-
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్గా మాజీ క్రికెటర్
దేశవాళీ క్రికెట్ సీజన్ (2024-25)కు ముందు ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బౌలింగ్ మెంటార్గా భారత మాజీ పేసర్ ధావల్ కులకర్ణిని ముంబై క్రికెట్ అసోసియేషన్ నియమించింది. కులకర్ణి దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో ముంబై జట్టు బౌలింగ్ మెంటార్గా వ్యవహరించనున్నాడు. ఈ మెరకు ఎంసీఏ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కులకర్ణికి అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటకి దేశీవాళీ క్రికెట్లో మాత్రం ముంబై తరపున అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కులకర్ణి.. టీమిండియా తరపున 12 వన్డేలు, రెండు టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో మాత్రం కులకర్ణి 96 మ్యాచ్ల్లో ఏకంగా 285 వికెట్లు పడగొట్టాడు. రంజీట్రోఫీ 2023-24 సీజన్ ట్రోఫీని ముంబై సొంతం చేసుకోవడంలో కులకర్ణి కీలక పాత్ర పోషించాడు.రికార్డు స్ధాయిలో 42వ సారి రంజీ ట్రోఫీని ముంబై గెలుచుకున్న అనంతరం కులకర్ణి.. ఈ ఏడాది మార్చిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పకున్నాడు. ఈ క్రమంలోనే అతడి సేవలను ఉపయెగించుకోవాలని భావించిన ఎంసీఏ.. మెంటార్ పదవిని కట్టబెట్టింది. -
టీ20 ర్యాంకింగ్స్లో సత్తా చాటిన విండీస్.. టాప్లోనే భారత్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో వెస్టిండీస్ సత్తా చాటింది. అంతర్జాతీయ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో విండీస్ జట్టు రెండు స్ధానాలు ఎగబాకి నాలుగో స్ధానానికి చేరుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన కరేబియన్లు.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టి నాలుగో ర్యాంక్ను సొంతం చేసుకుంది.టీ20 వరల్డ్కప్-2024కు ముందు వెస్టిండీస్ జట్టు అద్బుతమైన ఫామ్లో ఉంది. రెగ్యూలర్ కెప్టెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్మైర్ వంటి ఆటగాళ్లు లేకుండానే ప్రోటీస్ జట్టును వెస్టిండీస్ చిత్తు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కరేబియన్లు సత్తాచాటారు.తమ సొంత గడ్డపై జరగనున్న టీ20 వరల్డ్కప్లోనూ ఇదే జోరును కొనసాగించాలని విండీస్ జట్టు భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ర్యాకింగ్స్లో అగ్రస్ధానంలో భారత్(264 రేటింగ్) కొనసాగుతోంది. టీమిండియా తర్వాతి స్ధానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నిలిచాయి. -
టీ20 వరల్డ్కప్లో లీడింగ్ వికెట్ టేకర్ అతడే..!
మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్కప్ 2024పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. పలానా ఆటగాడు ఇన్ని పరుగులు చేస్తాడు.. పలానా బౌలర్ అన్ని వికెట్లు తీస్తాడు.. పలానా జట్టు టైటిల్ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్కు చేరతాయని అభిమానులు, విశ్లేషకులు సోషల్మీడియా వేదికగా జోస్యాల మోత మోగిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా విండీస్ దిగ్గజ బౌలర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ కూడా స్పందించాడు.బిషప్ అందరి అంచనాలకు భిన్నంగా తన ప్రెడిక్షన్కు చెప్పి క్రికెట్ సర్కిల్స్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈసారి వరల్డ్కప్లో లీడింగ్ వికెట్ టేకర్గా టీమిండియా చైనా మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఉంటాడని బోల్డ్ స్టేట్మెంట్ చేశాడు. మరో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత ప్రభావిత బౌలర్గా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు, మాజీలు యుజ్వేంద్ర చహల్ లీడింగ్ వికెట్ టేకర్ అవుతాడని ముక్తకంఠంతో వాదిస్తుంటే.. బిషప్ మాత్రం కుల్దీప్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరల్డ్కప్ లీడింగ్ రన్ స్కోరర్పై కూడా బిషప్ తన అంచనాను అందరికీ భిన్నంగా వెల్లడించాడు. ఈ విభాగంలో మెజారిటీ శాతం విరాట్, రోహిత్, సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్ల పేర్లు చెబుతుంటే బిషప్ మాత్రం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ పేరు చెప్పి అందరి అంచనాల్లో తన అంచనా వేరని నిరూపించాడు. సెమీఫైనలిస్ట్ల విషయంలోనూ బిషప్ అంచనా కాస్త వైవిధ్యంగా ఉంది. ఈసారి ఫైనల్ ఫోర్కు భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు చేరతాయని బిషప్ చెప్పుకొచ్చాడు.కాగా, టీ20 వరల్డ్కప్ 2024 ఎడిషన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో మొదలవుతుంది. అనంతరం టీమిండియా జూన్ 9న చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్తో తలపడుతుంది. ఐర్లాండ్తో మ్యాచ్ కోసం ఇదివరకే న్యూయార్క్ చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్స్లో నిమగ్నమై ఉన్నారు. -
ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
ప్రపంచ క్రికెట్లో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటివరకు జరిగిన అన్ని టీ20 ప్రపంచకప్ల్లో పాల్గొని ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ ఇద్దరు జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే తొమ్మిదో ఎడిషన్లోనూ పాల్గొని సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 2007 నుంచి వరుసగా 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ఎడిషన్లలో పాల్గొని ఎవరికీ సాధ్యంకాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. పొట్టి ప్రపంచకప్లో వీరిద్దరి ప్రస్తానం 17 ఏళ్ల పాటు నిరాటంకంగా సాగింది.ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్కప్ అరంగేట్రం ఎడిషన్ (2007) సమయానికి క్రికెట్లో ఒనమాలు దిద్దుతుండేవాడు. ఇప్పుడు అదే హిట్మ్యాన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్నాడు. రోహిత్ ఇప్పటివరకు జరిగిన ఎనిమిది వరల్డ్కప్ ఎడిషన్లలో 39 మ్యాచ్లు ఆడి 34.39 సగటున, 127.88 స్ట్రయిక్రేట్తో 963 పరుగలు సాధించాడు. రోహిత్ ఖాతాలో తొమ్మిది ప్రపంచకప్ హాఫ్ సెంచరీలు ఉన్నాయి.షకీబ్ విషయానికొస్తే.. ఈ బంగ్లాదేశీ వెటరన్ టీ20 ప్రపంచకప్లో ఇప్పటివరకు 36 మ్యాచ్లు ఆడి 23.93 సగటున 122.44 స్ట్రయిక్రేట్తో 742 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన షకీబ్ బౌలింగ్లోనూ సత్తా చాటాడు. షకీబ్ 36 మ్యాచ్ల్లో 47 వికెట్లు పడగొట్టి, టీ20 వరల్డ్కప్ లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు. వయసు పైబడిన రిత్యా రోహిత్, షకీబ్లకు ఇదే చివరి టీ20 వరల్డ్కప్ కావచ్చు. రోహిత్ తొలి ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉండగా.. షకీబ్కు టీ20 ప్రపంచకప్ కలగా మిగిలిపోవచ్చు.2024 ఎడిషన్ విషయానికొస్తే.. ఈసారి రికార్డు స్థాయిలో 20 జట్లు నాలుగు గ్రూప్లుగా విభజించబడి పోటీపడనున్నాయి. భారత్ గ్రూప్-ఏలో పాకిస్తాన్తో పాటు మరో మూడు జట్లతో పోటీపడనుంది. బంగ్లాదేశ్ గ్రూప్-డిలో సౌతాఫ్రికా, శ్రీలంకతో పాటు మరో రెండు చిన్న జట్లతో తలపడనుంది. భారత్ తమ తొలి మ్యాచ్ను జూన్ 5న (ఐర్లాండ్) ఆడనుండగా.. బంగ్లాదేశ్ జూన్ 7న (శ్రీలంక) తమ వరల్డ్కప్ క్యాంపెయిన్ను ప్రారంభించనుంది. -
కసరత్తులు షురూ!
న్యూయార్క్: టి20 ప్రపంచకప్ వేటలో అమెరికా గడ్డపై అడుగు పెట్టిన భారత క్రికెట్ బృందం మొదటి రోజు ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లంతా ఇందులో పాల్గొన్నారు. కోహ్లి ఇంకా న్యూయార్క్ చేరుకోలేదు. టీమిండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఈ ట్రయినింగ్ సెషన్ను పర్యవేక్షించారు. ముఖ్యంగా భారత్తో పోలిస్తే పూర్తిగా భిన్నమైన యూఎస్ వాతావరణానికి అలవాటు పడటంపై ఆటగాళ్లు దృష్టి సారించారు.ఐపీఎల్ కారణంగా మన క్రికెటర్లంతా 90 శాతంకి పైగా డే అండ్ నైట్ మ్యాచ్లే ఆడారు. కానీ వరల్డ్ కప్ లీగ్ దశలో అమెరికా వేదికపై జట్టు 25–27 డిగ్రీల వాతావరణంలో అన్నీ డే మ్యాచ్లే (ఉదయం గం. 10:30 నుంచి) ఆడబోతోంది. ట్రయినింగ్ సెషన్లో క్రికెటర్లు స్వల్ప జాగింగ్, రన్నింగ్తో పాటు కొద్దిసేపు ఫుట్బాల్ ఆడారు.‘టైమ్ జోన్కు అలవాటు పడటం అన్నింటికంటే ముఖ్యం. జట్టు సభ్యులంతా కూడా దాదాపు రెండున్నర నెలల తర్వాత మళ్లీ ఒక్క చోటికి చేరారు. వారి ఫిట్నెస్ స్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని బట్టి మున్ముందు రోజుల కోసం ప్రణాళికలు రూపొందిస్తాను’ అని దేశాయ్ చెప్పారు. వాతావరణం చాలా బాగుందని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడగా... న్యూయార్క్లో తొలిసారి ఆడనుండటం పట్ల రవీంద్ర జడేజా ఉత్సాహంగా ఉన్నాడు. నగర శివార్లలోని నాసా కౌంటీ స్టేడియంలో జూన్ 1న బంగ్లాదేశ్తో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ వరకైనా కోహ్లి జట్టుతో చేరతాడా లేదా అనే విషయంలో బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. జూన్ 5న అసలు పోరులో ఐర్లాండ్తో భారత్ ఆడుతుంది. ‘నంబర్వన్’ ర్యాంక్తో ప్రపంచకప్లోకి... టి20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా నంబర్వన్ ర్యాంకర్గా బరిలోకి దిగనుంది. బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్లో భారత్ 264 రేటింగ్ పాయింట్లతో తమ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకుంది.రెండుసార్లు టి20 వరల్డ్ చాంపియన్ వెస్టిండీస్ రెండు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్కు చేరుకుంది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను వెస్టిండీస్ 3–0తో క్లీన్స్వీప్ చేయడంతో ఆ జట్టు ర్యాంక్ మెరుగైంది. దక్షిణాఫ్రికా నాలుగు స్థానాలు పడిపోయి ఏడో ర్యాంక్లో నిలిచింది. -
T20 WC: ఆసీస్ కాదు.. ఆ జట్టు: ఊహించని పేరు చెప్పిన దిగ్గజం
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పొట్టి ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ జూన్ 1న మొదలుకానుంది.అమెరికా- కెనడా జట్ల మధ్య డల్లాస్ వేదికగా ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేవనుంది. ఈసారి ఏకంగా 20 జట్లు వరల్డ్కప్లో పాల్గొంటున్నా.. పోటీ మాత్రం ప్రధానంగా సూపర్-8 జట్ల మధ్యే ఉండనుంది.ఆ నాలుగు జట్లకు మెజారిటీ ఓట్లుటీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ టైటిల్ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి సెమీ ఫైనలిస్టులు ఎవరన్న అంశంపై తమ అంచనాలు తెలియజేసిన విషయం తెలిసిందే.ఊహించని పేరు చెప్పిన లారామెజారిటీ మంది టీమిండియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పేర్లు చెప్పగా.. విండీస్ దిగ్గజం బ్రియన్ లారా మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. టీమిండియా, ఇంగ్లండ్, వెస్టిండీస్తో పాటు అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ జట్టుకు తన టాప్-4లో స్థానమిచ్చాడు.గావస్కర్ టాప్-4 జట్లు ఇవేఅండర్డాగ్స్గా టీ20 ప్రపంచకప్-2024లో అడుగుపెట్టే అఫ్గన్.. ఈసారి కచ్చితంగా సెమీస్ చేరే అవకాశం ఉందని లారా అంచనా వేశాడు. మరోవైపు.. టీమిండియా లెజెండ్ సునిల్ గావస్కర్ ఇండియాతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ఈసారి సెమీస్ చేరతాయని జోస్యం చెప్పాడు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
MS Dhoni: ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!
మహేంద్ర సింగ్ ధోని.. ఈ టీమిండియా దిగ్గజ కెప్టెన్ తన అద్బుత ఆట తీరు, నిరాండంబరతతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ తర్వాత కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూపంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా జట్టును రికార్డు స్థాయిలో ఐదుసార్లు చాంపియన్గా నిలిపి.. ‘తలా’గా అభిమానుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. అయితే, ధోని మైదానంలో దిగుతున్నాడంటే సీఎస్కే ఫ్యాన్స్కు మాత్రమే కాదు.. జట్లకు అతీతంగా అందరిలోనూ ఉత్సాహం నిండిపోతుంది.ఏ జట్టుకు మద్దతు ఇచ్చే వారైనా ధోని బ్యాటింగ్కు వచ్చాడంటే .. క్రీజులో ఉన్నంత సేపు అతడికే మద్దతుగా నిలుస్తారు. ఇక మరికొంత మందైతే తలాను నేరుగా కలిసేందుకు దెబ్బలు తినైనా సరే మైదానంలోకి దూసుకువస్తారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.ధోని బ్యాటింగ్కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పిఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగానూ ఓ వ్యక్తి ఇలాగే ఫీల్డ్లోకి దూసుకువచ్చాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ధోని బ్యాటింగ్కు రాగానే సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి ప్రవేశించి.. ధోని పాదాలను చుట్టేశాడు.ఆ సమయంలో ధోని ఏమాత్రం సహనం కోల్పోకుండా తన అభిమాని సమస్యను అర్థం చేసుకోవడమే గాకుండా.. సర్జరీ చేయిస్తానని మాట ఇచ్చాడట. నాడు ధోనిని కలిసిన సదరు వ్యక్తి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ధోని కాళ్లు మొక్కాను.. సర్జరీ చేయిస్తా అన్నారు!‘‘ధోనిని చూడగానే నా చుట్టూ ఏం జరుగుతుందో అంతా మర్చిపోయాను. మైదానంలోకి పరిగెత్తుకు వెళ్లాను. మహీ భాయ్ అప్పుడు.. ‘సరదా కోసమే ఇక్కడికి వచ్చావు కదా’ అన్నాడు.మహీ భాయ్ను చూశానన్న ఆనందంలో నాకైతే పిచ్చిపట్టినట్లయింది. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాను. ఆయనొక లెజెండ్. నేరుగా ఆయనను చూడగానే నా కళ్లలో నీళ్లు వచ్చాయి.ఆ సమయంలో నేను భారంగా శ్వాస తీసుకోవడం గమనించి.. ఏమైందని అడిగారు. నా ముక్కు సరిగా పనిచేయదని.. శ్వాస విషయంలో ఇబ్బంది పడుతున్న అని చెప్పాను. వెంటనే ఆయన.. ‘బాధపడకు.. నీ సర్జరీ గురించి నేను చూసుకుంటా. నీకేం కానివ్వను’ అని భరోసా ఇచ్చారు’’ అని సదరు అభిమాని ఫోకస్డ్ ఇండియన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.ధోని గ్రేట్అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా.. ధోని గ్రేట్ అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. కాగా 42 ఏళ్ల వయసులో సీఎస్కే కెప్టెన్గా వైదొలిగిన ధోని.. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందే పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించాడు.గైక్వాడ్ సారథ్యంలో వికెట్ కీపర్బ్యాటర్గా కొనసాగాడు ధోని. అయితే, డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈసారి ప్లే ఆఫ్స్ కూడా చేరకుండానే నిష్క్రమించింది.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్Conversation between @msdhoni and fan 🥹💛Fan told him he has some breathing issues and there is surgery of it. He wanted to meet him before surgery. Mahi replied "Teri surgery ka mai dekh lunga. Tujhe kuch nahi hoga, tu ghabara mat. Mai tujhe kuch nahi hone dunga" pic.twitter.com/wKz9aZOVGQ— ` (@WorshipDhoni) May 29, 2024 -
టీమిండియా హెడ్కోచ్గా కాదు!.. గంభీర్ వ్యాఖ్యలు వైరల్
టీమిండియా కొత్త కోచ్ ఎవరన్న అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తొలుత విదేశీ కోచ్ల పేర్లు వినిపించగా.. ఐపీఎల్-2024 ఫైనల్ తర్వాత మాత్రం ఇండియన్నే ఈ పదవి చేపట్టనున్నాడనే అభిప్రాయాలు బలపడ్డాయి.రాహుల్ ద్రవిడ్ స్థానంలో మాజీ ఓపెనర్, కోల్కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతం గంభీర్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఐపీఎల్ తాజా సీజన్ ఫైనల్ అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా గౌతీతో సుదీర్ఘ చర్చలు జరపడం.. గంభీర్ సైతం హెడ్కోచ్ పదవి పట్ల ఆసక్తిగా ఉన్నాడనే వార్తలు ఇందుకు ఊతమిచ్చాయి.అయితే, తాజాగా గౌతం గంభీర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తాను భారత ప్రధాన కోచ్ పదవి చేపట్టడం లేదని గంభీర్ ఒక రకంగా స్పష్టం చేశాడు. ఇంతకీ గౌతీ ఏమన్నాడంటే..‘‘కేకేఆర్ మూడో ట్రోఫీ గెలిచింది కాబట్టి.. డ్రెస్సింగ్రూం వాతావరణం మొత్తం సంతోషంతో నిండిపోయిందని మీరు అంటున్నారు. అయితే, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కంటే మేము ఇంకా రెండు టైటిళ్లు వెనుకబడి ఉన్నాం.ఈ సీజన్ బాగా సాగింది. అయితే, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలవాలంటే మేమింకా మూడుసార్లు చాంపియన్లుగా నిలవాలి. అందుకు ఎంతో కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది.కాబట్టి మా తదుపరి మిషన్.. అదే. కేకేఆర్ను మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్గా చేయగలగాలి. అంతకంటే గొప్ప అనుభూతి నాకు మరొకటి ఉండదు. అయితే, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది’’ అని స్పోర్ట్స్కీడా ఇంటర్వ్యూలో గంభీర్ పేర్కొన్నాడు.ఈ వ్యాఖ్యలను బట్టి గంభీర్ కేకేఆర్తో తన ప్రయాణం కొనసాగిస్తాడని స్పష్టమవుతోంది. ఇక టీమిండియా హెడ్ కోచ్గా ఉండాలంటే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు, ఇతర జట్లతో సదరు వ్యక్తికి సంబంధం ఉండకూడదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేకేఆర్ మెంటార్గా కొనసాగేందుకే గంభీర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. -
Rohit Sharma- MI: ఆఖరి మ్యాచ్ ఆడేశాడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్లోనే 2024 సీజన్ను ఓ చేదు జ్ఞాపకంగా చెప్పవచ్చు. 2011లో ముంబై ఇండియన్స్ కుటుంబంలో అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఓపెనర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.ఆ తర్వాత రెండేళ్లకే కెప్టెన్గా ప్రమోట్ అయిన హిట్మ్యాన్.. సారథిగా తొలి ప్రయత్నంలోనే ముంబై ఇండియన్స్కు టైటిల్ అందించాడు. ఆ తర్వాత మరో నాలుగు సార్లు జట్టును చాంపియన్గా నిలిపి.. అత్యధికంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తొలి కెప్టెన్గా రికార్డు సృష్టించాడు.ఇక గతేడాది ముంబైని ప్లే ఆఫ్స్నకు చేర్చిన రోహిత్ శర్మకు.. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై మేనేజ్మెంట్ షాకిచ్చింది. కెప్టెన్గా రోహిత్పై వేటు వేసి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలో ముంబై ఈసారి చెత్తగా ఆడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. మరోవైపు.. రోహిత్ శర్మ సైతం ఓపెనర్గా ఆకట్టుకోలేకపోయాడు.ఆడిన 14 మ్యాచ్లలో కలిపి కేవలం 417 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే.. ముంబై మేనేజ్మెంట్ వైఖరితో విసిగిపోయిన రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ఆ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2025 వేలానికి ముందు ముంబై రిటెన్షన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.‘‘నాకు తెలిసి వాళ్లు ఇషాన్ కిషన్ను వదిలేస్తారు. అతడి కోసం రైట్ టూ మ్యాచ్ కార్డు వాడతారనుకుంటా. ఎందుకంటే ఇషాన్ కోసం 15.5 కోట్లు వెచ్చించడం సరికాదు.కాబట్టి వాళ్లు అతడిని వదిలేస్తారు. ఇక రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై ఇండియన్స్ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. తనను ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోవాలని అతడు కోరుకోవడం లేదు.అదే విధంగా ఫ్రాంఛైజీ కూడా అతడిని అట్టిపెట్టుకోవాలని భావించడం లేదు. ఇప్పటికే ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ దారులు వేరయ్యాయి. రోహిత్ను మరోసారి ముంబై జెర్సీలో చూసే అవకాశం లేదు.అయితే, ఇది కేవలం నా అంచనా మాత్రమే. ఒకవేళ ఇది నిజం కావచ్చు. కాకపోవచ్చు. ఏదేమైనా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబైకి మాత్రం ఆడబోడని నమ్మకంగా చెప్పగలను’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నాడు.ఇక ముంబై రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి ఆటగాడిని.. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మను కూడా కొనసాగిస్తుందని ఆకాశ్ చోప్రా అంచనా వేశాడు. కాగా ఐపీఎల్ పదిహేడో సీజన్లో ముంబై ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగే గెలిచింది. -
ICC Rankings: అక్షర్ పటేల్ తొలిసారి.. మనోడే మళ్లీ నంబర్ వన్!
టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఐసీసీ ర్యాంకింగ్స్లో దుమ్ములేపాడు. టీ20 మెన్స్ ర్యాంకింగ్స్ ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ తొలిసారిగా మూడో స్థానం సంపాదించాడు. బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్, శ్రీలంక కీలక ఆటగాడు వనిందు హసరంగ తర్వాతి స్థానం ఆక్రమించాడు.వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అకీల్ హొసేన్ సౌతాఫ్రికాతో సిరీస్లో తేలిపోవడంతో ఐదు స్థానాలు దిగజారగా.. అతడి స్థానాన్ని అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఇక టీమిండియా నుంచి మరో స్పిన్నర్ రవి బిష్ణోయి టాప్-5లో చోటు దక్కించుకోవడం విశేషం.ఐసీసీ టీ20 మెన్స్ తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. ఆదిల్ రషీద్- ఇంగ్లండ్- 722 రేటింగ్ పాయింట్లు2. వనిందు హసరంగ- శ్రీలంక- 687 రేటింగ్ పాయింట్లు3. అక్షర్ పటేల్- ఇండియా- 660 రేటింగ్ పాయింట్లు4. మహీశ్ తీక్షణ- శ్రీలంక- 659 రేటింగ్ పాయింట్లు5. రవి బిష్ణోయి- ఇండియా- 659 రేటింగ్ పాయింట్లు.మనోడే మళ్లీ నంబర్ వన్ బౌలర్ల సంగతి ఇలా ఉంటే.. టీ20 బ్యాటర్ల జాబితాలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అదే విధంగా టాప్-6 ఆటగాళ్లంతా తమ తమ స్థానాల్లో కొనసాగుతుండగా.. ఇంగ్లంఢ్ సారథి జోస్ బట్లర్ ఒక ర్యాంకు మెరుగుపరచుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు.ఇక వెస్టిండీస్ స్టార్ బ్రాండన్ కింగ్ ఏకంగా ఐదుస్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకు సాధించాడు.ఐసీసీ మెన్స్ టీ20 తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-51. సూర్యకుమార్ యాదవ్- ఇండియా- 861 పాయింట్లు2. ఫిల్ సాల్ట్- ఇంగ్లండ్- 788 పాయింట్లు3. మహ్మద్ రిజ్వాన్- పాకిస్తాన్- 769 పాయింట్లు4. బాబర్ ఆజం- పాకిస్తాన్- 761 పాయింట్లు5. ఐడెన్ మార్క్రమ్- సౌతాఫ్రికా- 733 పాయింట్లు.చదవండి: Hardik-Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్ -
Hardik- Natasa: ఇక్కడ బాగుంది.. హార్దిక్ పాండ్యా పోస్ట్ వైరల్
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుతో చేరాడు. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం సహచర ఆటగాళ్లతో కలిసి అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కాగా ఈ స్టార్ ఆల్రౌండర్ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్-2024 సీజన్లో పగ్గాలు చేపట్టిన పాండ్యాకు ఏదీ కలిసి రాలేదు. రోహిత్ శర్మపై మేనేజ్మెంట్ వేటు వేసి అతడి స్థానంలో పాండ్యాను తీసుకువచ్చినందుకు సొంత జట్టు అభిమానులే జీర్ణించుకోలేకపోయారు.అడుగడుగునా హార్దిక్ పాండ్యా, ముంబై యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తైన పాండ్యా చెత్త కెప్టెన్సీతో విమర్శలు మూటగట్టుకున్నాడు. అతడి సారథ్యంలో ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్.. పదో స్థానంతో ఈ సీజన్ను ముగించింది.ఇదిలా ఉంటే.. వ్యక్తిగత జీవితంలోనూ హార్దిక్ పాండ్యా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అతడి భార్య నటాషా స్టాంకోవిక్తో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 ముగియగానే హార్దిక్ పాండ్యా ఒంటరిగానే లండన్కు వెళ్లి సెలవులను గడిపినట్లు సమాచారం. అనంతరం.. అమెరికాకు వచ్చిన టీమిండియాతో అతడు చేరినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో భారత ఆటగాళ్లంతా ప్రాక్టీస్ షురూ చేసిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఇందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ‘‘మెగా టోర్నీ కోసం న్యూయార్క్లో రావడం ఎగ్జైటింగ్గా ఉంది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఎండ కూడా బాగా కాస్తోంది’’ అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. ‘‘జాతీయ జట్టు తరఫున విధుల్లో ఇలా’’ అంటూ తన ఫొటోలను హార్దిక్ పాండ్యా ఇన్స్టాలో షేర్ చేశాడు. నటాషాతో విడాకుల ప్రచారం ఊపందుకున్న తర్వాత ఈ పేస్ ఆల్రౌండర్ తొలిసారిగా ఇలా తన ఒక్కడి ఫొటోలు షేర్ చేయడం విశేషం.చదవండి: T20 WC: ఓపెనర్గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!📍 New YorkBright weather ☀️, good vibes 🤗 and some foot volley ⚽️Soham Desai, Strength & Conditioning Coach gives a glimpse of #TeamIndia's light running session 👌👌#T20WorldCup pic.twitter.com/QXWldwL3qu— BCCI (@BCCI) May 29, 2024 View this post on Instagram A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93) -
బ్యాట్ వదిలి బల్లెం పట్టిన డీకే
టీమిండియా మాజీ వికెట్కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్కు వీడ్కోలు పలికి వార్తల్లో నిలిచాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్కు గుడ్బై చెప్పిన అనంతరం డీకే క్రికెట్ ప్రపంచం మొత్తం నుంచి ఘనంగా సెడాంఫ్ను అందుకున్నాడు.క్రికెట్కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో సేద తీరుతున్న డీకే.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. Neeraj Chopra trained Dinesh Karthik to be his partner at 2024 Olympics.#Neerajchopra #Dineshkarthik pic.twitter.com/zOLswEDjW8— scOut Op (@ScOutoppp69) May 29, 2024డీకే జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరలవుతంది. ఈ వీడియోలో డీకే రెండు ప్రయత్నాల అనంతరం బల్లెంను విజయవంతంగా నిర్దేశిత ప్రాంతం ఆవలికి విసరగలిగాడు. లాస్ట్ ఛాన్స్ అని నీరజ్ను అడిగి మరీ జావెలిన్ను అందుకున్న డీకే.. ప్రొఫెషన్ అథ్లెట్లా రన్ అప్ తీసుకుని జావెలిన్ను సంధించాడు. మండే ఎండలో డీకే చేస్తున్న ప్రయత్నానికి ముగ్దుడైన నీరజ్.. నువ్వు చేయగలవు దినేష్ భాయ్ అంటూ ప్రోత్సహించాడు. నీరజ్ ప్రోత్సాహంతో జావెలిన్ను విసిరిన డీకే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి సక్సెస్ సాధించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డీకేను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీ ప్రయత్నం అమోఘమని కొనియాడుతున్నారు. తెలీని క్రీడలోనూ సక్సెస్ సాధించావని కితాబునిస్తున్నారు. క్రికెట్లో మ్యాచ్ ఫినిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ జావెలిన్ త్రోయర్ అంటూ కొనియాడుతున్నారు. మరికొందరేమో నీరజ్తో పాటు ఒలింపిక్స్లో అదృష్టాన్ని పరీక్షించుకోమని సూచిస్తున్నారు. 38 ఏళ్ల డీకే 2004 నుంచి 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. డీకే ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి తాజాగా ముగిసిన 2024 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.నీరజ్ చోప్రా విషయానికొస్తే.. 26 ఏళ్ల ఈ జావెలిన్ త్రోయర్ 2020 టోక్యో ఓలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది జులైలో జరిగే సమ్మర్ ఓలింపిక్స్లో నీరజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
‘ఐపీఎల్లో చెత్తగా ఆడినా.. వరల్డ్కప్లో మాత్రం దుమ్ములేపుతాడు’
ఐపీఎల్-2024లో దారుణంగా విఫలమైన ఆటగాళ్లలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ‘స్టార్’ గ్లెన్ మాక్స్వెల్ ఒకడు. ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేసింది.మాక్సీ ఆట తీరుపై నమ్మకంతో ఈ మేరకు భారీ మొత్తానికి అతడిని రీటైన్ చేసుకుంది. కానీ ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ మేనేజ్మెంట్, అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు.పదిహేడో ఎడిషన్ ఆరంభం నుంచే పేలవ ప్రదర్శనతో చతికిల పడ్డ మాక్స్వెల్.. మానసిక ఒత్తిడిని కారణంగా చూపి మధ్యలో కొన్ని మ్యాచ్లలో దూరమయ్యాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ కొన్ని మ్యాచ్లు ఆడగా.. మాక్సీ తిరిగి వచ్చి మళ్లీ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు.అయితే, ఓవరాల్గా ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్లో కలిపి కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. జట్టుకు అవసరమైన సమయంలో ముఖ్యంగా కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.ఇదిలా ఉంటే.. మాక్సీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీ కానున్నాడు. అయితే, ఐపీఎల్-2024లో అతడి ఫామ్లేమి ప్రభావం ఆస్ట్రేలియా జట్టుపై పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘ఐపీఎల్ ఫామ్తో అసలు సంబంధమే లేదు. మాక్సీ ఇప్పటికే తనను తాను ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. సుదీర్ఘకాలంగా మెగా టోర్నీల్లో అద్భుతంగా రాణించే ఆటగాడు.. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్లుగా ఆడటంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు.టీ20 క్రికెట్లో మిడిలార్డర్లో ఆడుతున్నపుడు కొన్నిసార్లు రిస్క్ తీసుకోకతప్పదు. ఒక్కసారి క్రీజులో కుదురుకుని మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే తనకు తిరుగే ఉండదు.గతం గురించి చర్చ అనవసరం. గతాన్ని అతడు మార్చలేడు. అయితే, భవిష్యత్తును మాత్రం అందంగా మలచుకోగల సత్తా అతడికి ఉంది’’ అని ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా చెప్పుకొచ్చాడు.టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా.ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్ మెగర్క్, మాథ్యూ షార్ట్. -
పాలస్తీనాకు మద్దతుగా పోస్ట్.. రోహిత్ శర్మ భార్యపై ట్రోల్స్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే సోషల్మీడియా వేదికగా భారీ ట్రోలింగ్ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా ట్రెండింగ్లో ఉన్న ఓ పోస్ట్ను షేర్ చేయడమే ఇందుకు కారణం.వివరాల్లోకి వెళితే.. హమాస్ (పాలస్తీనాలో అధికారిక పార్టీ) నిర్మూలనే లక్ష్యంగా పాలస్తీనాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబు దాడులు జరుపుతుంది. ఈ దాడుల్లో 37 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఈ దాడుల అనంతరం రఫా నగరం ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. విశ్వవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు రఫా నగరాన్ని హైలైట్ చేస్తూ పాలస్తీనాపై సానుభూతి చూపిస్తున్నారు.Meet Ritika Sajdeh, wife of Rohit Sharma.“Did she ever talk about Kashmiri Pandits?”-No“Did she ever talk about the vιolence happening by a specific community in India?”-No“Did she ever raise her voice for Hindus being persecuted in Pakistan and Bangladesh?”-No“Did she… pic.twitter.com/SFNrMHOtAM— Mikku 🐼 (@effucktivehumor) May 28, 2024టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక కూడా పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే ట్రెండింగ్లో ఉన్న ఓ పోస్ట్ను తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది.BIG NEWS 🚨 Rohit Sharma’s wife Ritika Sajdeh removes ‘All Eyes On Rafah’ Instagram story after facing backlash from Hindus 🔥🔥She had posted "All Eyes on Rafah" on social media in support of Palestine.Many Hindus started questioning her about her silence on the issue of… pic.twitter.com/ayfbgjtYV6— Times Algebra (@TimesAlgebraIND) May 29, 2024రితిక ఈ పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే భారత క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. భారత్లో ఎన్ని అరాచకాలు జరిగినా స్పందించని రితిక పరాయి దేశంలోని సమస్యపై స్పందించడమేంటని ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీ పండిట్లపై దాడులు, మణిపూర్లో హింస, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో హిందువులపై దాడులు జరిగినప్పుడు ఈమె ప్రశ్నించలేదే అని నిలదీస్తున్నారు. ఎక్కడో వేల మైళ్ల దూరంలో, భారత్కు ఏమాత్రం సంబంధం లేని అంశంపై రితక స్పందించడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇంటి సమస్యలు (భారత్లో జరిగేవి) పట్టవు కాని పరాయి దేశ సమస్యలపై గళం విప్పడం ఫ్యాషన్ అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. రఫా పోస్ట్పై నెట్టింట తీవ్ర వ్యతిరేత ఎదురవడంతో రితిక ఈ పోస్ట్ను వెంటనే డిలీట్ చేసి సైలెంట్ అయిపోయింది.ఇదిలా ఉంటే, రితిక కంటే ముందు చాలామంది భారతీయ సెలబ్రిటీలు పాలస్తీనా పౌరులకు మద్దతుగా 'ఆల్ ఐస్ ఆన్ రఫా' అనే పోస్ట్ను సోషల్మీడియాలో షేర్ చేశారు. ఈ లిస్ట్లో కరీనా కపూర్, అలియా భట్, వరుణ్ ధావన్, త్రిప్తి దిమ్రీ, సమంత రూత్ ప్రభు, ఫాతిమా సనా షేక్, స్వరా భాస్కర్, దియా మీర్జా లాంటి బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. -
T20 WC: ఓపెనర్గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1న మొదలుకానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ సహా మొదటి బ్యాచ్లోని కీలక ఆటగాళ్లంతా న్యూయార్క్ చేరుకున్నారు.మిగిలిన వాళ్లలో బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లితో పాటు మరికొంత మంది అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాగా జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.రోహిత్కు జోడీగా కోహ్లి వస్తే బెటర్ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. వరల్డ్కప్ టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కాగా మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖరారైపోగా.. రోహిత్కు జోడీగా కోహ్లి వస్తే బాగుంటుందని మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ శర్మ వన్డౌన్లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఓపెనర్గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!‘‘వరల్డ్కప్ ఈవెంట్లో కోహ్లి- జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి ఆరంభం లభిస్తుందన్న అంశం ఆధారంగా.. రోహిత్- స్కై(సూర్యకుమార్ యాదవ్) మూడు, నాలుగు స్థానాల్లో రావాలి. నిజానికి రోహిత్ స్పిన్ అద్బుతంగా ఆడగలడు. కాబట్టి నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే వాళ్లు మిడిల్ ఓవర్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.అయితే, ఐర్లాండ్, పాకిస్తాన్లతో మ్యాచ్లకు మాత్రమే ఈ ఓపెనింగ్ జోడీ బాగుంటుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్దీప్ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్Kohli & Jaiswal should open in the World Cup imo. Rohit & SKY should bat 3&4 depending on the start we get. Rohit plays spin really well so batting at 4 shouldn't be a concern. #T20WorldCup #INDvPAK #INDvIRE pic.twitter.com/nMgwwaDNXb— Wasim Jaffer (@WasimJaffer14) May 29, 2024 -
T20 World Cup 2024: సూపర్-8లో టీమిండియా ప్రత్యర్థులు వీరే..!
క్రికెట్ మహా సంగ్రామం టీ20 వరల్డ్కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి పొట్టి ప్రపంచకప్లో రికార్డు స్థాయిలో 20 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్కు ఐదు జట్ల చొప్పున జట్లన్నీ నాలుగు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్లోని మిగతా నాలుగు జట్లతో ఓ మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ అనంతరం గ్రూప్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు తమ సొంత గ్రూప్లోని జట్టు మినహా మిగతా మూడు గ్రూప్ల్లోని ఒకటి లేదా రెండు స్థానాల్లో నిలిచే ఏదో ఒక జట్టుతో (ప్రత్యర్ధి ఎవరో గ్రూప్ దశలో స్థానంపై ఆధారపడి ఉంటుంది) పోటీపడుతుంది. సూపర్-8 దశ ముగిసిన అనంతరం తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. రెండు సెమీస్ల్లో గెలిచే జట్లు జూన్ 29న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ రకంగా ప్రపంచకప్ పోటీలు జరుగుతాయి.టీమిండియా సూపర్-8కి చేరితే..ఈ ప్రపంచకప్లో భారత్ పాకిస్తాన్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా జట్లతో గ్రూప్-ఏలో పోటీపడుతుంది. ఈ గ్రూప్లో పాక్ మినహా మిగతా జట్లన్నీ పసికూనలే కావడంతో భారత్ సూపర్-8కు చేరడం దాదాపుగా ఖాయమనే చెప్పాలి. టీమిండియాకు పాక్పై కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారత్ గ్రూప్ టాపర్గా నిలవడం ఖాయం.ఈ నేపథ్యంలో సూపర్-8లో భారత్ ప్రత్యర్దులు ఎవరయ్యే అవకాశం ఉందనే అంశంపై ఓ అంచనా వేద్దాం. సూపర్-8 దశలో టీమిండియా ప్రత్యర్దులుగా గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉండే జట్టు.. గ్రూప్-సిలో తొలి స్థానంలో నిలిచే జట్టు.. గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టు ఉంటుంది.ఈ లెక్కన గ్రూప్-బి నుంచి సూపర్-8 దశలో టీమిండియా ప్రత్యర్ది ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియా అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రూప్లో ఈ రెండు జట్లు మినహా మిగతా జట్టన్నీ (నమీబియా, స్కాట్లాండ్, ఒమన్) ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్నాయి. కాబట్టి ఆ జట్లకు సూపర్-8 దశకు చేరుకునే అవకాశాలు చాలా తక్కువ.గ్రూప్-సి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో న్యూజిలాండ్, వెస్టిండీస్ పటిష్టమైన జట్లుగా చెప్పవచ్చు. కాబట్టి ఈ గ్రూప్ నుంచి టీమిండియా ప్రత్యర్దిగా న్యూజిలాండ్ లేదా వెస్టిండీస్ అయ్యే అవకాశం ఉంది. ఈ గ్రూప్లో సంచలనాల జట్టైన ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉంది. ఈ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు. మరో రెండు జట్లైన ఉగాండ, పపువా న్యూ గినియా ఒక్క మ్యాచ్లో గెలిచినా ఆశ్చర్యమే అని చెప్పాలి.గ్రూప్-డి విషయానికొస్తే.. ఈ గ్రూప్ను గ్రూప్ ఆఫ్ డెత్గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ గ్రూప్లో అన్ని జట్లకు సంచలనాలు సృష్టించే సామర్థ్యం ఉంది. బలాబలాల ప్రకారం సౌతాఫ్రికా ఈ గ్రూప్ టాపర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిగతా నాలుగు జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఏ మ్యాచ్లో ఎలా ఆడతాయో అంచనా వేయలేని పరిస్థితి. కాబట్టి ఈ గ్రూప్లో రెండో స్థానంలో నిలిచే జట్టు ఏదో అంచనా వేయడం చాలా కష్టం. ఒకవేళ టీమిండియా గ్రూప్లో టాపర్గా నిలిస్తే.. గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచే జట్టునే ఢీకొట్టాల్సి ఉంటుంది.సూపర్-8లో టీమిండియా ప్రత్యర్దులు (అంచనా)..గ్రూప్-బి- ఆస్ట్రేలియా (జూన్ 24)గ్రూప్-సి- న్యూజిలాండ్ (జూన్ 20)గ్రూప్-డి- శ్రీలంక (జూన్ 22) -
T20 World Cup 2024: లంకేయులకు షాక్.. పసికూన చేతిలో పరాభవం
శ్రీలంక క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో వీరు చిత్తుగా ఓడారు. ఫ్లోరిడాలో జరిగిన ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. మైఖేల్ లెవిట్ (28 బంతుల్లో 55 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. లెవిట్తో పాటు తేజ నిడమనూరు (27), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (12 బంతుల్లో 27 నాటౌట్) సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మధుషంక (4-0-39-2) రాణించగా.. నువాన్ తుషార, దునిత్ వెల్లలగే, ఏంజెలో మాథ్యూస్ తలో వికెట్ పడగొట్టారు. Excellent success 🤩 Our first T20 World Cup Warm-up Match ends with a 𝘄𝗶𝗻 🆚🇱🇰Thanks for your enthusiasm 🦁#kncbcricket #nordek #t20worldcup #cricket #srivned #outofthisworld pic.twitter.com/eFKtpiY5V6— Cricket🏏Netherlands (@KNCBcricket) May 28, 2024అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. ఆ జట్టు పవర్ ప్లేలో 4 వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు మాత్రమే చేసింది. ఆతర్వాత కూడా లంక బ్యాటర్లు లయను అందుకోలేకపోయారు. ఏ దశలో గెలుపు దిశగా సాగలేకపోయారు. 18.5 ఓవర్లలో 161 పరుగుల వద్ద లంక ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా నెదర్లాండ్స్ సంచలన విజయం నమోదు చేసింది. లంక ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ హసరంగ బ్యాట్ ఝులిపించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. హసరంగ 15 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు వరుస సిక్సర్లు ఉండటం విశేషం. లంక ఇన్నింగ్స్లో హసరంగతో పాటు ధనంజయ డిసిల్వ (31), దసున్ షనక (35 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్యన్ దత్ 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బకొట్టగా.. కైల్ క్లెయిన్ 2, లొగాన్ వాన్ బీక్ ఓ వికెట్ పడగొట్టారు. నెదర్లాండ్స్ తమ రెండో వార్మప్ మ్యాచ్ను మే 30న ఆడనుంది. డల్లాస్లో జరిగే ఈ మ్యాచ్లో ఆ జట్టు కెనడాను ఢీకొట్టనుంది. శ్రీలంక తమ రెండో వార్మప్ మ్యాచ్ను మే 31న ఆడనుంది. ఫ్లోరిడాలో జరిగే ఆ మ్యాచ్లో లంకేయులు ఐర్లాండ్తో తలపడతారు. ప్రపంచకప్లో శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్-డిలో పోటీపడనున్నాయి. వీటితో పాటు సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు గ్రూప్-డిలో ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. ఈ రెండు జట్ల మధ్య సమరం జూన్ 9న న్యూయార్క్లో జరుగనుంది. -
T20 World Cup 2024: ఫీల్డర్గా మారిన ఆసీస్ చీఫ్ సెలెక్టర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఫీల్డర్ అవతారమెత్తాడు. నమీబియాతో జరిగిన టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో బెయిలీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఐపీఎల్ విధుల కారణంగా ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు (కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్వెల్, గ్రీన్, స్టోయినిస్) మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు. అతి త్వరలో వీరు జట్టుతో కలుస్తారని సమాచారం. నబీమియాతో మ్యాచ్లో బెయిలీతో పాటు ఆసీస్ ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ కూడా బరిలోకి దిగాల్సి వచ్చింది. వీరిద్దరే కాక ఆసీస్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ కూడా కాసేపు ఫీల్డింగ్ చేశారు. మిచెల్ మార్ష్, హాజిల్వుడ్ విరామం తీసుకున్న సమయంలో వీరు బరిలోకి దిగారు.ఇదిలా ఉంటే, ఆటగాళ్ల కొరత ఉన్నా నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. -
ఇంగ్లండ్-పాకిస్తాన్ టీ20 మ్యాచ్ రద్దు
కార్డిఫ్ వేదికగా పాకిస్తాన్-ఇంగ్లండ్ మధ్య నిన్న (మే 28) జరగాల్సిన టీ20 మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా టాస్ కూడా సాధ్యపడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్ కూడా వర్షం కారణంగానే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాలుగో టీ20 ఓవల్ వేదికగా మే 30న జరుగనుంది. ఈ సిరీస్లో జరిగిన ఏకైక మ్యాచ్లో (రెండో టీ20) ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. జోస్ బట్లర్ (84) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. షాహీన్ అఫ్రిది 3, ఇమాద్ వసీం, హరీస్ రౌఫ్ తలో వికెట్ పడగొట్టారు.184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. ఇంగ్లండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 19.2 ఓవర్లలో 160 పరుగులకు చాపచుట్టేసింది. రీస్ టాప్లే 3, మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ చెరో 2 వికెట్లు.. క్రిస్ జోర్డన్, ఆదిల్ రషీద్, లివింగ్స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.ఈ సిరీస్ ముగిసిన వెంటనే పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు టీ20 వరల్డ్కప్ 2024 ఆడేందుకు బయల్దేరతాయి. ప్రపంచకప్లో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ను జూన్ 4న (స్కాట్లాండ్తో).. పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ను జూన్ 6న (యూఎస్ఏతో) ఆడనున్నాయి. మెగా టోర్నీలో భారత్-పాక్ సమరం జూన్ 9న న్యూయార్క్ వేదికగా జరుగనుంది. -
పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్వుడ్, వార్నర్
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. హాజిల్వుడ్తో పాటు ఆడమ్ జంపా (4-0-25-3), నాథన్ ఇల్లిస్ (4-0-17-1), టిమ్ డేవిడ్ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మార్ష్ 18, ఇంగ్లిస్ 5, టిమ్ డేవిడ్ 23, వేడ్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్ స్కోల్జ్కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్, యూఎస్ఏ మధ్య నిన్ననే జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. -
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2024
ఐపీఎల్ 2024 సీజన్ సెంచరీల విషయంలో ఆల్టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 14 సెంచరీలు నమోదయ్యాయి. గతంలో ఏ సీజన్లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. 2023 సీజన్లో నమోదైన 12 సెంచరీల రికార్డును ఈ సీజన్ బద్దలు కొట్టింది. ఈ సీజన్లో వివిధ ఫ్రాంచైజీలకు చెందిన 13 మంది ప్లేయర్లు శతక్కొట్టారు. వీరిలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రెండుసార్లు సెంచరీ మార్కును తాకాడు. సీజన్ తొలి సెంచరీని లక్నో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ (63 బంతుల్లో 124*) నమోదు చేయగా.. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113*), సునీల్ నరైన్ (56 బంతుల్లో 109), రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108*), జానీ బెయిర్స్టో (48 బంతుల్లో 108*), జోస్ బట్లర్ (60 బంతుల్లో 107*), రోహిత్ శర్మ (63 బంతుల్లో 105*), యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104*), శుభ్మన్ గిల్ (55 బంతుల్లో 104), సాయి సుదర్శన్ (51 బంతుల్లో 103), సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102*), ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102), జోస్ బట్లర్ (58 బంతుల్లో 100*), విల్ జాక్స్ (41 బంతుల్లో 100*) వరుసగా సెంచరీలు చేశారు. ఈ సీజన్ వేగవంతమైన సెంచరీ రికార్డు ట్రవిస్ హెడ్, విల్ జాక్స్ పేరిట సంయుక్తంగా నమోదై ఉంది. హెడ్ ఆర్సీబీపై.. జాక్స్ గుజరాత్పై 41 బంతుల్లో శతక్కొట్టారు.సీజన్ల వారీగా సెంచరీలు..2024- 14 సెంచరీలు2023- 12 సెంచరీలు2022- 8 సెంచరీలు2021- 4 సెంచరీలు2020- 5 సెంచరీలు2019- 6 సెంచరీలు2018- 5 సెంచరీలు2017- 5 సెంచరీలు2016- 7 సెంచరీలు2015- 4 సెంచరీలు2014- 3 సెంచరీలు2013- 4 సెంచరీలు2012- 6 సెంచరీలు2011- 6 సెంచరీలు2010- 4 సెంచరీలు2009- 2 సెంచరీలు2008- 6 సెంచరీలుఓవరాల్గా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 101 సెంచరీలు నమోదయ్యాయి. -
టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్ పేరు ఖరారు.. త్వరలోనే ప్రకటన..?
టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. భారత్ హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్లు గంభీర్ స్వయంగా సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. గంభీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ అయిన షారుఖ్ ఖాన్కు కూడా ఈ విషయం తెలుసని సదరు వెబ్సైట్ వెల్లడించింది. హెడ్ కోచ్ పదవికి గంభీర్ దరఖాస్తు చేశాడా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ ఈ విషయం ముమ్మాటికి నిజమేనని సోషల్మీడియా సైతం కోడై కూస్తుంది. ఇదే విషయాన్ని ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా స్పష్టం చేశాడని తెలుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి జై షా, గంభీర్ల మధ్య డీల్ కుదిరిందని.. ఈ విషయమై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని సదరు ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు సమాచారం. రెండ్రోజుల కిందట ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఈ డీల్ క్లోజ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ముగిశాక గంభీర్-జై షా చాలాసేపు బహిరంగంగా డిస్కస్ చేసుకోవడం జనమంతా చూశారు. ఆ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ పదవిపైనే చర్చ జరిగినట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తే కాని ఏమీ చెప్పలేని పరిస్థితి ఉంది. టీ20 వరల్డ్కప్ 2024తో భారత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది. ద్రవిడ్ పదవి వీడేందుకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ప్రకటన వెలువడేందుకు ఆస్కారం ఉంది. టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తుంది. కాగా, గంభీర్ మెంటార్షిప్లో కేకేఆర్ ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్గా అవతరించిన విషయం తెలిసిందే. పదేళ్లకు ముందు ఇదే గంభీర్ కెప్టెన్గా కేకేఆర్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. అంతకు రెండేళ్ల ముందు కూడా గంభీర్ ఓసారి కేకేఆర్కు టైటిల్ అందించాడు. ఘనమైన ట్రాక్ రికార్డుతో పాటు దేశం పట్ల గంభీర్కు ఉన్న కమిట్మెంట్ భారత్ హెడ్ కోచ్ పదవి రేసులో అతన్ని ముందుంచుతుంది. -
మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా
అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్ క్రికెట్కు లిస్ట్-ఏ హోదా లభించింది. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ఐసీసీ నిర్ణయం వెలువడటంతో ఎంఎల్సీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (యూఏఈ) తర్వాత లిస్ట్-ఏ హోదా పొందిన రెండో అసోసియేట్ సభ్య దేశ లీగ్గా ఎంఎల్సీ గుర్తింపు దక్కించుకుంది. ఎంఎల్సీ రెండో సీజన్ ఈ ఏడాది జులై 5 నుంచి ప్రారంభంకానుంది. ఎంఎల్సీలో ఈసారి గత సీజన్ కంటే ఎక్కువ మ్యాచ్లు జరుగనున్నాయి. గత సీజన్లో ఆరు జట్లు సింగిల్ రౌండ్ రాబిన్ ఫార్మట్లో మూడు వారాల పాటు 19 మ్యాచ్లు ఆడగా.. ఈ సీజన్లో అన్నే జట్లు గత సీజన్ కంటే 6 మ్యాచ్లు ఎక్కువగా ఆడనున్నాయి. ఎంఎల్సీని మరికొద్ది సీజన్లలో 10 జట్ల లీగ్గా ఎక్స్ప్యాండ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఎంఎల్సీలో బీసీసీఐ అనుబంధ ఆటగాళ్లు మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జట్ల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ లీగ్కు తొలి సీజన్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ లీగ్ను లిస్ట్-ఏ హోదా లభించడానికి ఇదీ ఒక కారణం. ఎంఎల్సీ అరంగేట్ర ఎడిషన్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఛాంపియన్గా నిలిచింది. ఈ జట్టుకు కీరన్ పోలార్డ్ నేతృత్వం వహించాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్తో పాటు లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సీయాటిల్ ఆర్కాస్, టెక్సస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడం ఎంఎల్సీలో మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. క్రికెట్లో లిస్ట్-ఏను వన్డే ఫార్మాట్ కింద పరిగణిస్తారు. అంతర్జాతీయ వన్డేలతో పాటు పలు దేశవాలీ టోర్నీలు కూడా ఈ జాబితా పరిధిలోకి వస్తాయి. లిస్ట్-ఏ పోటీలు గరిష్టంగా 8 గంటల పాటు సాగుతాయి. ఐసీసీచే అధికారికంగా వన్డే హోదా పొందని దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్లు కూడా లిస్ట్-ఏ కిందికే వస్తాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్, టీ20 క్రికెట్తో పాటు లిస్ట్-ఏ క్రికెట్ ఐసీసీచే గుర్తించబడిన మూడు ప్రధాన ఫార్మాట్లలో ఒకటి. -
ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత-ఏ జట్టు
భారత-ఏ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 31-నవంబర్ 10 మధ్యలో ఆస్ట్రేలియా-ఏతో రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్కు ముందు జరుగనుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు టీమిండియాతో కూడా ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 15-17 మధ్యలో జరుగనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత-ఏ జట్టు ఆడే రెండు మ్యాచ్లకు ఫస్ట్ క్లాస్ హోదా లభించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్పష్టం చేసింది.ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులు కొందరు ఈ సిరీస్లో పాల్గొంటారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సన్నాహకంగా ఈ సిరీస్ ఉపయోగపడనుందని సీఏ తెలిపింది. ఈ పర్యటన కోసం జట్ల ఎంపిక జరగాల్సి ఉంది. భారత్-ఏతో సిరీస్ పక్కా అయిన విషయాన్ని మాత్రమే క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.ఆస్ట్రేలియాలో భారత-ఏ జట్లు పర్యటన వివరాలు..తొలి నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు క్వీన్స్ల్యాండ్ వేదికగా జరుగనుంది.రెండో నాలుగు రోజుల మ్యాచ్- భారత్-ఏ, ఆస్ట్రేలియా జట్ల మధ్య నవంబర్ 7 నుంచి నవంబర్ 10 వరకు మెల్బోర్న్ వేదికగా జరుగనుంది.టీమిండియాతో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్- నవంబర్ 15 నుంచి 17 వరకు పెర్త్లో జరుగనుంది.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ ఇలా..తొలి టెస్ట్- నవంబర్ 22-28 వరకు (పెర్త్లో)రెండో టెస్ట్- డిసెంబర్ 6-10 వరకు (అడిలైడ్లో)మూడో టెస్ట్- డిసెంబర్ 14-18 వరకు (బ్రిస్బేన్లో)నాలుగో టెస్ట్- డిసెంబర్ 26-30 వరకు (మెల్బోర్న్లో)ఐదో టెస్ట్- 2025 జనవరి 3 నుంచి 7 వరకు (సిడ్నీలో)స్వదేశంలో జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఆస్ట్రేలియా కోల్పోయింది. దీంతో ఈసారి సిరీస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. -
T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
ఐపీఎల్ 2024 సీజన్ ముగిసి రెండు రోజులైనా పూర్తి కాకముందే క్రికెట్ సర్కిల్స్ను పొట్టి ప్రపంచకప్ ఫీవర్ పట్టుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి మరో మూడు రోజులు ఉండగానే అభిమానులతో పాటు విశ్లేషకులు వరల్డ్కప్ మోడ్లోకి వచ్చారు. ఈసారి తమ టీమ్ గెలుస్తుందంటే తమ టీమ్ గెలుస్తుందని అభిమానులు నెట్టింట డిబేట్లకు దిగుతున్నారు. విశ్లేషకులు, మాజీలు గెలుపు గుర్రాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు వరల్డ్కప్ సెమీస్కు చేరే జట్లపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో అందరూ భారత్ తప్పక సెమీస్కు చేరుతుందని చెప్పడం విశేషం.టీ20 వరల్డ్కప్ 2024 సెమీఫైనలిస్ట్ల విషయంలో మాజీల అంచనాలు ఇలా..అంబటి రాయుడు- భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాబ్రియాన్ లారా- భారత్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్పాల్ కాలింగ్వుడ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్సునీల్ గవాస్కర్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్క్రిస్ మోరిస్- భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియామాథ్యూ హేడెన్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాఆరోన్ ఫించ్- భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్మొహమ్మద్ కైఫ్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్టామ్ మూడీ- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాశ్రీశాంత్- భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్కాగా, టీ20 వరల్డ్కప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈసారి ప్రపంచకప్లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్లుగా విభజించబడి పోటీపడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాక్, ఐర్లాండ్, యూఎస్ఏ, కెనడా దేశాలు.. గ్రూప్-బిలో నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా.. గ్రూప్-సిలో ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్-డిలో నెదర్లాండ్స్, నేపాల్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడుతున్నాయి.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
పాక్ను శక్తివంతం చేస్తున్న చైనా? లక్ష్యం ఏమిటి?
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్గా మాజీ క్రికెటర్
పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్లు
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ప్రాణం తీసిన ఫొటో సరదా
ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ సెన్సార్ తప్పిదమే: ఐఎండీ
నేటితో చివరి అంకం..ప్రచారం ముగింపు
తప్పక చదవండి
- Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
- కౌంటింగ్లో ఏజెంట్లు కీలకం!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
- జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
- ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement