-
క్లుప్తంగా
మొక్కలు నాటేందుకు సంప్రదించండి కొరుక్కుపేట: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకు రావాలని గ్రెటర్ చైన్నె కార్పొరేషన్ ఆహ్వానించింది. ఈ మేరకు శనివారం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందులో చైన్నె నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు కార్పొరేషన్ పలు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి సంవత్సరం విస్తృతంగా మొక్కలు నాటుతూ వస్తోందని, గత రెండేళ్లలో 3 లక్షల 3 వేల 967 మొక్కలు నాటినట్టు చెప్పారు. ప్రస్తుత ఏడాది 2 లక్షల 50 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ పనులను మున్సిపల్ అధికారులు అమలు చేస్తున్నారని తెలిపారు. చైన్నెలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్కుల్లో మొక్కలు నాటడమే కాకుండా బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన, నివాస ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నివాసం, సంక్షేమ సంఘాలు, పర్యావరణ రక్షకులు మొక్కలు నాటే సమయంలో కార్పొరేషన్ను సంప్రదించాలని కోరారు. అధికారులు ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పరిశీలించి స్వచ్ఛంద సంస్థల సహ కారంతో మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రతి ఏరియాలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు వారి వారి వార్డు కార్యాలయాన్ని, పార్కు సిబ్బందిని సంప్రదించి మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ఈ విధంగా ఇప్పటివరకు 74 వేల మొక్కలు నాటినట్లు చెప్పారు. వచ్చే నెలలో పర్యా వరణ పరిరక్షణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం చైన్నెలో మొక్కలు నాటేందుకు స్థలాలను ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య తిరువళ్లూరు: పెళ్లి కాలేదని విరక్తి చెంది ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా ఆరంబాక్కం కుళినవల్ కాలనీ ప్రాంతానికి చెందిన రామదాస్ కుమారుడు కర్ణన్(36). ఇతనికి ఆరేళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయినా పెళ్లి కుదరలేదు. దీంతో విరక్తి చెందిన కర్ణణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గుర్తించి కర్ణన్ను కోట్టకరై ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చిక్సిత అనంతరం మెరుగైన చిక్సిత కోసం పొన్నేరి వైద్యశాలకు తరలించారు. అక్కడ చిక్సిత పొందుతూ మృతిచెందాడు. ఆరంబాక్కం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆధ్యాత్మికతను పెంచుతున్న జీయర్ ట్రస్ట్
కొరుక్కుపేట: ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిన అనేక విషయాలపై వివిధ పోటీలు నిర్వహిస్తున్న జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ – చైన్నె విభాగం చిన్నారుల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. స్థానిక మైలాపూర్లోని ఆంధ్ర మహిళా సభ ప్రాంగణంలో ఈనెల 13 నుంచి 18 తేదీ వరకు ప్రజ్ఞ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. త్రిదండి చినజీయర్స్వామి మంగళశాసనాలతో క్యాంపు నిర్వహించారు. భగవంతుని ఐదు రూపాలు అనే అంశంపై జరిగిన క్యాంప్లో భగవంతునికి సంబంధించిన ఐదు రూపాల కథలు, కథలకు సంబంధించిన ప్రాజెక్టు వర్క్స్, భజనలు, ఆధ్యాత్మిక ఆటలు, రామాయణంపై జరిగిన క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో సీనియర్, జూనియర్ బృందాల విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు, చిన్నారులకు డ్రాయింగ్ బుక్స్ అందజేశారు. జెట్కు చెందిన రవీంద్రకుమార్ రెడ్డి అన్నపూర్ణ, ఉమ్మిడి లలిత, మీరా, విశ్వంభర, పి.కమల, సునంద ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
విజేతలకు బహుమతుల ప్రదానం
కాంచీపురం(పళ్లిపట్టు): వేసవి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు కాంచీపురం కలెక్టర్ శనివారం బహుమతులతో సత్కరించారు. కాంచీపురం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక అన్నా జిల్లా క్రీడామైదానం కేంద్రంగా వేసవి శిక్షణ శిబిరం ఏప్రిల్ 29న ప్రారంభమైంది. శిబిరంలో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వేసవి శిబిరంలో ముగింపోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేసవి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ కలైసెల్వి అభినందించి సర్టిఫికెట్లతో పాటు యూనిఫాం అందజేశారు. వేసవి శిబిరాల ద్వారా విద్యార్థులతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తి కల్పించి వారిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతిఏటా వేసవి క్రీడాశిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఎస్పీ షణ్ముగం, జిల్లా క్రీడ, యువత సంక్షేమ అధికారి జయచిత్ర, స్విమ్మింగ్ శిక్షకులు ఆనంద్ పాల్గొన్నారు. -
నాది కాదు!
ఆపని తమిళసినిమా: ఇతరుల గురించి పట్టించుకోవడం తన పని కాదని, అంత తీరిక కూడా తనకు లేదని, తన పనిని తాను సక్రమంగా చేసుకుంటున్నానని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పేర్కొన్నారు. ఇటీవల ఈయన పేరు నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇళయరాజా సంగీతాన్ని అందించిన పాటకు కాపీ రైట్స్ కోరుతున్న విషయం విధితమే. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇటీవల తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని కాపీ కొట్టారంటూ సన్ పిక్చర్స్ సంస్థకు నోటీసులు కూడా జారీ చేశారు. అసలు సంగీతం గొప్పదా? సాహిత్యం గొప్పదా? అనే ప్రశ్నకు గీతరచయిత వైరముత్తు తెర లేపారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఇళయరాజా గురువారం ఒక వీడియోను తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేశారు. అందులో ఇటీవల తన గురించి ఏవేమో వార్తలు వస్తున్నట్లు వింటున్నానన్నారు. అయితే వాటి గురించి పట్టించుకునే సమయం తనకు లేదని, అలాంటి వాటిపై దృష్టి పెట్టడం తన పని కాదన్నారు. తన పని తాను సక్రమంగా చేసుకుంటున్నానని, చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూనే, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నానని, అయినప్పటికీ 35 రోజుల్లో సింపోనీ రాసి పూర్తిచేసినట్లు చెప్పారు. ఇది సంతోషకరమైన విషయం అని పేర్కొన్నారు. ఇళయరాజా జూలై 14న భారీ సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక నందనంలోని వీఎంసీఏ గ్రౌండ్లో జరగనున్న ఈ సంగీత విభావరిలో ఇళయరాజా కనీ సం 50 నుంచి 60 పాటలు పాడే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. -
@172
రజనీకాంత్ తమిళసినిమా: సూపర్స్టార్ రజనీకాంత్ 172వ చిత్రానికి పచ్చజెండా ఊపారా? ఆ ప్రశ్నకు అందుకు చర్చలు జరుగుతున్నట్లు ప్రముఖ నిర్మాత ఐసరి కే.గణేశ్ తెలిపారు. రజనీకాంత్ ఇటీవలే తన 170వ చిత్రం వేట్టైయాన్ను పూర్తిచేశారు. ఇందులో ఈయన మాజీ పోలీస్ ఎన్కౌంటర్గా నటించినట్లు సమాచారం. అమితాబ్బచ్చన్, తెలుగు నటుడు రానా వంటి ప్రముఖ నటులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రజనీకాంత్ తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్పైకి వెళ్లనుంది. కాగా తాజాగా రజనీకాంత్ 172వ చిత్రానికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. దీన్ని వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన ప్రస్తుతం హిప్హాప్ ఆది హీరోగా పీటీసార్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. చైన్నెలో నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు గురించి అడిగిన ప్రశ్నకు ఐసరి గణేశ్ బదులిస్తూ శింబు తన చిత్రం కరోనాకుమార్ చిత్రంలో నటిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు. ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే త్వరలో రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆయన గ్రీన్సిగ్నల్ ఇవ్వగానే వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై తలైవర్ 172వ చిత్రం ప్రారంభం అవుతుందని నిర్మాత ఐసరి గణేశ్ పేర్కొన్నారు. మొత్తం మీద రజనీకాంత్ 172వ చిత్రం కూడా షురూ అయినట్లేనని భావించవచ్చు. -
ఘనంగా వాసవీ జయంతి వేడుకలు
కొరుక్కుపేట: చైన్నెలోని ఎస్కేపీడీ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతి ఉత్సవం శనివారం నేత్రపర్వంగా సాగింది. ఎస్కేపీడీ పాలక మండలి సభ్యులు చేపట్టిన భారీ ఏర్పాట్ల మధ్య కళాశాల ప్రాంగణంలో ఉదయం 6 గంటలకు కన్యకా పరమేశ్వరి మూలవిరాట్లు, ఉత్సవమూర్తికి ఆలయ అర్చకులు త్రికాల అభిషేకాలతో పాటు మహాయాగం, ధూప దీపారాధనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ నుంచి వాహనంలో నగరానికి తీసుకుని వచ్చిన వాసవీ జ్యోతికి ఎస్కేపీడీ ట్రస్టీలు ఘనస్వాగతం పలికారు. 1008 మంది మహిళలు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి క్షీర కలశాలను పూజల్లో ఉంచిన అనంతరం అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం సాయి రాగమాలిక ట్రస్ట్ నేతృత్వంలో 102 మంది గాయకులు ఆలపించిన భక్తిగీతాలు అలరించాయి. జార్జిటౌన్ గిడ్డంగి వీధిలోని సదరన్ ఇండియా వైశ్య సంఘం కార్యాలయం నుంచి సంఘ అధ్యక్షుడు డాక్టర్ కనిగెలుపుల అజంతా శంకరరావు, విజయలక్ష్మి దంపతులు నేతృత్వంలో వాసవి జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. అన్నానగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 108 క్షీర కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. ముందుగా సంఘ అధ్యక్షులు వైవీ హరికృష్ణ ఊరేగింపును ప్రారంభించారు. తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చైన్నె చైర్మన్ త్రినాథ్కుమార్ అధ్యక్షతన తిరువళ్లురు జిల్లా తిరూర్లోని కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి ప్రాజెక్టు చైర్మన్ ఎస్వీ పద్మనాభం పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాసవీ జ్యోతిని వాహనం ద్వారా జార్జ్టౌన్ లోని కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి తరలించి ట్రస్టీలకు అప్పగించారు. -
24న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
● టీఎన్పీఎస్సీ ప్రకటన కొరుక్కుపేట: తమిళనాడు జైళ్లలో, పబ్లిక్ హెల్త్ సర్వీస్ల్లో ఇంటర్వ్యూయర్, సోషల్ వర్కర్ పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు టీఎన్పీఎస్సీ ప్రకటించింది. వివరాలు.. తమిళనాడు పబ్లిక్ సెలక్షన్ కమిషన్ (టీఎన్పీఎస్సీ) తమిళనాడు పబ్లిక్ హెల్త్ సర్వీస్లో మాస్ ఇంటర్వ్యూయర్, అలాగే తమిళనాడు జైల్ సర్వీస్లో సోషల్ వర్కర్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులకు రాత పరీక్ష 8.12.2023 నుంచి 10.2.2023న మధ్య జరిగింది. అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మార్కుల వివరాలు, ర్యాంక్ వివరాలను 22.2.2024న రైల్వే బోర్డు వెబ్సైట్లో ప్రచురించారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 24న జరుగునుందని చైన్నె బ్రాడ్వేలో ఉన్న టీఎన్పీఎస్సీ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు, ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం వచ్చే దరఖాస్తుదారుల సంఖ్య, సంచిత ర్యాంక్ సంఖ్య, రిజర్వేషన్ నియమాలు, ఖాళీల ఆధారంగా రూ పొందించిన తాత్కాలిక అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో ప్రచురించారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీ, అభ్యర్థులు సమయం, వివరాలతో కూడిన కాల్ లెటర్ను ఎంపిక బోర్డు వెబ్సైట్ www.tnpsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. బాలికను గర్భవతిని చేసిన 16 ఏళ్ల బాలుడు ● నిందితుడిపై పోక్సో కేసు అన్నానగర్: చైన్నెలోని రాయపేట ప్రాంతంలో నివసిస్తున్న ప్లస్–1 విద్యార్థిని మరుగుదొడ్డిని శుభ్రం చేసేందుకు ఉంచిన క్రిమిసంహారక మందును నీళ్లలా పొరపాటున తాగినట్లు తెలుస్తోంది. దీంతో వాంతులు చేసుకుని సృహతప్పి పడిపోయింది. చికిత్స నిమిత్తం రాయపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించే సరికి షాక్ అయ్యారు. విద్యార్థిని 2 నెలల గర్భవతి అని తేలింది. వెంటనే విద్యార్థిని కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి 2 నెలల పిండాన్ని తొలగించారు. ఈ ఘటనపై రాయపేట ఆల్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆ విద్యార్థిని తన పక్కింటిలో నివాసముండే 16 ఏళ్ల బాలుడిని ప్రేమిస్తున్నట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఈ కారణంగానే గర్భవతి అయినట్లు వివరించింది. దీంతో పోలీసులు ఆ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. రూ.1.50 కోట్ల గంజాయి సీజ్ ● కంప్యూటర్ ఇంజినీర్ అరెస్ట్ అన్నానగర్: మడిపాక్కం సమీపంలో శుక్రవారం రాత్రి ఆటోలో రూ.కోటిన్నర గంజాయిని అక్రమంగా తరలిస్తున్న కంప్యూటర్ ఇంజినీర్ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె శివారులోని మడిపాక్కం ప్రాంతంలో గంజాయి చలామణి ఎక్కువగా ఉందని పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో మడిపాక్కం అసిస్టెంట్ కమిషనర్ పురుషోత్తమన్న్ ఆధ్వర్యంలో పోలీసులు పల్ల్లావరం – తురైపాక్కం 200 అడుగులు రేడియల్ రోడ్డులో గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో అటువైపుగా వెళుతున్న ఆటోను నిలిపి తనిఖీ చేపట్టారు. ఆటోను అనకాపుత్తూరుకు చెందిన మురళీకృష్ణ( 46) నడిపాడు. ఆటోలోని ప్రయాణికుడిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో పోలీసులు అతడి వద్ద ఉన్న బ్యాగ్, సూట్కేస్ను సోదా చేయగా అందులో సుమారు రూ. 1.50 కోట్ల విలువైన 7 కిలోల హైగ్రేడ్ గంజాయి ఉండడంతో సీజ్ చేశారు. విచారణలో ప్రయాణికుడు నంగనల్లూరుకి చెందిన శ్రీనివాస రాహుల్ (29 )గా తేలింది. పెరుంగుడిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 100 తులాల నగలు చోరీ కొరుక్కుపేట: తూతుకుడి కార్పొరేషన్ చిన్నమణి వీధిలో ఉంటున్న ఫిషరీస్ కళాశాల రిటైర్డ్ వైస్ చాన్స్లర్ సుకుమార్ ఇటీవల ఇంటికి తాళం వేసి చైన్నెకి వెళ్లారు. ఈ సమయంలో ఇంటిపై దుండగులు దాడి చేసి 100 తులాల నగలను దోచుకెళ్లారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ బాలాజీ శరవణన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుకుమార్ తన కూతురు పెళ్లికి ఏర్పాట్లు చేస్తుండగా 100 తులాల నగలు చోరీకి గురవడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బోనులో చిక్కిన చిరుత కొరుక్కుపేట: నైల్లె జిల్లా అంబసముద్రం సమీపంలోని వెంబయ్యపురం గ్రామ పరిధిలో తరచూ పశువులను వేటాడుతున్న చిరుతపులి అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో శుక్రవారం రాత్రి చిక్కుకుంది. దాన్ని కోటయార్ అటవీ ప్రాంతంలో అధికారులు విడిచిపెట్టారు. ఆహారం, నీటి కోసం మాత్రమే అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని వన్యమృగాలు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు తగిన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. -
అందులో తగ్గేదేలే!
తమిళసినిమా: అందం చూడవయ్యా ఆనందించవయ్యా అన్నాడో కవి. అలా అందానికి వశం అవ్వని, ఆస్వాదించని మగాడు ఉండడీ ధరణిలో అనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు అలాంటి అందాన్ని కాపాడుకునే, మెరుగులు దిద్దుకునే సంస్కృతి పెరుగుతోంది. ఇక సినీ తారల విషయానికి వస్తే అదే వారి పెద్ద పెట్టుబడిగా మారిపోయింది. కథానాయికలు అందంగా మెరిసిపోతేనే అవకాశాలు తలుపుతడతాయి. దీంతో పెళ్లి అయిన తరువాత కూడా కథానాయికలు అందాల్లో సొగసుల మెరుపులు చూపిస్తున్నారు. హన్సిక మొదటి నుంచీ అందాన్నే నమ్ముకున్నారు. బాలతారగానే సినీ రంగప్రవేశం చేసిన హన్సిక ఆ తరువాత హిందీ, తెలుగు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. తమిళంలో 2011లో ధనుష్కు జంటగా మాప్పిళై చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పెద్దగా సక్సెస్ కాకపోయినా, ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. అలా విజయ్, శింబు, సూర్య వంటి స్టార్ హీరోలతో జత కట్టి పాపులర్ అయ్యారు. శింబుతో ప్రేమాయణం కూడా జరిపి వార్తల్లో కెక్కారు. అయితే ఆ ప్రేమ విఫలమైంది. అయినప్పటికీ హన్సిక కెరీర్ సాఫీగానే సాగుతోంది. 2022లో పెళ్లి కూడా చేసుకున్నారు. అయినప్పటికీ నటనకు దూరం కాలేదు. ఇటీవలే ఈమె నటించిన తమిళ చిత్రం పార్టనర్ చిత్రం విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ప్రస్తుతం రౌడీ బేబీ, గాంధారి, మెన్ అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరిన్ని అవకాశాల కోసం హన్సిక తన అందాలకు మెరుగు పెట్టి మరీ స్పెషల్ ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకుని దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందంలో హన్సిక తగ్గేదేలే అంటున్నారుగా అనే కామెంట్స్ చేస్తున్నారు. -
అశ్వదళంతో మెరీనాలో నిఘా
● అలల తాకిడిలో చిక్కుకున్న వారికి తక్షణ సాయం ●గ్రేటర్ చైన్నె పోలీసుల కీలక నిర్ణయం సాక్షి, చైన్నె : చైన్నె మెరీనా తీరంలో అశ్వదళంతో నిఘాను మరింత పటిష్టం చేశారు. అలల తాకిడిలో చిక్కే వారిని రక్షించడంలో ఇకపై ఈ దళంలోని సభ్యులు ముందంజలో ఉండనున్నారు. వివరాలు.. రాష్ట్ర రాజధాని నగరం చైన్నెలోని మెరీనా బీచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఇక్కడికి భారీగా జనం వచ్చి వెళ్తుంటారు. అతి పెద్ద బీచ్గా పేరు గడించిన మెరీనాలో అలల తాకిడికి గురయ్యే వారూ ఎక్కువే. ప్రమాదమని హెచ్చరిస్తున్నా, నిర్లక్ష్యంగా సముద్రంలోకి దిగి గల్లంతయ్యే వారూ అధికమే. ఇక్కడి జాలర్లు, పోలీసు యంత్రాంగం తరచూ రక్షణ చర్యలలో నిమగ్నమవుతున్నా, భారీ అలల కారణంగా వారిని రక్షించడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెరీనా తీరంలో భద్రతను మరింత పటిష్టం చేయడానికి అశ్వదళాన్ని ఉపయోగించుకునే పనిలో గ్రేటర్ చైన్నె పోలీసులు నిమగ్నమయ్యారు. అశ్వాలపై చక్కర్లు.. బ్రిటీష్ హయాంలో మద్రాసు ప్రెసిడెన్సీలో అశ్వదళం పరిచయమైంది. తొలుత పుదుపేట, వెప్పేరి, బ్రాడ్ వే, ట్రిప్లికేన్, సైదాపేట పరిసరాలలో ఈ విభాగం భద్రతా విధుల్లో ఉండేది. కాలక్రమేనా అశ్వదళం కేవలం పుదుపేట విభాగానికే పరిమితమైంది. పుదుపేట పోలీసు స్టేషన్ పరిధిలో 25 అశ్వాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యేక శిక్షణ పొందినవి. ఇందులో 11 గుర్రాలు మరింతగా ప్రత్యేక శిక్షణలో ఆరితేరాయి. వీటిని స్వారీ చేసే పోలీసులు సైతం ప్రత్యేక శిక్షణ పొందారు. మరో 14 అశ్వాలను వీఐపీల రాక సమయంలో, స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో పరేడ్ సమయంలో తమ పాత్రను పోషిస్తుంటాయి. ప్రత్యేక శిక్షణ పొందిన అశ్వదళాన్ని మెరీనా తీరంలో భద్రతకు ఉపయోగించేందుకు గ్రేటర్ చైన్నె పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ బృందంలో శిక్షణ పొందిన మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. పొడవైన మెరీనా తీరంలో ఇసుకలో నడిపే వాహనాలలో దూసుకెళ్లడమే కాకుండా ఈ గుర్రాల సహకారంతో ఇటు నుంచి అటు...అటు నుంచి ఇటు చక్కర్లు కొడతూ నిరంతరం పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నారు. ఈ విభాగంలోని సిబ్బంది అశ్వాలను స్వారీ చేయడంలోనే కాదు గజ ఈతగాళ్లు కూడా. రద్దీ సమయంలో సముద్రంలోకి దిగకుండా చక్కర్లు కొడుతూ హెచ్చరికలు చేసే విధంగా వీరు వ్యవహరిస్తారు. ప్రస్తుతం గజ ఈతగాళ్లుగా ఉన్న సిబ్బంది అలల తాకిడిలో చిక్కుకునే వారిని రక్షించే విధంగా ముందుకెళ్లేందుకు పరుగులు తీస్తున్నారు. అంతేకాదు, చైన్ స్నాచర్లను వెంటాడడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఇక్కడ విధులలో ఉన్న గుర్రాలకు కబాళి, రోలన్, సారథి వంటి పేర్లుతో పాటు కావేరి, వైగై, తామర భరణి తదితర నదుల పేర్లును సైతం అధికారులు పెట్టడం విశేషం. -
పశ్చిమ కనుమల్లో వరుణ బీభత్సం
● మరో ఐదు రోజుల పాటు వర్షాలు ● పిల్లూరు, కున్నూరులో 17 సెం.మీ వాన ● కుట్రాలంలో సందర్శకుల ప్రవేశంపై నిషేధం సాక్షి, చైన్నె : పశ్చిమ కనుమల సరిహద్దుల్లోని జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం ఈ జిల్లాలపై ఉంటాయని చైన్నె వాతావరణ కేంద్రం ప్రకటించింది. కుట్రాలంలో వరదల నేపథ్యంలో సందర్శకులపై నిషేధం విధించారు. పిల్లూరు, కున్నూరులలో అత్యధికంగా 17 సెం.మీ వర్షం పడింది. వివరాలు.. గత నాలుగైదు రోజులుగా పశ్చిమ పర్వత శ్రేణుల వెండి ఉన్న కేరళ సరిహద్దుల్లోని తమిళ జిల్లాలైన కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, తేని, దిండుగల్, కోయంబత్తూరు, నీలగిరిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజులుగా ఈ ప్రభావం మరింతగా పెరిగింది. శుక్రవారం రాత్రి పశ్చిమ కనుమలలోని కోయంబత్తూరు జిల్లా పిల్లూరు పరిసరాలు, నీలగిరి జిల్లా కున్నూరులో భారీ వర్షం పడింది. 17 సెం.మీ వర్షం ఇక్కడ పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ జిల్లాల్లో మరో ఐదు రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం మదురై, విరుదునగర్ జిల్లాలోనూ అనేక చోట్ల వర్షాలు పడ్డాయి. ఆదివారం నుంచి తెన్కాశి, తిరునల్వేలి, తేని, దిండుగల్ జిల్లాలో మరింత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయనే హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో తిరునల్వేలిలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ బృందాలు తిష్ట వేశాయి. తిరునల్వేలిలో ఓ ఇంటి గోడ కూలడంతో బాలిక మరణించింది. శుక్రవారం తెన్కాశి జిల్లా కుట్రాలంలో హఠాత్తుగా వరదలు పోటెత్తడం, ఓ బాలుడు మరణించడంతో ఇక్కడ సందర్శకులపై నిషేధం విధించారు. శనివారం ఉదయం ఆ జిల్లా కలెక్టర్ కమల్ కిషర్, ఎస్పీ సురేష్కుమార్ నేతృత్వంలోని బృందాలు కుట్రాలంలోని అన్ని జలపాతాల పరిసరాలలో పర్యటించారు. పాత కుట్రాలం, చిట్టరివి జలపాతాలు ప్రజా పనుల శాఖ చేతిలో ఉండడంతో భద్రత దృష్ట్యా వీటిని అటవీ శాఖకు అప్పగించాలని నిర్ణయించారు. ఇక ఇప్పటికే కుట్రాలం లోయలు, కొండలు అటవీశాఖ పరిధిలో ఉండడం గమనార్హం. -
సంతానం సందడి
థియేటర్లలో తమిళసినిమా: నటుడు సంతానం కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ఇంగ నాన్దాన్ కింగ్. ఆనంద్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గోపురం ఫిలింస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్సియర్, నిర్మాత అన్భుచెళియన్ సమర్పణలో ఆయన వారసురాలు సుస్మిత అన్బుచెళియన్ నిర్మించింది. ఈ చిత్రంలో నటి ప్రియాలయ నాయకిగా నటించగా తంబి రామయ్య, బాలాసరవణన్, దివంగత నటుడు మనోబాల, మునీశ్కాంత్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. అప్పు చేసి దాన్ని తీర్చడానికి సంతానం పడే ఇక్కట్లు ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో వినోదానికి పెద్ద పీట వేశారు. కాగా చిత్రం విడుదలైన థియేటర్లకు నటుడు సంతానం తన చిత్ర యూనిట్తో శుక్రవారం విజిట్ చేశారు. దీంతో థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు. ఇంగ నాన్ దాన్ కింగ్ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసిన సంతానం ప్రేక్షకులతో కలిసి కాసేపు సందడి చేశారు. చిత్రంలోని సంతానం నటన, పంచ్ డైలాగ్స్కు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్రానికి డి.ఇమాన్ సంగీతం చాలా బలాన్ని చేకూర్చింది. సంతానం పూర్తిగా తన భుజాలపైనే మోసిన చిత్రం ఇంగ నాన్దాన్ కింగ్ అన్నది ప్రేక్షకుల టాక్. -
ఎంటీసీ బస్టాప్లలో డిజిటల్ బోర్డులు
● ప్రయాణికుల కోసం సమగ్ర సమాచారం ●రూ. 136 కోట్లతో 532 చోట్ల బోర్డులు సాక్షి, చైన్నె: ఎంటీసీ బస్టాప్లలో ప్రయాణికులకు సమగ్ర సమాచారం అందించేందుకు వీలుగా డిజిటల్ బోర్డుల ఏర్పాటుకు రవాణా సంస్థ నిర్ణయించింది. రూ. 136 కోట్లతో 532 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రయోగాత్మకంగా శనివారం నాలుగు మార్గాలలో ఈ బోర్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వివరాలు.. చైన్నెలో ఎంటీసీ బస్సుల సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజుకు 3,100 బస్సులు సుమారు 900 మార్గాలలో సేవలను అందిస్తున్నాయి. రోజుకు 30 లక్షల మంది ప్రయాణికులు ఈ బస్సుల సేవలను వినియోగిస్తున్నారు. ఈ బస్సుల కోసం ఆయా మార్గాలలోని ప్రధాన ప్రాంతాలలో బస్టాప్లు ఉన్నాయి. ఈ బస్టాప్లలో ఆధునిక హంగులతో ఏర్పాట్లు ఉంటాయి. అయితే, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారే కాకుండా అధిక శాతం మందికి ఏ బస్సు ఏ బస్టాప్లో ఆగుతుందో అనే సమాచారంపై అవగాహన తక్కువే. దీంతో బస్సు ముందు భాగం ఉండే డిజిటల్ బోర్డులోని సమాచారం పైనే ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న నగర రవాణా సంస్థ ప్రయాణికులకు సమాచారాన్ని సులభంగా అందించాలని నిర్ణయించింది. బస్టాప్లలో డిజిటల్ బోర్డులు నగరంలోని ప్రధాన మార్గాలలో ఉన్న బస్టాప్లలో డిజిటల్ బోర్డుల ఏర్పాటుకు నిర్ణయించారు. రూ.136 కోట్లతో 532 బస్టాప్లలో ఈ బోర్డుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా శనివారం అన్నాసాలై, కోడంబాక్కం, ఎగ్మూర్, ఓమందూరర్ ఆస్పత్రి పరిసరాల్లోని బస్టాప్లలో ఈ డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ బోర్డులలో ఆ బస్టాప్లో ఆగి బస్సుల వివరాలు, మార్గాలు, బస్సు ఏ సమయానికి వస్తుందో తదితర వివరాలను సులభతరంగా ప్రయాణికులు తెలుసుకునేందుకు వీలుగా తమిళం, ఆంగ్లంలలో వివరాలను పొందు పరిచారు. ఈ బోర్డులకు బస్సులలోని జీపీఎస్ను అనుసంధానించారు. ఈ మేరకు బస్సు ఆ బస్టాప్కు ఏ సమయంలో వస్తుందో అన్న వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ డిజటల్ బోర్డులను పర్యవేక్షించేందుకు పల్లవన్ హౌస్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలూ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రక్రియ విజయవంతం కాగానే, 532 బస్టాప్లలో ఈ డిజిటల్ బోర్డుల ఏర్పాటు చేయనున్నారు. చైన్నె నగరంలో ఈ డిజిటల్ బోర్డు సమాచార సేవకు లభించే ఆదరణ బట్టి తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు వంటి నగరాలకు విస్తరింప చేయనున్నారు. ఇలాంటి డిజిటల్ బోర్డులతో కూడిన సమాచారం ప్రస్తుతం చైన్నెలో మెట్రో, ఎలక్ట్రిక్ రైల్వే స్టేషన్లలో అందిస్తున్న విషయం తెలిసిందే. -
కాంగేశం నౌక సేవ మళ్లీ వాయిదా
● ప్రయాణికుల్లో అసంతృప్తి ● టికెట్ వాపస్ ● ప్రారంభించే తేదీని కూడా ప్రకటించని అధికారులుసాక్షి, చైన్నె: తమిళనాడులోని నాగపట్నం – శ్రీలంకలోని కాంగేశం హార్బర్ మధ్య నౌక సేవకు మళ్లీ బ్రేక్ పడింది. టికెట్టు బుక్ చేసుకున్న వారందరికీ రీఫండ్ చేసే పనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. సరైన అనుమతులు దక్కని దృష్ట్యా, నౌక సేవలకు జాప్యం తప్పడం లేదని నిర్వాహకులు ప్రకటించారు. వివరాలు.. నాలుగు దశాబ్దాల అనంతరం తమిళనాడు – శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌక నడిపేందుకు కేంద్రప్రభుత్వం గత ఏడాది చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. సిరియ పాణి అని నామకరణం చేసిన నౌకలో 150 మంది ప్రయాణించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది అక్టోబరులో ఈ నౌకాయానం సేవలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. తొలి రోజు 50 మంది, మరుసటి రోజు 15 మంది మాత్రమే ఈ నౌకలో ప్రయాణించారు. పాస్ పోర్టు, వీసా, ఇతర అనుమతులను పొందడంలో నెలకొన్న జాప్యంతో పాటు డీజిల్ ఖర్చులకు కూడా సరి పడేందుకు తగినట్టుగా ప్రయాణికుల సంఖ్య లేక పోవడంతో సేవను రద్దు చేశారు. ప్రస్తుతం అన్ని రకాల సమస్యలను అధిగమించారు. వీసా లేకుండా నౌక ప్రయాణానికి సంబంధించిన అనుమతులు మంజూరయ్యాయి. దీంతో ఈ నౌక సేవలను మళ్లీ పునరుద్ధరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సిరియాపాణి అనే నౌకను పక్కన పెట్టి శివగంగై పేరిట కొత్త నౌకను సిద్ధం చేశారు. ఈ నౌక సేవలు మే 13వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని అధికారులు తొలుత ముందుగా ప్రకటించారు. ఈ మేరకు ప్రయాణికులు , పర్యాటకులు టికెట్లను బుక్ చేసుకున్నారు. ఇందులో ప్రయాణించే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే, అనుమతి దక్కని దృష్ట్యా పర్యటనను ఈనెల 17వ తేదీకి వాయిదా వేశారు. చివరకు 19వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో నౌక సేవలు జరుగుతాయని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం నుంచి నౌక సేవ షురూ అని భావించిన వారికి నిరాశ తప్పలేదు. శనివారం బుక్ చేసుకున్న వారందరికీ రీఫండ్ చేస్తూ, తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో నిర్వాహకుల తీరుపై పర్యాటకులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంక నుంచి, భారత ప్రభుత్వం నుంచి నౌక సేవకు పూర్తిస్థాయిలో అనుమతులు రాక పోవడంతోనే ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నౌక సేవ పునఃప్రారంభం ఎప్పుడో అన్నది త్వరలో ప్రకటిస్తామని పేర్కొనడంతో ఈ నౌకాయానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
రాష్ట్రాల మధ్య చిచ్చుకు మోదీ కుట్ర
● ప్రధాని బాధ్యతగా వ్యవహరించాలి ● సీఎం స్టాలిన్ హితవు సాక్షి, చైన్నె : రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడమే కాకుండా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రధాని మోదీ కుట్రలకు పాల్పడుతున్నారని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పదేళ్లలో ఆయన సాధించిన ప్రగతి శూన్యం అని తేలడంలో చెప్పుకునేదిలేక నోటికొచ్చింది వాగేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకాలను కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలకు ఉచిత బస్సు సేవల రూపంలో మెట్రో రైలుకు నష్టం వాటిల్లిందని ప్రధాని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న ప్రధాని దేశంలోని అందరికీ సమానమని, అయితే రాష్ట్రాల ప్రగతిని జీర్ణించుకోలేక ఆయన చేస్తున్న కువిమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాలను, ప్రజలను సమానంగా చూడని ప్రధాని నరేంద్ర మోదీకి జూన్ 4న దేశ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పనున్నారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి గెలుపు తథ్యమని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. -
పెళ్లికి అనుష్క సిద్ధమవుతోందా?
తమిళసినిమా: అందం, అభినయం పోటీ పడితే అది నటి అనుష్క అనవచ్చు. ఆదిలో అందాలారబోతతో అందరినీ అలరించినా, అరుంధతి చిత్రంతో ఆమె కెరీరే మారిపోయింది. ఆ చిత్రంలో అనుష్క నటనకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి ఉమెన్స్ సెంట్రిక్ కథా చిత్రాలకు కేరాఫ్గా మారారు. కాగా తెలుగు, తమిళం భాషల్లో అగ్రనటిగా రాణించిన అనుష్క సైజ్ జీరో (తమిళంలో ఇంజి ఇడుప్పళగి) చిత్రంలో పాత్ర కోసం బరువును భారీగా పెంచేశారు. అదే జీవితంలో ఆమె చేసిన పెద్ద పొరపాటు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు, ఆమె బరువు తగ్గలేదు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల మిసెస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో నటించారు. అందులో పెద్దగా లావు తగ్గకపోయినా, చిత్రం మంచి సక్సెస్నే అందుకుంది. కాగా ప్రస్తుతం మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. త్వరలో మరో తెలుగు చిత్రం చేయడానికి కమిట్ అయినట్లు సమాచారం. ఈ విషయాన్ని పక్కన పెడితే అనుష్క మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అన్నది తెలిసిందే. ఈమె వయసు ఇప్పుడు జస్ట్ 42. అయితే అనుష్క గురించి ఇప్పటికే పలు వదంతులు వచ్చాయి. టాలీవుడ్ స్టార్ ప్రభాస్తో ప్రేమ అని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ వార్తలను ఇద్దరూ ఖండించారు. తాము మంచి ఫ్రెండ్స్ అని స్పష్టం చేశారు. మరో టాలీవుడ్ దర్శకుడితో అనుష్కను కలిపి వదంతులు ప్రచారం జరిగాయి.తాజాగా అనుష్క త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమెకు ఒక కన్నడ నిర్మాతతో పెళ్లి నిర్ణయం అయినట్లు, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆ నిర్మాత ఎవరన్నది పేర్కొనకపోయినా, ఆయన వయసు 45 ఏళ్లని ప్రచారం జరుగుతోంది. అనుష్క కూడా బెంగళూర్ భామనే అన్నది తెలిసిందే. అయితే ఈమె పెళ్లి ఎప్పుడు? అసలు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? అన్న విషయంలో స్పష్టత రావలసి ఉంది. -
‘తోళి’ తోడ్పాటు!
సాక్షి, చైన్నె: ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న పేద మహిళలకు తోడ్పాటును అందించే విధంగా తోళి వసతి గృహాలను మెరుగు పరిచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో మరింతగా మెరుగైన సౌకర్యాలను తక్కువ ఖర్చుతో అందించేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. వివరాలు.. చైన్నె వంటి నగరాలు, జిల్లా కేంద్రాల్లో వివిధ సంస్థలలో ఉద్యోగాలు చేసుకునే మహిళలు, యువతులు అఽధికంగా ఉమెన్స్ హాస్టళ్లపై ఆధారా పడాల్సిన పరిస్థితి అధికంగా ఉంది. తమ కుటుంబాలు ఎక్కడో ఉంటే, తాము ఊరుగాని ఊరొచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్న వారూ ఇందులో ఎక్కువే. ఈనేపథ్యంలో చాలీచాలని జీతాలతో ప్రైవేటు మెన్షన్లు, ఉమెన్స్ హాస్టళ్లలో బస చేసి ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు, యువతులకు తోడ్పాటు అందించే విధంగా శ్రీతోళిశ్రీ(స్నేహితురాలు) పేరిట మహిళా హాస్టళ్ల నిర్మాణాలను ప్రభుత్వం విస్తృతం చేసింది. ప్రత్యేక చొరవ.. చైన్నెతో పాటు పలు ప్రాంతాలలో ఉన్న మహిళా హాస్టళ్లు(తోళి)లో నెలకు రూ.300 అతి తక్కువ అద్దెతో బస చేయడానికి ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. ఇందుకోసం చైన్నె, చెంగల్పట్టు, పెరంబలూరు, సేలం, తిరుచ్చి, తిరునెల్వేలి, తంజావూరు, వేలూరు, విల్లుపురం జిల్లాలో 11 తొలి మహిళా వసతి గృహాలు, హాస్టళ్లను నిర్మించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ భోజనాల గది, విశ్రాంతి గది, ఎయిర్ కండిషనర్లు, లిఫ్ట్ సౌకర్యం, వాషింగ్ మెషీన్, ఐరన్ బోర్డ్, ఐరన్ బాక్స్, ఫ్రిజ్తో కూడిన ప్యాంట్రీ, మైక్రోవోవన్, వాటర్ కూలర్తో కూడిన అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు వివరించారు. 24 గంటల భద్రతతో ఇక్కడ మహిళకు అనేక సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అయితే, ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వారి కుటుంబాలు, బంధువులకు ఎటువంటి వసతి కల్పించబోమని స్పష్టం చేశారు. రాత్రి పది గంటలలోపు మహిళలు హాస్టళ్లకు చేరుకోవాలని, ఒక వేళ వివిధ షిఫ్టులలో పనిచేసే వారు వారి షిఫ్ట్ సమయాల ప్రకారం హాస్టల్కు వచ్చే అవకాశం కల్పించారు. ఇక తమిళనాడు వర్కింగ్ ఉమెన్స్ కార్పొరేషన్ వెబ్సైట్ ద్వారా ఉద్యోగాలు చేసే మహిళలు శ్రీతోళిశ్రీ సహకారం పొందేందుకు వీలు కల్పించామని ప్రభుత్వం ప్రకటించింది. మహిళా ఉద్యోగుల కోసం ప్రభుత్వ సహకారం హాస్టళ్లలో మరిన్ని సౌకర్యాలు -
ఊయల చీర మెడకు బిగుసుకుని బాలుడు మృతి
అన్నానగర్: మదురైలోని ఎల్లీస్ నగర్ వైద్యనాథపుర నివాసి వేలుస్వామి. ఇతని కుమారుడు జయవీర (13). వీరి ఇంటి వెనుక ఉన్న వేప చెట్టుకు శుక్రవారం సాయంత్రం చీరతో ఊయల కట్టి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అతని తల్లిదండ్రులు బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జయవీర ఊయలలో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో బంధువులు గుర్తించి వేలుస్వామికి సమాచారం అందించారు. అనంతరం బాలుడిని మదురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించగా జయవీర అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వేలుస్వామి ఎస్.ఎస్.కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆడుకుంటున్న బాలుడు ఊయలలో చీర మెడకు బిగుసుకుపోయి మృతి చెందాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
140 కిలోల గంజాయి పట్టివేత
తిరువొత్తియూరు: పెరంబలూరు జిల్లా కున్నంలో కారులో తరలిస్తున్న 140 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. శనివారం ఉదయం కున్నం వైపు వెళుతున్న ఒక కారును పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు కారు వెంబడించి అడ్డుకున్నారు. పోలీసులు కారులో తనిఖీ చేయగా 140 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని కారులో ఉన్న ఐదుగురిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాట్సప్లో బిల్లులు చెల్లించవచ్చు అన్నానగర్: విద్యుత్ వినియోగదారులు ఇకపై వాట్సప్ ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చు. గతంలో విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వినియోగదారులు విద్యుత్ బోర్డు కార్యాలయం వద్ద క్యూలో గంటల తరబడి బారులు తీరేవారు. ఆ తర్వాత విద్యుత్ బోర్డు వెబ్సైట్ ద్వారా, వివిధ యాప్ల ద్వారా విద్యుత్ బిల్లు చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా వినియోగదారులకు సులువుగా బిల్లు చెల్లించేందుకు తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు పలు చర్యలు తీసుకుంటోంది. ఆ క్రమంలోనే తమిళనాడు విద్యుత్ బోర్డు ఇప్పుడు వాట్సాప్ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 2 నెలలకు ఒకసారి, ప్రతి ఇల్లు, దుకాణం విద్యుత్ వినియోగం కోసం మీటర్ వినియోగదారులు వినియోగించే విద్యుత్ యూనిట్ల ప్రకారం విద్యుత్ చార్జీలు నిర్ణయించబడతాయి. ఈ బిల్లింగ్ వివరాలు చెల్లింపు లింక్తో పాటు వినియోగదారుల వాట్సాప్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపుతారు. చికిత్స వికటించి మహిళ మృతి వేలూరు: తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని మోటూరు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి భార్య వేండమ్మాల్(42) రెండు సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆంబూరులోని అగ్నిమాపక కేంద్రం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేశారు. ఈ సమయంలో వేండమ్మాల్ అధిక రక్తస్రావమై మృతిచెందారు. దీంతో వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే వేండమ్మాల్ మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తర్వాత ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు బంధువులతో చర్చించి ఆస్పత్రి నుంచి బయటకు పంపారు. ఆంబూరు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు కొరుక్కుపేట: తిరువారూరు సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడి 20 మందికి పైగా గాయపడి ఆస్పత్రిలో చేరారు. మైలాడుదురై నుంచి వెళ్తున్న ప్రైవేటు బస్సు తేన్కుడి వద్ద బోల్తా పడింది. స్థానికులు, పోలీసులు వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ క్షతగాత్రుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
పెళ్లి పేరుతో మోసం
● 8 సవర్ల నగలు, రూ.30 వేల చోరీ ● యువకుడి కోసం గాలింపు అన్నానగర్: చైన్నె, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా హోంగార్డు నుంచి ఓ యువకుడు నగదు, నగలు చోరీ చేశాడు. ఆదంబాక్కం పెరియార్ నగర్కు చెందిన కవిత (30). పరంగిమలై పోలీస్స్టేషన్న్లో హోంగార్డు. ఈమె మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయి ఏడేళ్లుగా విడిగా ఉంటోంది. ఈ స్థితిలో అదే ప్రాంతానికి చెందిన వివాహమై భార్యతో విడిపోయి జీవిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి హరీష్(29)తో పరిచయం ఏర్పడింది. హరీష్, కవితను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. గత 11వ తేదీ రాత్రి హరీష్, కవితకు చెందిన ఎనిమిది సవర్ల బంగారు నగలు, రూ. 30 వేల నగదు తీసుకుని అదృశ్యమయ్యాడు. దీంతో షాక్కు గురైన కవిత అతని స్నేహితులను హరీష్ గురించి అడగగా, అతను తన బంధువును పెళ్లి చేసుకునేందుకు వెళ్లాడని చెప్పారు. దీంతో హరీష్పై చర్యలు తీసుకోవాలని కవిత మడిపాక్కం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పరారీలో ఉన్న హరీష్ కోసం గాలిస్తున్నారు. -
స్థానికథ పై కసరత్తు
● పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం దృష్టి ● డిసెంబర్లో నిర్వహించేందుకు యత్నాలు? ● పార్లమెంట్ ఫలితాల తదుపరి పూర్తిస్థాయి కార్యాచరణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై డీఎంకే పాలకులు దృష్టి పెట్టారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తదుపరి ఈ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ప్రస్తుతం జిల్లాల వారీగా ఉన్న స్థానిక సంస్థలు, వార్డులు, ఓటరు జాబితా తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. సాక్షి, చైన్నె: రాష్ట్రంలోని గ్రామ, యూనియన్, జిల్లా స్థాయి పంచాయతీలలో అధ్యక్షులు, వార్డు సభ్యుల వంటి లక్షన్నరకు పైగా పదవులు ఉన్నాయి. వీటిలో 27 జిల్లాలకు చెందిన స్థానిక సంస్థలకు 2019లో ఎన్నికలు జరిగాయి. ఆయా పాలకవర్గాల పదవీ కాలం డిసెంబర్లో ముగియనుంది. మరో 9 జిల్లాలు కొత్తగా ఆవిర్భవించిన నేపథ్యంలో వీటికి మాత్రం ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించలేదు. 2021లో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం ఈ జిల్లాలోని స్థానిక సంస్థలతో పాటు 125 మేరకు ఉన్న మునిసిపాలిటీలు, 529 మేరకు ఉన్న పట్టణ పంచాయతీలు, 15 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు అదే ఏడాది అక్టోబరు, సెప్టెంబర్ నెలలో ముగించారు. ఈ ఎన్నికల ద్వారా ఎంపికై న స్థానిక ప్రజా ప్రతినిధుల పదవీ కాలం 2026 చివరి వరకు ఉంది. ఈ స్థానాలలో మెజారిటీ పదవులు డీఎంకే ఖాతాలోనే చేరాయి. ఈ పరిస్థితులలో 2026 అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ అధికారమే లక్ష్యంగా డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టారు. లోక్సభ ఎన్నికలలో తాము క్లీన్ స్వీప్ చేస్తామనే ధీమాతో ఉన్నప్పటికీ, పూర్తి స్థాయిలో వచ్చే ఫలితాలు, ఓటుబ్యాంక్కు అనుగుణంగా పంచాయతీ ఎన్నికలపై కసరత్తు, వ్యూహాలకు మరింతగా పదును పెట్టే విధంగా స్టాలిన్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ఒకేసారి మొత్తం నిర్వహణకు.. 2026 అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ అధికారం రావాలంటే స్థానికంగా బలం తప్పనిసరి అని డీఎంకే పాలకులు గ్రహించారు. ఓ వైపు పార్టీ పరంగా బలోపేతం కావడం, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై కూడా దృష్టి పెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి సీఎం స్టాలిన్ ఆదేశాల జారీ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా నగరాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల విభాగాల అధికారులకు ప్రత్యేక సూచనలు చేసి ఉన్నట్టు వెలుగు చూసింది. అయితే 27 జిల్లాలలోని స్థానిక ప్రతినిధుల పదవీ కాలం డిసెంబర్తో ముగియనున్నప్పటికీ, మరో 9 జిల్లాలలోని ప్రతినిధుల పదవీ కాలం మరో 21 నెలలు ఉండడం సమస్యగా మారింది. ఈ 9 జిల్లాలకు ఎన్నికల నిర్వహించాల్సి ఉంటే 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రక్రియ మొదలెట్టాల్సి ఉంటుంది. అయితే అంతకు ముందే స్థానికంగా బలం పెంచుకునే వ్యూహంతో ఉన్న స్టాలిన్ అసెంబ్లీ వేదికగా కొత్త ఎత్తుగడకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. జూన్లో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంగా ప్రత్యేక తీర్మానం తీసుకొచ్చే వ్యూహంతో ఉన్నట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని స్థానిక సంస్థల పదవులను రద్దు చేసి, అన్నింటికీ కలిపి ఒకేసారిగా ఎన్నికల నిర్వహణకు కొత్త ఎత్తుగడతో ముందుకెళుతున్నట్టు చెబుతున్నారు. డిసెంబర్లోపు అన్ని ప్రక్రియలను ముగించి స్థానిక నగరా మోగించే కసరత్తుల్లో ఉన్నట్లు తెలిసింది. 2025 ఫిబ్రవరి నాటికి స్థానిక ఎన్నికల ప్రక్రియను ఒకేసారిగా ముగించి, తదుపరి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టే దిశగా పాలకులు ముందుకెళుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం వర్గాలు పేర్కొంటున్నాయి. అంతలోపు జిల్లాల వారీగా స్థానిక పరిస్థితులు, అంశాలు, వార్డుల వివరాలు, పోలింగ్ బూత్లు తదితర అంశాలతో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసుకునే విధంగా ముందుకెళుతున్నామని చెబుతున్నారు.రాష్ట్ర ఎన్నికల కార్యాలయం -
క్లుప్తంగా
బస్సులో వ్యక్తి మృతి అన్నానగర్: చైన్నెలోని కొళత్తూరు ప్రాంతానికి చెందిన చంద్రన్ (62). ఐటీ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్డ్అయ్యాడు. శుక్రవారం తిరుచ్చిలోని బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమ్నీ బస్సులో తిరుచ్చికి బయల్దేరాడు. శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బస్సు విల్లుపురం జిల్లా విక్రవాండి టోల్ బూత్ వద్దకు చేరుకోగా, డ్రైవర్ టీ తాగేందుకు రోడ్డు పక్కన ఉన్న కేఫ్ వద్ద బస్సును ఆపాడు. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న చంద్రన్ కూర్చున్న సీటుపై నురగలు కక్కుతూ పడుకుని ఉన్నాడు. తోటి ప్రయాణికులు అతడిని రక్షించి ముండియంబాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చంద్రన్ అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. హాస్టల్లో విద్యార్థి బలవన్మరణం అన్నానగర్: ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో డబ్బు పోగొట్టుకోవడంతో హాస్టల్లో ఆంధ్రా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రామయ్య భూకల (21). ఇతను కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీపెరంబుదూర్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్లో ఉంటున్న రామయ్య భూకల ఆన్లైన్లో జూదంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇందుకోసం తన వద్ద ఉంటున్న తోటి విద్యార్థుల నుంచి రూ.3 లక్షల వరకు అప్పు చేసి ఆన్లైన్ గ్యాంబ్లింగ్లో పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన రామయ్య భూకల శుక్రవారం రాత్రి హాస్టల్లోని ఓ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీపెరంబదూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ను ఢీకొన్న కారు ● బాలిక దుర్మరణం అన్నానగర్: తూత్తుకుడి సమీపం సాయిరాపురం మధుకురిచ్చికి చెందిన సింగరాయర్. ఇతని భార్య బ్యూలా (39). వీరి కుమార్తె ప్లాసిక (10). ఈమె 5వ తరగతి చదువుతోంది. శనివారం తెల్లవారుజామున సింగరాయర్ తన కుటుంబంలోని 9 మందితో కలిసి కుమరి జిల్లా నాగర్ కోయిల్లో బంధువుల వివాహ వేడుకకు కారులో బయలుదేరారు. కారు తూత్తుకుడి – పాళయంగొట్టై ప్రధాన రహదారిపై పోతలూరాణి ఎగ్జిట్ వద్దకు రాగానే కారు కుడివైపు టైరు అకస్మాత్తుగా పేలింది. దీంతో అదుపుతప్పిన కారు రోడ్డు డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో వెనుక కూర్చుని కుడివైపు కిటికీ వద్ద ఉన్న ప్లాసిక కిటికీలోంచి బయటకు పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందింది. కారులో ఉన్న మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు విచారణ చేస్తున్నారు. మానవత్వం మరచిన డ్రైవర్, క్లీనర్ అన్నానగర్: మేట్టుపాళయంలో బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడిన యువకుడిని డ్రైవర్, క్లీనర్ రోడ్డు పక్కన పడేసిన దృశ్యం నిఘా కెమెరాలో నమోదైంది. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం బస్స్టేషనన్్ ప్రవేశ ద్వారం దగ్గర శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఓ టూరిస్ట్ బస్సు నిలుచుకుని ఉన్న యువకుడిపై దూసుకెళ్లింది. విషయం తెలిసి మేట్టుపాళయం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన టూరిస్టు బస్సును గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని నిఘా కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అందులో బెంగళూరు నుంచి ఊటీకి వెళుతున్న టూరిస్ట్ బస్సు మేటుప్పాలయం బస్స్టేషన్ వద్ద నిలబడి ఉన్న యువకుడిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ శివరాజ్, క్లీనర్ శరవణన్ యువకుడిని ఎత్తుకెళ్లి రోడ్డుపక్కన పడేసినట్లు తేలింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ శివరాజ్, క్లీనర్ శరవణన్లను అరెస్టు చేసి బస్సును సీజ్ చేశారు. మలేషియా వర్సిటీతో అమృత ఒప్పందం కొరుక్కుపేట: ఏవియేషన్ రంగంలో విద్య, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా చైన్నెకు చెందిన చైన్నెస్ అమృత ఇంటర్నేషనల్ ఏవియేషన్ కాలేజ్ మలేషియాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ (యూనికాం)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో అమృత చైర్మన్ ఆర్.భూమినాథన్, మలేషియా లోని యూనికామ్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ కెప్టెన్ అబ్ మనాన్ బిన్ మన్సోర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. శ్రీలంక జాలర్ల అరెస్ట్ కొరుక్కుపేట: భారత సరిహద్దుల్లోకి సముద్రంలో చేపలు పట్టేందుకు ప్రవేశించిన ఏడుగురు శ్రీలంక జాలర్లను భారత కోస్ట్గార్డు అరెస్టు చేసింది. శనివారం ఉదయం తూత్తుకుడి సమీపంలో ఓ పడవలో జాలర్లు చేపల వేటలో నిమగ్నమై ఉన్నారు. వీరిని కోస్ట్ గార్డు వర్గాలు గుర్తించాయి. ఆ పడవను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఏడుగురు శ్రీలంకకు చెందిన జాలర్లు ఉండడంతో వారిని అరెస్టు చేసి తూత్తుకుడికి తరలించారు. శ్రీవారి సేవలో అపోలో డైరెక్టర్ తిరుమల: తిరుమల శ్రీవారిని శుక్రవారం అపోలో డైరెక్టర్ సంగీత దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా, టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. -
పనిచేయని టికెట్ యంత్రాలు
● ప్రయాణికుల ఇక్కట్లు కొరుక్కుపేట: ఎగ్మూర్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ టికెట్ యంత్రాలు పనిచేయక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో ఒకటైన ఎగ్మూర్ రైల్వేస్టేషన్. దీని పునరుద్ధరణ పనులు రూ.735 కోట్లతో గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ పని ఊపందుకుంది. ముఖ్యంగా గాంధీ ఇర్విన్ రోడ్డు పక్కన ఉన్న రైల్వే క్వార్టర్లు, రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైల్వే కార్యాలయం ఇప్పటికే కూల్చివేశారు. ఇక్కడ రైల్వేస్టేషన్, మల్టీ వెహికల్ పార్కింగ్ నిర్మాణం సహా వివిధ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో రైల్వేస్టేషన్ పునరుద్ధరణ పనుల కారణంగా ఎలక్ట్రిక్ రైలు టికెట్ కార్యాలయాన్ని ఎగ్మూర్ ఆర్పీఎఫ్ కార్యాలయం తాత్కాలికంగా ఆవరణలోకి మార్చారు. ఈ క్రమంలో కొత్త టికెట్ కౌంటర్లు ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మూడు ఆటోమేటిక్ టికెట్ కౌంటర్లలో రెండు ఆటోమేటిక్ యంత్రాలు పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
కేవీ కుప్పం గ్రామస్తుల ఆందోళన
వేలూరు: వేలూరు జిల్లా కేవీ కుప్పం ప్రాంతంలో గ్రామ సర్పంచ్పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులతో పాటు హిందూ మున్నని కార్యకర్తలు పోలీస్ స్టేషన్ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. వివరాలు.. కేవీకుప్పం సమీపంలోని వడుగంతాంగల్ సర్పంచ్గా రామలింగం ఉంటున్నారు. ఇతను హిందూ మున్ననిలో డివిజన్ కార్యదర్శిగానూ పనిచేస్తూ కంభం గ్రామంలో నివశిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన గ్రామంలో జరిగిన జాతర సమయంలో అర్ధరాత్రి సమయంలో చెరువు గట్టపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర గాయాలైన రామలింగం వేలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీటిపై లత్తేరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నాలుగు రోజులు అవుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ గ్రామస్తులతో పాటు హిందూ మున్నని కార్యకర్తలు శనివారం లత్తేరి పోలీస్ స్టేషన్ను ముట్టడించి ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఆందోళన కారులతో చర్చించారు. అనంతరం అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్ను ముట్టడించి ధర్నా నిర్వహించిన 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,510 మంది స్వామివారిని దర్శించుకోగా 43,199 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
కూలిన వందేళ్ల చింతచెట్టు
తిరుత్తణి: వందేళ్ల చింతచెట్టు నేలకూలింది. దీంతో కనకమ్మసత్రం – తిరువలంగాడు మార్గంలో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం నుంచి తిరువలంగాడు వెళ్లే రోడ్డులో ముత్తుకొండాపురం వద్ద వందేళ్ల భారీ చింతచెట్టు అడుగుభాగం దెబ్బతిని బలహీనంగా వుండేది. ఈక్రమంలో శనివారం ఉదయం చింతచెట్టు ఒక్కసారిగా వేర్లతో కుప్పకూలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో పోలీసులతో పాటు తిరుత్తణి హైవేశాఖ అధికారులు సంఘటన ప్రాంతం చేరుకుని జేసీబీతో రోడ్డు మధ్య నుంచి చింతచెట్టును తొలగించి ట్రాఫిక్ పునరుద్ధరించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement