-
అడవి పందిని చంపిన వ్యక్తి పట్టివేత
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): అడవి పందిని చంపిన ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు గోదావరిఖని టూటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. అల్లూరు గ్రామానికి చెందిన ఆవుల రాజేశ్ శనివారం అడవి పందిని చంపాడు. సంచిలో వేసుకొని, బైక్పై వస్తున్నాడు. అదే సమయంలో యైటింక్లయిన్కాలనీలోని ఎస్ఎంఎస్ ప్లాంట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి, బైక్ను వెనక్కి తిప్పాడు. దీంతో వారు అతన్ని వెంబడించి పట్టుకున్నాడు. సంచిలో చూడగా అడవి పంది కళేబరం కనిపించింది. విచారణ నిమిత్తం రాజేశ్ను మంథని ఫారెస్ట్ అధికారులకు అప్పగించినట్లు టూటౌన్ సీఐ రవీందర్ పేర్కొన్నారు. -
గోపులాపూర్ మృతులకు కన్నీటి వీడ్కోలు
● హాజరైన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, గ్రామస్తులు ● కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు, బంధువులు బుగ్గారం(ధర్మపురి): మండలంలోని గోపులాపూర్లో ఇంటి కొనుగోలు విషయంలో ఏర్పడిన వివాదం వరుసకు అన్నాతమ్ముడైన దీటి మహేశ్, శ్రీనివాస్ల హత్యకు దారితీయగా మృతులకు శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. గురువారం రాత్రి సంఘటన జరిగినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి పర్యవేక్షణలో బుగ్గారం, గొల్లపల్లి, వెల్గటూర్ ఎస్సైలు శ్రీధర్రెడ్డి, ఉమాసాగర్, సతీశ్ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వందలాది మంది గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులు మృతులకు కన్నీటి వీడ్కోలు పలికారు. హత్యకు రెండు రోజుల ముందే మహేశ్ ముంబయి నుంచి రాగా.. చావు కోసమే వచ్చినవా బిడ్డా.. అంటూ కుటుంబసభ్యులు, బంధువులు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. ప్రభుత్వపరంగా ఆదుకుంటాం : విప్ అడ్లూరి అత్యంత దారుణంగా జరిగిన ఈ హత్యలు తనను తీవ్రంగా కలచివేశాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. అంత్యక్రియలకు హాజరైన ఆయన మృతులకు నివాళి అర్పించారు. బాధిత కుంటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దోషులెంత మంది ఉన్నా తప్పించుకోలేరని, చట్టపరంగా చర్యలు తీసుకునేలా చూస్తామని పేర్కొన్నారు. చిన్న చిన్న తగాదాలకే ఇంత దారుణంగా ప్రవర్తించడం సమాజానికి మంచిది కాదన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన రూ.20 వేలు, జెడ్పీటీసీ సభ్యుడు బాదినేని రాజేందర్ రూ.10 వేల ఆర్థికసాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్, నాయకులు నర్సాగౌడ్, బీర్పూరి తిరుపతి, మదన్, సంతోష్ తదితరులున్నారు. -
అప్పు తీర్చలేనని ఐపీ నోటీసులు
మెట్పల్లి: ఇతరుల వద్ద తాను తీసుకున్న అప్పులను తీర్చలేనని ఓ వ్యాపారి పలువురికి ఐపీ నోటీసులు పంపడం మెట్పల్లి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మెట్పల్లి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కొన్నేళ్లుగా బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం ఓ ప్రైవేట్ ఫైన్సాన్తోపాటు మరో 27 మంది వద్ద అప్పు తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వ్యాపారంలో దివాలా తీశాననే కారణంతో పలువురికి ఐపీ నోటీసులు పంపించారు. ఇందులో కొందరు నగదు అప్పు ఇవ్వగా, మిగతా కొందరు బంగారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
బొలెరో ఢీకొని వ్యక్తి దుర్మరణం
హుజూరాబాద్రూరల్/జమ్మికుంట(హుజూరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ గ్రామానికి చెందిన మండల సమ్మయ్య(60) శనివారం పని నిమిత్తం సైకిల్పై శాలపల్లి ఇందిరానగర్ వెళ్లాడు. తిరిగి వస్తుండగా జమ్మికుంట నుంచి హుజూరాబాద్ వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. వాహన యజమాని ఇంటి ఎదుట ధర్నా సమ్మయ్యను ఢీకొన్న వాహనం జమ్మికుంట పట్టణంలోని ఓ ఐరన్ షాపు యాజమానికి చెందినది. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో అతని ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. కానీ, యజమాని అప్పటికే తన కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు. ప్రమాద విషయం తెలిశాక బాధితులతో ఫోన్లో మాట్లాడాడు. పరిహారం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మృతుడికి భార్య యాదక్క, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ టౌన్ సీఐ రమేశ్, జమ్మికుంట ఎస్సై రాజేశ్, ఇల్లందకుంట ఎస్సై రాజ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
జగిత్యాలక్రైం: పట్టణ శివారులోని టీఆర్నగర్కు చెందిన ఎస్కే సపోల్(22) అనే యువకుడు శుక్రవారం అర్ధరాత్రి కొత్త బస్టాండ్ అవుట్గేట్ ప్రాంతంలో ద్విచక్ర వాహనం డివైడర్కు ఢీకొని మృతిచెందాడు. టీఆర్నగర్కు చెందిన జగన్నాథం విజయ్, ఎస్కే సపోల్ శుక్రవారం రాత్రి పని నిమిత్తం జగిత్యాలకు వచ్చారు. అర్ధరాత్రి 1.40 గంటల ప్రాంతంలో కొత్త బస్టాండ్ అవుట్గేట్ వద్ద ద్విచక్ర వాహనం అతివేగంగా వెళ్లి డివైడర్ను ఢీకొనగా.. ఎస్కే సపోల్ మృతిచెందాడు. మృతుడి తండ్రి ఎస్కే జలీల్ ఫిర్యాదు మేరకు ద్విచక్ర వాహనం నడుపుతున్న జగన్నాథం విజయ్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై నరేశ్ తెలిపారు. ఇసుక లారీ, ఆర్టీసీ బస్సు ఢీ ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి గ్రామంలో శనివారం ఇసుక లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఇరుకై న రోడ్డు కావడం, కొన్ని లారీలను రహదారిపైనే పార్కింగ్ చేయడంతో మిగతా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈక్రమంలోనే లారీ, బస్సు ఢీకొన్నాయని గ్రామస్తులు తెలిపారు. అయితే, ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డీజిల్ కుంభకోణంపై రీజినల్ డైరెక్టర్ విచారణ వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో 2022లో డీజిల్ కుంభకోణానికి పాల్పడిన అప్పటి శానిటరీ ఇన్స్పెక్టర్ నగేశ్పై మున్సిపల్శాఖ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ శనివారం విచారణ చేపట్టారు. డీజిల్ కుంభకోణానికి పాల్పడిన నగేశ్ను ఆ సమయంలో కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే శాఖాపరమైన చర్యల్లో భాగంగా రీజినల్ డైరెక్టర్ విచారణకు వచ్చారు. -
‘సఖి’ సేవలను వినియోగించుకోవాలి
జగిత్యాలరూరల్: మహిళల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సఖి సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ వాణిశ్రీ అన్నారు. సఖీ కేంద్రం ద్వారా అందించే సేవలపై శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో వీవో సభ్యులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల సమస్యల పరిష్కారం కోసం సఖి కేంద్రం నిరంతరం పనిచేస్తుందన్నారు. అనంతరం మిషన్శక్తి కో ఆర్డినేటర్ అశ్విని మాట్లాడుతూ, మహిళల సాధికారత కేంద్రం ఆవశ్యకత, మిషన్ శక్తి పథకం, పనిచేసే చోట లైంగిక వేధింపులు, గృహ హింసచట్టం తదితర అంశాలపై వివరించారు. తేజస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సఖి కేంద్రంలో 365 రోజులు 24 గంటల పాటు సిబ్బంది పనిచేయడం జరుగుతుందన్నారు. మహిళలు హింసకు గురైనప్పుడు 181 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలన్నారు. కేంద్రంలో ఐదు రకాల సేవలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌతమి, హేమశ్రీ, వీవోలు, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఈసారి 0.25 టీఎంసీలే..
తుది దశకు ‘రోల్లవాగు’ ● అటవీశాఖ అనుమతి వస్తే 1 టీఎంసీ నీటి నిల్వకు అవకాశం ● గేట్ల బిగింపునకు కొనసాగుతున్న పనులు ● వానాకాలంలో బీర్పూర్, ధర్మపురి మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు సారంగాపూర్(జగిత్యాల): బీర్పూర్ శివారులోని రోల్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు తుది దశకు చేరాయి. వానాకాలంలో ప్రాజెక్టు దిగువన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా ఈసారి ప్రాజెక్టులో పాత విధానంలో 0.25 టీఎంసీల నీరు నిల్వ చేసేందుకే అవకాశం ఉంది. 1 టీఎంసీ నీరు నిల్వ చేసేందుకు అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ప్రాజెక్టు స్వరూపం ● రోల్లవాగు ఆధునికీకరణకు 2017లో రూ.60.25 కోట్లతో పనులు ప్రారంభించారు. అటవీశాఖ అనుమతులు రాక, ఇతర కారణాలతో ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో అంచనా వ్యయం రూ.152 కోట్లకు చేరింది. ● ప్రాజెక్టు కింద బీర్పూర్, ధర్మపురి మండలాల్లో 20 వేల ఎకరాలు సాగవుతాయి. రోల్లవాగు గుట్టల మధ్య ఉండడంతో వర్షాకాలంలో వాగుల ద్వారా వచ్చే నీటితో పాటు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డీ–53, 12ఎల్ 1ఆర్ కాలువ ద్వారా నీరు చేరుతుంది. ● ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన పనుల్లో 1,265 మీటర్ల కట్ట పొడవు ఉండగా 1,240 మీటర్ల నిర్మాణం పూర్తయింది. కేవలం 25 మీటర్ల పనులు చేపట్టాల్సి ఉంది. మరో 300 మీటర్ల కట్ట పూర్తిగా అటవీప్రాంతంలో ఉండడంతో గుట్టల ఎత్తు కారణంగా అక్కడ పనులు చేపట్టాల్సిన అవసరం లేదు. ● 156 మీటర్ల పొడవుతో ప్రాజెక్టు మత్తడి నిర్మాణం పూర్తి చేశారు. దాదాపు 90 శాతం పనులు పూర్తి కాగా ప్రాజెక్టు దిగువకు నీరు విడుదల చేసేందుకు 3 తూములకు గేట్లు బిగించాల్సి ఉంది. అటవీశాఖ అభ్యంతరం 3 తూములకు గేట్ల బిగిస్తే ప్రాజెక్టులో 1 టీఎంసీ నీరు చేరి అటవీశాఖకు చెందిన 864 ఎకరాలు, రెవెన్యూ భూములు 900 ఎకరాలు, పట్టా భూములు 250 ఎకరాలు ముంపునకు గురవుతాయి. కాగా ఇందులో రెవెన్యూ, పట్టా భూములపై ఎలాంటి వివాదం లేదు. గేట్ల బిగింపుపై అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రోల్లవాగులో ముంపునకు గురయ్యే 864 ఎకరాలు అటవీశాఖకు కేటాయించేందుకు పెగడపల్లి మండలం నంచర్ల, దికొండ, ల్యాగలమర్రి, గొల్లపల్లి మండలం చందోళి గ్రామాల్లోని రెవెన్యూ భూములను పరిశీలించారు. ఎన్నికల కోడ్ కారణంగా కేటాయించిన భూములను అటవీశాఖకు అప్పగించడంలో జాప్యం జరుగుతుంది. అటవీశాఖ అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని ఇటీవల సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ కోరారు. తాత్కాలిక పరిష్కారం నీటి నిల్వపై ఇటీవల అటవీ, నీటిపారుదల శాఖల అధికారులతో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చర్చించారు. గతంలో ప్రాజెక్టులో 0.25 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని, ప్రస్తుతం అటవీశాఖ అనుమతి వచ్చే వరకు అంతే మొత్తంలో నీరు నిల్వ చేస్తే అటవీ భూములు ముంపునకు గురికావని పేర్కొనడంతో అధికారులు అంగీకరించారు. దీంతో గేట్ల బిగింపు పనులు కొనసాగుతున్నాయి. అటవీశాఖ అనుమతి వస్తే 1 టీఎంసీ నీరు నిల్వ చేసే అవకాశం ఉంటుంది. -
గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తా
● కాంగ్రెస్ నిజామాబాద్ అభ్యర్థి జీవన్రెడ్డి జగిత్యాలటౌన్: శ్రీనిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలో గెలిస్తే అర్జునుడిని, ఓడితే అభిమన్యుడినవుతా.. గెలిచినా, ఓడినా చరిత్రలో నిలుస్తాశ్రీ అని కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మాట్లాడారు. కాంగ్రెస్ను నిలువరించేందుకు బీజేపీకి బీఆర్ఎస్ను కుదువబెట్టారని విమర్శించారు. ఎవరు ఎవరితో కుమ్మకై ్కనా ప్రజల ఆశీర్వాదంతో ఎంపీగా గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. వరి వేస్తే ఉరేనని, సన్న రకాలే సాగు చేయాలని, లేదంటే ధాన్యం కొనుగోలు చేయబోమంటూ చెరువులు, తూములు బందు చేసి రైతులను గోసపెట్టిన బీఆర్ఎస్ రైతు దీక్షలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ధ్వజమెత్తారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రూ.3వేలు మద్దతు ధర చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో తరుగు పేరుతో క్వింటాల్కు 10కిలోల ధ్యానం అదనపు తూకం వేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కోతలు లే కుండా ధాన్యం సేకరిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు సన్న రకాల బోనస్ పేరుతో దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ ప్ర భుత్వం ఆర్థిక ప్రణాళికతో ఏక మొత్తంలో రూ.2లక్షల రుణమాఫీతో పాటు ప్రజలకిచ్చిన అన్ని హామీ లు అమలు చేస్తుందని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు గిరి నాగభూషణం, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, జున్ను రాజేందర్ తదితరులు ఉన్నారు. -
మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి
జగిత్యాల: పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జూన్ 10లోపు అన్ని పనులు పూర్తి చేయాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాల కు అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. యూనిఫాంలు ఇప్పటికే జిల్లాకు వచ్చాయని, జిల్లాలో కుట్టుమిషన్లలో అనుభవం గల వారిని గుర్తించి స్వశక్తి సంఘాలకు యూనిఫాంలు కుట్టే ఆర్డర్ ఇవ్వాలన్నారు. పాఠశాల ప్రారంభానికి ముందే యూనిఫాంలు అందించాలన్నారు. అలాగే ధరణి సమస్యలపై మార్చి 15 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 1.15 లక్షల దరఖాస్తులు పరిష్కరించామని, లోక్సభ ఎన్నికలు ముగిసినందున మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మే చివరి నాటికి అన్ని పూర్తిచేయాలన్నారు. అనంతరం కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని వివరించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు దివాకర, రాంబాబు, ఆర్డీవోలు మధుసూదన్, ఆనంద్కుమార్, శ్రీనివాస్, డీఆర్డీవో సంపత్రావు, డీఈవో జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. ● వీడియో కాన్ఫరెన్స్లోప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి -
హైపర్టెన్షన్ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: హైపర్టెన్షన్ వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జాతీయ హైపర్టెన్షన్ డే పురస్కరించుకుని జగిత్యాలరూరల్ మండలం కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైపర్ టెన్షన్ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో జగదీశ్, ల్యాబ్ టెక్నీషియన్ బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి ఆవాసంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంజగిత్యాలటౌన్: సేవాభారతి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవా సంలో 2024–25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆవాసం అధ్యక్ష, కార్యదర్శులు జిడిగె పురుషోత్తం, నందెల్లి మదన్మోహన్రావు శుక్రవారం తెలిపారు. తల్లిదండ్రులు లేనివారు, తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పేద కుటుంబాలకు చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. 2 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారని, ఆసక్తిగల వారు ఈనెల 31లోపు ఆవాసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జగిత్యాల పట్టణానికి చెందిన విద్యార్థులు అర్హులు కాదని తెలిపారు. జూన్ 1న విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94944 31893, 99892 48893 నంబర్లలో సంప్రదించాలని కోరారు. బెస్ట్ అవేలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి..జగిత్యాల: జిల్లాలోని బెస్ట్ అవేలబుల్ స్కూళ్లలో (రెసిడెన్షియల్/నాన్ రెసిడెన్షియల్) 2024–25 సంవత్సరానికి 1, 5వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్కుమార్ తెలిపారు. 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతి రెసిడెన్షియల్కు దరఖాస్తు చేసుకోవచ్చని, 1వ తరగతి 75 సీట్లు, 5వ తరగతిలో 76 సీట్లు కేటాయించబడునని పేర్కొన్నారు. విద్యార్థులు జిల్లాకు చెందిన వారై ఉండాలని, లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. దరఖాస్తులు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో లభిస్తాయని, తగిన ధ్రువ పత్రాలతో జూన్ 7లోపు కార్యాలయంలో సమర్పించాలన్నారు. జూన్ 11న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారని, ఒక కుటుంబం నుంచి ఒకరికే అర్హత ఉంటుందన్నారు. మిగతా వివరాలకు 63028 82400 నంబర్లో సంప్రదించాలని కోరారు. అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్కోరుట్లరూరల్: కోరుట్ల పోలీస్స్టేషన్లో నమోదైన ఓ యాక్సిడెంట్ కేసులో అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ కోరుట్ల జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పునిచ్చారని నిందితుడి తరఫు న్యాయవాది సంగ విజయ్సాయి ప్రకటనలో తెలిపారు. సాక్షులుగా ఉన్న డాక్టర్ సయ్యద్ అహ్మద్, ఎంవీఐ కిషన్రావు, ఎస్ఐ జయేశ్రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో జడ్జి పావని నాన్బెయిలబుల్ వారెంటు జారీ చేశారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టండిఇబ్రహీంపట్నం(కోరుట్ల): అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు ఆదేశించారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం గోదూర్, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలం చిట్టాపూర్, మేడిపల్లి మండలం మోహన్రావుపేట, కోరుట్ల మండలం అయిలాపూర్, జగిత్యాల మండలం చల్గల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎంపీవో కృపాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అఖిల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లలో జాప్యం.. రోడ్డెక్కిన అన్నదాత
రాయికల్(జగిత్యాల): మండలంలోని మైతాపూర్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో కొనుగోళ్లు వేగవంతం చేయాలని శుక్రవారం రైతులు సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హమాలీల కొరతతో కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఏర్పడుతుందని, వర్షాలు కురియడంతో ధాన్యం తడిసి ముద్దవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు వేగవంతం చేసేంత వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకు కూర్చోవడంతో ఎక్కడివాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సహకార సంఘం సీఈవో రవీందర్ ఘటన స్థలానికి చేరుకుని కొనుగోళ్లు వేగవంతం చేస్తామని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
జేఎన్టీయూ 16వ వార్షికోత్సవం
కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండలం నా చుపెల్లి జేఎన్టీయూ కళాశాల 16వ వార్షికోత్సవ వే డుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ము ఖ్య అతిథిగా మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ డా.సీహెచ్ శ్రీధర్రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు కాన్సెప్ట్ పరంగా చదువుకోవాలన్నారు. క్లాసులకు రెగ్యూలర్గా హాజరై కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా. కామాక్షి ప్రసాద్ మాట్లాడుతూ, 2024–25 విద్యాసంవత్సరంలో కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు అనుమతి వచ్చిందన్నారు. 15రోజులకు ఒకసారి న్యూస్ లెటర్ విడుదల చేస్తామని వివరించారు. విద్యార్థుల హాజరు వివరాలను తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నామని పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించిన నలుగురు విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర అధిపతులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ప్రవేశాలకు వేళాయే
● ఈనెల 31 వరకు అవకాశం ● జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభంకథలాపూర్(వేములవాడ): పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో 2024–25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్లో చేరడానికి అధి కారులు నోటిఫికేషన్ను విడుదల చేశారు. జిల్లాలో ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో మొద టి సంవత్సరంలో చేరడానికి ఈనెల 31 వరకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతాలతోపాటు గ్రామాల్లో విద్యార్థుల కోసం లెక్చరర్లు ప్రచారం ప్రారంభించారు. కళాశాలల్లో కల్పిస్తున్న వసతులు, గతంలో సాధించిన ఫలితాలను విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివరించే పనుల్లో నిమగ్నమయ్యారు. 15 ప్రభుత్వ కళాశాలలు జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, 20 మండలాలున్నాయి. వీటి పరిధిలో 15 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీతోపాటు వొకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రతి కోర్సులో 88 చొప్పున సీట్లు ఉంటాయి. ఇటీవలి ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాలో 10,898 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ లెక్కన కళాశాలల్లో సుమారు 6 వేల మంది విద్యార్థులు చేరడానికి అవకాశం ఉంది. జిల్లాలోని 13 మోడల్స్కూళ్లలో ఇంటర్ విభాగంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో 40మంది చొప్పున విద్యార్థులు చేరవచ్చు. మోడల్ కళాశాలల్లో మొత్తం 2,080 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో మొత్తం 560 సీట్లు ఉన్నాయి. ఇలా అన్ని యాజమాన్య కళాశాలల్లో విద్యార్థులందరూ చేరే అవకాశముంది. విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న లెక్చరర్లు ప్రభుత్వ కళాశాలలు 15 మోడల్స్కూళ్లు 13 కేజీబీవీలు 07 గురుకులం కళాశాలలు 2 సాంఘిక సంక్షేమశాఖ గురుకులాలు 5 మైనార్టీ గురుకులాలు 5 బీసీ గురుకులాలు 5 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 19 -
పదేళ్లలో వ్యవసాయ రంగం నిర్వీర్యం
సారంగాపూర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు వడ్లు కొనడం లేదని, రైతుభరోసా, బోనస్ ఇవ్వాలని ధర్నా, దీక్షకు దిగడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. మండలంలోని లచ్చక్కపేటలో విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం చక్కెర ఫ్యాక్టరీలను పునఃప్రారంభించలేదని, రూ.లక్ష రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని గుర్తు చేశారు. చక్కెర ఫ్యాక్టరీ తెరిపించేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.43 కోట్ల బకాయిలు చెల్లించిందన్నారు. ఖరీఫ్ ప్రారంభం లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందన్నారు. సన్నాలతోపాటు దొడ్డురకాలకూ రూ.500 బోనస్ అందిస్తామని స్పష్టం చేశారు. నాయకులు కోండ్ర రాంచంద్రారెడ్డి, రామడుగు రవి, బేర మహేశ్, గుంటి గంగారాం, బేతి శంకర్రెడ్డి, మాలెపు సుధాకర్, నక్క రమేశ్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణ వేగవంతం చేయండి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని జీవన్రెడ్డి వ్యవసాయశాఖ కమిషనర్కు సూచించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి తూకం వేసిన సంచులను మిల్లులకు తరలించాలని కోరారు. -
‘బోనస్’ కోసం బీఆర్ఎస్ పోరుబాట
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతులు సాగు చేస్తున్న దొడ్డు రకం ధాన్యానికీ రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలకు దిగింది. కేవలం సన్నరకానికే బోనస్ ఇస్తామని సీ ఎం అనడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పి లుపు మేరకు జిల్లాకేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్కుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గురువా రం తహసీల్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. ఎన్నికల్లో ఏ పంటకై నా బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేవలం సన్నరకం ధాన్యానికేననడం కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనమన్నారు. అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని కొనాలని, రూ.రెండులక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల త రఫున పోరాటాలకు సిద్ధమని స్పష్టం చేశారు. అ నంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. జె డ్పీ చైర్పర్సన్ దావ వసంత, నాయకులు నక్కల రవీందర్రెడ్డి, ఒల్లెం మల్లేశం, బాల ముకుందం, బాలె శంకర్, ఆనందరావు, శ్రీమంజరి, రైతులు పాల్గొన్నారు. కోరుట్లలో.. కోరుట్ల: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బోనస్ ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ నాయకులు డి మాండ్ చేశారు. గురువారం పట్టణంలోని జాతీయ రహదారిపై నంది చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఎంపీపీ తోట నారాయణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్, సీనియర్ నాయకులు చీటి వెంకట్రావు, నాయకులు పాల్గొన్నారు. మెట్పల్లిలో.. మెట్పల్లి: పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. సన్న వడ్లకే బోనస్ ఇస్తామన్న సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు మానుకోవాలని సూచించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. పార్టీ పట్టణ, మండల నాయకులు పాల్గొన్నారు. దొడ్డు వడ్లకూ రూ.500 ఇవ్వాల్సిందే.. జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ -
సాగు ప్రణాళిక ఖరారు
● వరి వైపే అన్నదాతల మొగ్గు ● వానాకాలంలో పెరగనున్న విస్తీర్ణం ● జిల్లాలో 4.14 లక్షల ఎకరాల్లో సాగుజగిత్యాలఅగ్రికల్చర్: వచ్చే వానాకాలం జిల్లా రైతులు వరి పంట వైపే దృష్టి పెట్టనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వానాకాలం సీజన్లో సాగుచేసే పంటలు.. వాటికి అవసరమైన రసాయన ఎరువులు, సబ్సిడీ విత్తనాల కోసం జిల్లా వ్యసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. 4.14 లక్షల ఎకరాల్లో పంటల సాగు వానాకాలం సీజన్లో జిల్లాలో 4.14 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, కంది పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. వరిని అత్యధికంగా 3.07 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 38,000, పత్తి 18,401, కంది 2,204, పసుపు 8,016, పెసర 49, సోయాబీన్ 605, చెరుకు 651, మిర్చి 1,253, కూరగాయలు వంటి ఇతర పంటలు 15,330 ఎకరాల్లో సాగు చేయనున్నారు. జిల్లాలో సాధారణ పంటల విస్తీర్ణం 3.98 లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది అదనంగా 15,587 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయడం గమనార్హం. 1.08 లక్షల టన్నుల ఎరువుల అవసరం జిల్లాలో సాగయ్యే ఆయా పంటల కోసం రసాయన ఎరువులు కూడా నెలవారీగా జిల్లాకు రానున్నాయి. 40,797టన్నుల యూరియా, 11,699 టన్నుల డీఏపీ, 10,257 టన్నుల పొటాష్, 45,500 టన్నుల కాంప్లెక్స్, సింగిల్ సూపర్ ఫాస్పేట్, 4,763 టన్నుల రసాయన ఎరువులు అవసరమని అధికారులు తేల్చారు. పంటల పెరుగుదలను బట్టి జూన్లో 22,163 టన్నులు జూలైలో 30,674 టన్నులు, ఆగస్టులో 33,253 టన్నులు, సెప్టెంబర్లో 22,163టన్నుల చొప్పున ఎరువులు జిల్లాకు చేరేలా ప్రణాళిక రూపొందించారు. ఈనెలలో ఇప్పటివరకు యూరియా 15,372 టన్నులు, డీఏపీ 1,139 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 6,485 టన్నులు, పొటాష్ 2,55 టన్నులు, సింగిల్ సూపర్ ఫాస్పేట్ 4,64 టన్నుల చొప్పున మొత్తం 23,714 టన్నులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాకు 76,095 క్వింటాళ్ల విత్తనాలు జిల్లాకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 74,635 క్వింటాళ్ల వరి, 257 క్వింటాళ్ల కంది, 3,230 క్వింటాళ్ల మొక్కజొన్న, 18 క్వింటాళ్ల పెసర, 562.5 క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు అవసరమని ప్రణాళిక సిద్ధం చేసింది. విత్తనాలను ప్రభుత్వ, ప్రైవేట్ దుకాణాల్లో సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు చేసింది. దీనికి తోడు 40 వేల వివిధ కంపెనీల పత్తి విత్తన ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. పచ్చిరొట్ట విత్తనాలు సిద్ధం వరి పండించే పొలాల్లో తొలుత పచ్చిరొట్ట కోసం జనుము, జీలుగ విత్తనాలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ మేరకు జిల్లాకు అవసరమైన 14,303 క్వింటాళ్ల జీలుగ, 2400 క్వింటాళ్ల జనుము విత్తనాలను 60 శాతం సబ్సిడీపై సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జిల్లాకు కేటాయింపు చేశారు. ప్రభుత్వ సబ్సిడీ పోను మిగతా సొమ్మును రైతులు చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ విత్తనాలను జిల్లాలోని సింగిల్ విండోలు, అగ్రోస్ కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. -
ఘనంగా నృసింహుడి నవరాత్రి ఉత్సవాలు
ధర్మపురి: ధర్మపురి లక్ష్మినృసింహస్వామి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగోరోజు కార్యక్రమంలో భాగంగా ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర వరుణ కలశస్థాపన, మూలమంత్ర హోమాలు, స్థాపితదేవత హోమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు. ‘దోస్త్’ హెల్ప్ సెంటర్ ఏర్పాటుజగిత్యాల: డిగ్రీ అడ్మిషన్లకు జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలో దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ అరిగెల అశోక్ తెలిపారు. ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని, ఏదైనా సమస్యలుంటే ప్రిన్సిపల్ 98484 15835, కో–ఆర్డినేటర్ 98855 88419 సంప్రదించాలని కోరారు. మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఈనెల 20 నుంచి ప్రారంభమవుతాయని, మొదటి విడత సీట్ల కేటాయింపు జూన్ 6న ఉంటుందని తెలిపారు. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేతజగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లి సబ్స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఏఈ తెలిపారు. సోమన్పల్లి, సంగంపల్లి, హబ్సీపూర్, హన్మాజీపేట, కండ్లపల్లిలో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు. అలాగే జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు సబ్స్టేషన్ మరమ్మతు దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఏఈ రహీం తెలిపారు. వాణినగర్, తులసినగర్, బీట్బజార్, గీతా విద్యాలయం, నటరాజ్ చౌరస్తా, బసవేశ్వరకూడలి, ఇస్లాంపూర, నిజామాబాద్రోడ్, పురాణిపేటలో కరెంట్ ఉండదని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలపై పీఆర్టీయూ వినతిమెట్పల్లిరూరల్: పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్టీయూ నాయకులు రాష్ట్ర పీఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకర్ను కలిసి విన్నవించారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో ఆయనను కలిశారు. 27 డిమాండ్లతో కూడిన వివిధ సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్, తదితరులు పాల్గొన్నారు. డెంగీ నివారణ అందరి బాధ్యతజగిత్యాల: డెంగీ ప్రమాదకరమని, నివారణ అందరి బాధ్యత అని డీఎంహెచ్వో పుప్పాల శ్రీధర్ అన్నారు. గురువారం జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏడిస్ ఈజిప్ట్ ఆడదోమతో వ్యాధి వ్యాప్తి చెందుతుందని, నియంత్రణే అతిముఖ్యమని, వ్యక్తిగతంగా ప్రతిఒక్కరూ దోమలు కుట్టకుండా చూసుకోవాలని సూచించారు. దోమలు నీటిలో నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. వారంలో రెండుసార్లు శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. కీటక జనీత వ్యాధి నియంత్రణ అధికారి శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు సమియోద్దీన్, జైపాల్రెడ్డి, సంతోష్, స్వాతి, చైతన్యరాణి పాల్గొన్నారు. ప్రజల్లో అవగాహన పెరగాలి జగిత్యాలరూరల్: డెంగీపై ప్రజల్లో అవగాహన పెరగాలని డెప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగీ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డాక్టర్ రవిశంకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
జగిత్యాలరూరల్: అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. జగిత్యాలరూరల్ మండలం చల్గల్, మోరపల్లి, తాటిపల్లిలో గురువారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. చల్గల్, మోరపల్లి గ్రామాల మధ్య రెండు భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఆ ప్రాంతంలో విద్యుత్వైర్లు కూడా తెగి కిందపడ్డాయి. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కథలాపూర్లో.. కథలాపూర్: మండలంలో అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం తడిసిందని రైతులు తెలిపారు. ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీలు సకాలంలో రాకపోవడంతో ఇక్కట్ల పాలవుతున్నామని పేర్కొన్నారు. చెట్లకొమ్మలు విరిగి ట్రాఫిక్కు అంతరాయం మేడిపల్లి: మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై చెట్లకొమ్మలు విరిగి ఓ వ్యాన్పై పడ్డాయి. ఓ టూవీలర్ పాక్షికంగా దెబ్బతింది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు చెట్లకొమ్మలు తొలగించి క్లియర్ చేశారు. అకాల వర్షం.. తడిసిన ధాన్యం సారంగాపూర్: సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో భారీ ఈదురు గాలులు వీచాయి. సారంగాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వర్షం కురిసింది. రంగపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని అధికారులు పేర్కొన్నారు. నేలకొరిగిన చెట్లు తెగిపోయిన విద్యుత్ వైర్లు -
రైతులకు ఇబ్బంది తలెత్తనివ్వొద్దు
జగిత్యాల: ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తనివ్వొద్దని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. కలెక్టరేట్లో అధికారులు, రైస్మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో బుధవారం సమీక్ష స మావేశం నిర్వహించారు. అకాల వర్షాలు కురుస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటవెంటనే రైస్మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లర్లు కూడా ధాన్యాన్ని తొందరగా దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. రైతులకు ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమచేయాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, రైస్మిల్లర్స్ పాల్గొన్నారు. ● కలెక్టర్ యాస్మిన్ బాషా -
ప్రజలు వంశీవైపే నిలిచారు
ధర్మపురి: పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి వంశీవైపే నిలిచారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ధర్మపురిలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగింటిని అమలు చేస్తున్నామని పేర్కొన్నా రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాళీ ఖజానాను అప్పగించినా ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామన్నా రు. స్థానికంగా డిగ్రీ, పాలిటెక్నిక్ ఏర్పాటుతోపాటు ఈ ప్రాంతానికి అవసరమైన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని వెల్లడించారు. నాయకులు దినేష్, నిశాంత్రెడ్డి, సుభాష్, వేముల రాజేశ్, లక్ష్మణ్, ప్ర సాద్, సుధాకర్, సుముఖ్, రవీందర్ పాల్గొన్నారు. దారిమళ్లిన అగ్నిమాపక శాఖ బిల్లు ● విచారణ చేపట్టని అధికారులు ● విధుల్లోకి రాని సూత్రధారిజగిత్యాలక్రైం: జగిత్యాల అగ్నిమాపక శాఖలో గతంలో పనిచేసి.. ఉద్యోగి విరమణ పొందిన అధికారి మరోచోట పనిచేస్తున్న వ్యక్తితో కలిసి అక్రమాలకు పాల్పడిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని ఏప్రిల్ 21న ‘సాక్షి’ ‘జగిత్యాల అగ్నిమాపక శాఖలో అక్రమాలు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అయినప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం విచారణ చేపట్టి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతోపాటు మరోచోట పనిచేస్తున్న వ్యక్తి అగ్నిమాపక శాఖ బిల్లులు తన ఖాతాలోకి మళ్లించుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. అగ్నిమాపక శాఖ బిల్లును అదే శాఖలో పనిచేసే ఓ వ్యక్తి తన ఖాతాలోకి మళ్లించి అవినీతికి పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తున్నా.. అతడిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తుండడం గమనార్హం. మరోచోట పనిచేస్తున్న వ్యక్తి ‘సాక్షి’ కథనంతో దీర్ఘకాలిక సెలవులో ఉండటం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. -
‘ఆదర్శ’ కేంద్రాల్లో పోలింగ్ అంతంతే
జగిత్యాల: ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్, పెద్దపల్లి పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఐదు మహిళా కేంద్రాలు, మరో ఐదు మోడల్, ఒకటి దివ్యాంగులకు, ఒకటి కేవలం యువత కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఓటర్లను ఆకర్షించేలా రంగులు, హంగులు వేయడంతోపాటు పచ్చని పందిళ్లు కూడా వేశారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ ఓటు శాతం పెంచాలనే ఉద్దేశంతో ఇలా ఏర్పాట్లు చేసినప్పటికీ ఓటర్లు మాత్రం అంతంతమాత్రంగానే ముందుకొచ్చారు. ఏ బూత్లోనూ 70 శాతానికి ఓటింగ్ మించలేదు. ఆదర్శ కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు పోలింగ్ శాతం పెంచేలా విస్తృతంగా అవగాహన కల్పించినా ఆశించినస్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. మహిళా కేంద్రాల్లో జగిత్యాలలోని తిప్పన్నపేట, కోరుట్లలోని బండలింగాపూర్, ధర్మపురిలోని పెగడపల్లి కేంద్రాల్లో కొద్దిమేర ఆశించిన మేర పోలింగ్ నమోదైంది. మోడల్ కేంద్రాల్లో కోరుట్లలో ఎస్ఎస్ఆర్ తండా, జగిత్యాలలోని చిత్రవేణిగూడెం, ధర్మపురిలో ధర్మపురి పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువగా నమోదైనా మిగతా వాటిల్లో నమోదు కాలేదు. మహిళల కోసం ప్రత్యేకంగా రంగురంగులతో ఏర్పాటు చేసినప్పటికీ ఓటుహక్కు వినియోగించుకోవడంలో ముందుకు రాలేదు. కొన్ని చోట్లనే మెరుగు అవగాహన కల్పించినా ఫలితం శూన్యం -
ఏటా నువ్వు సాగు
ప్రతి ఏటా నువ్వుల పంటను కనీసం రెండు ఎకరాల్లో సాగు చేస్తాను. గత రెండేళ్ల నుంచి నువ్వు పంటను విత్తనోత్పత్తి కింద సాగు చేస్తున్నాను. సాధారణంతో పోల్చితే ఎకరాకు రూ.3వేల నుంచి రూ.4వేల వరకు అదనపు అదాయం వస్తుంది. మాకు నువ్వుల పంట కలిసి వస్తోంది. – లక్ష్మారెడ్డి, నువ్వుల రైతు, జోగిన్పల్లి లక్ష్మీపూర్లో 500 ఎకరాలు.. గ్రామంలో తొలుత కొద్దిమంది రైతులు మాత్రమే నువ్వుల పంట సాగు చేసేవారు. నువ్వులను విత్తనంగా అమ్మడంతో మంచి ఆదాయం వస్తోంది. దీంతో ప్రస్తుతం మా గ్రామంలో దాదాపు 500 ఎకరాల వరకు నువ్వు పంట సాగు చేసి, సొసైటీ ద్వారా విక్రయిస్తూ లాభం పొందుతున్నాం. – ఏలేటి రాజిరెడ్డి, నువ్వుల రైతు, లక్ష్మీపూర్ వినూత్న ఆలోచన జేసీఎస్–1020 నువ్వుల రకానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆ రకం నువ్వులను విత్తనంగా ఉత్పత్తి చేస్తే మంచి ఆదాయం వస్తుందని చెప్పడంతో మూడు గ్రామాల రైతులు ముందుకొచ్చారు. శాస్త్రవేత్తలం నాలుగైదు సార్లు వెళ్లి పంటను చూసి, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చాం. – డాక్టర్ పద్మజ, నువ్వుల శాస్త్రవేత్త, జగిత్యాల -
కలిసొచ్చేది ఎవరికో..?
● ఓటింగ్ సరళిపై జోరుగా చర్చ ● పార్టీ అభ్యర్థులందరిలోనూ ధీమా ● మహిళల ఓట్లే కీలకమనే భావనజగిత్యాల: ఎన్నికలు ముగియడంతో జిల్లాలో ఎక్కడ చూసినా ఏ అభ్యర్థి గెలుస్తాడో..? అనే చర్చనే కొనసాగుతోంది. జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, జంక్షన్ల వద్ద ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారు. ఇటు ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం పోలింగ్ సరళిని ఆరా తీస్తూ ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వస్తున్నాయో అంచనా వేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలతో చర్చిస్తూ ఏ గ్రామాల్లో ఎంత మెజార్టీ వస్తుందో లెక్కలు వేసుకుంటూ గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఓట్లు వినియోగించుకోవడంతో వారి ఓట్లనే ఎక్కువగా లెక్కగడుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు వస్తాయి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోకి ధర్మపురి నియోజకవర్గం వస్తుంది. ఈ నియోజకవర్గాలు ఓటర్లు ఎటు వైపు మొగ్గారో వేచి చూడాల్సి ఉంది. ఈవీఎంల్లో భవిష్యత్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల భవిష్యత్ ఉంది. ఇప్పటికే ఈవీఎంలను భద్రంగా నిజామాబాద్లోని డిచ్పల్లికి తరలించారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో వాటిని మూడంచెల భద్రత మధ్య ఉంచారు. అభ్యర్థులు మాత్రం ఎవరి ధీమాను వారు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానంగా పోటీపడగా.. నువ్వా నేనా అన్నరీతిలో గెలుపోటములపై ఎవరి ధీమాతో వారు విశ్వాసంగా ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జగిత్యాలకు జీవన్రెడ్డి పోటీకి దిగగా నిజామాబాద్కు చెందిన బీజేపీ నుంచి అర్వింద్, బీఆర్ఎస్ నుంచి గోవర్దన్ పోటీపడ్డారు. పెరుగుతున్న టెన్షన్ అభ్యర్థుల్లో రోజురోజుకూ టెన్షన్ పెరుగుతోంది. ఓట్ల పండుగ ముగిసిపోవడంతో సర్వేలు, పోలింగ్పై అంచనాలు వేయడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. అంతటా పోలింగ్ గురించే చర్చించుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులే కాకుండా ప్రజల్లో సైతం ఎవరు గెలుస్తారనే చర్చలు ఊపందుకున్నాయి. హోరాహోరీగా పోటీ కొనసాగడంతో ఓటర్ల మనోభావాలను ఆధారంగా చేసుకుని ఫలితాలపై ఊహాగానాలు వేసుకుంటున్నారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాలు తేడా లేకుండా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నెల రోజుల పాటు ప్రచారంలో మునిగి తేలినప్పటికీ నిత్యం అధికారులు, నాయకులతో చర్చించుకుంటూ విరామం దొరికితే విశ్రాంతి తీసుకుంటున్నారు. -
జిల్లాలో మోడల్ కేంద్రాల్లో ఓటింగ్ నమోదు ఇలా..
జగిత్యాల నియోజకవర్గం: అల్లీపూర్ 1,163 848 కల్లెడ 1,256 904 చిత్రవేణిగూడెం 408 360 జగిత్యాల 1,343 944 జగిత్యాల 814 586 ధర్మపురి నియోజకవర్గం: వెల్గటూర్ 1,243 851 దోనూర్ 1,012 703 ధర్మపురి 952 570 ధర్మపురి 482 362 గొల్లపల్లి 1,089 802 దివ్యాంగుల పోలింగ్ కేంద్రం మెట్పల్లి 1,440 910 జగిత్యాల 638 396 ధర్మపురి 691 514 యూత్ పోలింగ్ కేంద్రం మెట్పల్లి 1,132 873 జగిత్యాల 1,387 916 రాయపట్నం 1,000 814 మహిళాకేంద్రం.. కోరుట్ల నియోజకవర్గం: కేంద్రం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు అమ్మక్కపేట 739 596 బండలింగాపూర్ 468 390 వెంకటాపూర్ 699 571 మోహన్రావుపేట 1,061 784 కోరుట్ల 964 708 జగిత్యాల నియోజకవర్గం: సింగరావుపేట 1,102 863 పెంబట్ల 1,063 823 తిప్పన్నపేట 643 574 జగిత్యాల 1,040 701 జగిత్యాల 1,220 780 ధర్మపురి నియోజకవర్గం: నేరెళ్ల 815 597 దట్నూర్ 917 715 ఇబ్రహీంనగర్ 1,003 774 చిన్నాపూర్ 1,076 806 పెగడపల్లి 556 432 మోడల్ పోలింగ్ కేంద్రం.. కోరుట్ల నియోజకవర్గం: కోరుట్ల 939 637 గుమ్లాపూర్ 578 481 వేంపేట 1,099 895 ఏఎస్ఆర్తండా 275 219 మెట్పల్లి 1,264 818 -
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనం
ధర్మపురి: కార్పొరేట్ కళాశాలల్లో చదవాలనుకునే విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2024–25 విద్యా సంవత్సరానికి గాను పది పాసైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, డిసేబుల్డ్, మైనార్టీ విద్యార్థులు ఈనెల 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. పదో తరగతిలో 7.0 జీపీ ఏ, ఆపై గ్రేడ్ పొందిన విద్యార్థులు అర్హులని ప్రకటించింది. ప్రభుత్వ సంక్షేమ గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూరిబా, గురుకులాలు, మున్సిపల్, జి ల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ సంక్షే మ రెసిడెన్షియల్ స్కూల్స్, నవోదయ విద్యాలయా ల విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదివి న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చంది. టెన్త్ మె మో, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, బ్యాంకు పాస్ బుక్, ఆధార్కార్డు, రేషన్కార్డు నెంబర్, పాస్పోర్టు సైజ్ ఫొటో, విద్యార్థుల స్టడీ సర్టిఫికెట్లు ఏడేళ్లకు సంబందించినవి జత చేయాల్సి ఉంటుంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement