-
Lok Sabha Election 2024: ఒడిశాలో రసవత్తర పోటీ
బీజేపీ, అధికార బీజేడీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోరు సాగుతున్న ఒడిశాలో ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుతోంది. 15 లోక్సభ, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇప్పటికే ముగిసింది. చివరి దశలో భాగంగా మిగతా 6 లోక్సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది. వీటిలో 4 బీజేడీ, 2 బీజేపీ సిట్టింగ్ స్థానాలు. వాటిపై ఫోకస్...జగత్సింగ్పూర్ ఇక్కడ రెండు దశాబ్దాలుగా బీజేడీ చక్రం తిప్పుతోంది. బీజేపీ ఖాతా తెరవలేదు. 2019లో భారీ మెజారిటీతో నెగ్గిన రాజశ్రీ మల్లిక్ బీజేడీ నుంచి, ఆయన చేతిలో ఓడిన బిబూ ప్రసాద్ తరాయ్ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. తరాయ్ 2009లో ïసీపీఐ నుంచి, 2014లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు. ఆయన ఓటు బ్యాంకును చూసి బీజేపీ మరోసారి చాన్సిచి్చనట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి రవీంద్ర కుమార్ సేథీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేడీలోకి చేరడం ఆ పారీ్టకి అనుకూలించే అంశం.కేంద్రపర ఇదీ బీజేడీ కంచుకోటే. ఈసారి మాత్రం బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. 2009, 2014ల్లో బీజేడీ నుంచి గెలిచిన బైజయంత్ పాండా గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి బీజేడీ నేత, సినీ నటుడు అనుభవ్ మహంతి చేతిలో ఓటమి చవిచూశారు. ఒకప్పుడు సీఎం నవీన్ పట్నాయక్కు అత్యంత సన్నిహితుడైన బైజయంత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుని హోదాలో మరోసారి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ అనుభవ్ మహంతి కూడా బీజేపీలో చేరడంతో బీజేడీ సంకట స్థితిలో పడింది. అన్షుమన్ మహంతిని పోటీకి దింపింది. మయూర్భంజ్ సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్థానంలో ఎమ్మెల్యే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సన్నిహితుడు నాబా చరణ్ మఝికి ఈసారి బీజేపీ టికెటిచ్చింది. ద్రౌపది ముర్ము 2009లో ఈ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన విద్యా శాఖ మంత్రి సుదమ్ మరాండీని బీజేడీ బరిలో దింపింది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజని సోరెన్ జేఎంఎం తరఫున పోటీలో ఉండటంతో త్రిముఖ పోటీ నెలకొంది.భద్రక్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ భద్రక్ లోక్సభ స్థానం పరిధిలోని చాంద్బలి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. దాంతో భద్రక్లో గెలుపు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ చరణ్ సేథీ కుమారుడు అవిమన్యు సేథీ పోటీ చేస్తున్నారు. బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ మంజులతా మండల్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ అనంత ప్రసాద్ సేథీ బరిలో ఉన్నారు.జజ్పూర్ బీజేడీ నుంచి సిట్టింగ్ ఎంపీ శరి్మష్ఠ సేథీ మళ్లీ బరిలో ఉన్నారు. రవీంద్ర నారాయణ బెహరాకు బీజేపీ టికెటిచి్చంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ ఆంచల్ దాస్ పోటీ చేస్తున్నారు. ఆయన 1996లో ఇక్కడ జనతాదళ్ నుంచి గెలిచారు. గత ఐదేళ్లలో బీజేపీ ఓటు బ్యాంక్ బాగా పెరిగిందన్న ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే పార్టీ అభ్యర్థి బెహరా స్థానికులకు పరిచయస్తుడే అయినా రాజకీయాలకు కొత్త.బాలాసోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మాజీ బీజేపీ నేత లేఖశ్రీ సమంత సింగార్ పోటీ చేస్తున్నారు. పార్టీని అస్తమానం విమర్శించే లేఖశ్రీకి టికెటివ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. నిజానికి కందమాల్ నుంచి బీజేపీ తరఫున పోటీకి లేఖశ్రీ ఆసక్తి చూపారు. నీలగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్టానం సూచించడంతో బీజేడీలో చేరారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి శ్రీకాంత్ కుమార్ జెనా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన కరబేల స్వైన్ స్వతంత్ర అభ్యర్థిగా రెండు పారీ్టలకూ సవాలు విసురుతున్నారు.బరిలో కోటీశ్వరులు ఒడిశాలో తుది విడత బరిలో ఉన్న 66 మంది అభ్యర్థుల్లో 20 మంది కోటీశ్వరులే. కేంద్రపర బీజేపీ అభ్యర్థి బైజయంత్ పాండాకు అత్యధికంగా రూ.148 కోట్లున్నాయి. తర్వాత స్వతంత్ర అభ్యర్థి శ్రీరామ్ పాండే రూ.18.23 కోట్లు, భద్రక్ బీజేపీ ఎంపీ మంజులత మండల్కు రూ.14.86 కోట్ల ఆస్తులున్నాయి. 15 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 10 మంది తీవ్ర కేసుల్లో నిందితులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) పేర్కొంది. -
ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ నిర్దోషి
భువనేశ్వర్: ఈవీఎం పగలుగొట్టిన కేసులో చిలికా ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ నిర్దోషి అని భువనేశ్వర్ బీజేపీ ఎంపీ అపరాజిత షడంగి అన్నారు. ఈ మేరకు మూడో విడత ఓటింగ్ సందర్భంగా బెగుణియా శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బొలొగొడొ మండలం పోలింగ్స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో మంగళవారం పోస్ట్ చేశారు. తన ఫేస్బుక్ ఖాతాలో వీడియోను ప్రసారం చేసిన అపరాజిత షడంగి నిజం ఎప్పుడూ దాచబడదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ ఈవీఎం పగలగొట్టలేదని వీడియోలో రుజువైందని పేర్కొన్నారు. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత షడంగి -
పోలింగ్స్టేషన్ వీడియోపై విచారణకు ఆదేశం
భువనేశ్వర్: ఖుర్దా జిల్లా బెగుణియా అసెంబ్లీ సెగ్మెంట్లోని ఎమ్మెల్యే ప్రశాంత జగదేవ్ పోలింగ్స్టేషన్్ సందర్శన ఉద్దేశించిన వీడియో ప్రసారం కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ జరపాలని ఖుర్దా జిల్లా ఎన్నికల అధికారికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మంగళవారం ఆదేశించారు. బెగుణియా అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్స్టేషన్కు సంబంధించిన వీడియో కొన్ని ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో చక్కర్లు కొడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనికి సంబంధించి పోలింగ్ రోజు దాదాపు 60 శాతం పోలింగ్స్టేషన్లలో ప్రత్యక్ష వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారుల కంట్రోల్ రూమ్లలో వెబ్కాస్టింగ్ ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. డీఈవో వెబ్కాస్టింగ్ రికార్డుల సంరక్షకుడు. ఈ నేపథ్యంలో వెంటనే విచారణ జరిపి స్పష్టత తెలియజేయాలని డీఈవో ఖుర్దాను ఆదేశించారు. -
రథాలకు 3 టన్నుల పట్టువస్త్రాలు
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రథయాత్ర సన్నాహాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. రథాల తయారీ అంచెలంచెలుగా ముందుకు సాగుతోంది. తయారీ పనులు నిర్విరామంగా కొనసాగుతుండగా, రథాల అలంకరణ కోసం అవసరమైన పట్టు వస్త్రాలు రథాల తయారీ ప్రాంగణానికి చేరాయి. మూడు రథాల అలంకరణ కోసం 3 టన్నలు పట్టు వస్త్రాలు చేరినట్లు శ్రీజగన్నాథ ఆలయ పాలక వర్గం (ఎస్జేటీఏ) తెలిపింది. ముందస్తు ఆర్డరు మేరకు ఈ వస్త్రాలు సరఫరా అయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వ్యాపారులు సరఫరా చేసిన పట్టువస్త్రాల నాణ్యతను రథం పనుల్లో నిమగ్నమైన ఆలయ సేవకులు నిర్ధారిస్తారు. ఒక్కో రథానికి ఒక్కో రకం రంగుల వస్త్రాల్ని వినియోగించడం ఆచారం. ఆచారం ప్రకారం పట్టు వస్త్రాలు విభిన్న రంగుల్లో సరఫరా అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది జూలై 8న పూరీలో రథయాత్ర జరగనుంది. విజిలెన్స్ వలలో పీఈవోజయపురం: కొరాపుట్ విజిలెన్స్ డివిజన్ జయపురం అధికారుల వలలో కలహండి జిల్లా తునమూల్ రాంపూర్ సమితి కనిగుమ్మ పంచాయతీ కార్యనిర్వాహక అధికారి(పీఈవో) సన్యాసి నాయిక్ చిక్కారు. రూ.10 వేల లంచం తీసుకుంటూ సోమవారం విజిలెన్స్ అధికారులకు పట్టుబడినట్లు స్థానిక విజిలెన్స్ వర్గాలు వెల్లడించారు. మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ రోజ్గార్ యోజన పథకంలో(మనోరెగ) ఒక చెక్డ్యామ్ పని జరిగింది. అందులో పనిచేసిన కార్మికులకు పేమెంట్ చేసేందుకు పీఈవో నాయక్ లంచం అడిగాడు. దీంతో కార్మికులు ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు తెలియజేశారు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సలహా ప్రకారం సోమవారం లంచం డబ్బు ఇస్తామని కార్మికులు పీఈవోకు తెలిపారు. ముందుగా పన్నిన వ్యూహం మేరకు విజిలెన్స్ సిబ్బంది మాటు వేశారు. పీఈవో నాయిక్ కార్మికులు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో విజిలెన్స్ సిబ్బంది దాడి జరిపి పట్టుకున్నారు. నిందితుడు నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భవాణీపట్నలోని అతని ఇంటిపై, లంజిగుడలో మరో ఇంటిపై, అతడి ఆఫీసుపై దాడులు నిర్వహించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిసింది. దోపిడీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్టు రాయగడ: ఒక దోపిడీ కేసుకు సంబంధించి శశిఖాల్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు మంగళవారం తరలించారు. అరైస్టెనవారిలో నారాయణ నాయక్, సహీద్ సమీర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శశిఖాల్ ఐఐసీ మున్ని ఆచార్య తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 14వ తేదీన గోలక్ నాయక్ అనే వ్యక్తి పార్వతీపురం నుంచి రాయగడవైపు లారీని డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. అర్థరాత్రి కావడంతో ఎవరూ లేని సమయాన్ని చూసుకున్న దుండగులు శశిఖాల్ గ్రామానికి సమీపంలో లారీపై రాళ్లతో దాడిచేసి అద్దాలను విరగ్గొట్టారు. అనంతరం లారీలోని నాయక్ వద్ద ఉన్నటువంటి కొంత మొత్తం డబ్బులు, ఇతర సామగ్రీని దోచుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈనెల 25వ తేదిన శశిఖాల్ పోలీసుస్టేషన్లో నాయక్ తనపై జరిగిన దోపిడి గురించి ఫిర్యాదు చేశారు. ఎస్డీపీవో రస్మీరంజన్ సేనాపతి, ఐఐసీ మున్ని ఆచార్యల నేతృతంలో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు, నిందితులను అరెస్టు చేశారు. 15 అడుగుల నాగుపాము పట్టివేత మల్కన్గిరి: జిల్లాలోని మల్కన్గిరి సమితి ఎంవీ 23 గ్రామం వద్దనున్న ఒక క్రసర్లో 15 అడుగుల నాగుపాము మంగళవారం కలకలం రేపింది. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్కు సమాచారం ఇవ్వడంతో అతను అతికష్టం మీద పట్టుకున్నారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారులు వచ్చి పామును స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షలు చేయించి అనంతరం అడవిలో విడిచిపెడతామని తెలిపారు. -
No Headline
స్థానిక మూడో వార్డు కాపువీధిలో గ్రామ దేవత నీలమ్మ తల్లి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున ముర్రాటలు పట్టుకొని కాలేజీ రోడ్డులో ఉన్న గ్రామదేవత నీలమ్మ గుడికి వెళ్లి చల్లదనం చేశారు. మొత్తం మూడు రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సేరివీధిలో కూడా ఆదివారం నుంచి అమ్మవారి సంబరాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 14వ వార్డు రాయిచెట్టు జంక్షన్ వద్ద ఉన్న జడ్డెమ్మ మందిరంలో వార్షిక ఉత్సవాలు ప్రారంభించారు. – పర్లాకిమిడి -
జలపాతంలో పడి యువకుడు మృతి
కొరాపుట్: జలపాతంలో పడి యువకుడు మృతి చెందిన విషాదకర ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నబరంగ్పూర్ జిల్లా తెంతులకుంటి సమితి ముండాగుడ గ్రామ సమీపంలోని డకరడొర జలపాతంలో సమీప గ్రామం కండ్రగుడ గ్రామానికి చెందిన గమ్యూనల్ సునా (22) అనే యువకుడు గల్లంతయ్యాడు. స్నానానికి వెళ్లి కాలుజారి లోయలో పడిపోయాడు. గ్రామస్తుల సమాచారంతో తెంతులకుంటి పోలీస్స్టేషన్ ఐఐసీ గోపాలకృష్ణ పాత్రో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. అనంతరం అగ్నిమాపక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశాయి. ఈస్ట్కోస్ట్ జనరల్ మేనేజర్గా పరమేశ్వర్ భువనేశ్వర్: ఈస్ట్ కోస్ట్ రైల్వే నూతన జనరల్ మేనేజర్గా పరమేశ్వర్ ఫుంక్వాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అతను ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఐఆర్ఎస్ఈ) 1988 బ్యాచ్ అభ్యర్థి. రైల్వే సేవా రంగంలో దశాబ్ధాల విశేష అనుభవంతో రాజ్కోట్ మండల రైల్వే అధికారి (డీఆర్ఎం), అహ్మదాబాద్ అదనపు మండల రైల్వే అధికారి (ఏడీఆర్ఎం), రైల్వే రిక్రూట్మెంటు బోర్డు (ఆర్ఆర్బీ) చైర్మన్ మరియు ఆర్డీఎస్వో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి అనేక ముఖ్యమైన హోదాల్లో కీలకమైన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. ఇంతకుముందు ఆయన ముంబైలోని పశ్చిమ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్గా పని చేశారు. ఆర్డీఎస్వోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవీకాలంలో వేగాన్ని పెంచడానికి ట్రాక్ మరియు వంతెనల రంగాలలో వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. రైల్వే ఇంజనీరింగ్తో పాటు మానవ వనరుల విధులు, పరిశోధన – డిజైన్లు, సాధారణ పరిపాలనలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. పలు అంతర్జాతీయ పత్రికల్లో ట్రాక్, బ్రిడ్జ్, పర్యావరణ ఇంజనీరింగ్పై అనేక పరిశోధన పత్రాలను ప్రచురించారు. బీజింగ్ (చైనా), కాల్గరీ (కెనడా), న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ హెవీ హాల్ అసోసియేషన్ (ఐహెచ్హెచ్ఏ) సమావేశాల్లో పరిశోధన పత్రాలను సమర్పించారు. స్వీడన్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా, కెనడా, మలేషియా, సింగపూర్, ఇటలీ ప్రాంతాల్లో వివిధ శిక్షణ మరియు అధ్యయన కార్యకలాపాల కోసం సందర్శించారు. ఫుంక్వాల్కు సాహిత్యంపై అమితమైన ఆసక్తి ఉంది. అతని కొన్ని కవితలు సమకాలీన హిందీ సాహిత్య పత్రికల్లో ప్రచురితం కావడం విశేషం. -
స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్లను కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్ మంగళవారం సందర్శించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. చర్చల్లో ఎస్పీ అభినవ సోన్కర్, జయపురం సబ్ కలెక్టర్ ప్రభాత్ కుమార్ పరిడ, కొరాపుట్ అదనపు జిల్లా కలెక్టర్ అలోమణి సెట్టి, జయపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి తపశ్విణీ కొహూర్, జయపురం మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి సిద్దార్థ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు రోజున అధికారులు, జర్నలిస్టులను వర్సిటీ ప్రధాన గేటులో నుంచి కాకుండా దసరా పొడియ మీదుగా అనుమతిస్తారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ సామగ్రిని అనుమతించరు. జర్నలిస్టులు వీడియో రికార్డింగ్ మొబైల్లో కాకుండా డిజిటల్ కెమేరాలలో మాత్రమే చేయాలి. ● రెండు నియోజకవర్గాల లెక్కింపు విక్రమదేవ్ వర్సిటీలో జయపురం, కోట్పాడ్ శాసనసభ నియోజకవర్గాల ఓట్లు లెక్కిస్తారు. అలాగే ఆ రెండు సిగ్మెంట్లలో ఎంపీ నియోజకవర్గాల ఓట్లు కూడా లెక్కిస్తారు. మొత్తం 25 రౌండ్లు చొప్పున ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎక్కువగా వచ్చే ప్రజలను అదుపు చేయడం, రోడ్డు జామ్ కాకుండా రూట్ మ్యాప్ను తయారు చేసే బాధ్యతలను జయపురం సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండికి అప్పగించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఒక మీడియా సెల్ ఏర్పాటు చేస్తారు. సమావేశంలో జయపురం సమితి బీడీవో శక్తి మహాపాత్ర, తహసీల్దార్ డాక్టర్ మనోలిస ఆచార్య, పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొళాయ్, బొయిపరిగుడ తహసీల్దార్ స్నిగ్ధ చౌదరి, జయపురం సబ్ డివిజన్ సమాచార పౌర సంబంధాల అధికారి యశోద గదబ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు యోగా శిక్షణ
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వ విద్యాలయంలో జరుగుతున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో విద్యార్థులకు యోగా, మానసిక వికాసంపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బందితో వివిధ విన్యాసాలు జరిపి ఎన్సీసీ క్యాడెట్లకు వివరించారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన యోగ క్లాస్లో యోగాగురు భగీరథి పాణి వివిధ రకాల యోగ విన్యాసాలు నిర్వహించి, వాటి వలన కలిగే ఉపయోగాలను వివరించారు. యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని శిక్షణ కేంద్ర కెప్టెన్ కమాండెంట్ ప్రీతి రంజన్ దాస్ తెలియజేశారు. ఇన్స్పెక్టర్ ఆదిత్య దాస్ అతడి టీమ్ అగ్నితో పలు విన్యాసాల్లో ఎన్సీసీ క్యాడర్కు శిక్షణ ఇచ్చారు. -
కౌంటింగ్కు మూడంచెల భద్రత
పర్లాకిమిడి: జూన్ 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం స్థానిక ఎస్కేసీజీ కళాశాలలో తగు ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మృతి రంజన్ ప్రధాన్ తెలియజేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో మంగళవారం ఆయన మాట్లాడారు. గజపతి జిల్లాలో మోహనా, పర్లాకిమిడి అసెంబ్లీ స్థానాలు, బరంపురం పార్లమెంటరీ స్థానం కోసం ఉదయం 8.30 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. మోహనా నియోజకవర్గానికి 30 రౌండ్లు, పర్లాకిమిడికి 28 రౌండ్లు ఉంటాయని, ఒక్కొక్క రౌండ్కు పది టేబుల్స్ ఉంటాయని తెలియజేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 180 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించామన్నారు. వారిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలియజేశారు. మోహనా నియోజకవర్గంలో 71.20 శాతం ఓట్లు పోలవ్వగా, పర్లాకిమిడికి 64.23 శాతం పోలయ్యాయని, వాటితో పాటు పోస్టల్ బ్యాలెట్స్ పర్లాకిమిడికి 1,990, మోహనాకు 1,200 కూడా లెక్కించనున్నట్లు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రతీ వంద మీటర్లకు ఒక భద్రతా వలయం ఉంటుందన్నారు. ఎన్నికల ఫలితాలు కవరేజ్ కోసం మీడియా సెంటర్ ఏర్పాటు చేశామని, దీనికోసం 50 పాస్లు ఎన్నికల కమిషన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆయనతో పాటు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్, సబ్ కలెక్టర్ అలోక్ పండా ఉన్నారు. -
నేర చరిత అభ్యర్థులు
భువనేశ్వర్: ప్రస్తుతం జరుగుతున్న జంట ఎన్నికల్లో, వివిధ రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అభ్యర్థుల స్వీయ ప్రకటిత నేర చరిత్ర కలిగిన అభ్యర్థులను ఎక్కువ మందిని నిలబెట్టాయని ఒడిశా ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) తమ ఉమ్మడి విశ్లేషణలో వెల్లడించింది. 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, అన్ని రాజకీయ పార్టీలు క్రిమినల్ రికార్డులు ఉన్న అభ్యర్థులను నామినేట్ చేశాయని నివేదిక పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ పాత పద్ధతిని అనుసరించాయి. క్రిమినల్ కేసులు ఉన్న 27 శాతం అభ్యర్థులకు టికెట్లు కేటాయించాయి. ఒడిశా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్ని ప్రధాన పార్టీలు తమపై క్రిమినల్ కేసులు నమోదు చేసుకున్న అభ్యర్థులకు 17 నుంచి 68 శాతం వరకు టిక్కెట్లు ఇచ్చాయి. సుప్రీంకోర్టు 2020 సంవత్సరం ఫిబ్రవరి 13 నాటి ఆదేశాల్లో అటువంటి ఎంపికకు కారణాలను తెలియజేయాలని, నేర చరిత్ర లేని ఇతర వ్యక్తులను అభ్యర్థులుగా ఎందుకు ఎంపిక చేయకూడదని రాజకీయ పార్టీలను ప్రత్యేకంగా ఆదేశించింది. ● ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం... ఒడిశా ఎలక్షన్ వాచ్ మరియు ఏడీఆర్ విశ్లేషణ ప్రకారం.. బీజేపీ నుంచి 147 మంది అభ్యర్థుల్లో 100 (68 శాతం) మంది, భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సీ) నుంచి 145 మంది అభ్యర్థుల్లో 60 (41 శాతం) మంది, బీజేడీ నుంచి 147 మందిలో 46 (31 శాతం) మంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ ద్వారా బరిలోకి దిగిన 41 మంది అభ్యర్థుల్లో ఏడుగురు (17 శాతం) తమ అఫిడవిట్లలో తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారు. ఇద్దరు అభ్యర్థుల అఫిడవిట్లు తప్పుగా స్కాన్ చేయబడినందున లేదా పూర్తి అఫిడవిట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయబడనందున నివేదిక విశ్లేషించలేదు. ఈ అభ్యర్థులు ఖుర్దా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సుప్రీం జీరో పార్టీ ఆఫ్ భారత్కు చెందిన బ్రహ్మచారి నాయక్, సంబల్పూర్ రెంగాలి (ఎస్సీ) స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి ఉన్నారు. మొత్తంగా 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 1,283 మంది అభ్యర్థుల్లో 348 (27 శాతం) అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారు. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 1,121 మంది అభ్యర్థులను విశ్లేషించగా 332 (30 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులను ప్రకటించారు. 2024 ఎన్నికల్లో తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగింది. 292 మంది (23 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసులను ప్రకటించారు. 2019 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 257 (23 శాతం) మంది అభ్యర్థులు తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు చేసుకున్నారు. మొత్తం అభ్యర్థుల్లో 27 శాతం మందికి నేర చరిత్ర బీజేపీ అభ్యర్థుల్లో అత్యధికంగా 68 శాతం మంది -
కౌంటింగ్పై ఉద్యోగులకు శిక్షణ
పర్లాకిమిడి: స్థానిక ఎస్కేసీజీ కళాశాలలో జూన్ 4న జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణ, పారదర్శకతతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మృతి రంజన్ ప్రధాన్ సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమీపంలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. రెండో విడత శిక్షణ జూన 2వ తేదీన పోలీసు అధికారులతో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్, సబ్ కలెక్టర్ అలోక్ పండా, ఎన్నికల డిప్యూటీ కలెక్టర్ కమలకాంత పండా తదితరులు పాల్గొన్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
జయపురం: స్థానిక ఎకై ్సజ్ అధికారులు 22 కేజీల 100 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు ఎకై ్సజ్ అధికారి నీలాద్రి బిహారి మిశ్ర వెల్లడించారు. ఈ సంఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులు కొరాపుట్ జిల్లా కొలాబ్ నగర్కు చెందిన అభినాగ్, కేరళ రాష్ట్రానికి చెందిన నిశాన్ మాలడిన్, భబాధర్ ఫసులుద్దీన్, అరసాద్ హుసేన్లుగా ధ్రువీకరించారు. ముందుగా అందిన సమాచారం మేరకు సోమవారం సాయంత్రం జయపురం ఎకై ్సజ్ విభాగ అధికారి నీలాద్రి బిహారి మిశ్ర నేతృత్వంలో ఏఎస్ఐ ఎం.లక్ష్మణరావుతో పాటు పలువురు సిబ్బంది విజయవాడ– రాంచీ 326వ జాతీయ రహదారి పాత్రోపుట్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఒక ఆటో వస్తుండగా అనుమానం వచ్చి సోదాలు చేపట్టారు. దీంతో ఒక సూట్కేస్లో గంజాయి పట్టుబడింది. తాము గంజాయిని లమతాపుట్ నుంచి తీసుకొస్తున్నట్లు నిందితులు తెలిపినట్లు వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
అగ్ని గంగమ్మ ఉత్సవాలు ప్రారంభం
కొరాపుట్: జిల్లాలోని సిమిలిగుడలో కొలువుదీరిన అగ్ని గంగమ్మ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి అమ్మవారిని సాంప్రదాయ రీతిలో బయటకు తీసుకొచ్చారు. దీంతో తల్లి తన పుట్టింటికి వెళ్లింది. మంగళవారం పుట్టింటికి సమీపంలో ఉన్న పందిరి వద్ద కొలువుదీరింది. ఈ ఉత్సవాలు నవరాత్రులు జరుగుతాయి. ప్రతి వీధిలో అమ్మవారి రాకను ఆహ్వానిస్తూ ప్రజలు అలంకారాలు చేశారు. కొన్నిచోట్ల బొగ్గులు మండించి నిప్పులు తయారు చేశారు. వీటిపై నుంచి ఘటాలు నడవనున్నాయి. జూన్ 5వ తేదీన ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. తొలిరోజు కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం పొడాల్, పొట్టంగి ఎమ్మెల్యే పీతం పాఢీ, మాజీ ఎమ్మెల్యే ప్రపుల్ల పంగి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే సిబ్బంది దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి శ్రామిక్ కాంగ్రెస్ నడుం బిగించింది. ఈనెల 28న ఖుర్దారోడ్ మండల అధికారులతో జరిగిన కాలానుగుణ చర్చల సమావేశం (పీఎన్ఎం)లో ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు చర్చించారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో కుదిరిన ఒప్పంద తీర్మానాల వాస్తవ కార్యాచరణ ఆరంభమైంది. మండల రైల్వే అధికారులు సహాయ మండల ఇంజనీర్ డి.ప్రభాకర్రావు, సహాయ మండల సిగ్నల్ అండ్ టెలికాం ఇంజినీర్ జపానీ బెహెరా క్షేత్ర స్థాయిలో సిబ్బందితో ప్రత్యక్షంగా సంప్రదించి సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఓపెన్ లైన్ మండల శాఖ కార్యదర్శి లక్ష్మీధర మహంతి శ్రామిక్ కాంగ్రెస్ ప్రతినిధిగా పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ కోర్సులతో మెరుగైన ఉద్యోగావకాశాలు
ఆమదాలవలస రూరల్: పాలిటెక్నిక్ కోర్సులు చేసే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయని బీఎస్ఎన్ఎల్ జేటీఓ గురుగుబెల్లి శ్రీహరి అన్నారు. మండలంలో దన్నానపేట గ్రామం సమీపంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ అచీవర్స్ డేను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలకు చెందిన 41 మంది విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు రావడంపై అభినందనలు తెలియజేశారు. వారందరికీ నియామక పత్రాలు అందజేశారు. పాలిటెక్నిక్లో చేరిన విద్యార్థుల్లో నైపుణ్య కల్పన, ఉద్యోగ సాధనలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదువుకోడానికి అస్కారం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఎన్ఏసీఎల్ ఏజీఎం వీఆర్ పాండా, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నెపు గోపి, ఎలక్ట్రానిక్ విభాగాధిపతి పి.శ్రీనివాస్, ఎమ్.మోహన్దాస్, విద్యార్ధుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్యం మెరుగుకు శ్రీకారం
రాయగడ: రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ యంత్రాంగం పారిశుద్ధ్య మెరుగు పనులకు శ్రీకారం చుట్టింది. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాకాలంలో మురుగు కాలువలు నిండి రోడ్లపై ప్రవహిస్తుంటాయి. అయితే ఈసారి ఆ సమస్య తలెత్తకుండా యంత్రాంగం అందుకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టింది. మున్సిపాలిటీ వార్డు పరిధిలోని మొత్తం 24 వార్డులను ఆరు జోన్లుగా విభజించింది. ఆయా జోన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేవిధంగా 82 మంది సఫాయి కార్మికులను నియమించింది. వీరిని పర్యవేక్షించే విధంగా ఒక ప్రైవేట్ సంస్థకు బాధ్యతలను అప్పగించింది. దీంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు వీధుల్లోని మురికి కాలువలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నారు. ఇదివరకు కాలువలు సకాలంలో పరిశుభ్రం చేయకపోవడంతో చెత్తచెదారాలు నిల్వ ఉండి వర్షాకాలంలో రోడ్లపైకి మురికి నీరు ప్రవహిస్తుండేది. ఇకపై ఆ సమస్య తలెత్తకుండా ముందుగానే యంత్రాంగం చర్యలు చేపట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘సత్య’ విద్యార్థికి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్
విజయనగరం టౌన్: స్థానిక తోటపాలెంలో ఉన్న సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో బీబీఏ కోర్సు విద్యార్థిని కె.రమ్య 9.07 గ్రేడ్ పాయింట్లతో ఆంధ్రాయూనివర్సిటీ–2024 పరీక్ష ఫలితాల్లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థినులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో బీబీఏ కోర్సులో 2024 యూనివర్సిటీ పరీక్షా ఫలితాల్లో రమ్యకు తొలిస్థానం, ఊర్మిక 8.86 గ్రేడ్ పాయింట్లతో రెండోస్థానం సాధించారని చెప్పారు. భవిష్యత్తులో రమ్య, ఊర్మికలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవి.సాయిదేవమణి, సీతం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామమూర్తి, 2 ఆంధ్రా గర్ల్స్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ గోపేందర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
పాఠశాలలు తెరిచిన రోజే విద్యాకానుక
● డీఈవో జి.పగడాలమ్మ గరుగుబిల్లి: పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు విద్యాకానుక అందజేయాలని, ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని డీఈవో జి.పగడాలమ్మ ఆదేశించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యాకానుక స్టాక్ పాయింట్ను ఆమె మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జూన్ 12వ తేదీన పాఠశాలల పునఃప్రారంభం నాటికి ప్రతీ విద్యార్థి చేతిలో విద్యాకానుక కిట్ ఉండాలని సూచించారు. అలాగే పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోవాలన్నారు. తరగతులు మొదలైన తొలిరోజు నుంచే మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పథకం అమలయ్యేలా చూడాలన్నారు. ఆ తర్వాత పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజన ఏజెన్సీల సిబ్బందికి ఇస్తున్న శిక్షణను ఆమె సందర్శించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏపీవో వై.శంకరరావు, ఎంఈవో–2 కె.కొండలరావు, ప్రధానోపాధ్యాయుడు పాత్రుడు పాల్గొన్నారు. -
315 కేజీల గంజాయి పట్టివేత
జయపురం: జయపురం అబ్కారి సెటలైట్ విజిలెన్స్ విభాగం అధికారులు 315 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం రాత్రి నీలగిరి కర్రలు రవాణా చేస్తున్న ట్రక్కులో గంజాయిని రవాణా చేస్తుండగా జయపురం సమితి ఉమ్మిరి గ్రామ సమీప నది వంతెనపై ట్రక్కును నిలిపి తనిఖీ చేపట్టారు. ట్రక్కులో 7 మూటల గంజాయిని గుర్లించినట్లు బరంపురం అబ్కారి సెటలైట్ అధికారి స్నేహలత నాయిక్ సోమవారం వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ రామ రాజ గుజ్జర్, హెల్పర్ శంకరలాల్ గుజ్జర్ను అరెస్ట్ చేశామన్నారు. వీరిద్దరు రాజస్థాన్ రాష్ట్ర వాసులని తెలిపారు. ట్రక్కు బొయిపరిగుడ పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి నీలగిరి కలపతోపాటు 7 బస్తాల గంజాయిని రవాణా చేస్తూ జాతీయ రహదారిలో బొరిగుమ్మ వైపు వెళ్తుడంగా ముందుగా సమాచారం మేరకు మాటు వేసి పట్టుకున్నామన్నారు. గంజాయి విలువ రూ.31.50 లక్షలు ఉంటుందన్నారు. జయపురం అబ్కారి సబ్ఇన్స్పెక్టర్ గంగమయి హేమ్రమ్, సెటలైట్ విజిలెన్స్ విభాగ సిబ్బంది ఎఎస్ఐ రశ్మీరంజన్ నాయక్, కె.చంద్ర శేఖర్, సుశాంత పాత్రో, కపిలేష్ భొత్ర, సంతోష్ కుమార్నాయక్, పూజా నాయక్ తదితరులు గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు. -
కటక్, పూరీలో హింసాత్మక ఘటనలు
భువనేశ్వర్: రాష్ట్రంలో మూడు విడతల ఎన్నికలు చాలా వరకు ప్రశాంతంగా జరిగినప్పటికీ, గత కొన్ని రోజులుగా అనేక చోట్ల ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనలు పెచ్చుమీరుతున్నాయి. కటక్ జిల్లా బంకీ పోలీసు ఠాణా పరిధిలోని బెడ్పూర్ గ్రామంలో ఆదివారం రెండు రాజకీయ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 6 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం బంకి ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ వెనుక ఖచ్చితమైన కారణం నిర్ధారించాల్సి ఉంది. ఈ ఘర్షణతో ఘటనా స్థలంలో చాలాసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ హింసాత్మక చర్యలకు వ్యతిరేకంగా స్థానికులు ఆదివారం రాత్రి కటక్–బంకి రహదారిపై కదలికలను స్తంభింపజేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో పూరీ జిల్లా పిప్పిలి ఎమ్మెల్యే రుద్రప్రతాప్ మహారథి తన మద్దతుదారులతో ఆదివారం ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటన పూరి జిల్లాలోని నిమాపడా పరిధిలోని టెరుండియాలో చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత నిమాపడా పోలీసులు తెరుండియా పంచాయతీకి చెందిన ప్రతిపక్ష నేతను అదుపులోకి తీసుకున్నారు. -
రక్త నిల్వలు పెంచాలని వినతి
రాయగడ: పట్టణంలో గల ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త నిల్వలు పెంచాలని జిల్లా వికాష్ మంచ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని మంచ్ సభ్యులు జిల్లా ముఖ్యవైద్యాధికారి డాక్టర్ లాల్ మోహన్ రౌత్రాయ్కు సొమవారం సమర్పించారు. మంచ్ అధ్యక్షులు దయానిధి ఖడంగా, సరొజ్ సాహు తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. ఆదివాసీ, హరిజన జిల్లాగా గుర్తింపు పొందిన రాయగడలో గల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వైద్య సేవలు పొందేందుకు ఈ ఆస్పత్రికే వస్తుంటారని, అయితే అత్యవసర సమయంలో రక్తలేమితో రోగులు నానా అవస్థలు పడుతున్నారని మంచ్ అధ్యక్షులు ఖడంగా తెలియజేశారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర సమయంలో ఈ సమస్య మరింత జటిలమవుతుందని అన్నారు. అందువల్ల రక్త నిల్వలు పెంచి అవసరమైన రోగులకు ఉచితంగా రక్తం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రసవ వేదన
ఓ వైపు పురిటి నొప్పులు.. మరో వైపు కొండల్లో నడక.. ఇంకోవైపు ప్రసవంపై భయం.. గిరిజన గ్రామాల్లో దశాబ్దాలుగా వినిపిస్తున్న ప్రసవ వేదన కోరుకొండ సమితి నక్కమామ్ముడి పంచాయతీ గదిగూడ గ్రామంలో మళ్లీ బిగ్గరగా వినిపించింది. గ్రామానికి చెందిన మాధు ముదిలీ భార్య ప్రతిమా ముదిలికు సోమవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. కోరుకొండ ఆరోగ్య కేంద్రం అంబులెన్స్కు ఫోన్ చేయగా.. ఆ ఊరికి అంబులెన్స్ పంపించడానికి దారి లేదని చెప్పారు. దీంతో స్థానిక మహిళలతో కలిసి ఆమె అడవి దారిలో రెండు కిలోమీటర్ల పాటు నడిచారు. హతిబో గ్రామం వరకు అలా రాగా.. అక్కడ అంబులెన్స్లో ఎక్కించి కోరుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె మగ పిల్లాడికి జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. – మల్కన్గిరి -
మో బస్సులో నగదు చోరీ
భువనేశ్వర్: నగరంలోని మో బస్సులో సోమవారం నగదు చోరీ సంఘటన చోటు చేసుకుంది. కుమారుడి చికిత్స కోసం కూడగట్టుకున్న సొమ్ముని దొంగలు దోచుకున్నారని బాధితుడు వాపోయాడు. చికిత్స కోసం ఆస్పత్రిలో జమ చేసేందుకు తీసుకుని వెళ్తున్న రూ.60,000 పోయాయని వాపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. గంజాం జిల్లా హింజిలికాటు ప్రాంతానికి చెందిన బృందాబన్ సాహు తన కొడుకు బిభూ ప్రసాద్ చికిత్స కోసం స్థానిక ఎయిమ్స్ ఆస్పత్రిలోని న్యూరాలజీ విభాగంలో డబ్బులు జమ చేసేందుకు మో బస్సులో వెళ్తుండగా దొంగతనం జరిగింది. దీంతో స్థానిక ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బృందాబన్ సాహు తన జేబులో డబ్బు తో రూట్ నంబర్ 19లో మో బస్సు ఎక్కాడు. బస్సు కిక్కిరిసి ఉండడంతో ఖండగిరి వద్దకు చూసుకునే సరికి డబ్బులు దొంగిలించినట్లు గుర్తించాడు. ఈ సంఘటనపై తక్షణమే స్థానిక ఖండగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం మో బస్సులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
రక్తదానం.. ప్రాణదానం
జయపురం: జయపురం సిమెంట్ వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జయపురం సదర్ పోలీస్ స్టేషన్ అధికారి ఈశ్వర చంద్ర తండి, జయపురం బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర్ సూర్య శేఖర మిశ్ర ప్రారంభించారు. 96 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 18 మంది మహిళలు, యువతులు స్వచ్ఛందంగా వచ్చి రక్తాన్ని దానం చేశారు. రక్త దానం చేసిన వారిలో సిమెంట్ వ్యాపారుల కుటుంబ సభ్యులతోపాటు సిమ్మెంట్ దుకాణాలలో పనివారు తదితరులు ఉన్నారు. పట్టణ పోలీస్ అధికారి రమణీ రంజన్ దొలాయ్, సేల్స్ టాక్స్ విభాగం అధికారి జయంత శతపతి, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు అయజయ్ కుమార్ పండ, గురు పొరజ, ప్రతిభ పాత్రో, నతినినాల్ ధాని, ప్రభుత్వ ఎ.ఎన్.ఎం శిక్షణ కేంద్రం విద్యార్థులు, జయపురం సబ్డివిజన్ రక్త దాతల అసోసియేషన్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ రౌళో, భరద్వాజ బక్షీ, రంజన్ మిశ్ర పాల్గొన్నారు. రక్త దాతలకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
ఎవరి లెక్కల్లో వారు..!
పర్లాకిమిడి: తొలి దశలో పోలింగ్ జరిగిన గజపతి జిల్లాలోని మోహన, పర్లాకిమిడి నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీలు బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తమ గెలుపుపై ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. కౌంటింగ్కు ఇంకా చాలా రోజులు వ్యవధి ఉండడంతో పర్లాకిమిడిలో ఏమూల మాట్లాడుకున్నా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో అంటూ చర్చించుకోవడం కనిపిస్తోంది. ఎప్పుడూ పర్లాకిమిడి నియోజకవర్గంలో కాంగ్రెస్, స్వతంత్య్ర అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే త్రినాథ సాహు మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 1985, 2000, 2004 గెలుపొందగా, స్వతంత్య్ర అభ్యర్థిగా ఆయన 1995లో గెలుపొంది తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2009లో కోడూరు నారాయణ రావు బీజేడీ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019లో బీజేడీ పార్టీ అధిష్టానం అసెంబ్లీ టిక్కెట్టు ఇవ్వకపోవడంతో ఆయన భాజపాలో చేరి అధిక మెజారిటీతో గెలిచారు. పర్లాకిమిడి నియోజకవర్గంలో బీజేడీ అభ్యర్థిగా రూపేష్ పాణిగ్రాహి పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా బిజయ పట్నాయక్లు ఈసారి పోటీ చేశారు. పోలింగు జరిగి 15 రోజులు గడుస్తోంది. జూన్ 4న పర్లాకిమిడి ఎస్కేసీజీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతో ఎక్కడ చూసినా వీరి గురించే చర్చలు జరుగుతున్నాయి. బీజేడీ అభ్యర్థి రూపేష్ పాణిగ్రాహి కోసం ఈ ఎన్నికల్లో స్టార్ కాంపైనర్లు సీఎం నవీన్ పట్నాయిక్, తెలుగు హీరో సుమన్, ఓలివుడ్ హీరో హీరోయిన్లు సవ్యసాచి, అర్చనా, బాబుసేన్, ఎలినా సామంత్రే, హైదరాబాద్ నుంచి జబర్దస్త్ టీంలు విచ్చేసి గుసాని, గురండి, గుమ్మా సమితిల్లో పర్యటించారు. ఈ ఎన్నికల్లో 3,500 మెజార్టీతో బీజేడీ గెలుస్తుందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. భాజపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు ఏ స్టార్ క్యాంపైన్ లేకుండా ప్రచారం చేసి మరోసారి అధిక మెజారిటీతో గెలుస్తామని అంటున్నారు. కాశీనగర్, గుమ్మా, గుసాని సమితిలో బిజేపీ క్యాడర్ బలం పెరిగిందని భాజపా నాయకులు అంటున్నారు. గుమ్మా సమితిలో అత్యధికంగా 46,693 పోలవ్వగా, కాశీనగర్ సమితిలో 37,213, గుసాని సమితిలో 42,191, పర్లాకిమిడి టౌనులో 21,630 ఓట్లు పోలయ్యాయి. గుమ్మాలో కాంగ్రెస్ అభ్యర్థి బిజయపట్నాయిక్కు 30వేల ఓట్లు లభిస్తాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన గుమ్మాలో ఏ పార్టీకి అత్యధికంగా ఓట్లు లభిస్తే ఆ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా వుంటాయని అనేక రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
పాక్ను శక్తివంతం చేస్తున్న చైనా? లక్ష్యం ఏమిటి?
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్గా మాజీ క్రికెటర్
పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్లు
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ప్రాణం తీసిన ఫొటో సరదా
ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ సెన్సార్ తప్పిదమే: ఐఎండీ
నేటితో చివరి అంకం..ప్రచారం ముగింపు
తప్పక చదవండి
- Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
- కౌంటింగ్లో ఏజెంట్లు కీలకం!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
- జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
- ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement