-
రైతులను మోసంచేస్తే కఠిన చర్యలు
కాటారం: వ్యాపారులు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించి మోసం చేయాలని చూస్తే కఠినచర్యలు తప్పవని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. పోలీస్, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో మండలకేంద్రంలోని రైతు వేదికలో ఐదు మండలాల విత్తన, పురుగు మందు విక్రయ డీలర్లకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాల విక్రయాలు, సరఫరాపై నిత్యం పోలీసుల నిఘా ఉంటుందన్నా రు. వ్యాపారులు విత్తనాలను బ్లాక్చేసి అధిక ధరలకు విక్రయిస్తే ఊరుకునేది లేదని తెలిపారు. లైసెన్స్ పొందిన కంపెనీలకు చెందిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలన్నా రు. రైతులకు కొనుగోలు రశీదు పూర్తి వివరాలతో నమోదు చేసి ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యాపారులు ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే లెసె న్స్లు రద్దు చేయిస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల జోలికి వెళ్తే పీడీ యాక్టు ప్రయోగిస్తామని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో మహదేవపూర్ ఏడీఏ ఆర్కే.శ్రీనివాసరాజు, ఎస్సై మ్యాక అభినవ్, ఏఓలు రామకృష్ణ, ప్రభావతి, సతీశ్, సుధాకర్, ఏఈఓలు, విత్తన డీలర్లు పాల్గొన్నారు.డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి -
సింగరేణి సీఎండీ పర్యటన
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి సీఎండీ బలరాంనాయక్ బుధవారం పర్యటించారు. కేటీకే 1, కేటీకే 5వ గని సమీపల్లో, క్వార్టర్స్ కాలనీల్లోని ఆవరణల్లో నాటిన మొక్కలు, నర్సరీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత, జీవావరణ వ్యవస్థను సింగరేణి పరిసర ప్రాంతాల్లో స్థాపించడంలో భాగంగా ఖాళీ స్థలాలు, ఓబీ డంపింగ్, రహదారుల వెంబడి మొక్కలు నాటినట్లు చెప్పారు. సింగరేణి సంస్థను హరిత సింగరేణిగా మారుస్తూ పర్యావరణ సమతుల్యతతో పాటు సింగరేణి పరిసర ప్రాంతాల్లో పచ్చటి వనాలను ఏర్పాటు చేయడంలో అందరూ భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు. సింగరేణి సంస్థ ఒక ప్రత్యేక అటవీ విభాగాన్ని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో పచ్చటి వనాలను ఏర్పాటుచేసి పక్షులు, జంతు జీవరాసులకు ఆవాసాల కేంద్రాలుగా మారుస్తే అడవులను తలపించేలా ఖాళీస్థలాలను మారుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా జీఎం హబీమ్ హుస్సేన్, ఎస్వోటు జీఎం కవీంద్ర, ఫారెస్ట్ డీజీఎం కర్ణ, అధికారులు పాల్గొన్నారు. -
భూములు తీసుకుంటే ఆత్మహత్యలే..
చిట్యాల: నేషనల్ గ్రీన్ హైవే రోడ్డు కోసం బలవంతంగా తమ భూములు తీసుకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైతులు బుధవారం నిరసన వ్యక్తంచేశారు. అనంతరం తహశీల్దార్కు వినతిపత్రం అందజేశారు. రైతులు మాట్లాడుతూ.. నేషనల్ గ్రీన్హైవే రోడ్డు కోసం నవాబుపేట శివారులో బలవంతంగా రైతులకు చెందిన భూములను భూసేకరణ చేస్తున్నారని అన్నారు. జీవనాధార భూములను లాక్కుంటే తా ము బతికేదేలా అని ప్రశ్నించారు. రూ.40 లక్షలు పలికే భూమికి రూ.3లక్షలు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. తమకు ప్రభుత్వం జీవనాధారం చూపించిన తర్వాతే తీసుకోవాలని అన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ రైతుల వినతిపత్రాన్ని జిల్లా అధికారులకు అందజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులు సత్యనారాయణరెడ్డి, అమరేందర్రెడ్డి, రత్నాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
భూపాలపల్లి రూరల్: నకిలీ విత్తనాలను అరికట్టడంలో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు సూచించారు. భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులతో డీఎస్పీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు నియంత్రించడానికి ప్రతీ ఒక్క అధికారి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి సీఐ నరేష్కుమార్, సబ్ డివిజన్ ఎస్ఐలు, అధికారులు పాల్గొన్నారు.భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు -
అభివృద్ధి పనులు చేసి అప్పుల పాలయ్యాం
ములుగు: గతంలో ఎన్నడూలేని విధంగా గ్రామాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయామని మాజీ సర్పంచ్ల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ములుగు జిల్లాకేంద్రంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని రకాల సేవలు చేసి ప్రతి ఊరిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దామని అన్నారు. అప్పటి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, రైతు వేదికలు, కంటి వెలుగు, హరితహారం, నర్సరీలు, సెగ్రిగేషన్ షెడ్ల పనులు చేపట్టామని వివరించారు. దేశంలోని 20అవార్డుల్లో 19అవార్డులు తెలంగాణ గ్రామ పంచాయతీలకు వచ్చాయని గుర్తు చేశారు. బిల్లులు రాక సర్పంచ్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని, ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఇప్పటికే ఐదు నెలలు గడిచాయని, నూతన ప్రభుత్వం ఇప్పటి వరకు పెండింగ్ బిల్లుల విషయంలో స్పందించకపోవడం శోచనీయం అని అన్నారు. పెండింగ్ బిల్లులు ఇచ్చేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని డిమాండ్ చేశారు. సమావేశంలో పాప పవన్, దాసరి రమేష్, మద్దెవేణి రాములు, గరిగె లతానర్సింగం తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ -
65ఏళ్లు దాటితే..
భూపాలపల్లి రూరల్: 65ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో 65ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 48మంది ఉన్నారు. వీరు వచ్చేనెలలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. 2021 నుంచి ఖాళీలను భర్తీచేయకపోవడంతో 32మంది టీచర్, 77 మంది హెల్పర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉద్యోగ విరమణ చేసే వారితో కలిసి 157 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. 644 అంగన్వాడీ కేంద్రాలు.. జిల్లాలో భూపాలపల్లి, మహదేవపూర్లోని ప్రాజెక్టుల పరిధిలో 589 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 55 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గతేడాది 55 మినీకేంద్రాలను కలపడంతో 644 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అయ్యాయి. వీటిలో ప్రధాన సెంటర్లలో టీచర్, ఆయా, మినీ కేంద్రాల్లో టీచర్ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మినీ సెంటర్లలో కూడా టీచర్, ఆయాలు ఉండాల్సిందేనని ప్రభుత్వం చెప్పినా ఇంకా పోస్టులు భర్తీ చేయలేదు. ఈ క్రమంలోనే టీచర్లు, ఆయాలు తమకు ఉద్యోగ విరమణ చేపట్టి ప్రయోజనాలు కల్పించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. వివరాల సేకరణ.. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ప్రక్షాళనకు సిద్ధమైంది. దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తూ వయోభారంతో ఉన్న టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. గత నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా లోక్సభ ఎన్నికల దృష్ట్యా వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తికావడంతో అంగన్వాడీల వివరాలు సేకరిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు జిల్లాలో 65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 48 మంది ఉన్నారు. వీరంతా ఉద్యోగ విరమణ పొందనున్నారు. పదో తరగతి మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్ ఆధారంగా వయస్సును నిర్ధారిస్తున్నారు. కొంతమంది మాత్రం పుట్టినతేదీ సరిగాలేని కారణంగా తాము తొందరగా విధుల నుంచి తప్పుకోవాల్సి వస్తోంద ని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. న్యాయం చేయాలంటూ కొందరు అధికారులను ఆశ్రయిస్తున్నారు. గందరగోళం.. ఐసీడీఎస్ అధికారుల వద్ద ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టం (ఈఎంఎస్)లో ఉన్న వివరాలకు ఆయా ల వద్ద ఉన్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. అంగన్వాడీ టీచర్లకు పదోతరగతి సర్టిఫికెట్లు ఉండగా.. ఆయాలు చదువు కోకపోవడంతో వారి వయస్సు నిర్ధారణ కోసం అధికారులు ఆధార్ కార్డులు సేకరిస్తున్నారు. అందులో కూడా చాలా మంది వయస్సు హెచ్చుతగ్గులు ఉండడంతో ప్ర భుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్ వద్ద నుంచి వయ స్సు నిర్ధారణ పత్రాలు తేవాలని చెబుతున్నారు. ప్రభుత్వానికి జాబితా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 65ఏళ్లు నిండిన అంగన్వాడీ టీచర్, హెల్పర్లు ఏప్రిల్ 30వరకు 65 ఏళ్ల వయస్సు పైబడిన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాలో 48మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. కొందరిని పుట్టినతేదీ విషయంలో స్పష్టత లేకపోవడంతో వయస్సు నిర్ధారణకు ఆస్పత్రికి పంపించాం. – నాగేశ్వర్రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ కొత్తవారితో 157 పోస్టులు భర్తీచేసే అవకాశం కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం -
పనుల్లో వేగంపెంచాలి
భూపాలపల్లి అర్బన్: ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణ పనుల్లో వేగంపెంచాలని కలెక్టర్ భవేష్మిశ్రా తెలిపారు. ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణం, తదితర అంశాలపై వైద్య, టీజీఎంఎస్ఐడీసీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 63 ఉప ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి చర్యలు చేపట్టగా.. 17 పూర్తికాగా, 23 పురోగతిలో ఉన్నాయన్నారు. నిధుల సమస్య వల్ల 9 ప్రారంభం కాలేదని, 7 ఇంకా చేపట్టాల్సి ఉందని, 7 చోట్ల స్థల సమస్య ఉన్నట్లు తెలిపారు. వీటిలో 47 జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో చేపట్టినట్లు తెలిపారు. టెండర్ దాఖలు కాని వివరాలు అందచేయాలని ఆదేశించారు. ఆరు చోట్ల కేంద్రాలు నిర్మించాల్సి ఉందని, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. బాగిర్తిపేట, చెన్నాపూర్, చిన్నకోడెపాక, రంగయ్యపల్లి నిర్మాణాల్లో జాప్యానికి కాంట్రాక్టరుకు నోటీసులు జారీ చేయాలని అన్నారు. బుద్దారం, చల్లగరిగలో శిథిలావస్థలో ఉన్న భవనాలు తొలగించి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాడిచర్ల, మహాముత్తారంలో నిర్మాణంలో ఉన్న డాక్టర్ నివాస గృహల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, టీజీఎంఎస్ఐడీసీ డీఈ నాగిరెడ్డి, పంచాయతీరాజ్ డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు భూపాలపల్లి రూరల్: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టినట్లు కలెక్టర్ భవేష్మిశ్రా తెలిపారు. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు, నేరేడుపల్లి, వజినపల్లి, పెద్దాపూర్ గ్రామాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూపాలపల్లి గ్రామీణ ప్రాంతాల్లో 22 పాఠశాలల్లో 160.29 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఏ ఒక్క పని కూడా పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ప్రతీ ఒక్కరు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సురేష్కుమార్, భూపాలపల్లి ఎంపీఓ నాగరాజు పాల్గొన్నారు.కలెక్టర్ భవేష్మిశ్రా -
No Headline
సాక్షిప్రతినిధి, వరంగల్ : రోజుకో మలుపు తిరుగుతూ కొత్త అంశాలను తెరమీదకు తెస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల వాంగ్మూలాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఉమ్మడి వరంగల్ జిల్లా నీరుకుల్లకు చెందిన వ్యక్తి కాగా.. ఈ ప్రాంతం నేతలు కూడా ట్యాపింగ్ నుంచి తప్పించుకోలేకపోయారు. జేఎస్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా ఉన్న భుజంగరావు, మరో అదనపు ఎస్పీ తిరుపతన్న నేతృత్వంలో ఏసీపీ ప్రణీత్రావు ఆధ్వర్యాన బృందాలు ఉమ్మడి వరంగల్పై దృష్టి పెట్టడంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్టాపిక్ మారింది. రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు.. ఎస్ఐబీ మాజీ ఐజీ ప్రభాకర్రావు ఆదేశాలతోనే తాము ట్యాపింగ్, దాడులు చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా వారు చెప్పిన వాస్తవాలు, రిమాండ్ రిపోర్టులో అంశాలు ఉమ్మడి వరంగల్ రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కీలకంగా పనిచేసినట్లు అంగీకరించారు. మరో మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావు కూడా అంశాల వారీగా కొన్నింట్లో సలహాలు, సూచనలు చేసినట్లు వారు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్, బండి సంజయ్తో పాటు కమలాపూర్ ప్రాంతానికి చెందిన కొందరు కాంగ్రెస్, బీజేపీ నాయకుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఆ సమయంలో వరంగల్ కేంద్రంగా ఇద్దరు సీఐలతో కలిసి పనిచేసిన ఏసీపీ ప్రణీత్రావు బృందం ఇచ్చిన సమాచారం మేరకు డబ్బు, మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయగలిగామని తెలిపారు. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నర్సంపేట, జనగామ ప్రాంతాల్లో సుమారు రూ.2.18 కోట్ల నగదు పట్టుకున్న సంఘటనలతోపాటు పాలకుర్తి అభ్యర్థిగా బరిలో ఉన్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ తిరుపతన్న తన వాంగ్మూలంలో వెల్లడించినట్లు రిమాండ్ రిపోర్టు చెబుతోంది. ములుగు, భూపాలపల్లి, పాలకుర్తి తదితర ప్రాంతాల్లో కొందరి ఫోన్ల ట్యాపింగ్తో మద్యం రవాణా గుట్టు విప్పినట్లు పేర్కొన్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అంశాలు ఒక్కొక్కటిగా రిమాండ్ రిపోర్టు ద్వారా వెల్లడవుతుండటంతో అందరూ విస్తుపోతున్నారు.సెలెక్టెడ్ పొలిటికల్ లీడర్ల సంభాషణలు విన్నారు.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల కట్టడే లక్ష్యం ఫోన్ ట్యాపింగ్తోనే డబ్బు, మద్యం గుట్టు రట్టు జేఏసీ, విద్యార్థి సంఘాల నేతల ఫోన్లపైనా నిఘా భుజంగరావు, తిరుపతన్న నేతృత్వం.. ప్రణీత్రావు, మరికొందరు పాత్రధారులు కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్య వివాదంపై క్లారిటీ ఫోన్ ట్యాపింగ్ సూత్రధారి ప్రభాకర్రావు నీరుకుళ్ల వాసి ‘స్టేషన్’ వివాదంపై స్పష్టత ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇందులో భాగమై ఉన్నారని, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు ఈ ఆపరేషన్కు ఇన్చార్జ్గా ఉన్నారని అంగీకరించిన మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావు.. పలువురు ముఖ్యనేతలు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఉమ్మడి వరంగల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార, విపక్ష నేతల వైఖరిపై నిఘా వేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే స్టేషన్ఘన్పూర్, జనగామ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలన్న నిర్ణయం వివాదం కావడంపైనా ట్యాపింగ్ వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. మాజీ మంత్రులు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య గ్రూపు తగాదాలు, పరస్పర ఆరోపణలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు, వీరి వర్గాలకు చెందిన ముఖ్య నేతల ఫోన్ సంభాషణల తీరును పరిశీలించి ఇచ్చిన నివేదిక మేరకు కడియం శ్రీహరికి ‘బీ’ఫామ్ ఇచ్చి వివాదానికి తెర వేసినట్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో మాజీ పోలీసు అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పర్యటన, సభలు, సమావేశాలు, సంభాషణలపైన ఆరా తీసినట్లు తేలిందని ‘సిట్’ రిపోర్టులో పేర్కొంది. -
బుధవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2024
– 8లోuజిల్లాలో వానాకాలం సాగు అంచనా.. (ఎకరాల్లో)కాటారం: వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో రైతులు విత్తనాల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. సీజన్ ముగిసే వరకు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేయాలని పేర్కొంది. దీంతో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు జిల్లాలోని సీడ్స్ దుకాణాలపై నిఘాపెట్టారు. అకస్మాత్తుగా దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నారు. విత్తన అమ్మకాలు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని అవసరమైతే దుకాణాన్ని సీజ్చేసి పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో లైసెన్స్ కలిగిన విత్తన దుకాణాలు సుమారుగా 325 వరకు ఉన్నాయి. వానాకాలం సీజన్ పనులు మొదలవడంతో వ్యాపారులు విత్తనాలు, మందులను స్టాక్ తెచ్చుకొని పెట్టుకున్నారు. కొంతమంది వ్యాపారులు నాణ్యత లేని విత్తనాలను విక్రయించి రైతులను మోసం చేసిన ఘటనలు జిల్లాలోని పలు మండలాల్లో గత వానాకాలం సీజన్లో ఉత్పన్నమయ్యాయి. ప్రధానంగా పత్తి, మిర్చి విత్తనాల్లో కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని అరికట్టడానికి వ్యవసాయాధికారులు, పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. జిల్లాకేంద్రంతో పాటు మండలకేంద్రాలు, గ్రామాల్లోని విత్తన దుకాణాలపై నిఘా పెట్టారు. ఏఓ, ఏఈఓలకు ప్రభుత్వం ప్రత్యేక ఫార్మట్ ఇచ్చి అందులో రోజువారి తనిఖీ వివరాలను పొందుపర్చి ఫొటో సైతం అప్లోడ్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. దీంతో అధికారులు ఏ ఒక్క దుకాణాన్ని వదిలి పెట్టకుండా తనిఖీలు చేస్తూ నకిలీ విత్తన విక్రయాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. గతంలో కొంతమంది వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ, లూజ్ విత్తనాలు తీసుకొచి అమాయకపు రైతులకు అంటకట్టేవారు. ప్రస్తుతం అధికారులు చేపడుతున్న తనిఖీలతో నకిలీ అనే మాట ఎత్తడానికి వ్యాపారులు జంకుతున్నారు. పెరగనున్న సాగు.. గత వానాకాలం సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో జిల్లాలో పలు పంటల సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరి సాగు కొంత మేర తగ్గిపోగా పత్తితో పాటు మిర్చి, మొక్కజొన్న, ఇతర పంటల సాగు మరింత పుంజుకుంటుందని అధికారుల అంచనా లెక్కలు చెపుతున్నాయి. జిల్లాలో 1,01,500 ఎకరాల్లో రైతులు పత్తి సాగుకు పూనుకుంటుండటంతో సుమారు రెండు లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు, 1,05,000 ఎకరాల్లో వరి సాగు జరగనుండగా 25వేల క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకు కావాల్సి ఉంది. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు.. జిల్లాలోని సీడ్ వ్యాపారులు ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే విక్రయించాలి. విత్తనాలు కొనుగోలు చేసిన రైతుకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలి. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందు విత్తన నాణ్యతతో పాటు ప్యాకెట్పై బ్యాచ్ నంబర్ పరిశీలించాలి. లెసెన్స్ కలిగిన డీలర్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. లూజ్, సంచుల్లో ఉన్న విత్తనాలను కొని మోసపోవద్దు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విత్తనాలు, లూజ్ విత్తనాలను ఎవరైనా విక్రయిస్తే అధికారులకు సమాచారం అందించాలి. – విజయ్భాస్కర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరి 1,05,000 పత్తి 1,01,500 మిర్చి 25,800 మొక్కజొన్న 250 పెసర 250 కంది 20 మినుము 350 వేరుశనగ 50 ఆయిల్పామ్ 6,500 ఇతర పంటలు 8,550న్యూస్రీల్పత్తి విత్తనాల దుకాణాలపై ప్రత్యేక నిఘా పోలీస్, వ్యవసాయశాఖ అధికారుల తనిఖీలు అమ్మకాలు, స్టాక్ రిజిస్టర్ల పరిశీలన రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచనరైతులు జాగ్రత్తలు పాటించాలి.. విత్తన కొనుగోళ్లలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయే కంటే రైతులే ముందుగా విత్తన ప్యాకెట్లను చూసి కొనుగోలు చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. రైతులు లూజుగా సంచుల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదని, విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రశీదును తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విత్తన ప్యాకెట్, బిల్లును పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలని, వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని తెలుపుతున్నారు. వ్యాపారులు పత్తి విత్తనాల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరకు విక్రయిస్తే రైతులు అధికారులకు సమాచారం అందించాలని పేర్కొంటున్నారు. విత్తనాల కొనుగోళ్లలో ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని కోరుతున్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● ఎస్పీ కిరణ్ఖరే భూపాలపల్లి అర్బన్: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కిరణ్ఖరే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులకు అమ్మితే పీడీ యాక్టు నమోదుచేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులను మోసంచేసే వారిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హెచ్టీ కాటన్ విక్రయాలకు అనుమతి లేదన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులకు రైతులు డీలర్ల నుంచి రశీదులు తీసుకోవాలని సూచించారు. నకిలీ పత్తి విత్తనాలు ఉపయోగిస్తే భూసారం దెబ్బతింటుందని, ప్రభుత్వం ఆమోదించిన పత్తి విత్తనాలు మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని తెలిపారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాల సమాచారం తెలిస్తే వెంటనే వ్యవసాయ అధికారులు గాని పోలీస్ అధికారులు గానీ తెలియజేయాలని తెలిపారు. షాపుల తనిఖీ భూపాలపల్లి రూరల్: జిల్లా కేంద్రంలో ఫర్టిలైజర్, విత్తనాల షాపులను భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, టౌన్ సీఐ నరేష్ కుమార్, మండల వ్యవసాయఅధికారి సతీష్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సంపత్రావు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు మందులు విక్రయించవద్దన్నారు. ఒకవేళ విక్రయించినట్లు తేలితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అమ్మే ప్రతీ విత్తనాల, పురుగు మందులకు రశీదు ఇవ్వాలని షాపుల యజమానులకు డీఎస్పీ సూచించారు. -
కాటారం పీఏసీఎస్లో అవినీతి
● రాష్ట్ర ఉన్నతాధికారులకు చైర్మన్ ఫిర్యాదు కాటారం: కాటారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో రూ.50లక్షల అవినీతి జరిగినట్లు ఆరోపిస్తూ మంగళవారం చైర్మన్ తోటపల్లి ప్రశాంత్రెడ్డి రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మాజీ పీఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి, సీఈఓ ఎడ్ల సతీశ్, డైరెక్టర్ అయిలి రాజబాబు పలు అంశాల్లో అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీతో పాటు డైరెక్టర్ ఆఫ్ కో ఆపరేషన్, రిజిస్టార్ ఆఫ్ కో ఆపరేషన్కు ఫిర్యాదు లేఖను అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా గోదాం నిర్మాణం చేపట్టి అందులో రూ.24.24 లక్షలు, ప్యాక్స్ కార్యాలయం పై అంతస్తు నిర్మాణంలో రూ.18లక్షల అవినీతికి పాల్పడటంతో పాటు పాలకవర్గం అనుమతి లేకుండా నారాయణరెడ్డి వ్యక్తిగత అవసరాలకు ఓ వ్యక్తిని నియమించుకొని అతని పేరిట రూ.3.50 లక్షలు దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో సరైన రికార్డులు, ఎంబీలు లేకుండా నారాయణరెడ్డి, సతీశ్, రాజబాబుతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లు కుమ్మకై ్క బినామీల పేరిట చెక్కులు డ్రా చేసి సొసైటీ డబ్బులను కాజేశారని చైర్మన్ తెలిపారు. పాలకవర్గంలోని సభ్యులు సంఘానికి చెందిన ఎలాంటి కాంట్రాక్టులు, వ్యాపారాలు చేయరాదని నిబంధనల్లో ఉన్నప్పటికీ డైరెక్టర్ అయిలి రాజబాబు, మరో ఇద్దరు డైరెక్టర్లు సొసైటీతో అగ్రిమెంట్ చేసుకొని పనుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి మాజీ చైర్మన్, సీఈఓ, డైరెక్టర్ రాజబాబు, ప్రమేయం ఉన్న మరో ఒకరిద్దరు డైరెక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేసి డబ్బులను రికవరీ చేయాలని ప్రశాంత్రెడ్డి అధికారులను కోరారు. -
ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులతో వికాస్రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ భవేష్మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మంగీలాల్ పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపులో స్ట్రాంగ్ రూమ్ నుంచి ఈవీఎంలు తెచ్చే సిబ్బంది ఒకే రంగు కలిగిన టీషర్ట్స్ అందజేయాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సమాచారం అందించాలని, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. -
హనుమాన్ శోభాయాత్ర
కాటారం: కాటారం మండల కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ శోభాయాత్ర కనుల విందుగా కొనసాగింది. హనుమాన్ మాలాధారణ స్వాములు, భక్తులు శ్రీ సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో శోభా యాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలకగా మాలాధారణ స్వాములు నృత్యాలతో ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చీర్ల శ్రావణ్కుమార్, గౌరవ అధ్యక్షుడు మద్ది నవీన్, పులి అశోక్, అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకుడు బచ్చు అశోక్, ఆలయ పురోహితులు నిఖిల్శాస్త్రి పాల్గొన్నారు. -
‘మేడిగడ్డ’లో కొనసాగుతున్న మరమ్మతులు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. గతేడాది అక్టోబర్ 21న బ్యారేజీలోని 7వ బ్లాక్లోని 19, 20, 21 పియర్లతో పాటు వంతెన కుంగిన విషయం తెలిసిందే. ఎన్డీఎస్ఏ ఏర్పాటుచేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని మద్యంతర నివేదికలు ఇచ్చారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం సీఎంతో పాటు ఇరిగేషన్శాఖ మంత్రి కూడా ఎల్ఎన్టీ, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దీంతో వారం రోజులుగా సీసీ బ్లాక్ తొలగించి డౌన్స్ట్రీమ్లో 7వ బ్లాక్ వద్ద 210 మీటర్ల పొడవునా షీట్ఫైల్స్, వేస్తున్నారు. బొరియ ఏర్పడ్డ ప్రదేశాల్లో డ్రిల్లింగ్ హోల్స్ వేసి ఇసుక, సిమెంట్, కాంక్రీటు మిశ్రమాన్ని రంధ్రాల్లోకి పంపించనున్నారు. 20వ పియర్కు సంబంధించిన రేడియల్ గేటును గ్యాస్కట్టింగ్ పరికరంతో గ్రౌగింగ్ చేసి తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. రెండు రోజులుగా 20వ గేటు తొలగింపు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా ఈ ఒక్క గేటు ఐదు రోజులు పట్టచ్చని తెలిసింది. మిగితా గేట్ల రబ్బర్ సీలింగ్ రిమూవ్ చేస్తున్నారు. గేట్ల సమీపంలోని చెత్తచెదారం తొలగిస్తున్నారు. కాఫర్డ్యాం తొలగింపు.. కుంగిన 7వ బ్లాక్ పియర్ల వద్దకు నీరు రాకుండా వేసిన కాఫర్ డ్యాంను కూడా తొలగించనున్నట్లు సమాచారం. వర్షాకాలంలో నీరు నిల్వ చేయకుండా దిగువకు పంపించడానికి ఇరిగేషన్ శాఖ ప్రయత్నాలు చేస్తుంది. మొరాయించిన గేట్ల కటింగ్ ఆలస్యం కానుందని సమాచారం. త్వరగా పూర్తయితే నీటిని దిగువకు పంపించడానికి వీలుగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం
భూపాలపల్లి రూరల్: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన వేసవి క్రీడల శిక్షణ సోమవారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా అధికార ప్రతినిధి అజ్మీర తుకారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణలో విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం స్థానిక ఉద్యోగుల, స్థానిక పిల్లలకు అనేక ఆటలలో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని శిబిరాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు శ్యామ్ప్రసాద్, గుర్తింపు సంఘం నాయకులు మోట పలుకుల రమేష్, సంఘం నాయకులు జోగ బుచ్చయ్య, పర్స శ్రీనివాస్, స్పోర్ట్స్ సూపర్వైజర్, కోచ్లు ఎస్.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం ఎన్నిక భూపాలపల్లి రూరల్: మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామి సోమవారం ఓ ప్రకటనతో పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా బేతోజు మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడుగా అభిషేక్ గుప్తా, ప్రధాన కార్యదర్శిగా దుబాసి సాగర్, సంయుక్త కార్యదర్శిగా బొమ్మారపు లక్ష్మణ్రెడ్డి, కోశాధికారిగా గన్యారపు సురేష్ను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యే పరామర్శ మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలం పిడిసిల్ల గ్రామానికి చెందిన దుంప సాయి చరణ్, చిట్యాల మండలం వెంకట్రావ్పల్లి(సీ) గ్రామానికి చెందిన ముడుతనపల్లి లక్ష్మీ మండలంలోని పిడిసిల్ల గ్రామంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే చనిపోగా.. వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే సత్యనారాయణరావు పరామర్శించారు. చిట్యాల మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మృతుల కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన భూపాలపల్లి రూరల్: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వాసుదేవ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం సోమవారం జిల్లాలో పరిశీలించింది. భూపాలపల్లి మండలంలోని కొత్తపెళ్లి (ఎస్ఎం)గ్రామంలో పర్యటించి తడిసిన ధాన్యంతో పాటు నెలకొరిగిన పంట పొలాలను సభ్యులు పరిశీలించారు. కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలోని రైతులతో మాట్లాడారు. ధాన్యం కేంద్రానికి తీసువచ్చి ఎన్ని రోజులు అవుతుంది.. కొనుగోలు చేయకపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు పరదాలు పంపిణీ చేయాలని, రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భారత ఆహార సంస్థ మేనేజర్ దీప్లానాయక్, జిల్లా సరఫరాల శాఖ అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల డీఎం రాఘవేందర్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. నేర నియంత్రణకు సహకరించాలి ఎస్ఎస్తాడ్వాయి: నేర నియంత్రణకు గ్రాడ్యుయేట్లు సహకరించాలని ఎస్సై శ్రీకాంత్రెడ్డి అన్నారు. డియర్ గ్రాడ్యుయేట్ నేను ఎస్సై శ్రీకాంత్రెడ్డి పౌరులకు మెరుగైన సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాం. గుడుంబా, గుట్కా, గంజాయి స్మగ్లింగ్ లాంటి సమాచారాన్ని తన ఫోన్నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియపర్చాలని ఇంగ్లిష్లో రాసిన చిన్న కాగితం స్లిప్ను సోమవారం మండల కేంద్రానికి ఎమ్మెల్సీ ఓటు వేసేందుకు వచ్చిన వారికి అందించారు. అంతేకాకుండా మండలంలోని గ్రాడ్యుయేట్ల అందరికీ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేందుకు వారి పేరు ఫోన్నంబర్లను కూడా సేకరించారు. గ్రాడ్యుయేట్లు వాట్సాప్ మేసేజ్ ద్వారా స్పందించి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యావంతుల ద్వారా గ్రామాల్లో నిషేధిత స్మగ్లింగ్కు అరికట్టవచ్చని స్లిప్ల పంపిణీ ద్వారా మెసేజ్ అందించామని ఎస్సై తెలిపారు. -
నాసిరకం విక్రయిస్తే చర్యలు
కాటారం: నకిలీ పత్తి విత్తనాలు విక్రయించి రైతులను మోసంచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి అన్నారు. కాటారం మండలకేంద్రంలోని ఫర్టిలైజర్, విత్తన విక్రయ దుకాణాలను సోమవారం డీఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని పత్తి విత్తనాల ప్యాకెట్లు, లైసెన్స్, పత్తి విత్తనాల రకం, లాట్ నంబర్లు, విక్రయ అనుమతి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దుకాణాల యజమానులకు పలు సూచనలు చేశారు. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు తప్పనిసరిగా పూర్తి వివరాలతో కూడిన రశీదు అందించాలని సూచించారు. లూజు, అనుమతిలేని పత్తి విత్తనాలను విక్రయించవద్దని, వ్యవసాయశాఖ నిబంధనల ప్రకారమే పత్తి విత్తనాలు విక్రయించాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించి ఎమ్మార్పీ ధరకంటే మించి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తన ప్యాకెట్లు నిల్వ, విక్రయానికి సంబంధించి రిజిస్టర్లు ఉండాలని తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే దుకాణం లైసెన్స్లు రద్దయ్యేలా ఉన్నతాధికారులకు ప్రతిపాదిస్తామని, పీడీ యాక్టులు సైతం నమోదు చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనేప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లూజు, అనుమతి లేని విత్తనాలు కొని మోసపోవద్దని తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి ఎవరైనా పత్తి విత్తనాలు తీసుకొచ్చి అమ్మితే పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. డీఎస్పీ వెంట ఎస్సై మ్యాక అభినవ్, ఏఈఓ సరిత ఉన్నారు.కాటారం డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి -
అన్నదాతకు బాసటగా..
భూపాలపల్లి రూరల్: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఈ వానాకాలం సీజన్ నుంచే ఈ పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తుండగా.. ఇందుకోసం వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్రం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడం, ప్రీమియం చెల్లింపు, బీమా పరిహారం తదితర వాటితో పాటు పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పంటల బీమా పథకాలను అధ్యయనం చేస్తోంది. పంటల బీమా పథకాలు పక్కాగా అమలు కాక జిల్లావ్యాప్తంగా రైతులు అతివృష్టి, అనావృష్టి కారణంగా గతంలో పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంటల బీమా పథకం ఈ సారి అమలుచేస్తే జిల్లాలో దాదాపు 1.16 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. 24.82 లక్షల ఎకరాల సాగు.. జిల్లావ్యాప్తంగా 1,16,187 మంది రైతులు ఉన్నారు. 2,48,270 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. వరి సాగు 1,10,899 ఎకరాలు ఉండగా.. రెండోస్థానంలో పత్తి 91,510 ఎకరాల వరకు ఉంటుంది. ప్రతీ ఏటా ఏదో రకంగా కరువు, కాటకాలకు రైతులు పంటలను నష్టపోతున్నారు. గత ప్రభుత్వం ఏడేళ్లుగా బీమాను పక్కన బెట్టింది. దీంతో పంటలకు నష్టం జరిగినా రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. పక్కాగా అమలుకు ప్రణాళికలు.. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించనుందని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పంటల బీమా పథకాన్ని పక్కాగా అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఇప్పటికే క్లస్టర్ల వారీగా వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న క్రాష్ బుకింగ్ను పరిగణనలోకి తీసుకోనున్నారు. చాలా మంది ఈఏఓలు పంట పొలాలకు వెళ్లకుండా రైతులను అడిగి రాస్తుండటం, పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో పంటల నమోదుపై గొడవలు జరుగుతుండటంతో పంటల బీమాను పకడ్బందీగా అమలు చేయాలంటే బయోమెట్రిక్ తీసుకోవడంతో పాటు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేర కు ఇప్పటికే జిల్లాల వారీగా పంటల సాగు అంచనా లు, ప్రీమియం తదితర వాటికి సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఫసల్ బీమా యోజనతో వచ్చే ప్రయోజనాలను వినియోగించుకోవడంతో పాటు రైతులపై భారం పడకుండా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తం చెల్లించే యోచనలో ప్రభుత్వం జిల్లాలో 1.16 లక్షల మందికి ప్రయోజనం..రైతులు 1,16,187 మంది సాగు భూమి 2,43,193 ఎకరాలు వరి సాగు 1,10,899 ఎకరాలు పత్తి సాగు 91,510 ఎకరాలు మిర్చిసాగు 24,360 ఎకరాలు -
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
చిట్యాల: మండలంలోని ఫర్టిలైజర్ షాపులలో ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు అన్నారు. చల్లగరిగ గ్రామంలోని ఫర్టిలైజర్ షాపును సోమవారం తనిఖీ చేశారు. గడువు ముగిసిన విత్తనాలు, లేబుల్స్ లేనివి, నిల్వ ఉంచిన లూజ్ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ విత్తనాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు సరైన రశీదులు తీసుకోవాలని తెలిపారు. పంట వచ్చే వరకు వాటిని భద్రపరచుకోవాలని కోరారు. రైతులకు ఇబ్బందులు ఉంటే డయల్ 100కు స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. ఆయన వెంట సీఐ మల్లేష్, ఎస్సై శ్రావణ్కుమార్ ఉన్నారు. -
కరెంటు పోతే ప్రత్యామ్నాయం చేసుకోవాలి
● డీఎంహెచ్ఓ అప్పయ్యవాజేడు : వానాకాలంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకోవాలని ములుగు డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అన్నారు. సోమవారం వాజేడుకు వచ్చిన ఆయన ఆస్పత్రిలో ఉన్న రెండు ఇన్వర్టర్లు పని చేస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అందులో ఒకటి మరమ్మతుకు గురైనట్లు డాక్టర్ మహేందర్ తెలిపాడు. మరమ్మతు చేయడానికి వీలుగా ఉంటే వెంటనే లేఖ రాయాలని ఆదేశించారు. వానాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చినప్పుడు ఇన్వర్టర్ల ద్వారా సరఫరాను కొనసాగించాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సూచించారు. సోమవారం వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారన్నారు. -
రైతులపై కాంగ్రెస్ నిర్లక్ష్యం
కాటారం: రైతుల సంక్షేమమే ధ్యేయమంటూ రైతులకు అనేక హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తుందని బీజేపీ నేత గోమాసే శ్రీనివాస్ ఆరోపించారు. కాటారం మండలం రేగులగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నాయకుడు చల్ల నారాయణరెడ్డితో కలిసి ఆదివారం సందర్శించారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం, కొనుగోళ్ల తీరు, రైతుల సమస్యలపై ఆరాతీశారు. రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం గోమాసే శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పదవిలో ఉన్న మంత్రి శ్రీధర్బాబు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలకు మంత్రి సొంత మండలంలో ధాన్యం తడిసి రైతులు గగ్గోలు పెడుతున్నప్పటికీ మంత్రి ఇప్పటివరకు వారి వద్దకు వెళ్లి పరిస్థితి తెలుసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. రైతులకు జరిగే నష్టానికి మంత్రి శ్రీధర్బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.బీజేపీ నేత గోమాసే శ్రీనివాస్ -
ప్రవేశాలు పెంచేందుకు..
భూపాలపల్లి అర్బన్: వచ్చే విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి విడత ప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ప్రకటించింది. ప్రవేశాలు పెంచేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లావ్యాప్తంగా గత విద్యాసంవత్సరం 3,925 మంది విద్యనభ్యసించారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన, వసతులు, అధ్యాపకుల వివరాలు, ఫలితాలను వివరిస్తూ ప్రవేశాలు పెంచుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు దీనిపై దృష్టి సారించారు. వారం రోజులుగా ఊరూరా తిరుగుతూ పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. కళాశాలల్లో ఉన్న వసతులు, ప్రయోగశాలలు, అధ్యాపకులు తదితర వాటిని వివరిస్తూ తమ కళాశాలల్లో ప్రవేశం పొందాలని అభ్యర్థిస్తున్నారు. గతేడాది కూడా ముందస్తు ప్రచారంతో కొంత మేరకు విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. ఉచిత విద్య, వసతులు.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించడంతోపాటు నిష్ణాతులైన అధ్యాపకులతో విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, మైదానాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. వీటికితోడు గురుకులాల్లో ఉచితంగా ఇంటర్ చదువుకునే అవకాశమున్నా ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జిల్లాలోని మోడల్ స్కూల్, కేజీబీవీల్లో చదువుతున్న వారికి ప్రాధాన్యమిస్తూ మిగిలిన సీట్లను నిబంధనలకు అనుగుణంగా కొత్తవారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలను ఈసారి ఎక్కువగా పెంచుకునేందుకు అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు ముందుకు సాగుతున్నారు. జిల్లాకేంద్రంలో హాస్టల్ సౌకర్యాలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందే బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి సౌకర్యాలు ఉన్నాయి. దూర ప్రాంతాల విద్యార్థుల బాలబాలికలకు వేర్వేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీల పోస్ట్మెట్రిక్ హాస్టల్ వసతులు అందుబాటులో ఉన్నాయి. హాస్టల్లో ప్రతీ రోజు టిఫిన్, రెండు పూటల భోజన సౌకర్యాలు ఉంటాయని అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. మైనారిటీ గురుకుల సీట్లకు సైతం.. జిల్లాకేంద్రంలోని మైనారిటీ గురుకుల కళాశాలలో మైనారిటీ విద్యార్థులకు 60 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా 32 సీట్లు మాత్రమే భర్తీఅయ్యాయి. మిగితా 28 సీట్లను మైనారిటీ విద్యార్థులతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. సీట్లను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు గురుకుల కళాశాల అధ్యాపకులు జిల్లాలోని వివిధ గ్రామాలకు వెళ్లి మైనారిటీ విద్యార్థులను ఆరా తీసి కళాశాలలో చేరాలని అవగాహన కల్పిస్తున్నారు.నాణ్యమైన విద్య.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల భాగస్వామ్యంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రచారం చేపట్టి ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. కళాశాలల్లో వసతులు, ఫలితాల గురించి కరపత్రాల ద్వారా వివరిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుంది. గతేడాది కంటే ఎక్కువ ప్రవేశాలు పొందేలా ముందుకు సాగుతున్నాం. – దేవరాజం, జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి●జూనియర్ కళాశాలల సంఖ్యప్రభుత్వ జూనియర్ 5 మోడల్ కళాశాలలు 6 కేజీబీవీ కళాశాలలు 10 బీసీ వెల్ఫేర్ కళాశాలలు 4 ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు 2 సోషల్ వెల్ఫేర్ కళాశాలలు 2 మైనారిటీ కళాశాల 1 ప్రైవేట్ కళాశాలలు 5జూన్ 1నుంచి ఇంటర్ కళాశాలలు పునఃప్రారంభం విద్యార్థుల చెంతకు అధ్యాపకులు సౌకర్యాలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం జిల్లాకేంద్రంలో ఉచిత పోస్ట్మెట్రిక్ హాస్టల్ వసతి -
నేటి నుంచి ‘మేడిగడ్డ’ బొరియల్లో గ్రౌటింగ్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మీ)బ్యారేజీలో ఏర్పడ్డ బొరియల్లో గ్రౌటింగ్ పనులు చేసేందుకు ప్రత్యేక యంత్రాలను నిర్మాణసంస్థ ఏర్పాటు చేసింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ పరీక్షల ద్వారా 7వ బ్లాక్లో మాత్రమే బొరియలు ఏర్పడినట్లు నిర్మాణ సంస్థ ప్రతినిథులు తెలిపారు. దీనికోసం డ్రెడ్జర్ యంత్రాలను బ్లాక్ 7లో ఏర్పాటు చేశారు.19, 20, 21 గేట్ల సమీపంలో ఏర్పడిన బొరియల్లో సోమవారం నుంచి కాంక్రీటు, ఇసుక మిశ్రమాన్ని నింపడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బొరియల్లో మట్టిని నింపి నిషేధిత ప్రాంతంగా సైన్బోర్డులు పెట్టారు. గేట్ల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేశారు. 7వ బ్లాక్లో మొరాయించిన గేట్లను ఆర్మ్ గ్రౌగింగ్ పరికరంతో కట్ చేసి తొలగిస్తున్నారు. అదే విధంగా ఆ బ్లాక్లోని పియర్ల దిగువన 10మీటర్ల లోతు వరకు ఇసుక వరద తాకిడికి తరలిపోకుండా షీట్ఫైల్స్ వేయడానికి ఏర్పాట్లు చే«శారు. ఇప్పటికే సీసీ బ్లాక్ పనులు, ఇసుక మేటల తొలగింపు చేపట్టారు. -
ఎమ్మెల్సీ పోలింగ్కు ఏర్పాట్లు
భూపాలపల్లి అర్బన్: రేపు(సోమవారం) జరిగే పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఉప ఎన్నిక ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 16 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 12,535 మంది పట్టభద్రులు ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. పోలింగ్ కోసం 19మంది పీఓలు, 19మంది ఏపీఓలు, 38మంది ఓపీఓలు, మైక్రో అబ్సర్వర్స్ 16మంది, నలుగురు సెక్టార్ అధికారులను నియమించామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్డీఓ నరేష్, డీపీఓ నారాయణరావు, ఆర్డీఓ మంగీలాల్ పాల్గొన్నారు. నిర్మాణ పనుల్లో వేగం.. కాటారం మండలంలోని బీరసాగర్ వద్ద పంప్హౌస్ పునరుద్ధరణ, మరమ్మతు పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ భవేష్మిశ్రా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బీర సాగర్, పంప్హౌస్ మరమ్మతు పనులు, మందిర, ఎర్ర చెరువులకు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా అంశాలపై కలెక్టరేట్లోని తన కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంప్హౌస్ పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయని వేగం పెంచాలని అన్నారు. పంప్హౌస్ ముంపుకు గురికాకుండా కాంక్రీట్తో పటిష్టమైన రక్షణ గోడ నిర్మించాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ యాదగిరి, విద్యుత్ ఎస్ఈ మల్చూర్, ఆర్డిఓ మంగిలాల్లు పాల్గొన్నారు. రేపు స్పెషల్ క్యాజువల్ లీవ్ పట్టభద్రుల ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 27న ప్రత్యేక సాధారణ సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్)ను ఎన్నికల సంఘం ప్రకటించినట్లు కలెక్టర్ భవేష్మిశ్రా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేస్తున్న బోనఫైడ్ ఓటర్లు సీఎల్ వినియోగించుకోవాలన్నారు. పనులు పూర్తి చేయండి రేగొండ(కొత్తపల్లిగోరి): అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద ఎంపికై న పాఠశాలల్లో చేపట్టిన పనులను జూన్ 12లోగా పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్మిశ్రా అధికారులను ఆదేశించారు. రేగొండ, కొత్తపల్లిగోరి మండలాలలోని పలు గ్రామాల్లో పనులను కలెక్టర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శామ్యుల్, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు, ఎంపీఓ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ భవేష్మిశ్రా -
బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమాలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. 20సంవత్సరాల అనంతరం బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం మొదలైన ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఆదివారంతో ముగియనున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొని గ్రామదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వ్యక్తి అనుమానాస్పద మృతి భూపాలపల్లి రూరల్: రాంపూర్ అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూపాలపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతిచెందిన వ్యక్తి మృతదేహం కుళ్లిపోయి ఉంది. మృతుడి కుడిచేతికి ఆపరేషన్ చేసిన రాడ్ వేసి ఉంది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు రేగొండ(కొత్తపల్లిగోరి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లిగోరి గ్రామానికి చెందిన నరెడ్ల సంజీవ్ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా బస్టాండ్ సమీపంలోని మీసేవ వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజీవ్ కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రగాత్రుడిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. బాలసదనాన్ని సందర్శించిన జడ్జి ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని బాలసదనంను సివిల్కోర్టు జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కన్నయ్యలాల్ శనివారం సందర్శించారు. అనాథలకు అందుతున్న సౌకర్యాలు, వసతులను పరిశీలించారు. రోజువారీగా అందిస్తున్న భోజనం, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టర్ను తనిఖీ చేశారు. జడ్జి వెంట జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా, బాలల పరిరక్షణ అధికారి ఓంకార్, బాలసదనం సూపరింటెండెంట్ సుమతి, ప్రొటెక్షన్ అధికారి కృష్ణవేణి, కౌన్సిలర్ రాణి, తదితరులు ఉన్నారు. రామప్పను సందర్శించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి.. ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పాకళా సంపద బాగుందని కొనియాడారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు మునిగంటి నరేంద్రచారి, భూక్య జంపన్న, రేణిగుంట్ల శరత్ తదితరులు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం ములుగు రూరల్: పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు టీఎస్ఆర్డబ్ల్యూఎస్ గురుకులాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయ అధికారి యాదగిరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని జాకారం (బాలురు), ఏటూరునాగారం (బాలికలు) గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్డాట్ఏసీడాట్ఇన్ వెబ్సైట్లో రూ. 100 చెల్లించి ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. -
12 గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య కాళోజీ సెంటర్ : ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పట్టభద్రులు 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డులేని వారు ఆధార్కార్డు, ఉపాధిహామీ జాబ్కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ పాస్పుస్తకాలు, కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు, ప్రత్యేక వైకల్యం తదితర గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకదానితో ఓటు వేయవచ్చని తెలిపారు. జిల్లాలోని పట్టభద్రుల ఓటర్లు సోమవారం సమయం కేటాయించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement