-
ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి
లక్ష్మణచాంద: ప్రమాదవశాత్తు మాటు కాలువలో జారిపడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మండలంలోని ఒడ్డెపెల్లి గ్రామానికి చెందిన పల్లపు చిన్న రాజన్న(52) శనివారం రాచాపూర్ శివారులో కల్లు తాగడానికి వచ్చి కాలకృత్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా జారిపడి మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యానికి బానిసై ఒకరి ఆత్మహత్య భైంసాటౌన్: పట్టణంలోని కోర్వగల్లికి చెందిన జింక సతీష్ (35) శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎండీ గౌసుద్దీన్ కథనం ప్రకారం.. బోథ్కు చెందిన సతీష్ ఉపాధి నిమిత్తం మూడునెలల కిందట భైంసా పట్టణానికి కుటుంబంతో సహా వలస వచ్చాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస కావడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. హత్య కేసులో ఇద్దరి అరెస్టు ఆసిఫాబాద్రూరల్: ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య కళావతి, అక్కలపెల్లి రవీందర్ను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ సతీష్ తెలిపారు. మండలంలోని రహపల్లి గ్రామంలో ఈనెల 16న రాత్రి జరిగిన సంఘటన. అక్కలపెల్లి రవీందర్తో వివాహేతర సంబంధం పెటుకున్న కళావతి ప్రియుడితో కలిసి భర్త చున్కాకర్ రవీందర్ను హత్యచేసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇంట్లో దూలానికి వేలాడదీశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఒక ప్రకటనలో తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు నెన్నెల: మైలారం గ్రామానికి చెందిన యు వతి (18) నాలుగు రోజులుగా కనిపించడం లేదని ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఈ నెల 14న బెల్లంపల్లికి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో యువతి తండ్రి వెంక అభి శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు. -
No Headline
ఇటీవల సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో పదమూడేళ్ల బాలుడు మొబైల్ ఫోన్కు బాగా అలవాటుపడ్డాడు. రో జంతా సెల్ఫోన్లలో సోషల్ మీడియా, రీల్స్ తదితర మాధ్యమాల్లో మునిగితేలుతుండడంతో ఆ అలవాటు మాన్పించాలని అతని తండ్రి మందలించాడు. అయితే మనస్తాపానికి గు రైన ఆ యువకుడు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ సమీపంలోని జాతీయ రహదారిపై రాత్రి 9 గంటల తర్వాత దాదాపు 18 నుంచి 25 సంవత్సరాల లోపు యువకులు ద్విచక్ర వాహనాలపై ఇష్టారీతిన నడుపుకుంటూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు. ఆరా తీస్తే అప్పటికే వారు దాబాహోటల్లో మద్యం సేవించి ఇంటికి తిరిగి వస్తున్నట్టు తెలిసింది. పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మందలించి ఇంటికి పంపించారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్ స్టేషన్ పరి ధిలోని ఇల్లందు క్లబ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్ర మాదంలో వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన కుర్మ రాధమ్మ(60) అల్లుడు ఇటీవల చనిపోగా ఆదివారం నిర్వహించనున్న దశదినకర్మ కోసం శనివారం మందమర్రికి వ చ్చింది. స్థానిక ఇల్లందు క్లబ్ వద్ద బస్సు దిగి సీఎస్పీ రోడ్డు వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. -
ఈఏపీ సెట్లో విద్యార్థుల ప్రతిభ
ఆదిలాబాద్టౌన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీ సెట్–2024 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన రాహుల్ రాష్ట్రస్థాయిలో 60వ ర్యాంకు సాధించారు. 160 మార్కులకుగానూ 132.87 మార్కులు సాధించి ప్రతిభ చాటాడు. రాంనగర్కు చెందిన ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి మధుకర్–నంద దంపతుల కూతురు వర్ణతేజ 720 వ ర్యాంకు సాధించింది. 160 మార్కులకు గాను 100.55 మార్కులు సాధించి సత్తా చాటింది. ఎస్ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఈఏపీ సెట్లో ప్రతిభ కనబర్చారు. దోటి అవినాష్ 3,210, కనక ఓం దోటి అదిత్య 6,272, అనూ 6,634, దోటి అదిత్య 7,019, దొడ్డి చందు 7,775, క్రిష్ణ 8,171తో పాటు పలువురు విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. విద్యార్థులను ఎస్ఆర్ కళాశాలల జోనల్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాళ్లు జైపాల్రెడ్డి, బ్రహ్మం, అరవింద్ , అధ్యాపకులు అభినందించారు. -
పురుగు మందు డబ్బాలతో అన్నదాతల నిరసన
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ హెడ్ పోస్టాఫీస్ ఎదుట శనివారం అన్నదాతలు ఆందోళనకు దిగారు. గత మార్చిలో సీసీఐ ద్వారా పత్తి విక్రయించిన అన్నదాతలకు సంబంధించిన నగదును ఐపీపీబీ మేనేజర్ విజయ్ కుమార్ తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఈ విషయమై రైతుల ఫిర్యాదు మేరకు సదరు మేనేజర్పై కేసు నమోదు చేశారు. నెలలు గడుస్తున్నా తమ ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదని అన్నదాతలు పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు. పోస్టల్ అధికారులు గతంలోనే నెల తర్వాత ఖాతాలో డబ్బులు జమవుతాయని చెప్పినప్పటికీ ఇంతవరకు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 15 రోజులపాటు వేచి చూడాలని అధికారులు చెబుతున్నారని, పంట సాగు కాలం సమీపిస్తున్న దృష్ట్యా వీలైనంత త్వరగా నగదును తమ ఖాతాల్లో జమచేసి న్యాయం చేయాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోస్టల్ అధికారుల హామీతో ఆందోళన విరమించారు. ● పోస్టాఫీస్ ఎదుట ఆందోళన -
ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్టౌన్: ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై ఆదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమో దు చేసినట్లు ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. శనివారం వివరాలను వెల్లడించారు. శనివారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన జాస్మీన్ అనే మహిళకు 2017లో అబ్దుల్ అతీక్తో వి వాహమైంది. దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు న్నా రు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో గతేడాది ఫిబ్రవరిలో అబ్దుల్ అతీక్పై వేధింపుల కేసు నమోదైంది. భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆమె మెయింటెనెన్స్ కోసం కోర్టులో కేసు వేయగా నెలకు రూ.7వేల చొప్పున ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నాలుగు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా ఆమెకు ట్రిపుల్ తలాక్ ఇస్తున్నట్లుగా ఈ నెల 11న వాట్సాప్ ద్వారా రెండు నిమిషాల నిడివి గల సందేశం పంపించాడు. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. దీంతో ఆవేదనకు గురైన బాధితురాలు శనివారం మహిళా పోలీస్ స్టేషన్ అధికారులను ఆశ్రయించింది. 2019లోనే ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తూ ప్రత్యేక చట్టం తీసుకోచ్చిన విషయం తెల్సిందే. దీంతో అతీక్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఇన్స్పెక్టర్ వివరించారు. -
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
తాంసి: అకాల వర్షాలతో దెబ్బతిన్న జొన్నపంటను ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని సబ్మార్కెట్యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. దెబ్బతిన్న పంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. తడిసిన ప్రతీ గింజ కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతామన్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి దళారులు తీసుకొస్తున్న జొన్న పంటను కొనుగోలు చేయవద్దని ని ర్వాహకులకు సూచించారు. వారి వెంట సొసైటీ సీఈవో కేశవ్, నాయకులు కృష్ణ, రజనీకాంత్రెడ్డి, తదితరులున్నారు. -
‘కల్తీ కల్లును అరికట్టాలి’
ఆదిలాబాద్రూరల్: జిల్లాలో కల్తీ కల్లు వ్యాపారాన్ని వెంటనే అరికట్టాలని ఆదివాసీ భారత్ మహాసభ (ఏబీఎం) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల హీరా సుక మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండల కేంద్రాల్లో, పల్లెల్లో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోందని ఆరోపించారు. మద్యం ప్రియులను మత్తులోకి ముంచేందుకు గుల్ఫార్మ్, కఫ్ పౌడర్, యూరియా లాంటి విష పదార్థాలు కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. అధికారులు స్పందించి కల్తీ కల్లును నియంత్రించాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో ఏబీఎం జిల్లా అధ్యక్షుడు కినక సరేష్, నాయకులు దీపక్, వినోద్, వామన్, రమేశ్, ప్రదీప్, సాకారాం, తదితరులు పాల్గొన్నారు. -
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
కై లాస్నగర్: రాజీవ్ స్వగృహ లేఅవుట్లో పార్కు కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైనట్లు ప్లాట్ల కొనుగోలుదారులు శుక్రవారం కలెక్టర్ రాజర్షి షాకు ఫిర్యాదు చేశారు. స్థలాన్ని కాపాడలంటూ కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆది లాబాద్ ఆర్డీవో టి.వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎండీ.ఖమర్ అహ్మద్తో కలిసి శనివా రం లేఅవుట్ స్థలాన్ని పరిశీలించారు. స్థలంలో నిర్మాణాలు చేపట్టిన వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయని ఆ స్థలం తమది కనుకనే రోడ్డు వేస్తున్నామని నిర్మాణం చేపట్టిన వ్యక్తులు తెలిపారు. దీనిపై ఇరువర్గాల వారితో పాటు టీఎస్ఐఐసీ అధికారులతో సోమవారం సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు. వారి వెంట మావల తహసీల్దార్ వేణుగోపాల్, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు. -
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
కై లాస్నగర్: జూన్ 9న జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు 18 కేంద్రాలను, రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పరీక్షల ఏర్పాట్లపై ఆ సంస్థ చైర్మన్ ఎం. మహేందర్రెడ్డి శనివారం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, నోడల్ అధికారులతో గూగుల్మీట్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షకు 6,729 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి రూట్ ఆఫీసర్లు ఐదుగురు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు తదితర సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు ప్రఽశ్నపత్రాలను భద్రపరిచేలా స్ట్రాంగ్ రూమ్, గట్టి భద్రత ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందన్నారు. అభ్యర్థులు ఉదయం 9గంటలలోపే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9.30 గంటలకు బయోమెట్రిక్ హాజరు ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేలా అన్ని వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
ఆదిలాబాద్టౌన్: రిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల ఆత్మహత్యయత్నానికి పాల్పడిన పేషేంట్కేర్ కార్మికురాలు లక్ష్మిని తెలంగాణ మెడికల్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు నరేశ్ శనివారం పరామర్శించారు. వేధింపులకు పాల్పడిన రిమ్స్ సూపర్వైజర్ను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట రిమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు అక్రమ్ఖాన్, దేవిదాస్, రమాకాంత్, శేఖర్, రమేశ్, అనసూయ తదితరులున్నారు. -
క్లుప్తంగా
బెదిరింపు కేసులో కౌన్సిలర్ భర్త అరెస్ట్ భైంసాటౌన్: రియల్ ఎస్టేట్ వ్యాపారిని డబ్బు ల కోసం బెదిరించిన కేసులో భైంసా పట్ట ణానికి చెందిన కౌన్సిలర్ భర్త బాలాజీ సూత్రావేను శనివారం అరెస్ట్ చేసినట్లు సీఐ డి.రాజారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణానికి చెందిన అరవింద్ రాహుల్నగర్లో ప్లాట్లు చేసి విక్రయిస్తుండగా బాలాజీ సూత్రావే డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలి పారు. రూ.20 లక్షలు ఇస్తేనే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయనిస్తానని, లేదంటే చంపుతానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. దీంతో బాధితుడు అప్పు చేసి రూ.10 లక్షలు ఇవ్వగా మరో రూ.పది లక్షలు సర్దుబాటు కాకపోవడంతో నేతాజీనగర్లోని ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా సబ్రిజిస్ట్రార్ కా ర్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నా డు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ తెలిపారు. బాలాజీ సూత్రావేను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా కోర్టు 14రోజుల జ్యుడీషియల్ క స్టడీకి అప్పగించినట్లు ఆయన వెల్లడించారు.మామిడి పండ్ల అపహరణ ముధోల్: మండల కేంద్రానికి చెందిన రైతు షఫీఉల్లాఖాన్ 8 క్యారెట్ల మామిడి పండ్లు అపహరణకు గురయ్యాయి. ఆశ్రమ పాఠశాల ముందున్న మామిడి తోటలో నుంచి శుక్రవా రం 8 క్యారెట్ల మామిడి పండ్లు తెంపి మార్కెట్కు తరలించేందుకు ఒక గదిలో ఉంచాడు. శనివారం ఉదయం చూసే సరికి గుర్తు తెలి యని వ్యక్తులు అపహరించినట్లు గుర్తించాడు. మామిడి పండ్ల విలువ రూ.50వేలు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.పేకాటరాయుళ్ల అరెస్టు సారంగపూర్: మండలంలోని బీరవెల్లి గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై శనివారం పో లీసులు దాడులు నిర్వహించినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న దయాకర్, గణేశ్, సయ్యద్ బాబు, శేక్ రసూల్, తాండ్ర సాయన్న, తరుణం శంకర్, బొడ్డు మహేందర్ను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.31వేల నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
‘అధికారులు తీరు మార్చుకోవాలి’
శ్రీరాంపూర్: అధికారులు తమ తీరు మార్చుకో వాలని ఐఎన్టీయూసీ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్రావు అన్నారు. శని వారం ఎస్సార్పీ1 గనిలో కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో కొందరు అ ధికారులు బీఆర్ఎస్, టీబీజీకేఎస్లకు తొత్తులై ఇన్నాళ్లు పనిచేశారని ఇప్పుడు కూడా అదే విధా నం కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఐఎన్టీయూసీని బదనాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి అధికారుల ను ఉపేక్షించేది లేదని, కార్మికుల క్షేత్రంలో వారి ని నిలదీస్తామన్నారు. అనంతరం గని మేనేజర్ ను కలిసి సమస్యలు విన్నవించారు. పనిస్థలా ల్లో వెంటిలేషన్ సౌకర్యం మెరుగుపర్చాలని, కా ర్మికులకు టూల్ బాక్స్లను ఏర్పాటు చేయాల ని, మ్యాన్రైడింగ్ యంత్రాన్ని షిఫ్ట్కు 10 నిమి షాల ముందే ప్రారంభించాలని, క్యాంటీన్లో సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు కలవేన శ్యామ్, మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్లో ప్రవేశానికి స్పాట్ కౌన్సెలింగ్
ఉట్నూర్రూరల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్ ప్రథ మ సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్ల కోసం ఈ నెల 23, 25 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సులకు 23న బాలికలకు ఉట్నూర్ కేబీ ప్రాంగణంలోని గిరిజ న గురుకుల (బాలికల) కళాశాలలో, 25న గిరిజన గురుకుల (బాలుర) కళాశాల లాల్టెక్డీలో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. 2023–24 వి ద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన ఎస్టీ, ఇతర విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరు కావాలని సూచించారు. ఆసక్తి కలవారు ధ్రువీ కరణ పత్రాలు రెండు జతల జిరాక్స్, 4 పాస్ పోర్ట్ సైజ్ఫొటోలతో ఉదయం 10 గంటల నుంచి కౌన్సిలింగ్కు హాజరు కావాలన్నారు. -
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
నిర్మల్ఖిల్లా: ప్రస్తుతం జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవుల కాలం కొనసాగుతోంది. అయితే ఈ దశలో ఉన్న పిల్లలు, టీనేజ్ యువత పక్కదారులు పడుతున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల కాలాన్ని దుర్వినియోగం చేస్తూ సిగరెట్లు, మద్యం, మొబైల్ ఫోన్ వంటి ఇతర దురలవాట్లకు బానిసగా మారుతున్నట్లు ఇటీవలి కొన్ని ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. మత్తు కోసం మాత్రలు, గంజాయి వంటి వాటిని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అర్ధరాత్రి వేళల్లో సైతం బైక్లపై రైడ్ల కోసం కోసం జాతీయ రహదారిపై తిరుగుతున్నారు. దాబా హోటళ్లలో మద్యం సేవించి ఇష్టారీతిన ప్రధాన రహదారిపై తిరగడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇవి కాకుండా కొత్తగా కొన్ని రకాల శీతల పానీయాల్లో చాక్లెట్ల వంటి పదార్థాలు కలుపుకుని మత్తును ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పలు కేసులు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నట్లు సమాచారం. మత్తుకు బానిసైన వారిలో ఎక్కువగా కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె వంటి అవయవాలపై ప్రభావం పడడమే కాకుండా మతిమరుపు, రక్తహీనత, నరాల బలహీనత వంటి వ్యాధులకు కారణమవుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి సమయాల్లో పిల్లలు యువత ప్రవర్తనపై వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
స్టాక్ బయటకొచ్చింది
సాక్షి,ఆదిలాబాద్: ఆ డిమాండ్ రకం పత్తి విత్తనం కావాలని సీడ్స్ దుకాణానికి వెళితే అది లేదని రైతులను తిరిగి వెనక్కి పంపించిన వ్యాపారులు శనివారం మాత్రం వాటిని బయటకు తీసుకొచ్చారు. జిల్లాకు అన్నిరకాల పత్తి విత్తనాలు కలిపి పెద్ద ఎత్తున స్టాక్ వచ్చిందని, అందులో ఆ రకం విత్తనాలు కూడా ఉన్నప్పటికీ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అవి లేవని చెబుతూ వచ్చారు. దీనిపై ‘సాక్షి’లో శనివా రం ‘ఆ ఒక్కటి లేదట!’ శీర్షికన డిమాండ్ రకం పత్తి విత్తనాల కృత్రిమ కొరత, వ్యాపారులు మాయాజాలంపై కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి ఆ విత్తనాలను మా ర్కెట్లో వ్యాపారుల ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒకరికి రెండు ప్యాకెట్లు మాత్రమే.. ఆ డిమాండ్ రకం ఆదిలాబాద్ పట్టణంలోని ఓ సీడ్ షాప్లో శనివారం అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిసిన పలువురు రైతులు ఉదయం నుంచే జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అంబేద్కర్ చౌక్లోని సంబంధిత షాపు వద్ద బారులు తీరారు. అందులో పలువురు మహిళా రైతులు కూడా ఉండటం గమనార్హం. అయితే తలా రెండు ప్యాకెట్లు మాత్రమే ఇవ్వగా... అవి ఎకరంనరకు కూడా సరిపోవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా ఎకరాల్లో నాణ్యత లేని పత్తి విత్తనాలను కొనాల్సిన పరిస్థితులను వ్యాపారులే సృష్టిస్తున్నారని వాపోతున్నారు. ఏటా ఇదే తంతు సాగుతున్నా అధికారులు అరికట్టలేకపోతున్నారని అంటున్నారు. మహారాష్ట్ర రైతులకు అధిక ధరకు విక్రయించేందుకే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అసలు జిల్లాకు ఆ రకం విత్తనాలు ఎన్ని ప్యాకెట్లు వచ్చాయి.. ఇప్పటివరకు జిల్లా రైతులకు ఎన్ని విక్రయించారన్న వివరాలను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర రైతులకు విక్రయించరాదు.. ఆదిలాబాద్ మార్కెట్లో డీలర్లు పత్తి విత్తనాలను మహారాష్ట్ర రైతులకు విక్రయించరాదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య నుంచి శనివారం జిల్లాలోని సీడ్స్ డీలర్లకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 16న జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆధ్వర్యంలో సీడ్స్ డీలర్స్, కంపెనీ ప్రతినిధులతో జరిగిన అవగాహన సమావేశంలో దీనికి సంబంధించిన ఆదేశాలు అప్పుడే ఇవ్వడం జరిగిందని ఆ ఉత్తర్వుల్లో డీఏవో పేర్కొన్నారు. జిల్లా రైతులకు మాత్రమే ఆ విత్తనాలు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు ఆధారంగా గుర్తించి ఈ ప్రక్రియ కొనసాగించాలని వివరించారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించరాదని, ఒకవేళ ఉల్లంఘిస్తే సీడ్ యాక్ట్ 1986 ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘సాక్షి’ కథనంతో అందుబాటులోకి ఆ రకం పత్తి విత్తనాలు అయితే ఒక్క షాపులోనే విక్రయాలు ఉదయం నుంచే బారులు తీరిన రైతులు మధ్యాహ్నానికి మళ్లీ నో స్టాక్! వ్యాపారుల ‘మహా’ జిమ్మిక్కు?వరుసలో నిలబడి తీసుకున్నా.. ఆదిలాబాద్ మార్కెట్లో విత్తనాలు ఇస్తున్నారని తెలిసి నేను మా అన్నతో కలిసి దుకాణానికి వచ్చాం. తలా రెండు ప్యాకెట్లు మాత్రమే ఇచ్చారు. వరుసలో నిలబడి తీసుకున్నాం. ప్రారంభంలోనే ఇలా కొరత ఉంటే మాలాంటి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేది కష్టమే. అధికారులు చర్యలు తీసుకోవాలి. – షేక్ సోహెల్, నిరాల, జైనథ్ మండలం పనులు విడిచిపెట్టి వచ్చిన.. నాణ్యమైన పత్తి విత్తనాలు దొరకడం లేదు. ఆదిలాబాద్ మార్కెట్లో అవి ఇస్తున్నారని తెలిసి అన్ని పనులు పక్కనపెట్టి ఉదయమే వచ్చా. వరుసలో నిలబడ్డప్పటికీ రెండు ప్యాకెట్లే ఇచ్చారు. ఈ విత్తనాలు మొత్తం సాగుకు సరిపోవు. – ఎం.లక్ష్మి, పిప్పల్కోటి, భీంపూర్ రెండు ప్యాకెట్లే ఇచ్చారు పత్తి విత్తనాల కోసమే జిల్లా కేంద్రానికి వచ్చిన. డిమాండ్ రకం విత్తనం కోసం గంటకు పైగా లైన్ల నిలబడ్డా. నాకు 17 ప్యాకెట్లు అవసరం ఉంటే కేవలం 2 మాత్రమే ఆ రకం విత్తనాలు ఇచ్చారు. – సిడాం కేషవ్, భీంపూర్ మండల రైతు, ఆదిలాబాద్ జిల్లా -
● అసంపూర్తిగా భవన నిర్మాణాలు ● నత్తనడకన వసతుల కల్పన పనులు ● అడ్వాన్స్ నిధులిచ్చినా అంతంతమాత్రంగానే.. ● గడువులోపు పూర్తి కావడం అనుమానమే.. ● ‘సాక్షి’ విజిట్లో వెల్లడైన సర్కారు బడుల తీరు
కై లాస్నగర్: సర్కారు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేదిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందు కోసం అడ్వాన్స్గా 25శాతం నిధులు సైతం ఆ కమిటీల ఖాతాల్లోకి జమ చేసింది. బడుల పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని పాఠశాలల్లో అధికారులు గుర్తించిన విద్యుదీకరణ, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, కిచెన్ షెడ్ల నిర్మాణంతో పాటు పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి కార్పొరేట్ తరహాలో బడులు తీర్చిదిద్దాలని ఆదేశించింది. అయితే ఈ పనులు గడువులో పూర్తి కావడం అనుమానంగానే కనిపిస్తోంది. ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలను శుక్రవారం సందర్శించగా ఈ విషయం వెల్లడైంది. చాలా పాఠశాలల్లో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యార్థులకు మరోసారి సమస్యలే స్వాగతం పలికే పరిస్థితి కనిపిస్తోంది. అసంపూర్తిగా భవన నిర్మాణాలు జిల్లాలో డీఈవో పరిధిలో మొత్తం 702 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 678 ప్రభుత్వ, జెడ్పీ యాజమాన్య పాఠశాలలుండగా, 17 కేజీబీవీలు, ఆరు మోడల్ స్కూళ్లు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల ఉంది. చాలా బడుల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస వసతుల్లేక విద్యార్థులు ఇబ్బందుల నడుమ చదువులు సాగించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రభుత్వ హయాంలో మన ఊరు–మనబడి పథకం ద్వారా ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులతో పాటు మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా చాలా చోట్ల పూర్తి కాలేదు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బాధ్యతలను అమ్మ అదర్శ పాఠశాలలకు అప్పగించింది. మొన్నటి వరకు ఎన్నికలు ఉండటంతో పనులు నెమ్మదించాయని, ప్రస్తుతం వేగం పుంజుకుంటుందని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా కనిపించడం లేదు. పది పాఠశాలలకు అదనపు గదులు వర్షాకాలం నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలను విద్యాశాఖ ముందుగానే గుర్తించింది. జిల్లా వ్యాప్తంగా 14 పాఠశాలల్లో భవనాలు కూలిపోయే దశలలో ఉన్నట్లుగా గుర్తించి కలెక్టర్కు నివేదిక అందజేశారు. ఈ మేరకు స్పందించిన కలెక్టర్ తన స్థాయిలో పది పాఠశాలలకు రూ.16లక్షల నుంచి రూ.20లక్షల చొప్పున అదనపు తరగతి గదులను మంజూరు చేశారు. వాటి పనులు ప్రారంభించాల్సి ఉంది. మిగతా నాలుగు పాఠశాలలకు వ్యయం ఎక్కువగా ఉండటంతో వాటి మంజూరు కోసం రాష్టస్థాయికి ప్రతిపాదనలు పంపించారు. ఇక్కడ కనిపిస్తున్నది బజార్హత్నూర్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.6లక్షల వ్యయంతో చేపట్టిన కిచెన్షెడ్, డైనింగ్ హాల్ నిర్మాణం. మన ఊరు–మన బడి కింద గతేడాది ఏప్రిల్లో పనులు ప్రారంభించారు. సీలింగ్ వరకు చేరుకున్నా ఒక్క రూపాయి నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేశాడు. ఏప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. – బజార్హత్నూర్ వసతులు కల్పిస్తాం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గాను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఆయా క మిటీల అకౌంట్లకు రూ.5కోట్ల నిధులు విడుద ల చేశాం. తాగునీరు, విద్యుదీకరణ, మరుగుదొడ్లు వంటి వాటితో పాటు చిన్నపాటి మరమ్మతు పనులు సైతం చేపడుతున్నాం. ఇవి స కాలంలో పూర్తిచేసేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రతి పాదికన పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నాం. – ప్రణీత, డీఈవోజిల్లాలో.. బాయ్స్ టాయ్లెట్స్ లేని పాఠశాలలు : 325 గర్ల్స్ టాయ్లెట్స్ లేని పాఠశాలలు : 282 తాగునీటి వసతి లేని పాఠశాలలు : 264 విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలు: 234 శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు : 14 -
పిల్లలపై ఓ కన్నేయండి..
ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. అయితే ఈ దశలో ఉన్న పిల్లలు, టీనేజ్ యువత పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 20248లోu ఆదిలాబాద్రూరల్: ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులు. ఏడాది క్రితం మన ఊరు–మన బడి పథకంలో నాలుగు అదనపు గదులతో పాటు షెడ్డు నిర్మాణం కోసం రూ.89లక్షలు మంజూరయ్యాయి. అయితే కాంట్రాక్టర్ ఆ నిధులు గిట్టుబాటు కావడం లేదని పనులను మధ్యలోనే వదిలేశాడు. విషయాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇటీవల అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద రూ.7.40 లక్షలు మంజూరు చేశారు. 15 రోజుల క్రితం పనులు ప్రారంభించారు. టైల్స్, కిటికీలు, విద్యుత్, తదితర పనులు కొనసాగుతున్నాయి. జైనథ్: ఇక్కడ కనిపిస్తున్నది జైనథ్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రెండంతస్తుల్లో భవనం నిర్మించాల్సి ఉండగా, ఫస్ట్ ఫ్లోర్లో స్లాబ్ వర్క్ మాత్రమే పూర్తి చేశారు. 50శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఈ విద్యా సంవత్సరానికి తరగతి గదులు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.తాంసి: భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాలలో 191 మంది విద్యార్థులుండగా వారికి సరిపడా గదులు లేవు. అదనపు గదుల నిర్మాణం కోసం గతేడాది రూ.39 లక్షలు మంజూరయ్యాయి. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. గడిచిన విద్యాసంవత్సరంలో గ్రామపంచాయతీ భవనంలో విద్యార్థులకు బోధన చేయాల్సి వచ్చింది. న్యూస్రీల్ -
ఇక ‘టీజీ’ పేరిటే నిర్వహించాలి
కైలాస్నగర్: తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్కు బదులు టీజీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ రా జర్షి షా ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్హెడ్లలో టీజీగా ఉండాలని, ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటనామస్ విభాగాలన్నీ దీనిని పాటించాలని ఆదేశించారు. తెలంగాణలో ఇప్పటి వరకు వాహనాల రిజిస్ట్రేషన్కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు అన్ని అధికారిక వ్యవహారాలకు వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. వెబ్సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లో ఇకపైన ‘టీజీ’ పదాన్నే (అబ్రివేషన్) వినియోగించాలని స్పష్టం చేశారు. అధికారులు వాడే లెటర్హెడ్స్, రిపోర్టులు, నోటిఫికేషన్లు, నేమ్ బోర్డులు, వెబ్సైట్లు, ఇతర అన్ని రకాల ఉత్తర, ప్రత్యుత్తరాల్లోనూ ఈ మార్పును అమలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), టీఎస్ఆర్టీసీ (తెలంగాణ స్టేట్ ఆర్టీసీ) తదితర పేర్లతో కొనసాగుతున్న సంస్థలు ఇకపైన టీజీపీఎస్సీ, టీజీఆర్టీసీగా మారనున్నాయని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విషయాన్ని గమనించి పాటించాలని పేర్కొన్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. గాలిలో తేమశాతం పెరగనుంది. పలుచోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. 75 పాఠశాలల్లోనే పూర్తి జిల్లాలో 678 పాఠశాలల్లో వసతుల కల్పన కోసం యంత్రాంగం రూ.30.84కోట్ల పరిపాల న అనుమతులు మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు వీలుగా గ్రామ,ఏరియా సంఘం అధ్యక్షురాలు, పాఠశాల హెచ్ఎంల పేరిట సంయుక్త బ్యాంకు ఖాతాలు తెరిపించి 25శాతం నిధులను అడ్వాన్స్గా అందులో జమచేసింది. ఇందులో 648 పాఠశాలలకు నిధులు విడుదల కాగా, 665 పాఠశాలలకు అధికారిక మంజూ రు ఇచ్చారు. ఇందులో 639 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. అందులో ఇప్పటి వరకు కేవలం75 పాఠశాలల్లో మాత్రమే అన్ని వసతులు కల్పించి ప్రైవేట్కు ధీటుగా ఆదర్శంగా తీ ర్చిదిద్దారు. అలాగే 42 పాఠశాలలకు డ్యూయ ల్ డెస్క్లు, 31 పాఠశాలలకు గ్రీన్ చాక్బోర్డులు, 37 పాఠశాలల్లో పెయింటింగ్ చేపట్టేందు కు ఉన్నతాధికారులకు ఇండెంట్ పంపించారు. మిగతా పాఠశాలల్లో కొనసాగుతున్న వసతుల కల్పన పనులు నత్తనడకన సాగుతుండటంతో బడులు తెరిచే నాటికి పూర్తి కావడం అనుమానంగానే ఉంది. -
పీఆర్సీ చైర్మన్కు వినతి
ఎదులాపురం: రాష్ట్ర వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎస్.శివశంకర్ను పీఆర్టీయూ(తెలంగాణ) నాయకులు హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో శుక్రవారం కలిశారు. పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అన్ని యాజమాన్య విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఉపాధ్యాయులు, బోధనేత సిబ్బంది, పెన్షనర్లకు సంబంధించి వేతన సవరణ, ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇందులో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి, రాష్ట్ర బాధ్యులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూర్సింగ్, నవీన్యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ ప్రకాశ్, రాథోడ్ రవీందర్ ఉన్నారు. -
కోడ్ ఉల్లంఘించారని కలెక్టర్కు ఫిర్యాదు
కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికల రోజున కోడ్కు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విధుల నుంచి సస్పెండ్ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తలమడుగు మండలం కజ్జర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి కస్తూరి శోభారాణి, కారోబార్లు, ఆ గ్రామంలో విధులు నిర్వహించిన పోలింగ్ సిబ్బందిపై కలెక్టర్ రాజర్షి షాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున పంచాయతీ కార్యదర్శి బీఆర్ఎస్ నాయకులతో భోజనాలు ఏర్పాటు చేయించారన్నారు. అలాగే ఆ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల, పంచాయతీ సిబ్బంది భోజనం చేశారని తెలిపారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను ప్రభావితం చేసేలా పోలింగ్ బూత్లోనే భోజనాలు చేయించిన వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో నవీన్ కుమార్, శ్యామల, మంజూష, సాయి, సురేశ్, శ్రీనివాస్,రాకేశ్ తదితరులు ఉన్నారు. -
జొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి
బోథ్: ఇటీవల కురిసిన వర్షానికి తడిచిన జొన్నలను షరతులు లేకుండా త్వరగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలోని బోథ్ మార్కెట్ యార్డును శుక్రవారం ఆయన సందర్శించారు. తడిచిన జొన్నలను పరిశీలించారు. అధైర్యపడవద్దని రైతులకు సూచించారు. ఆరు కాంటాలు ఏర్పాటు చేసి త్వరితగతిన కొనుగోలు చే యాలని అధికారులను ఆదేశించారు. అలాగే యా ర్డులో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నా రు. ఆయన వెంట మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి మనోహర్, సెంటర్ ఇన్చార్జి స్వామి, నేరడిగొండ ఎంపీపీ సజన్, నానక్ సింగ్, నారాయణరెడ్డి, సురేందర్ యాదవ్, తదితరులున్నారు. అన్నదాతకు అండగా బీఆర్ఎస్ఇచ్చోడ: రైతులకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మార్కెట్ యార్డులో జొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెచ్చారు. వెంటనే ఆయన కలెక్టర్కు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. యార్డులో కావాల్సిన రెండు షెడ్లకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు. -
అత్యధికం 94.. అత్యల్పం 48
● జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం తీరు ● ఆదివాసీ గ్రామాల్లో వెల్లువెత్తిన ఓటరు చైతన్యం ● ఆసక్తి చూపని పట్టణ ఓటర్లు కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఇటీవల ముగిసింది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా పోలింగ్ శాతం నమోదుపైనే చర్చ సాగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు బూత్ల వారీగా తమకు అనుకూలంగా ఉండే ఓట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. జిల్లాలో పోలింగ్ అత్యధికంగా 94.61శాతం నమోదు కాగా అత్యల్పంగా 48.51శాతం నమోదైంది. పట్టణ వాసులతో పోల్చితే పల్లెల్లో ఓటర్లు చైతన్యం చాటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివాసీ గ్రామాలు అదుర్స్ జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం పరిశీలిస్తే ఆదివాసీ గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రెండు నియోజకవర్గాల పరిధిలోని ఏ ఆదివాసీ గ్రామంలో చూసినా 80కి పైగా పోలింగ్ శాతం నమోదు కావడం ఓటు హక్కు వినియోగానికి వారు ఎంతగా ప్రాధాన్యతనిస్తున్నారనేది స్పష్టం చేస్తోంది. కొన్ని గ్రామాల్లోనైతే 92 నుంచి 94శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం మెరుగ్గానే నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాలేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో ఒకటి రెండు కేంద్రాలు మినహాయిస్తే మిగతా చోట్ల 75కు పైగా పోలింగ్ శాతం నమోదు కాకపోవడం గమనార్హం. గతంలో తక్కువగా నమోదైన కేంద్రాలపై శ్రద్ధ వహించి అవగాహన కల్పించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఆయా కేంద్రాల్లోనూ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో మండలాల వారీగా అత్యధిక, అత్యల్ప పోలింగ్ శాతం నమోదైన గ్రామాల వివరాలుమండలం అత్యధిక పోలింగ్ శాతం అత్యల్ప పోలింగ్ శాతం నమోదైన గ్రామం నమోదైన గ్రామం జైనథ్ ఆకుర్ల(92.56) గిమ్మ(కె) (73.68) బేల శంషాబాద్(93.14) తోయగూడ(70.18) ఆదిలాబాద్రూరల్ చిట్యాల్బోరి(94.61) ఖానాపూర్ (68.94) మావల మావల (పీఎస్.140) (83.33) బట్టిసావర్గాం(పీఎస్.136)(65.52) ఆదిలాబాద్అర్బన్ జైజవాన్నగర్(82.12) టీచర్స్ కాలనీ (48.51) బోథ్ కేశవ్గూడ(88.96) బోథ్–బిలో (66.12) నేరడిగొండ గాజిలి(91.25) వెంకటాపూర్ (61.56) బజార్హత్నూర్ గేర్జాయి(84.36) డెడ్రా (62.12) ఇచ్చోడ అడెగామ–బి(93.36) ఇచ్చోడ (పీఎస్.131)(58.33) తాంసి అంబుగావ్(90.30) నిపాని(77.88) భీంపూర్ కామటివాడ(87.39) అర్లి–టి(74.41) తలమడుగు కోసాయి(92.54) ఖోడద్(75.88) సిరికొండ నేరడిగొండ(88.94) సుంకిడి(79.8) గుడిహత్నూర్ బెల్లూరి(89.6) గుడిహత్నూర్(67.84) -
న్యూస్రీల్
‘ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు తగదు’ ఆదిలాబాద్: ఎమ్మెల్యే పాయల్ శంకర్పై అసత్య ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాభవంతో కంది జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పై భూకబ్జాలు చేస్తున్నారంటూ అసత్య ఆరోపణలు చేయ డం తగదన్నారు. ఇందులో నాయకులు దినేశ్ మటోలియా, క్రాంతికుమార్, మోహన్ అగర్వాల్, సురేందర్, రవి, రాజు తదితరులున్నా రు.రేపు జిల్లాస్థాయి నెట్బాల్ ఎంపిక పోటీలు ఆదిలాబాద్: ఈనెల 19న నెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా నెట్బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అజ య్, గౌతమ్ ప్రకటనలో పేర్కొన్నారు. ఆది వారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో గల ఎస్ఆర్ డీజీ పాఠశాలలో ఉమెన్స్, మెన్స్ జట్ల ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు రూపేశ్కు రిపోర్ట్ చేయాలని సూచించారు.దరఖాస్తుల ఆహ్వానం ఎదులాపురం: జిల్లా ప్రభుత్వ పారిశ్రామిక సంస్థ (ఐటీఐ)లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ సుజాత ప్రకటనలో తెలిపారు. 10వ, 8వ తరగతి ఉత్తీర్ణులై, 1 ఆగస్టు 2024 నాటికి 14 ఏళ్లు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 16 నుంచి జూన్ 10లోగాhttps:// iti. telangana. gov. in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 94935 35378 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
జూన్ 10లోపు పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ రాజర్షి షా ● అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష కై లాస్నగర్: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనులను జూన్ 10లోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. పనుల ప్రగతిపై విద్య, పంచాయతీ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎంపిక చేసిన 678 ప్రభుత్వ పాఠశాలలకు గాను 668 పాఠశాలల్లో ఆయా కమిటీల బ్యాంకు ఖాతాలు తెరిచామన్నా రు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, విద్యుత్, పెయింటింగ్, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు, మేజర్, మైనర్ మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు చేపట్టాల్సిన పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పాఠశాలల్లో పనులు చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత వాటి ఫొటోలను తీసి పంపించాలన్నా రు. ఇంకా పనులు ప్రారంభించని పాఠశాలల్లో త్వరితగతిన ప్రారంభించాలన్నారు. బడులు పునఃప్రారంభం అయ్యేలోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ట్రెయినీ కలెక్టర్ అభిఘ్యాన్ మాల్వీయా, డీఈవో ప్రణీత, పీఆర్, ఆర్అండ్బీ ఈఈలు నర్సయ్య, వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్, డీపీవో శ్రీలత, డీఎల్పీఓ ఫణీందర్రావు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement