-
రైతులు రశీదు తీసుకోవాలి
బచ్చన్నపేట: ఎరువుల దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు, మందులను కొనుగోలు చేసినప్పుడు రైతులు తప్పకుండా రశీదులను తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శివశంకర్ ఫర్టిలైజర్ షాపులో ఎరువుల, విత్తనాల స్టాక్ వివరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వరి దుక్కిలో చల్లుకోవడానికి పొలానికి బలమైన జీలుగ విత్తనాలు కూడా అందుబుటులో ఉంచామన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో లూజుగా ఉన్నవాటిని ప్యాకింగ్ సరిగా లేనికి, ఐఎస్ఐ మార్క్ లేని విత్తనాలను కొనుగోలు చేయకూడదన్నారు. కేవలం జీఈఏసీ అప్రూవల్ ఉన్న ప్యాకెట్లను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఎలాంటి విత్తనాలను విత్తకూడదన్నారు. పంటల మెళకువలో ఆయా గ్రామాల ఏఈఓల సలహాలు, సూచనలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి విద్యాకర్రెడ్డి, షాపు యజమాని పిన్న సురేందర్, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వినోద్కుమార్ -
ఇసుక తరలింపుపై రైతుల ఆగ్రహం
దేవరుప్పుల: గొల్లపల్లి వాగు చెక్డ్యామ్ నుంచి ఇసుక తరలించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వాగు పరీవాహక రైతులు గొల్లపల్లి వాగు శివారులో ఇసుక తరలింపును అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి... ఈ నెల 22న మండలంలోని గొల్లపల్లి వాగు చెక్డ్యామ్ ఏరియాలో కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఐ అండ్ క్యాడ్ ఇరిగేషన్ డివిజన్ –5 ఉత్తర్వుల అనుమతుల పేరిట పాలకుర్తి రిజర్వాయర్కు ఐదు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలించేందుకు అనుమతులు వచ్చాయి. అదే రోజు చెక్ డ్యామ్ ఏరియా నుంచి ఇసుక తరలించేందుకు జేసీబీ యంత్రాలు రాగా రైతులు అడ్డుకున్న విషయం విధితమే. మళ్లీ బుధవారం కూడా పెద్ద ఎత్తున గొల్లపల్లి వాగు శివారులో జేసీబీలతో ఇసుక తరలిస్తుండగా వాగు పరీవాహక రైతులు చేరుకుని అడ్డుకున్నారు. ఈ విషయమై కాంట్రాక్టర్లు తమకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ రైతులు ససేమిర అన్నారు. వాగులో నుంచి యంత్రాలను వెళ్లగొట్టారు. దారికి అడ్డంగా రాతిబండలు వేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఇక్కడి నుంచి ఇసుక తరలిస్తే చుక్కనీరు భూమిలోకి ఇంకదన్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వలాభం చూడకుండా రైతుల గోసను ఆలకించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకవరం నర్సింహ్మరెడ్డి, తీగల దయాకర్, అబ్బయ్య, యాదగిరి, సైదులు, సత్యనారాయణ, భిక్షపతి, కిష్టయ్య, రైతులు ఉన్నారు. -
జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలి
రఘునాథపల్లి: రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత పుట్టిన గడ్డ జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు మైలారం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని కోమల్లలో ఆయన రజక సంఘం నాయకులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి ఐలమ్మ వర్థంతిని అధికారికంగా జరపడంతో పాటు జిల్లాకు పేరు పెట్టాలన్నారు. రజకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు ఐలయ్య, శ్రీనివాస్, భిక్షపతి, రామ్మూర్తి, సంపత్, వెంకటనర్సు, చంద్రయ్య, సత్యనారాయణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
జనగామ శంకర్దాదాలు
జనగామ: అర్హత లేని వైద్యం చేస్తూ రోగుల పాలిట శాపంగా మారుతున్నారు. తప్పుడు హోదాలతో అమాయక ప్రజలను మోసం చేస్తూ... నిబంధనలకు విరుద్ధంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. చిరంజీవి నటించిన శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలోలాగా పట్టణంలో కూడా అర్హత లేని వైద్యులు దర్జాగా స్టెతస్కోప్ వేసుకుని ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. స్పెషలిస్టు హోదా లేకున్నా... బోర్డులపై పెద్ద పెద్ద అక్షరాలతో రాతలు రాస్తూ... అర్హత లేని వ్యక్తులు రిపోర్టులు ఇచ్చేస్తున్నారు. కొంత మంది కక్కుర్తి అధికారుల అండదండలతో ప్రైవేట్ వైద్యంలో నకిలీ డాక్టర్లదే హవా కొనసాగుతుంది. నెలనెల ‘మామూళ్లు’ గానే డూప్లికేట్ వైద్యానికి సహకారం అందిస్తూ... గాలిలో కలిసి పోతున్న అమాయకుల ప్రాణాలకు కారకులవుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తూ.. వేలకు వేలు దండుకుంటూ... ప్రెగ్నెన్సీ పరీక్షలు అంగట్లో సరుకులా మార్చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యం దందాను పెకిలించేందుకు తెలంగాణ వైద్య మండలి బృందం దూకుడు పెంచింది. ఆకస్మిక దాడులతో నకిలీ వైద్యం చేస్తున్న నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తూ... కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అమాయక ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల భరతం పట్టేందుకు రాష్ట్ర వైద్యమండలి టాస్క్ఫోర్స్ టీం సభ్యులు ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, సర్టిఫై లేని ఆస్పత్రులు, ఎముకల వైద్యశాలలు, డయాగ్నోస్టిక్, ఫిజియోథెరపీ తదితర సెంటర్లను తెలంగాణ వైద్య మండలి టాస్క్ ఫోర్స్ టీం బృందం వరుస దాడులతో నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న హాస్పిటల్స్ బాగోతం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వైద్యమండలి టాస్క్ఫోర్స్ టీం సభ్యులు డాక్టర్ మాగంటి శేషుమాదవ్, డాక్టర్ వద్ది రాజు రాకేష్, డాక్టర్ వేములపల్లి నరేష్, డాక్టర్ కొలిపాక వెంకటస్వామి, డాక్టర్ జలగం విజయ్, డాక్టర్ ఎండీ అన్వర్, డాక్టర్ ఈశ్వర్రెడ్డి, డాక్టర్ షాబాజ్ నేతృత్వంలో ఈ నెల 28వ తేదీన జిల్లా కేంద్రంలో తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. గుట్టుచప్పుడు కాకుండా గర్భిణీ, హెచ్ఐవీ పరీక్షలు, ల్యాబ్కు సంబంధించి అర్హత లేని వ్యక్తులచే సర్టిఫికేషన్, తప్పుడు హోదాలు, అనర్హత చాటున స్పెషలిస్టు పేరిట వైద్యం అందిస్తూ తెలంగాణ వైద్యమండలిలో టాస్క్ ఫోర్స్ టీంకు అడ్డంగా దొరికేశారు. నకిలీ వైద్యం కేసులో ఐపీసీ సెక్షన్లువేషధారణ ద్వారా మోసం చేసిన కేసులో (416), మోసం చేసిన శిక్షలో (417, 419), చీటింగ్ (418), నకిలీ వైద్యంతో నిజమని నమ్మించడం (471), తదితర వాటికి సంబంధించి ఐపీఎస్ సెక్షన్ల పరంగా కేసులు నమోదు చేస్తామని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు తెలిపారు.అర్హత లేని డాక్టర్లు.. అనవసర వైద్యం ఎంబీబీఎస్తో పాటు ఎండీగా బోర్డులు ఎవర్ గ్రీన్ ఆస్పత్రిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్లు విద్యార్హత లేకున్నా.. ఎముకల స్పెషలిస్ట్ వైద్యం పలువురిపై కేసు నమోదు తెలంగాణ వైద్య మండలి విజిలెన్స్కు నివేదికలుఅర్హత లేకున్నా.. వైద్య పట్టా లేకుండా ఎవరూ చికిత్స చేయొద్దు. పారామెడికల్ కోర్సు పూర్తి చేసిన వారు, ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి, మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలి. ఎలాంటి అర్హత లేకున్నా, పేరుకు ముందు డాక్టర్ అని బోర్డు తగిలించుకుని ఇంజెక్షన్లు ఇవ్వడం, గ్లూకోస్ ఎక్కించడం విరుద్ధం. క్వాలిఫైడ్ డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ దుకాణాల్లో మందులు ఇవ్వాలి. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ వైద్య మండలికి వచ్చిన ఫిర్యాదులతో పాటు రెగ్యులర్గా తనిఖీలు చేస్తుంది. వైద్య పరంగా ఎటువంటి విద్యార్హత లేకుండా, ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. డాక్టర్ చీటి లేకుండా మందులు ఇస్తే, దానిపై ఉన్న బ్యాచ్ నంబర్తో పట్టేస్తాం. – డాక్టర్ జలగం విజయ్, తెలంగాణ వైద్య మండలి టీం సభ్యుడు -
పనుల్లో నాణ్యత పాటించాలి
జనగామ: జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్తీ యూపీఎస్, ఉర్దూ మీడియం యూపీఎస్ పాఠశాలలు, జనగామ మండలం శామీర్పేట, ఎల్లంల జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక, ఉన్నత బాణాపురం పీఎస్ పాఠశాలల్లో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో విద్యుత్ బల్బులు, ఫ్యాన్లు, ఇతర మరమ్మతు పనులను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. తాగు నీటి సిస్టర్న్, వాష్ ఏరియా ప్లాట్ ఫాం, ట్యాప్లను తనిఖీ చేసి, నిర్దేశిత గడువు లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 291 పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 93 పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు సుందరీకరణ పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ రాము, డీఆర్డీఓ మొగులప్ప తదితరులు ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి రఘునాథపల్లి: ధాన్యం కొనుగోళ్లు రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. బుధవారం మండలంలోని అశ్వరావుపల్లి, వెల్ది గ్రామాల్లోని ఐకేపీ, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ధాన్యం తరలింపు, తేమ శాతం తదితర వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 195 కొనుగోలు కేంద్రాలకు గాను 185 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. ఇప్పటి వరకు 24,559 మంది రైతుల నుంచి 1,25,163,360 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, 23,413 మంది రైతులకు రూ. 256.18 కోట్లు చెల్లించామన్నారు. కలెక్టర్ వెంట డీసీఎస్ఓ రోజారాణి, డీఎం, డీఆర్డీఓ మొగులప్ప, డీఎం సీఎస్ ప్రసాద్, తహసీల్దార్ పురం యుగేందర్, డీటీ సీఎస్ శ్రీనివాస్, సీసీ సంపత్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి కలెక్టర్ రిజ్వాన్ బాషా -
ఇంటి నిర్మాణ అనుమతుల్లో జాప్యం వద్దు
జనగామ: జనగామ పట్టణంలో ఇంటి నిర్మాణ అనుమతుల్లో జాప్యం చేయరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ కోరారు. ఇటీవల సాక్షిలో ప్రచురిత మైన గాడితప్పిన టౌన్ ప్లానింగ్ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి ఏసీ స్పదించారు. కమిషనర్ చాంబర్లో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునలింగయ్య, కమిషనర్ వెంకటేశ్వర్లు, 2వ వార్డు కౌన్సిలర్ వాంకుడోతు అనిత, తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంటి నిర్మాణ అను మతులకు సంబంధించి 41 ఫైళ్లలో 50 శాతం మేర ఎంక్వరీ పూర్తి చేసి, నివేదిక అందించాలని టీపీఎస్ ప్రశాంతిని ఆదేశించారు. సేవల విషయంలో మున్సిపల్కు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ముఖ్యంగా ఎన్క్రోచ్మెంట్కు సంబంధించి రిపోర్టు అందించాలన్నారు. మెడికల్ లీవ్పై వెళ్లిన టీపీఓ శ్రీధర్కు ఫోన్ చేసి విధులకు రావాలని అడుగగా, యశోద ఆస్పత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుందని వివరణ ఇచ్చారు. ఆస్పత్రి రిపోర్టులను తనకు పంపించాలని ఏసీ ఆదేశించారు. పట్టణంలో వీధి బల్బుల కాంట్రాక్టు పూర్తి కావడం, అవి సరిగా వెలగక పోవడంతో చీకటి మయంగా ఉందని మున్సిపల్ చైర్పర్సన్ ఏసీ దృష్టికి తీసుకు వచ్చారు. ఇంజనీరింగ్ సెక్షన్లో డీఈ, ఇన్చార్జ్ ఏఈ, టీపీఓ, ఆర్ఐ, రెగ్యులర్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ లేకపోవడంతో పరి పాలన కుంటు బడి పోతుందన్నారు. అలాగే చీటకోడూరు ఫిల్టర్ బెడ్ నుంచి సరఫరా చేసే తాగునీరు పచ్చకలర్లో వస్తుందని, నాణ్యతా ప్రమాణాలతో నీటిని ఫిల్టర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ అనిత చెప్పారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి సెంట్రల్ లైటింగ్ మరమ్మతు చేపట్టండి యానిమల్ బర్త్ కంట్రోల్పై సమీక్ష -
సాధారణ బోగీల సంఖ్య పెంచాలి
జనగామ: ప్రతీ రైలులో సాధారణ బోగీల సంఖ్యను పెంచాలని ఐదు సాధారణ బోగీల సాధన సమితి జాతీయ కన్వీనర్ జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ పరికిపండ్ల అశోక్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా బుధవారం పవన్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐదు సాధారణ బోగీల కోసం ప్రధానమంత్రికి దేశ వ్యాప్తంగా కోటి ఉత్తరాలను పంపించడమే లక్ష్యమన్నారు. గాంధీ మార్గంలో ఉద్యమాన్ని వివిధ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ రోజు దేశ వ్యాప్తంగా సుమారు 60 కోట్ల మంది రైలు ప్రయాణం చేస్తున్నారన్నారు. ఈ ప్రయాణంలో జనరల్ బోగీల్లో ప్రయాణించే సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఆగమ్యగోచరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బండి శంకర్ బాబు, బొద్దుల శ్రీధర్,చంద్రశేఖర్, ఆలేటి శ్రీను, హనుమాన్ల రవి, దండెం రవి , వెంకటరమణ్, సయ్యద్, యాకయ్య, వెంకటేశ్వర్లు, బాలనర్సయ్య, విశ్వనాధుల రాజు, భిక్షపతి, నరేష్ పాల్గొన్నారు. బదిలీల షెడ్యూల్ను విడుదల చేయాలిజఫర్గఢ్: సీఎం హామీ మేరకు ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర స్టడి సర్కిల్ సభ్యుడు మంగు జయప్రకాశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా పదోన్నతులు ఆరేళ్లుగా బదిలీలు లేక ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. అక్టోబర్లో బదిలీ అ యిన స్కూల్ అసిస్టెంట్స్ అందరినీ రిలీవ్ చేసి నూతన పాఠశాలలకు పంపించాలన్నారు. గిరి జన సంక్షేమ పాఠశాలలు, గురుకులాల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వేసవి సెలవుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలసదన్ను సందర్శించిన జడ్జిజనగామ రూరల్: జిల్లా కేంద్రంలోని బాల సదన్ (చిల్ట్రన్ హోం)ను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత బుధవారం సందర్శించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జడ్జి అక్కడకు వెళ్లి పిల్లల కష్టసుఖా లను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చదు వు ఎలా సాగుతుంది, నాణ్యతా ప్రమాణాలతో కూడిన భోజనం అందిస్తున్నారా, పిల్లల ఆరో గ్యం తదితర వాటిపై ఆరా తీశారు. పిల్లలు ప్రతీ రోజు 8 గ్లాసుల మంచి నీటిని తాగాలని సూచించారు. జడ్జి వెంట లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది ఇట్టబోయిన జ్యోత్స్న, తదితరులు ఉన్నారు. నిబంధనలు విస్మరిస్తే చర్యలుదేవరుప్పుల: వ్యవసాయ సాగు రైతులకు విత్తనాలు, ఎరువులు విక్రయాల్లో నిబంధనలు విస్మరిస్తే సదరు యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు పరుశరామ్నాయక్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విత్తనాలు, ఎరువులు స్టాక్ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతుల మేరకు నిర్ధేశిత కంపెనీ ఎరువులు మాత్రమే విక్రయించాలని, కాలపరిమితి ముగిసిన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు విక్రయించరాదన్నారు. నకిలీ విత్తనాల ముఠాపై కఠిన చర్యలు తీసుకునేందుకు దుకాణాదారులు తోడ్పాటు అందించాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి జనగామ: విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్, ఆర్జిజన్స్, సెక్యురిటీ గార్డ్స్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీ ఐటీయు) జనగామ సర్కిల్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఈ వేణుమాదవ్కు అందించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ భగవాన్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీను, శ్రీకాంత్, బత్తిని ఆంజనేయులు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ బాగోతం..
పట్టణంలోని స్వర్ణకళామందిర్ థియేటర్ ఏరియాలోని జి.రవికుమార్ ఎటువంటి విద్యార్హత లేకుండా 30 ఏళ్లుగా ఎంబీబీఎస్ వైద్యుడి స్థాయిలో ప్రజలకు చికిత్స చేస్తూ మోసం చేస్తున్నట్లు టాస్క్ఫోర్స్ బృందం గుర్తించింది. ఎవర్ గ్రీన్ డయాగ్నోస్టిక్ సెంటర్లో పని చేస్తున్న వైద్యుడు రెండేళ్ల కిందటే వెళ్లిపోయినా.. ఆయన పేరిట ల్యాబ్ నడిపిస్తూ రక్త, మూత్ర, ఇతర పరీక్షలు చేస్తూ దందా చేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బాలరాజుగౌడ్ అనే వ్యక్తి సత్యం ఎముకల వైద్య నిపుణులు అనే బోర్డుతో బోన్ స్పెషలిస్ట్గా వైద్యం చేయడంతో పాటు ప్రిస్క్రిప్షన్ రాయడాన్ని బృందంలోని సభ్యులు గమనించి ఎన్ఎంసీ చట్టం 34–54 ప్రకారం కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా కజకిస్థాన్లో ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ నిశాంత్, స్థానిక గాయత్రి ఆస్పత్రిలో పని చేస్తూ.. ఎండీగా చెలామణి అవుతూ బోర్డు పెట్టుకుని ఫిజీషియన్, డయాబెటీస్ స్పెషలిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. టాస్క్ఫోర్స్ టీం తనిఖీలు చేస్తున్నట్లు సమాచా రం అందుకున్న లక్ష్మీ ప్రథమ చికిత్స కేంద్రం పేరిట వైద్యం చేస్తున్న ప్రభాకర్ సెంటర్కు తాళం వేసి పరారైనట్లు నిర్ధారించుకుని, దానిపై నిఘా ఉంచారు. ఒక్కరోజు తనిఖీలోనే నకిలీ వైద్యం బా గోతం బట్టబయలు కాగా... ఇంకా ఎన్ని ఉన్నాయనే దానిపై కూపీ లాగుతున్నారు. ఆస్పత్రుల్లో పని చేస్తూ.. కొంతమేర అవగాహన రాగానే ల్యాబ్లు ఏర్పాటు చేయడం... వేలకు వేలు దండుకుంటూ అబార్షన్లు చేస్తూ.. వైద్య వృత్తికి కలంకితం చేస్తున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తప్పు చేయని వ్యక్తులు... టాస్క్ ఫోర్స్ బృందం వచ్చిన సమయంలో కేంద్రాలకు తాళా లు వేసుకుని పరారవడం వెనక అసలు నిజాన్ని వైద్య మండలి టీం బయటకు తీయాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. -
104 మంది గైర్హాజరు
జనగామ రూరల్: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు 104 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని ఇంటర్ విద్యాధికారి ఆంజనేయరాజు మంగళవారం తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలో జనరల్ విద్యార్థులు 1,357కు గాను 1,303 మంది హాజరు కాగా 54 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 323 మందిగాను 301 హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు గాను జనరల్ విభాగంలో 471కి గాను 451 మంది పరీక్షలకు హాజరు కాగా 20 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్లో 142 మందికి 134 హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారన్నారు. -
ఇరిగేషన్ ఎస్ఈ ఎవరు?
సాక్షిప్రతినిధి, వరంగల్ : నీటిపారుదలశాఖ వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీరు (ఎస్ఈ) ఎవరనేది ఆ శాఖలో హాట్టాఫిక్గా మారింది. ఆ రు రోజుల క్రితం వరకు వెంకటేశ్వర్లు ఎస్ఈగా వ్య వహరించారు. ఆయన స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా ఉన్న ఓంకార్ సింగ్ను వరంగల్ సర్కిల్ ఎస్ఈగా నియమించారు. అయితే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై నిర్మించిన బ్యారేజీలపై విచారణ జరుగుతుండగా.. ఆ విచారణ ఎదుర్కొంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఓంకార్సింగ్కు సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా అదనపు బాధ్యతలు అప్పగించడంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ని యామకంపైన కూడా ‘అప్పుడు.. ఇప్పుడు అదే తంతు’ శీర్షికన సాక్షిలో ఈనెల 26న ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది. ఇంజినీరింగ్వర్గాల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్గా మారి ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ మేరకు ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ ఓంకార్సింగ్ బదిలీ ఉత్తర్వులు రద్దు చేశారు. కాళేశ్వరం లింకు–2లో ఈఈగా పని చేస్తు న్న ఎన్.శ్రీధర్ను ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో పదోన్నతుల వ్యవహారం నీటిపారుదలశాఖలో హాట్ టాపిక్ అయింది. ప్రచారంలో సీతారాం నాయక్.. వెంకటేశ్వర్లు పేర్లు వరంగల్ సర్కిల్లో కోట్లాది రూపాయలు పనులు.. ఓంకార్ సింగ్ ఉత్తర్వులు రద్దు.. ప్రత్యామ్నాయంగా ప్రయత్నాలు చర్చనీయాంశంగా పదోన్నతులు, బదిలీలురేసులో సీతారాం.. వెంకటేశ్వర్లు వరంగల్ సర్కిల్ ఎస్ఈ బాధ్యతల నుంచి ఓంకార్ సింగ్ను తప్పించడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఈ సర్కిల్ పరిధిలో కోట్లాది రూపాయల వ్యయం కాగల ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాల్వల పునరుద్ధరణ, లైనింగ్ పనులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ సర్కిల్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టేందుకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కొందరు ఎస్ఈ, ఈఈ క్యాడర్లలోని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓంకార్ సింగ్ కంటే ముందు ఎస్ఈగా ఉన్న వెంకటేశ్వర్లు మళ్లీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఇదే సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న సీతారాంనాయక్ కూడా ఇన్చార్జ్ ఎస్ఈ కోసం ఉన్నతాధికారులను కలిసినట్లు చెబుతున్నారు. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉన్న మరో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కూడా ఈ సీటుపై గురిపెట్టి పావులు కదుపుతున్నారన్న ప్రచారం కూడా ఇంజినీరింగ్ వర్గాల్లో సాగుతోంది. -
పనులు త్వరగా పూర్తి చేయాలి
స్టేషన్ఘన్పూర్: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పునరుద్ధరణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ పింకేష్కుమార్ అన్నారు. మండలంలోని నమిలిగొండలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన విద్యాశాఖ, ఇంజనీరింగ్ అఽఽధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. కేజీబీవీలో చేస్తున్న పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పునరుద్ధరణ పనులను వేగవంతంగా చేపట్టాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే పాఠశాలల్లో నీరు, టాయిలెట్స్, విద్యుత్ తదితర సౌకర్యాలకు సంబంధించిన మరమ్మతు పనులను చేయించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా అవసరమైన మేర మరమ్మతు పనులను చేయాలని అధికా రులను ఆదేశించారు. ఆయన వెంట డీఈఓ రాము, జీసీడీఓ ఎండీ.గౌసియాబేగం, ఈఈ హుస్సేన్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎస్ఓ శ్రీదేవి ఉన్నారు. బచ్చన్నపేట: అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో పాఠశాలలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయన వెంట మండల నోడల్ అధికారి మూర్తి, ఎంపీడీఓ రఘు రామ కృష్ణ తదితరులు ఉన్నారు. రఘునాథపల్లిలో.. రఘునాథపల్లి: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు సత్వరమే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని కంచనపల్లి, గబ్బెట, ఖిలాషాపూర్ ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా పాఠశాలల పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన వెంట డీఈఓ రాము, ఎంపీడీఓ గార్లపాటి శ్రీనివాసులు, పీఆర్ డీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్ ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ పింకేష్కుమార్ -
పట్టభద్రులు ఎవరి పక్షం?
జనగామ: వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ శాతం పెరిగింది. ఈ నెల 27న జరిగిన ఓటింగ్ సమయంలో రాత్రి వరకు ప్రాథమికంగా 76.28 శాతం నమోదు కాగా, అర్థరాత్రి లెక్కలు పూర్తయ్యే సరికి 76.34 శాతంగా అధికారులు ధ్రు వీకరించారు. మొదటి రోజు 17,863 ఓట్లు పోలైనట్లు చూపించగా, ఫైనల్గా 17,879 ఓట్లు పోలు కాగా, కేవలం 16 ఓట్లు పెరిగాయి. పార్లమెంట్ ఎలక్షన్లు ముగిసిన వెంటనే.. పట్టభద్రుల ఎన్నికలు రావడంతో గడిచిన మూడు నెలలుగా జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార హోరులతో పల్లెలు, ప ట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో జిల్లాలో స్థబ్దత నెలకొంది. వచ్చే నెల జూన్ 4న పార్లమెంట్, 5వ తేదీన పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండడంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తీన్మార్ మల్లన్న, రాకేష్రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ముగ్గురి విజయంపై అప్పుడే బెట్టింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కువ..తక్కువ లింగాలఘణపురం మండలంలో రెండు పోలింగ్ బూత్ల్లో 1,677 ఓట్లు ఉండగా అత్యధికంగా 1,377 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 877, మహిళలు 440 మంది ఉన్నారు. అలాగే రఘునాథపల్లి రెండు బూత్ల్లో 1,821 పట్టభద్రుల ఓట్లకు గాను 1,455 రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. అత్యల్పంగా జనగామ గణేష్ వాడ బూత్లో 698 ఓ ట్లకు 493, పాలకుర్తి దక్షిణం వైపు ఏర్పాటు చేసిన బూత్లో 678 ఓట్లకు 488, కొడకండ్లలో 1,315 మంది ఓట్లు ఉండగ, 929 మంది పోలింగ్లో పాల్గొన్నారు. తరిగొప్పుల (79.57 శాతం), జనగామ ధర్మకంచ పాఠశాలలో (79.14), లింగాలఘణపురం పాఠశాలలో తూర్పున ఏర్పాటు చేసిన బూత్లో (82.57), రఘునాథపల్లి పాఠశాలలో తూర్పు, పడమర దిక్కున ఏర్పాటు చేసి బూత్ల్లో (79.47/80.50), స్టేషన్ఘన్పూర్ రెండు బూత్ల్లో (79.10/79.28), పాలకుర్తి పాఠశాలలో ఉత్తరం వైపు ఏర్పాటు చేసిన బూత్లో 79.25 శాతంతో రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు.జిల్లాలో పెరిగిన పోలింగ్ గెలుపోటములపై పార్టీల లెక్కలు బూత్ల వారీగా ఓటింగ్పై ఆరా కేడర్లో ఉత్కంఠ రెండు చోట్ల 80 శాతానికి పైగా పోలింగ్గెలుపోటములపై బేరీజు వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అభ్యర్థుల గెలుపోటములపై రాజకీయ పార్టీలు బేరీజు వేసుకుంటున్నారు. బూత్ల వారీగా ఓట్లు... పోలైనవి ఎన్ని... ఇందులో పురుషులు, మహిళల లెక్కలు తీస్తూ.. ఓటరు జాబితా ముందు ఉంచుకుని.. మనవారు ఎవరనే దానిపై విజయంపై అంచనా వేస్తున్నారు. 2021 ఎలక్షన్ కంటే.. ఉప ఎన్నికలో పోలింగ్ శాతం తగ్గినా.. ప్రస్తుతం నమోదైన ఓట్లు పర్వాలేదు అనిపిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ.. భయం వెంటాడుతూనే ఉంది. మెజార్టీ ఓటర్లు మొదటి ప్రాధాన్యతకు ఓటు వేసి వదిలేశారా.. లేక ఒకటి, రెండుకు సైతం ప్రాధాన్యత ఇచ్చారా లేదా అనే కోణంలో పార్టీల పరంగా సర్వే చేయించుకున్నారు. రెండు నుంచి మూడు శాతం ఓటర్లకు పూర్థి స్థాయి అవగాహన లేకపోవడంతో అభ్యర్థికి ఎదురుగా క్రమ సంఖ్యకు బదులుగా రైట్ గుర్తు వేసినట్లు ప్రచారం జరుగుతుండడంతో... ఆ ఓట్లు ఎవరివనే ఆందోళన లేకపోలేదు.టూర్లకు ప్రణాళిక.. పార్లమెంట్, పట్టభద్రుల ఎలక్షన్లు ముగియడంతో రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు రిలాక్సయ్యారు. ఓట్ల లెక్కింపు వరకు మండలాల వారీగా పలువురు ముఖ్య నాయకులు టూర్లు ప్రణాళిక చేస్తుండగా.. దిగువ శ్రేణి కేడర్ దావత్లతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చే అవకాశం కనిపించక పోవడంతో..అభ్యర్థుల తరఫున శ్రమించిన నేతలు... నామినేటెడ్ పోస్టుల వేట మొదలు పెట్టారు. -
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
స్టేషన్ఘన్పూర్: మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్ అన్నారు. మహిళలలో రుతుస్రావం–పరిశుభ్రత అనే అంశంపై స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మహిళల్లో రుతుస్రావం అనేది సాధారణ ప్రక్రియ అని, ప్రధానంగా కౌమారదశలో ఉన్న బాలికలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎలాంటి అపోహలను నమ్మవద్దని, మనిషి తీసుకున్న ఆహారం జీర్ణమై మలమూత్రాలుగా ఎలా విసర్జిస్తారో మహిళల జీవన విధానంలో రుతుస్రావం కూడా ఒక సాధారణ ప్రక్రియగా భావించాలన్నారు. మహిళలు తప్పనిసరిగా మంచి ప్రోటీన్లు ఉన్న పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మహేందర్, డాక్టర్ సంధ్య, సీహెచ్ఓ సాంబయ్య, హెచ్ఈఓ ప్రభాకర్, హరిప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించాలి
జనగామ రూరల్: పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల లెక్కింపు సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపుపై సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..కౌంటింగ్ రూంలో 17 టేబుల్స్ ఉంటాయని, కంట్రోల్ యూనిట్ నుంచి బటన్ నొక్కి ఫలితాలు చెప్పేటప్పడు ప్రజాప్రతినిధులకు చెప్పాలన్నారు. ప్రతీ ఒక్కరు నమోదు చేసుకోవాలని బిగ్గరగా చెప్పాలని, ఏమైన సమస్యలు ఉంటే వెంటనే రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలన్నారు. శిక్షణపై ఎలాంటి సందేహాలు ఉన్న నివృతి చేసుకోవాలని, ఇబ్బందులు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ అనిల్కుమార్, ఏఓ రవీందర్, కౌంటింగ్ సూపర్వైజర్లు, ఏజెంట్స్, మైక్రో అబ్జర్వర్లు తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్కు ఏర్పాట్లు చేయాలిజూన్ 4న కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు, కలెక్టర్లతో కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై సహాయ అధికారితో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫ్రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్ బాషా సంబంధిత అధికారులకు దిశానిర్థేశం చేశారు. కౌంటింగ్ సక్రమంగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అసరమైన మేరకు అధికారులను సిబ్బంది నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేష్కుమార్, రోహిత్సింగ్, ఆర్డీవోలు వెంకన్న, కొమురయ్య, ఏఓ రవీందర్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా -
నకిలీ వైద్యులపై కొరడా
జనగామ రూరల్: పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రథమ చికిత్సాలయాలు, కొంత మంది వైద్యులపై వైద్య మండలి కొరడా ఝులిపించారు. మంగళవారం రాష్ట్ర వైద్య మండలి టాస్క్ఫోర్స్ టీం సభ్యులు డాక్టర్ మాగంటి శేషుమాదవ్, డాక్టర్ వద్దిరాజు రాకేశ్, వేములపల్లి నరేశ్, కొలిపాక వెంకటస్వామితో పాటు వైద్య బృందం పలు ఆస్పత్రులు, ప్రథమ చికిత్స ఆలయాలు, ఫిజియోథెరఫీ సెంటర్లను తనిఖీ చేశారు. స్వర్ణ కళామందిర్రోడ్డులోని నకిలీ వైద్యుడు జి. రవికుమార్ ఎలాంటి విద్యార్హత లేకుండా ఎంబీబీఎస్ వైద్యస్థాయిలో ప్రజలకు చికిత్స చేస్తూ మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఎవర్గ్రీన్ డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎటువంటి క్వాలిఫైడ్ వైద్యులు లేకుండా రక్త, మూత్ర పరీక్షలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు. బస్టాండ్ రోడ్డు దగ్గరలోని సత్యం ఎముకల ప్రథమ చికిత్సాలయంలోని బాలరాజుగౌడ్ ఎముకల వైద్యనిపునుడు అని బోర్డు పెట్టి వైద్యం చేస్తూ ప్రిస్కిప్షన్ కూడా రాస్తున్నట్లు అధికారులు తెలిపారు. కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చదవి ఎండీ చేసినట్లు ఫిజిషియన్, డయాబెటిక్ స్పెషలిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్న శ్రీ గాయత్రి ఆస్పత్రికి చెందిన డాక్టర్ నిశాంత్కు కౌన్సిల్ నుంచి నోటీసులు సిఫారసు చేశారు. అలాగే తనిఖీల సమాచారం తెలుసుకున్న లక్ష్మీ ప్రథమ చికిత్సాలయం వైద్యుడు ప్రభాకర్ ఆస్పత్రికి తాళం వేసి పరారైనట్లు తెలిపారు. వీరిపై ఎన్ఎం చట్టం 34, 54 ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు డాక్టర్ నరేష్కుమార్ తెలిపారు. అనంతరం హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి మాట్లాడుతూ వైద్య పట్టా లేకుండా ఎవరూ వైద్యం చేయొద్దని, పారామెడికల్ కోర్సు చేసిన వారు ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పంపించాలన్నారు. పలు ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రథమ చికిత్సాలయాలపై కేసు -
రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలి
జనగామ రూరల్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను అమలు చేసి రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఏకకాలంలో మాఫీ చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసి సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2011 కౌలు చట్టం అమలు చేయాలన్నారు. సాగుదారులందరికీ ప్రభుత్వం ప్రకటించిన 12,500 సబ్సిడీ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో కల్తీ విత్తనాల వ్యాపారాన్ని అరికట్టాలన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రతీ ఏటా 3 లక్షల ఎకరాలపైగా పంట నష్టం వాటిల్లుతుందని, నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా వర్తింపజేసి ఆదుకోవాలన్నారు. రైతు భరోసా ద్వారా జూన్ మొదటి వారంలో రూ. 15 వేలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శి చందు, మీట్యా నాయక్, మంగ బీరయ్య, రవీందర్రెడ్డి, భిక్షపతి, అంజయ్య, రామచోక్కం తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
జనగామ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో జిల్లాలోని 27 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు పోలీసు బందోబస్తు మధ్య జనగామ కలెక్టరేట్లోని డిస్ట్రిబ్యూషన్ పాయింట్కు సోమవారం రాత్రి చేరుకున్నాయి. ఇక్కడ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత పోలీసు ఎస్కార్ట్ మధ్య ఐదు ప్రత్యేక బస్సుల్లో నల్లగొండ లోని స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. మొక్కలను సంరక్షించాలి కొడకండ్ల: నర్సరీల్లో పెంచుతున్న మొక్కలతో పాటు హరితహారంలో నాటిన మొక్కలు, ప్రకృతి వనాల్లోని మొక్కలను సంరక్షించాలని డీపీఓ అనిల్కుమార్ సూచించారు. సోమవారం మండలకేంద్రంలోని శ్మశాన వాటిక, షెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని డీపీఓ పరిశీలించి మొక్కల సంరక్షణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి, పంచాయతీ కార్యదర్శి గంట శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ మాలధారుల మహాయజ్ఞం రఘునాథపల్లి/ చిల్పూరు /బచ్చన్నపేట /స్టేషన్ఘన్పూర్ /లింగాలఘణపురం: జిల్లాలోని పలు మండలాల్లో హనుమాన్ దీక్ష చేపట్టిన మాలధారులు సోమవారం భక్తిశ్రద్ధలతో మహాయజ్ఞం, హోమం, శోభాయాత్ర నిర్వహించారు. గురుస్వాముల ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్ శివాలయంలో మహాయజ్ఞం, హోమం నిర్వహించారు. గురుస్వామి పాండు వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ మాలధారులు మల్లేష్, మహేష్, హేమేందర్, కుమార్, లక్ష్మణ్, ఉదయ్, శేఖర్, ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు. చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో గ్రామానికి చెందిన ఎస్ఎస్ఆర్ బ్రదర్స్ శివరాత్రిరాజు–రమ, స్వామి–పుష్పలతలు సోమవారం హనుమాన్ మహాయజ్ఞం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో మాలధారులు ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు చేపట్టారు. అనంతరం ఇరుముడులు కట్టుకొని కొండగట్టుకు బయలుదేరారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన 11 మంది హనుమాన్ మాలధారులు మాల విరమణ కోసం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు దేవాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. లింగాలఘణపురం మండల కేంద్రంలో హనుమాన్మాలధారులు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. రాంబాబు, ఉమేశ్, సంపత్, సత్యనారాయణ, రమేష్, నర్సింహ్ములు, నరహరి పాల్గొన్నారు. నేటి నుంచి అధ్యాపకులకు శిక్షణ కేయూ క్యాంపస్: తెలంగాణలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, ఇంగ్లిష్ అధ్యాపకులకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ఈనెల 28 నుంచి మూడు వారాల పాటు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్లాల్ సోమవారం తెలిపారు. శిక్షణ కార్యక్రమం ప్రారంభ సమావేశాన్ని ఈనెల 28న ఉదయం 11గంటలకు క్యాంపస్లోని గణితశాస్త్ర విభాగం సెమినార్హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అ తిథిగా కేయూ ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణ, గౌరవ అతిథిగా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య మ ల్లారెడ్డి, ఫిజిక్స్ విభాగాధిపతి సీజే శ్రీలత, కెమి స్ట్రీ విభాగాధిపతి సవితాజ్యోత్స్న పాల్గొంటారని తెలిపారు. -
మండలాల వారీగా ఓటర్ల వివరాలు
నర్మెట 688 368 1,056 తరిగొప్పుల 366 192 558 బచ్చన్నపేట 1,275 719 1,994 (అదర్స్–1) జనగామ 3,514 2,397 5,911 లిం.ఘనపురం 1,094 583 1,677 రఘునాథపల్లి 1,183 638 1,821 స్టేషన్ఘన్పూర్ 1,244 792 2,036 చిల్పూరు 746 408 1,154 జఫర్గఢ్ 987 537 1,524 పాలకుర్తి 1,692 812 2,504 దేవరుప్పుల 1,221 647 1,868 కొడకండ్ల 905 410 1,315 మొత్తం 14,915 8,503 23,419 దివ్యాంగుల ఓటర్లు 506 219 725పోలింగ్ స్టేషన్ పురుషులు మహిళలు మొత్తం -
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా జనగామ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరు ఓటు హక్కు నమోదు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఆదివారం ఆయన కలెక్టరేట్లో మాట్లాడారు. ఓటు వేసేందుకు ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేని పక్షంలో 12 రకాల ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులో ఏదైనా ఒకటి తీసుకు రావాలన్నారు. ఆధార్ కార్డు, ఈజీఎస్ జాబ్ కార్డు, బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ వారిచే జారీ చేసిన పాస్ పుస్తకాలు, కార్మిక మంత్రిత్వ శాఖ ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్ పోర్టు, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్యూలు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫొటోతో జారీ చేసిన ఐడీ కార్డు, ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డు (యూడీఐడీ)లలో ఏదో ఒకదానితో ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు. -
రూ.22.92 లక్షలతో ఏఏపీసీ పనులు
లింగాలఘణపురం: మండలంలో గతంలో మన ఊరు–మన బడి పాఠశాలలు 11 మినహా మిగిలిన 18 పాఠశాలల్లో రూ.22.92 లక్షలతో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ (ఏఏపీసీ) పనులు ముమ్మరంగా సాగుతున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి చేయాలని అధికార యంత్రాంగం కమిటీ చైర్మన్ల వెంటపడడంతో పనులు వేగవంతం చేస్తున్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, నీటి వసతి, ప్రహరీగోడల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నారు. కలెక్టర్ నుంచి నోడల్ ఆఫీసర్ వరకు ప్రతీ రోజు పనుల పర్యవేక్షణ చేస్తూ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో 70 శాతం పనులు పూర్తి అయినట్లు అధికారులు చెబుతున్నారు. -
బీఆర్ఎస్ పూర్వ వైభవం చాటుదాం
దేవరుప్పుల: వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పూర్వవైభవాన్ని చాటుదామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల ముఖ్యనాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ పోలింగ్కు ఓటర్లు అధిక సంఖ్యలో వచ్చేలా తోడ్పాటు అందించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు పల్లా సుందర్ రాం రెడ్డి, మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్సింగ్, పీఎసీఎస్ చైర్మన్ రమేష్ రెడ్డి, బస్వ మల్లేశం, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్, తదిదతరులు పాల్గొన్నారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీపీ దంపతులుచిల్పూరు: వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్కిషోర్ ఝా దంపతులు ఆదివారం రాత్రి చిల్పూరుగుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకోగానే ఆలయ ప్రధాన అర్చకుడు రవీందర్శర్మ, అర్చకులు రంగాచార్యులు, కృష్ణమాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ ఈఓ లక్ష్మిప్రసన్న ఆధ్వర్యంలో సీపీ దంపతులకు ఆశీర్వచనాలు చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్, ఎస్సై ముత్యం రాజేందర్, సిబ్బంది ఉన్నారు. రెజ్లింగ్ అభివృద్ధి, సంక్షేమానికి కృషి వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణలో రెజ్లింగ్ క్రీడాభివృద్ధితో పాటు రెజ్లర్ల సంక్షేమానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని తెలంగాణ రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు హఫీజ్ఖాన్ అన్నారు. తెలంగాణ అమోచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం హనుమకొండలోని ఓప్రైవేట్ కళాశాలలో జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హఫీజ్ఖాన్ మాట్లాడుతూ.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ నిషేధం తొలగించలేదన్నారు. మరో వారంలో ఫెడరేషన్కు సంబంధించి కోర్టు తుది తీర్పు వస్తుందని, అసోసియేషన్ నూతన క్యాలెండర్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో రాష్ట్ర సంఘంతో కూడిన బృందం ఫెడరేషన్తో పాటు సాయ్, ఇండియన్ ఒలింపిక్స్ బాధ్యులను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ కరీం మాట్లాడుతూ.. 2023–24 కు సంబంధించిన క్రీడా నివేదికను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల బాధ్యులు క్రీడాకారుల నైపుణ్యం పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు సుధాకర్, లింగం, వంశీ, రాజలింగం, సోహైల్, సాయిలు, ముబీన్, జైపాల్తోపాటు 33 జిల్లాల నుంచి అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు. కొనసాగుతున్న మల్లూరు బ్రహ్మోత్సవాలుమంగపేట: మల్లూరు హేమాచల క్షేత్రంలోని ప్రత్యేక నీటికొలనులో లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్షి చెంచులక్ష్మి అమ్మవార్లకు బ్రహ్మోత్సవాల యాగ్నికులు ఆదివారం సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయంలో కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) కార్యక్రమంలో భాగంగా ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి పర్యవేక్షణలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శిష్యబృందం ఆలయ అర్చకులు ఉదయం ఆలయంలో స్వామివారికి నిత్య పూజ, సేవాకాలం, బాలబోగం నిత్యహోమం, చతుస్థానార్చన, మమానివేదన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాల్లో సంక్షిప్త రామాయణ, హయగీంరవస్తోత్ర హవనం నిర్వహించారు. ఆలయ సమీపంలోని ఎద్దుముక్కు ఆంజనేయస్వామివారికి పంచాయమృతాలతో అభిషేకం చేశారు. లక్ష్మీనర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి పల్లకిలో ఉంచి యాగ్నికులు వేద మంత్రోచ్ఛరణ నడుమ ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక కొలనులో శాస్త్రోక్తంగా తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు కై కర్యం రాఘవాచార్యులు, శేఖర్శర్మ, పవన్కుమార్ ఆచార్యులు, యాగ్నికులు పాల్గొన్నారు. -
ఐదు రూట్లు
రూట్01: జనగామ పట్టణం (పీఎస్ నంబర్లు : 11, 3, 14, 15, 16) రూట్02: జనగామ, రఘునాథపల్లి, లింగాలఘణపురం (10,12,17,18,9,20) రూట్03: పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల (27, 28, 29, 30, 31, 32) రూట్04: స్టేషన్ ఘణపూర్, చిల్పూర్, జఫర్గఢ్ (21,22,23,24,2526) రూట్05: బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల (6, 7, 8, 9) పోలింగ్ సామగ్రి తరలింపు బస్సు వద్ద కలెక్టర్, అధికారులు -
ఘనంగా హనుమాన్ శోభాయాత్ర
రఘునాథపల్లి: మండలంలోని ఇబ్రహీంపూర్లో హ నుమాన్ మాలధారులు ఆదివారం ఘనంగా శోభా యాత్ర నిర్వహించారు. ప్రత్యేక వాహనంలో ఆంజనేయస్వామి విగ్రహంతో హనుమాన్ మాలధారణ స్వాములు శివాలయం నుంచి గ్రామ పుర వీధుల్లో అత్యంత భక్రిశ్రద్ధలతో శోభాయాత్ర చేశా రు. మహిళా భక్తులు నీళ్ల బిందెలతో ఎదురెళ్లి నీళ్లు పోసి మొక్కుకున్నారు. కార్యక్రమంలో హనుమాన్ మాలధారులు నూనె మల్లేష్, కొండ ఉదయ్, సింగారపు లక్ష్మణ్, శివార్ల కుమార్, దొరగొల్ల రాములు, ల్యాగల అనిల్, దొరగొల్ల మహేష్ పాల్గొన్నారు. లింగంపల్లిలో.. చిల్పూరు: మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఆదివారం హనుమాన్ శోభాయాత్రను హనుమాన్ భక్తులు వైభవంగా నిర్వహించారు. గురుస్వామి సందోజు రవీంద్రచారి ఆధ్వర్యంలో శోభాయాత్రను గ్రామ పుర వీధుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకోజు పున్నంచందర్, ఊరడి రాజు, రొయ్యల నర్సింహులు, చాతెల్లి రజాక్, రవీందర్, రత్నాకర్ రమేష్, శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
ద్వితీయ సంవత్సరానికి అనుమతి
జనగామ: జనగామ మెడికల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం మొదటి సంవత్సరం తరగతులు కొనసాగుతుండగా... వచ్చే ఆగస్టు మాసంలో పరీక్షలు జరుగనున్నాయి. ఇటీవల జరిగిన నీట్ ఎంట్రెట్స్ ఫలితాలు వచ్చిన వెంటనే మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్లో 100 సీట్లు ఉండగా... రెండో సంవత్సరంలో కూడా అంతే మొత్తంలో పర్మిషన్ వచ్చింది. ఇందులో 15 శాతం నాన్ లోకల్, 85 శాతం లోకల్కు ప్రియార్టీ ఇస్తారు. ఈ సారి పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి కోటా ఉండే అవకాశం ఉంది. మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా... మెడికల్ కళాశాలకు సంబంధించిన వందశాతం వసతులు కల్పించ లేదు. చంపక్హిల్స్లోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) పక్కన తాత్కాలికంగా నిర్మాణం చేసి రేకుల షెడ్డులో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ధర్మకంచ ఇంటిగ్రేడెడ్ భవన సముదాయంలో విద్యార్థినులు, చంపక్హిల్స్లోని పాత డీఆర్డీఓ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించారు. భవన నిర్మాణ పనులు నిలిపివేత మెడికల్ కళాశాల కోసం జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్డు గీతానగర్ ఏరియాలో 18 ఎకరాల స్థలం కేటాయించి, సుమారు రూ.190 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కళాశాలకు కేటాయించిన స్థలం మధ్యలో నుంచి దేవాదుల కాల్వ వెళ్లడం, పలువురు వ్యక్తులకు సంబంధించి కోర్టులో కేసులు కొనసాగుతుండడంతో భవన నిర్మాణ పనులు మొదలు కాలేదు. ఇటీవల కాంట్రాక్టర్ పనులు ప్రారంభించే సమయంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఆబ్జక్షన్ చెప్పడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కాగా విద్యార్థుల కోసం వేర్వేరుగా నిర్మించే రెండు హాస్టల్ భవనాలు పూర్తి కావస్తున్నాయి. ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు మొదలైతే... హాస్టల్ భవనం ఉన్నప్పటికీ తరగతులు ఎక్కడ నిర్వహించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. రూ.కోటి జరిమానా... రూ.2 లక్షలకు తగ్గింపు మెడికల్ కళాశాల ప్రారంభమై.. ఏడాది కావస్తున్నా పూర్తి స్థాయి ఫెసిలిటీస్ కల్పించడంలో అలసత్వం వహించారని ఎన్ఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ఎంసీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలో 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిత్యం ఇక్కడ జరుగుతున్న విద్యాబోధన, తదితర వాటిపై పర్యవేక్షణ చేశారు. కళాశాల భవన నిర్మాణంతో పాటు విద్యార్థులకు హాస్టల్ బిల్డింగ్, ఫోరెనిక్స్ ల్యాబ్, ఎస్పీఎంలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో జాప్యం, ఇతర మౌలిక వసతులను కల్పించడంలో విఫలమయ్యారని రూ.కోటి జరిమానా విధించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్రావు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో జరిమానాను రూ.2లక్షలకు తగ్గించగలిగారు. నూతన భవన నిర్మాణంలో నెలకొన్న అడ్డంకులను తొలగించి. ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం నాటికి సమస్యలను పరిష్కరించే విధంగా జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపించాల్సి ఉంటుంది. ఎన్ఎంసీ అనుమతులు జారీ దేవాదుల కాల్వతో పనుల నిలిపివేత మౌలిక వసతుల కల్పనపై ఎన్ఎంసీ ఆగ్రహం రూ.2 లక్షల జరిమానా ఈ సారి ఏపీ కోటా ఉండే అవకాశం సెప్టెంబర్ లోగా బాలికలు, బాలుర హాస్టల్ భవనాలు పూర్తిపనులు నిలిపేశారు.. జిల్లా కేంద్రం సిద్దిపేట రోడ్డులో నూతనంగా నిర్మాణం చేస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను ఇరిగేషన్ శాఖ అధికారులు నిలిపేశారు. స్థలం మధ్యలో నుంచి దేవాదుల కాల్వ ప్రతిపాదనలు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థినీ, విద్యార్థులకు సంబంధించి వేర్వేగా హాస్టల్ భవనాలు పూర్తి కావస్తున్నాయి. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులు, ఇతర ఫెసిలిటీలు పూర్తి స్థాయిలో లేవని ఎన్ఎంసీ అధికారులు రూ.కోటి జరిమానా విధిస్తే, రూ.2లక్షలకు తగ్గించుకోగలిగాం. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్ తరగతులకు అనుమతులు రాగా, నీట్ ఫలితాలు వచ్చిన వెంటనే.. మొదటి సంవత్సరం కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. – డాక్టర్ గోపాల్రావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ -
పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. కలెక్టరేట్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్లో పీఓలు, ఏపీఓ, ఓపీఓలతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్లతో పాటు చెక్ లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని, పీఎస్ల వారీగా పోస్టల్ బాక్సులను ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలన్నారు. – కలెక్టర్ రిజ్వాన్ బాషా●
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement