ తదితర అనుమతులు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం కాదా? అని మైలారం వాసులు ప్రశ్నిస్తున్నారు. బల్మూర్, మైలారం, కొండనాగుల, వీరంరాజ్పల్లి, రామాజిపల్లి గ్రామాల ప్రజలకు గుట్ట ఆదెరువుగా ఉందని.. గ్రామ చెరువులో మత్స్యసంపదపై ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుట్టపై తవ్వకాలు జరగనివ్వమని గ్రామస్తులు భీష్మించుకు కూర్చున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కలెక్టర్తో పాటు, స్థానిక అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను సైతం కలిసి మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని కోరారు. ఫలితం లేకపోవడంతో గుట్ట ముద్దు.. ఓటు వద్దు అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు. గుట్టపై మైనింగ్ అనుమతులు రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగుతుందని.. ఇదే పరిస్థితి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలనూ బహిష్కరిస్తామని.. మైలారం గ్రామ పరిరక్షణ సమితి ఆధ్వరంలో రోజువారీగా పోరు కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకున్నట్లు గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఎదిర: బ్యాటరీ పరిశ్రమ వద్దే వద్దు.. మహబూబ్నగర్ శివారులోని దివిటిపల్లి వద్ద గత ప్రభుత్వం ఐటీ కారిడార్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్దాయిపల్లి గ్రామాల్లోని రైతుల నుంచి దాదాపు 380 ఎకరాల భూసేకరణ చేపట్టింది. ఇందులో అత్యధికంగా ఎదిర గ్రామ రైతులే ఉన్నారు. ఐటీ పరిశ్రమలు వస్తే తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని భావించిన రైతులు తమ భూములు అప్పగించారు. తీరా పాలకులు అమరరాజ బ్యాటరీ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టారు. ఆ పరిశ్రమకు దాదాపు 260 ఎకరాల స్థలం కేటాయించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరగగా.. ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఆ తర్వాత క్రమంలో సదరు కంపెనీ భవన నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో ఎదిర గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. కాలుష్యం వెదజల్లే ఈ పరిశ్రమతో తమ పంట పొలాలు నాశనం అవుతాయని, అనారోగ్యం బారిన పడతామంటూ సుమారు 70 రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టారు. ‘అధికార’ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఇటీవల పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన వారు.. ఈ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని.. లేకుంటే భవిష్యత్లో జరిగే ఏ ఎన్నికల్లోనూ ఓటు వేసేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో ఉన్న వారు వరుస ఆందోళనలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మైలారం: గుట్ట ముద్దు.. మైనింగ్ వద్దు నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామానికి ఆనుకుని గుట్ట ఉంది. ఈ గ్రామం మొత్తం ఆ గుట్టను అనుసరించే ఉంది. ఈ ఊరిలో 300 వరకు కుటుంబాలు ఉండగా.. 1,500 వరకు జనాభా ఉన్నట్లు అంచనా. గుట్టపైనే 50కి పైగా నివాస గృహాలతో పాటు నర్సింహస్వామి, వెంకటేశ్వర స్వామి, శివాలయం, మారెమ్మ, పోచమ్మ, ఈదమ్మ ఆలయాలు ఉన్నాయి. నల్లమల అడవీ ప్రాంతానికి సమీపంలో ఈ గ్రామం ఉండడంతో గుట్టపై నెమళ్లతో పాటు ఇతర వన్యప్రాణులు సంచరిస్తూ ఉన్నాయి. ఈ గుట్టపై విలువైన క్వార్ట్జ్, పాల్స్పర్ రాళ్లు ఉండగా.. మైనింగ్ వ్యాపారులు, ఇతర పెద్దలు ఆరేళ్ల క్రితం కన్నేశారు. గుట్టపై సర్వే నంబర్ 120/1లో 98 ఎకరాలకు ఖనిజ తవ్వకాలకు మైనింగ్ శాఖ 2017లో అనుమతి ఇచ్చింది. 2022 వరకు స్తబ్దుగా ఉన్న కాంట్రాక్టర్ తవ్వకాల క్రమంలో గతేడాది సర్వే చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో తవ్వకాలు నిలిపివేశారు. ఆ తర్వాత ఆర్టీఐ ద్వారా గ్రామసభ తీర్మానం కాపీ వెలుగుచూడగా.. పలువురి సంతకాలను ఫోర్జరీ చేసినట్లు.. 2041 అక్టోబర్ పదోతేదీ వరకు తవ్వకాలు చేసుకునేందుకు మైనింగ్శాఖ అనుమతులు ఇచ్చినట్లు తేలడంతో గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. -
విత్తనాలకు పడిగాపులు
జీలుగ విత్తనాల కొరతతో రైతుల ఇబ్బందులు మరికల్: జీలుగ విత్తనాల కొరతతో రైతులు బ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల చిరుజల్లులు కురుస్తుండడంతో పంటల సాగు నిమిత్తం రైతులు పొలాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. అయితే, వరి నేలను సారవంతం చేసేందుకు పంటకు ముందే జీలుగ (పచ్చరొట్టె ఎరువు) విత్తనాలు వేస్తారు. మండలానికి వంద బస్తాల చొప్పున పంపిణీ జరిగితే క్షణాలో ఖాళీ అవుతున్నాయి. ఈ విత్తనాలతో భూసారాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం ఉండటంతో పంట సాగు చేసే ప్రతి రైతు జీలుగ విత్తనాలను ఆశిస్తుండగా ప్రభుత్వం మాత్రం అరకొరగా సరఫరా చేస్తుంది. దీంతో ఇవి అఘమేఘాల మీద అమ్ముడుపోతున్నాయి. జిల్లాలో వానాకాలం సీజన్లో సాధారణ సాగు 4,12,791 ఎకరలు ఉంటుంది. తక్కువ సారావంతమైన భూముల్లో జీలుగ (పచ్చిరొట్టె ఎరువు) వేస్తే సారం పెరిగి దిగుబడులు అధికంగా వచ్చే అవకాశం ఉంది. నేల స్వభావాన్ని బట్టి జీలుగను సాగు చేసుకుంటే తర్వాత వేసే పంటలకు అనుకూలంగా ఉంటుంది. పచ్చిరొట్టె ఎరువుల కోసం నిర్ధేశించిన మొక్కలను పొలంలో కలియుదున్నితే అవి కుళ్లి మొక్కలకు సారవంతమైన పోషకాల్ని అందిస్తాయి. అవసరం ఎక్కువ సరఫరా తక్కువ.. జిల్లాలో వానాకాలంలో వరి సాగు చేసే రైతుల అవసరాలకు 1700 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను వ్యవసాయ శాఖ జిల్లాకు కేటాయించగా, ఇప్పటి వరకు 550 క్వింటాళ్ల సరఫరా జరిగింది. తొలి విడతలో కొన్ని మండలాలకు 50 బస్తాల చొప్పున మరికొన్ని మండలాలకు వంద బస్తాల చొప్పున వచ్చాయి. మండలాలకు వంద బస్తాల చొప్పున కేటాయించగా అరగంటలోనే స్టాక్ అయిపోతుంది. కోయిల్సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారు వీరు సారం కోసం జీలుగ విత్తనాలు వేస్తారు. ప్రస్తుతం రెండున్నర ఎకరాలకు ఒక బస్తా మాత్రమే అందజేస్తుండటంపై ఆయకట్టు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సరిపడే జీలుగ విత్తనాలను అందజేయాలని ఆయకట్టు రైతులు అధికారులను కొరుతున్నారు. వారం రోజుల నుంచి తిరుగుతున్నా జీలుగ కోసం వారం రోజుల నుంచి మరికల్కు వస్తున్నాను. అధికారులను అడిగిన ప్రతిసారి రెండు రోజుల్లో వస్తాయి అంటున్నారు. కానీ రావడం లేదు. వరి సాగు చేసే 40 రోజుల వ్యవధిలో జీలుగ మొక్కలు పెరగాలి. కాబట్టి రైతుల కాల వ్యవధిన్ని దృష్టిలో ఉంచుకొని సరిపడే జీలుగ విత్తనాలను సరఫరా చేస్తే పొల్లాలో వేసే అవకాశం ఉంది. లేదంటే సమయం అయిపొయిన తర్వాత వేసిన ఫలితం ఉండదు. – సురేష్, రైతు, కన్మనూర్ అరగంటలో అయిపోతున్నాయి మండలానికి 200 బస్తాల జీలుగ విత్తనాలు వస్తే అరగంటలో అయిపోవడంతో మళ్లీ వాటి కోసం సింగిల్విండో, ఆగ్రో రైతు సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నాం. వరి సాగు ఎకరాలను దృష్టిలో ఉంచుకొన్ని కొరత లేకుండా జీలుగను పంపిణీ చేయాలి. – భాస్కర్రెడ్డి, రైతు, మరికల్ జీలుగ స్థానంలో పెసర జీలుగ విత్తనాల కొరత ఉండటం వల్ల ఆ స్థానంలో పెసరను కూడా వేస్తే అదే స్థాయిలో భూసారం పెరిగే అవకాశం ఉంది. పెసర సాగు చేయడం వల్ల రెండు విధాల లాభం ఉంది. ఒక్కటి సారం రెండవది కాపు కూడా వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో క్వింటాల్ పెసర రూ. 10 వేలకు పైగానే డిమాండ్ ఉంది. అందుకే జీలుగ స్థానంలో పెసరను కూడా సాగు చేసుకోవచ్చాని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. జిల్లాకు 1,700 క్వింటాళ్లు అవసరం నేటికీ అందింది 550 క్వింటాళ్లు మాత్రమే.. మధ్యప్రదేశ్, ఢిల్లీ నుంచి దిగుమతి ఎన్నికల నేపథ్యంలో ఆలస్యం వచ్చిన కొద్దిపాటి విత్తనాలు నిమిషాల్లో ఖాళీ రైతులు ఆందోళన చెందవద్దు ఇతర రాష్ట్రాల నుంచి జీలుగ విత్తనాలు రావాల్సింది. ఎన్నికల కోడ్ కారణంగా దిగుమతి ఆలస్యమవుతుంది. ప్రస్తుతానికి మండలానికి వంద భస్తాల చొప్పున పంపిణి చేయడం జరిగింది. మరో రెండు రోజుల్లో జీలుగను దిగుమతి చేసుకొని రైతులకు అందజేస్తాం. వరి సాగుకు సమయం ఉంది. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. – జాన్సుధాకార్, జిల్లా వ్యవసాయఽ శాఖ అధికారి -
అమరరాజా కంపెనీని ఆపేయాల్సిందే
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: దివిటిపల్లిలోని ఐటీ టవర్లో ఏర్పాటు చేస్తున్న అమరరాజా బ్యాటరీ కంపెనీ (లిథియం అయాన్ గిగా) ని ఆపేయాల్సిందే. కాలుష్యం వెదజల్లే ఈ ఫ్యాక్టరీ వల్ల పరిసర గ్రామాలైన ఎదిర, దివిటిపల్లి, అంబట్పల్లి, సిద్దాయపల్లి వాసులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ కంపెనీని వేరే ప్రాంతానికి తరలించే వరకు మా పోరాటం ఆగదు. ఇందులో భాగంగా ఈనెల 13న ఎంపీ ఎన్నికల పోలింగ్ను బహిష్కరించాం. ఈ విషయమై 72 రోజులుగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోక పోవడం తగదు. అవసరమైతే ర్యాలీగా బయలుదేరి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, కలెక్టరేట్ను ముట్టడిస్తాం. చివరగా హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి మా బాధలను విన్నవించేందుకు పాదయాత్ర చేపడతాం. – శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శి, అమరరాజా బ్యాటరీ వ్యతిరేక పోరాట కమిటీ, ఎదిర -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
కృష్ణా: రైతులకు నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ హెచ్చరించారు. సోమవారం మండలంలోని చేగుంట, కృష్ణ, టైరోడ్డులోని ఎరువుల దుకాణాలను ఏఓ సుదర్శన్గౌడ్ ఆధ్వర్యంలో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలోని స్టాక్ రికార్డులు, బిల్ బుక్లను పరిశీలించారు. అనంతరం దుకాణదారులకు పలు సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని, అదేవిధంగా దుకాణం యొక్క పేరు, డోర్ నెంబర్, సీడ్ లైసెన్స్, ధరల పట్టికలు కొనుగోలుదారులకు కనిపించే విధంగా ఉండాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ చేయకూడదని, నిషేధిత బీటీ 3 విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే వ్యవసాయ అధికారులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో ఎరువు దుకాణాల యజమానులు, ఏఈఓలు ఉన్నారు. -
పోరు కార్యాచరణ రూపొందిస్తున్నాం..
మైలారం గుట్టపై మైనింగ్ అనుమతులను వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. పార్లమెంట్ ఎన్నికలకూ దూరంగా ఉన్నాం. ఇక ఆందోళనలు ఉధృతం చేస్తాం. రోజువారీగా పోరు బాట పట్టేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాం. ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్ క్యాంప్ కార్యాలయాలను ముట్టడించడంతో పాటు ప్రతి రోజు ఏదో ఒక రూపంలో నిరసన తెలిపేలా ముందుకు సాగుతున్నాం. మా సమస్యను పరిష్కరించే వరకూ ఊరుకునేది లేదు. – సుంకరి రాములుగౌడ్, మైలారం, నాగర్కర్నూల్ -
No Headline
● గుట్టపై మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని ఒకరు.. ● కాలుష్య కారక బ్యాటరీ పరిశ్రమ వద్దని మరొకరు.. ● ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల బహిష్కరణ ● పట్టించుకోని ‘అధికార’ యంత్రాంగంపై ఆగ్రహం ● స్థానిక సంస్థల ఎన్నికలనూ బహిష్కరించాలని యోచన ● నిరసనలతో పాటు వరుస ఆందోళనలకు కార్యాచరణ -
నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
నారాయణపేట: నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. సోమవారం జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి ఎస్పీ కార్యాలయంలో శిక్షణలో ఎస్పీ మాట్లాడారు. జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు – 2023 అమల్లోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు. అలా అయితేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేశారన్నారు. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు. ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత వంటి అంశాలతో శాంతిభద్రతల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తోందన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నూతన అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇంత కాలం పాటిస్తున్న పాత విధానాలలో నూతన చట్టాలకు విరుద్ధమైన వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ పాటించకూడదని, నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయాల్సి ఉంటుందని అన్నారు. జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర పోలీస్ అకాడమీలో నూతన చట్టాలపై శిక్షణ పొందిన అధికారులతో బ్యాచ్ల వారీగా నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో డీఎస్పీ లు ఎన్ లింగయ్య, మహేష్, సిఐ లు శివ శంకర్, రాజేందర్ రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, భాగ్య లకి్ష్మ్రెడ్డి, మురళీ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఈదురుగాలులతో నేలకొరిగిన చెట్లు
నారాయణపేట రూరల్/కోస్గి/ధన్వాడ/దామరగిద్ద: ఉరుములు.. మెరుపులతో కూడిన ఈదురుగాలులకు జిల్లాలోని చాలాచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపోగా.. చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో పలు చోట్ల చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి కొన్నిచోట్ల వాహనాలపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. యాద్గీర్రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయ ఆవరణలోని దుకాణాల రేకుల పైకప్పు గాలికి ఎగిరిపోయింది. సెలవురోజు కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వాననీటితో పలు కాలనీలు చిత్తడిగా మారిపోయాయి. ● కోస్గిలో పలు చోట్ల ప్రధాన రహదారులపై చెట్లు నేలకూలగా హన్మాన్పల్లి, మీర్జాపూర్, కడంపల్లి, బిజ్జారం, నాగుసాన్పల్లితోపాటు పలు చోట్ల మామిడి కాయలు నేలరాలాయి. కోస్గి–తుంకిమెట్ల, కోస్గి–నారాయణపేట, కోస్గి–దౌల్తాబాద్ ప్రధాన రోడ్డు వెంట పలు చోట్ల చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలిపోయాయి. పట్టణంలోని రామాలయం చౌరస్తాలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ విద్యుత్ స్తంభం కూలి విద్యుత్ వైర్లపై పడింది. జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పట్టణ శివారులో నారాయణపేట రోడ్డులో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో మండలంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీయడంతో ఆదివారం జరిగే కోస్గి వారంతపు సంతలో తాత్కాలిక షెడ్లు కొట్టుకుపోయి చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ● ధన్వాడ మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం నెలకొంది. రోడ్డుపై చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. ● దామరగిద్ద మండలంలో పలు చోట్ల చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. ఉడ్మల్గిద్ద గ్రామ శివారులో వేప చెట్టుపై పిడుగుపడడంతో చెట్టు కాండం భాగం రెండుగా చీలింది. దీంతో సమీపంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement