-
గంజాయి రహిత జిల్లాయే లక్ష్యం
గద్వాల రూరల్: గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు నార్కోటెక్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధించబడిన మత్తుపదార్థాల సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీల వద్ద డ్రగ్స్ విక్రయాలు జరపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గంజాయి సాగుపై కూడా ప్రత్యేక దృష్టి సారించి పూర్తిగా అరికట్టాలని, మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై జూన్ చివరి వారంలో ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాను పూర్తిగా గంజాయి రహిత, మత్తుపదార్ధాల రహిత జిల్లాగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, డీఎస్పీ సత్యనారాయణ, ఎకై ్సజ్ సూపరిండెంట్ అరుణ్కుమార్, డీడబ్ల్యువో సుధారాణి, ఎఫ్ఆర్వో దేవరాజు, డీసీపీవో నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ వ్యాపారాల అడ్డాగా..
జిల్లా వ్యాప్తంగా వివిధ కంపెనీల వస్తువులను, సామగ్రిని నాసిరకం కంపెనీల తయారీదారుల నుంచి నడిగడ్డ నకిలీ వ్యాపారులు కొనుగోలు చేసి రూ.కోట్లలో లాభాలు పొందుతున్నట్లు సమాచారం. నాసిరకం సీడ్ పత్తి విత్తనాలు, మిర్చి, వరి, కందులు, వేరుశనగ, ఆముదం, కూరగాయాల విత్తనాలు, ఎరువులు, మందులు, పెస్టిసైడ్ మందులు సైతం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడి జిల్లాకు సరఫర అవుతున్నాయి. ప్రస్తుత సీజన్ పంటల సీజన్ ప్రారంభం కావడం అక్రమార్కులకు కలిసి వచ్చే ఆదాయంగా మారుతుంది. కల్తీ బంగారం, మద్యం, నిషేధిత కల్లు, బియ్యం, పప్పు, వంటనూనే, పాలు, పండ్లు, మాసాల దినుసులు, డ్రగ్ అండ్ కెమిస్ట్రి మందులు, గద్వాల చీరలు, వస్త్రలు, ఆటోమొబైల్స్ తదితర వ్యాపారులైన వాటిలో అత్యధిక శాతం నాసిరకం వస్తువులు బ్రాండెండ్ కంపెనీ లేబుళ్లతో బహిరంగ మార్కెట్లో గుర్తు పట్టలేని విధంగా అమాయక ప్రజలకు అంటగడుతున్నారు. -
నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా
గద్వాల క్రైం: జిల్లాలో నకిలీ విత్తనాల సరఫరా, క్రయ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతోపాటు అందుకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ రితిరాజ్ అన్నారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. నాసిరకమైన పురుగు మందులు, వివిధ పంటలకు సంబంధించిన కల్తీ విత్తనాల విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని, అందుకు కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మార్కెట్లోకి రాకుండా కట్టడి చేయాలన్నారు. జిల్లా సరిహద్దులలో నిత్యం తనిఖీలు చేపట్టి చెక్పోస్టుల వద్ద నిఘా ఉంచాలన్నారు. ప్రత్యేక బృందాలు జిల్లా వ్యాప్తంగా వెలసిన మందుల దుకాణాలు, సీడ్ వ్యాపారం చేస్తున్న ఆర్గనైజర్లు, వివిధ కంపెనీల మిల్లులు, గోదాం తదితర స్టాక్ పాయింట్లలో తనిఖీలు చేపట్టి నిల్వ ఉన్న స్టాకు, విక్రయాలు చేసిన బిల్లులు, ఎక్కడి నుంచి వచ్చాయి, కంపెనీల పేర్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. అనుమానాస్పద వాహనాల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, నకిలీ విత్తనాలు విక్రయించిన వారి వివరాలు, ప్రస్తుతం నమోదైన కేసుల వివరాలు తదితర వాటిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులు వ్యవసాయేతర విత్తనాలు, ఎరువులు, మందులను కొనుగోలు చేస్తున్న క్రమంలో కంపెనీ గుర్తించి, ప్రభుత్వ అనుమతి పొందిన వాటిని కొనుగోలు చేసి సంబంధిత వాటికి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనంతరం జూలై నుండి అమల్లోకి వచ్చే బీఎస్ఏ, బీఎన్ఎస్, బీఎన్ఎస్స్ కొత్త చట్టాలపై ప్రజలకు తెలియజేయాలని, ఈమేరకు సిబ్బంది ప్రత్యేక కార్యచరణతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారయణ, సీఐలు రత్నం, బీమాకుమార్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలి ఎస్పీ రితిరాజ్ -
ఇష్టంతో చదివి లక్ష్యాలు సాధించాలి
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా ఇష్టంతో చదివి నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించుకోవాలని అదనపు కలెక్టర్ అపూర్వ్చౌహాన్ అన్నారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని తన ఛాంబర్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచితంగా స్టడీమెటీరియల్ను అందజేశారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్టడీమెటీరియల్ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి శ్వేతాప్రయదర్శిని, స్టడీసర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. -
ఫలితాలపై అభ్యర్థుల్లో హైటెన్షన్..
లోక్సభ ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే పోలింగ్ నాటి నుంచి ఇప్పటివరకు బూత్ స్థాయి, మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తమకు వచ్చిన ఓట్ల శాతాన్ని అంచనా వేసుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు జూన్ 4న ఎన్నికల ఫలితాలపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మే 13న ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలకు ఎన్నిక నిర్వహించగా, సుమారు పక్షం రోజులుగా అభ్యర్థులు తమ పార్టీ ముఖ్య నేతలతో నియోజకవర్గాల వారీగా ఎన్నికల తీరుపై సమీక్షల్లో నిమగ్నమయ్యారు. మీడియా, సర్వే సంస్థలు, ఇతర వర్గాల ద్వారా ఓటరు నాడిని అంచనా వేసేందుకు ప్రయత్నాలు సాగించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత ఇలాకాలో రెండు పార్లమెంట్ స్థానాలను సొంతం చేసుకుంటామని కాంగ్రెస్ ధీమాను ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ పాలన మొదలైన ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ప్రజలు తమ వైపే చూస్తున్నారని బీఆర్ఎస్ తమ అభ్యర్థుల గెలుపుపై ఆశలు పెట్టుకుంది. ఈ సారి ఎన్నికల్లో భారీస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందని, నిశ్శబ్దమైన ఓటింగ్తో తమ అభ్యర్థులు గెలవబోతున్నారని బీజేపీ జోస్యం చెబుతోంది. ఎన్నికల ఫలితాలకు కేవలం ఐదు రోజుల సమయం మిగిలి ఉండటం, ఫలితాల్లో ప్రజలు ఏ పార్టీకి మద్దతు కట్టబెట్టారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
నకిలీగాళ్లు..!
గుర్తింపు పొందిన కంపెనీ లోగోలతో నకిలీ వస్తువుల విక్రయం తనిఖీల జాడేదీ..? గద్వాల, అయిజ, ధరూర్, అలంపూర్, గట్టు, మానవవపాడు, ఇటిక్యాల, శాంతినగర్, కేటీదొడ్డి తదితర మండలాల్లో వెయ్యి మందికిపైగా వివిధ వ్యవసాయేతర సామగ్రి, మందులు, విత్తనాలు, ఎరువులు, పరికరాల క్రయ విక్రయాలు చేస్తున్నారు. సగటు రోజున రూ.లక్షలో రైతులు వారి అవసరాలకు అవసరమైయ్యే వాటిని కొనుగోలు చేస్తుంటారు. ఈ వ్యాపారంలో నాసిరకం వాటిని గుర్తించడంలో రైతులకు, ప్రజలకు అవగాహన లేక పోవడం వ్యాపారులకు కలసి వస్తుంది. బ్రాండెడ్ కంపెనీల లోగోలతో ముద్రించడం వాటిని గుర్తించేందుకు కష్టంగా మారింది. లీగల్ మోట్రాలాజీ విభాగ అధికారులు నిత్యం ఎక్కడ తనిఖీలు చేయక పోవడం ఇదోక వరంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా పెద్ద ఎత్తున్న నడిగడ్డకు చేరుతున్నాయి. వాణిజ్యపన్నుల శాఖ వ్యాపారుల ఆర్థిక లావాదేవిలపై ఎప్పుడు తనిఖీలు చేసిన దాఖలు జిల్లాలో కన్పించకపోవడంపై చర్చనీయంశంగా మారింది. అంతరాష్ట్ర చెక్పోస్టులను దాటుకొని నకిలీగాలైన వ్యాపారుల గోదాంలో రూ.లక్షల విలువ గల సామగ్రి నిల్వ ఉండడం కొసమెరుపు. తాజాగా గద్వాలలో పట్టుబడిన నకిలీ డ్రిప్ పైపుల వ్యవహారంలోను సదరు కంపెనీ నిర్వాహకులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో తనిఖీలు చేసి సామగ్రిని సీజ్ చేయడంతోపాటు కేసు నమోదు చేశారు. అయితే వాటిని ఎక్కడ నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు.. ఈ తరహా వ్యవసాయేతర సామగ్రి ఏ జిల్లాలకు సరఫర చేశారు అనే విషయాలపై పోలీసులు కూపీ లాగుతారా లేక తమకేందుకులే అని చేతులు దులుపుకొంటారనే విషయాలు త్వరలో తేలనుంది. గద్వాల క్రైం: ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యక్తులు నకిలీ వస్తువులను మార్కెట్లోకి తీసుకొచ్చి కంపెనీ లోగోలతో అటు రైతులను.. ఇటు ప్రజలను మోసం చేస్తున్నారు. లాభాలు ఉండాలే గాని ఏ వస్తువునైన సరే అక్రమార్కులు గుట్టుగా తయారీదారుల నుంచి నకిలీగాలైన వ్యాపారులు కొనుగోలు చేయడం.. అట్టి వస్తువులను అమాయక రైతులకు విక్రయించడం నడిగడ్డ నకిలీగాళ్లకే సొంతం అన్నట్లుగా మారింది. తాజాగా జిల్లా కేంద్రంలోని ఓ కంపెనీ వ్యవసాయ పరికరాలైన పీవీసీ, యూ పీవీసీ డ్రిప్ పైపులు తదితర సామగ్రిని అసలు కంపెనీ లోగోకు ఏమాత్రం తీసిపోని విధంగా తసి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకే విక్రయాలు చేస్తుండడంతో రైతుల ఫిర్యాదుతో కంపెనీ సిబ్బంది కూపీలాగారు. ఈమేరకు ఈ నెల 8వ తేదీన రూరల్ పోలీసుల సహాయంతో సదరు కంపెనీ లీగల్ సెల్ సిబ్బంది గద్వాలకు చెందిన వ్యాపారి గోదాంలో సోదాలు చేయగా నాసీరకం వ్యవసాయేతర డ్రిప్ పైపులు ఇతరరాత్ర పరికరాలను గుర్తించారు. వాటి విలువ రూ.10లక్షలు ఉంటుంందని అంచనా వేశారు. సదరు వ్యాపారిపై రూరల్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా నకిలీ వ్యవసాయ డ్రిప్ పైపుల బాగోతం వెలుగులోకి.. పోలీసుల తనిఖీతో వ్యవసాయేతర ఇతర పరికరాలు లభ్యం రూ.10లక్షల సామగ్రి సీజ్ ఉపేక్షించేది లేదు నకిలీ వ్యవసాయేతర పరికరాలు, మందులు, ఎరువులు, విత్తనాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. ఇది పంటల సమయం. ఎక్కడైన నాసిరకం వస్తువులు, మందులు ఇతరాత్ర వాటి విక్రయాలు చేపట్టినా ఎంత మాత్రం సహించేది లేదు. నకిలీ వస్తువులు విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. పాత కేసుల్లో నమోదైన వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నాం. వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటాం. – రితిరాజ్, ఎస్పీ -
No Headline
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్డౌన్ మొదలైంది. ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 4న ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం కౌంటింగ్ను మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగంలో, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని నెల్లికొండ సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో చేపట్టనున్నారు. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక మార్చి నెల 28న నిర్వహించగా, ఓట్ల లెక్కింపును జూన్ 2న చేపట్టనున్నారు. దీంతో లోక్సభ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏర్పాట్లలో అధికార యంత్రాంగం.. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల పరిధిలో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలు, పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అదే రోజున ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్లో నిమగ్నమయ్యే ఎన్నికల సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేశారు. -
మూడు రోజుల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు..
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ తరఫున పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి జెడ్పీ మాజీ వైస్చైర్మన్ నవీన్కుమార్ రెడ్డి బరిలో ఉండగా, స్వతంత్య్ర అభ్యర్థిగా సుదర్శన్గౌడ్ పోటీ చేశారు. మొత్తం 1,439 మంది ఓటర్లకుగానూ ఈ ఉప ఎన్నికలో 1,437 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటువేయలేదు. ఈ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును జూన్ 2న చేపట్టి, అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. అభ్యర్థులకు వచ్చిన ప్రాధాన్యత ఓట్ల ప్రకారం ఓట్ల లెక్కింపు చేపడతారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్ల ఆధారంగా గెలుపు కోసం అవసరమైన కోటాను అధికారులు నిర్ధారిస్తారు. కోటాకు సరిపడు ఓట్లు వచ్చే వరకు అభ్యర్థుల మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఫలితాల్లో వీరిలో ఎవరికి అదృష్టం వరిస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది. -
‘భారత్మాల’ భూసేకరణపై విచారణ
గట్టు: భారత్మాల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అదనంగా మరికొంత మేరకు భూమిని సేకరించే నిమిత్తం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సమక్షంలో విచారణ నిర్వహించారు. మంగళవారం గట్టు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో రైతుల భూములను ఇది వరకే సేకరించి, పరిహారం అందజేశారు. మరికొంత భూమి అవసరం మేరకు గట్టు, రాయాపురం, తప్పెట్లమొర్సు గ్రామాల పరిధిలోని మొత్తం 15 ఎకరాలకుగాను 87 మంది రైతులకు అధికారులు ఇది వరకే నోటీసులను జారీ అందజేశారు. సదరు రైతులు గట్టు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని, అదనపు భూ సేకరణకు సంబందించిన ఒరిజినల్ పట్టాదారు పాసుపుస్తకం, ఇతర పత్రాలను అదనపు కలెక్టర్కు చూపించారు. రికార్డులతో పాటుగా, భూ యజమానులు వీరే అన్నట్లుగా రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, వివరాలను నమోదు చేసుకున్నారు. అవార్డు విచారణ పూర్తి చేసిన తర్వాత రైతులకు నష్టపరిహారం చెల్లించనున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సరితారాణి, డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, సినియర్ అసిస్టెంట్ తిరుమలేష్, ఆర్ఐ రాజు, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు. -
టిమ్ మిషన్లలో లోపం.. బస్సు సర్వీసులు ఆలస్యం
గద్వాల క్రైం: గద్వాల ఆర్టీసీ డిపో నుంచి మంగళవారం ఉదయం బస్సు సర్వీసులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. గద్వాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులు తీవ్ర నిరాశ చెందారు. ప్రయాణికులకు బస్సు టికెట్స్ ఇచ్చే టిమ్ మిషన్లలో సాంకేతిక సమస్యల కారణంగా సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గమనించిన సిబ్బంది సాంకేతిక నిపుణుల సహాయంతో సమస్యను నివారించారు. గంటపాటు ప్రయాణికులు బస్టాండ్లోనే నిలిచిపోయారు. అనుమతి లేకుండా శిక్షణ కార్యక్రమాలు ● అడ్డుకున్న పోలీసులు గద్వాల రూరల్: జిల్లాలో ఎన్నికల కోడ్ కొనసాగుతున్న వేళ ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో అవగాహన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు వ్యతిరేకమని సీఐ భీమ్కుమార్ అన్నారు. మంగళవారం గద్వాల మండలం అనంతపురం గ్రామంలో గత మూడు రోజుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో 11మంది మహిళలు బాల్యవివాహాలు, మూఢనమ్మకాలు, మహిళలపై దాడులు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న సీఐ భీమకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అనంతపురం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహిళల వివరాలపై ఆరా తీశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతులు తప్పనిసరి అని మరోసారి ఇలాంటివి జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పి పంపించారు. అయితే పోలీసులు పెద్ద ఎత్తున గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు. దీనిపై ఎస్పీ రితిరాజ్ను సంప్రదించగా వచ్చిన వారు మావోయిస్టులు, నక్సల్స్ కాదని మహిళా సంఘాలకు చెందిన సభ్యులని చెప్పారు. ఎన్నికల కోడ్ కొనసాగుతున్నప్పుడు ముందస్తు అనుమతులు లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని అదే విషయాన్ని వారికి చెప్పి పంపినట్లు ఎవరిని కూడ అదుపులోకి తీసుకోలేదని వట్టి ప్రచారం మాత్రమేనని తెలిపారు. వేరుశనగ క్వింటా రూ.6066 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు మంగళవారం 77 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6066, కనిష్టం రూ. 4321, సరాసరి రూ. 5001 ధరలు పలికాయి. అలాగే, 166 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2529, కనిష్టం రూ. 1769, సరాసరి ధర రూ. 1919 ధరలు వచ్చాయి. సమస్యల సాధనే లక్ష్యంగా పోరాటం పాన్గల్: ప్రతి కార్యకర్త ప్రభుత్వాలు అమలుచేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ సమస్యల సాధనే లక్ష్యంగా పోరాటాలు కొనసాగించాలని సీపీఎం ఉమ్మడి రాష్ట్ర నాయకుడు మీర్యం వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని రేమద్దులలో నిర్వహించిన పార్టీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం జరగగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి పేదల పక్షాన నిలిచిన చరిత్ర సీపీఎంకు ఉందని గుర్తు చేశారు. భూస్వాముల నుంచి 10 లక్షల ఎకరాల భూమికి విముక్తి కలిగించి పేదలకు పంచిన ఘనత పార్టీకి ఉందని తెలిపారు. పేదలు, రైతులు, కూలీలు, కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నది ఎర్రజెండా పార్టీ అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు వంత పాడుతోందని.. కనీస అవసరాలకు నోచుకొని స్థితిలో పేదలు ఉన్నారని తెలిపారు. పేదల కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ప్రభుత్వాలు కల్పించాలన్నారు. రెండ్రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల్లో ‘పార్టీ నిర్మాణం.. ప్రజాసంఘాల బాధ్యత’ అనే అంశంపై పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బాల్యానాయక్, మండల నాయకులు వెంకటయ్య, భాస్కర్, నిరంజన్, కోదండరాములు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చిన్నపాటి నిర్లక్ష్యం.. భారీ మూల్యం
బస్సు, బైక్ ఢీకొని.. ముగ్గురు యువకుల దుర్మరణం ● ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం,అతివేగమే ప్రమాదానికి కారణం ● నారాయణపేట జిల్లా మక్తల్లోవిషాదం నింపిన ఘటన ● శోకసంద్రంలో కుటుంబాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రతిరోజు వారు కలిసి తిరుగుతూ.. కష్టసుఖాలను పంచుకునేవారు.. శుభకార్యాల్లో ఫొటోలు, వీడియోలు తీస్తూ జీవనం సాగించారు.. జీవితకాలం ఇలాగే సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారి.. కాటికి సాగనంపింది.. నిబంధనలను బేఖాతర్ చేస్తూ.. హెల్మెట్ లేకుండా ముగ్గురు కలిసి ఒకే బైక్పై అతివేగంగా వెళ్లి.. ఎదురుగా వచ్చిన బస్సును అదుపు తప్పి ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం మక్తల్ పట్టణంలో విషాదం నింపింది. హెల్మెట్ లేకపోవడం, మితిమీరిన వేగంతో వాహనం నడపడం వల్ల ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. – మక్తల్ -
మిన్నంటిన రోదనలు
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రాఘవేంద్రచారి, వెంకటేష్, మహేష్ పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు తరలిరావడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా కిటకిటలాడింది. వారి రోదనలతో ఆస్పత్రి పరిసర ప్రాంతాలు హృదయ విదారకంగా మారాయి. పరామర్శించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను చూసి మృతుల తల్లిదండ్రులు కాళ్లమీద పడి బోరున విలపించారు. దీంతో ఎమ్మెల్యే వారిని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. ఆస్పత్రిలోనే మృతదేహాలకు పోస్టుమార్గం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ చెప్పారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
సురవరం ప్రతాపరెడ్డి సేవలు మరువలేనివి
గద్వాల అర్బన్: తెలుగుజాతికి సురవరం ప్రతాపరెడ్డి చేసిన సేవలు మరువలేనివని రెడ్డి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట రాజారెడ్డి అన్నారు. సురవరం ప్రతాప రెడ్డి 128వ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకట రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి నాయకులు రంగారెడ్డి, వెంకట్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
బత్తాయి రైతు విలవిల
వాతావరణ పరిస్థితులతో తగ్గిన దిగుబడిఅనుకూలించని వాతావరణం గడిచిన ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్లో వర్షాలు రాలేదు. జులైలో ఓ మోస్తారుగా వర్షాలు కురిసాయి. ఆ తర్వాత వర్షాల జాడే లేకుండా పోయింది. దీని ఫలితంగా భూగర్బ జలాల నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. ఈపరిస్థితులు బత్తాయి తోటలపై ప్రభావాన్ని చూపాయి. సరిగ్గా పూత పూసే సమయంలో భూమిలో తేమశాతం తగ్గింది. ఉష్ణోగ్రతలు ఎక్కువ అయ్యాయి. వీటితో పాటు బోర్లలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా జిల్లాలో చాలా ప్రాంతాల్లో బత్తాయి దిగుబడులు తగ్గాయి. కాయ సైజు రావాల్సినంత రాలేదు. పై నుంచి పూత రావడానికి, కాయ బాగా రావడానికి వేలకు వేలు మందులకు ఖర్చు చేశారు. అయినప్పటికి బత్తాయి రైతులకు నిరాశే మిగిలింది. ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, చాలచోట్ల 4నుంచి 6 టన్నులు మాత్రమే వచ్చిందని రైతులు ఆవేదనతో చెబుతున్నారు. ఇక ధరల విషయానికి వస్తే టన్నుకు కనీసం రూ.30వేల నుంచి రూ.40వేల వరకు వస్తేనే గిట్టుబాటు అవుతుంది. అయితే కాయసైజు చిన్నగా ఉండటం వల్ల మార్కెట్లో రూ.20వేల నుంచి రూ.25వేల వరకు మాత్రమే వస్తోందని వాపోతున్నారు. ఈసారి పెట్టుబడులు ఎక్కువగా పెట్టామని, ఈసారి దిగుబడులు తగ్గాయి అదేవిధంగా ధరలు కూడా తక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గద్వాల వ్యవసాయం: వాతావరణం అనుకూలించకపోవడం.. అటు దిగుబడులు తగ్గడం.. సరైన సమయంలో మార్కెట్లో ధరలు నేలచూపులు చూస్తుండడం.. మొత్తంగా బత్తాయి తోటల రైతులను ఈ ఏడాది కష్టాలు వెంటాడుతున్నాయి. తోటలకు రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టి, పంట సరిగ్గా చేతికి రాక అదేసమయంలో మార్కెట్లో ధరలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో జంబేరి, రంగాపూర్ రకాలు సాగు.. పండ్లతోటలకు నడిగడ్డలో నేలలు అనుకూలంగా ఉన్నాయి. ఇందుకు కావాల్సిన ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు కూడా సాధారణంగా బాగుంటాయి. ఇక్కడి రైతులు గడిచిన పదిహేను ఏళ్లనుంచి బోర్లు, బావుల కింద పండ్లతోటలు బాగా సాగు చేస్తున్నారు. ఈక్రమంలో జిల్లాలో 7వేల ఎకరాల్లో బత్తాయి తోటలు వేశారు. జంబేరీ, రంగాపూర్ వైరెటీ సాగు చేశారు. ఈతోటలకు ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. ఏటా రెండుసార్లు కాపు వస్తుంది. ఏప్రిల్, మే నెలలో ఒకసారి, సెప్టెంబర్, అక్టోబర్లో రెండో సారి కాపు వస్తుంది. వాతావరణ పరిస్థితులు మంచిగా అనుకూలిస్తే ఎకరాకు 8నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది. అయితే మిగిలిన పండ్ల తోటలతో పోల్చితే బత్తాయి తోటలకు పెట్టుబడులు ఎక్కువే. అదే సమయంలో నిర్వహణ కూడా ఎక్కువే. కాగా ఇక్కడి రైతులు ఎక్కువగా బెంగళూర్, హైదరాబాద్, డిల్లీకి విక్రయిస్తుంటారు. జిల్లా వివరాలిలా.. మార్కెట్లో పడిపోయిన ధరలతో ఆందోళన గతంలో టన్నుకు రూ.30వేల నుంచి రూ.40వేలు పలికిన వైనం ఈసారి రూ.20వేల నుంచి రూ.25వేల వరకు మాత్రమే వస్తోందని ఆవేదన జిల్లాలో 7వేల ఎకరాల్లో తోటల సాగు -
తప్పులకు తావివ్వొద్దు
జూన్4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అపూర్వ్చౌహాన్ అన్నారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశం హాలులో ఎన్నికల కౌంటింగ్లో పాల్గొనే అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కౌంటింగ్ సిబ్బంది, అధికారులు సకాలంలో చేరుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుందన్నారు. అనంతరం 8:30గంటలకు ఈవీఎం కౌంటింగ్ ప్రారంభించాలన్నారు. ప్రతిరౌండ్కు రిజల్ట్ను షీట్లో పొందుపర్చి ఇవ్వాలన్నారు. గద్వాల సెగ్మెంట్ పరిధిలో 16టేబుల్స్, అలంపూరు సెగ్మెంట్ పరిధిలో 14టేబుల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్, డీఆర్డీవో నర్సింగ్రావు, తిమ్మారెడ్డి, ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ
గద్వాల రూరల్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన అదనపు కలెక్టర్ అపూర్వ్చౌహాన్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన జిల్లా ఎన్నికల కౌంటింగ్ అధికారులతో మాట్లాడారు. జూన్ 4వ తేదీన ఉదయం 8గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ సకాలంలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా కౌంటింగ్ నిర్వహించే విధాంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అదేవిధంగా కౌంటింగ్ హాలులోకి ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బంది ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఫలితాలు ప్రకటించేందుకు ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరౌండ్ ఫలితాలను ప్రకటించేందుకు జిల్లా సీనియర్ అధికారిని మీడియా సెంటర్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
No Headline
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ శివారులోని ఎల్లమ్మకుంటకు చెందిన ఫొటోగ్రాఫర్ రాఘవేంద్రచారి (30), వెంకటేష్(29), మహేష్కుమార్(21) వీడియో గ్రాఫర్గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో మక్తల్ మండలంలోని కాచ్వార్ గ్రామంలో ఓ ఇంట్లో శుభకార్యంలో ఫొటోలు తీసేందుకు మంగళవారం ఉదయం వెళ్లారు. తర్వాత కొద్దిసేపు విరామం దొరకడంతో మక్తల్కు వచ్చి.. తిరిగి మధ్యాహ్నం సమయంలో ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై మళ్లీ బయలుదేరారు. ఈ క్రమంలో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామం సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారి–167పై మహబూబ్నగర్ నుంచి రాయచూర్ వెళ్తున్న కర్ణాటక బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేష్, రాఘవేంద్రచారి అక్కడికక్కడే మృతిచెందగా.. మహేష్ కాలు విరిగి తలకు తీవ్రగాయాలు కావడంతో 108లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. -
డిగ్రీ పరీక్షల్లో18 మంది డిబార్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్షలు కొనసాగుతుండగా.. మంగళవారం ఒక్కరోజే 18 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. ఉదయం సెషన్లో సెమిస్టర్ 2కు సంబంధించి మొత్తం 12,882 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 12,024 మంది హాజరయ్యారు. 846 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మద్యాహ్నంసెషన్లో 6వ సెమిస్టర్లో 8,415 మంది విద్యార్థులకు 8,085 మంది విద్యార్థులు హాజరయ్యారు. 324 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సెమిస్టర్–2లో 12 మంది మహబూబ్నగర్లోని ఎంవీఎస్, జడ్చర్ల, కొండనాగుల పరీక్ష కేంద్రాల్లో డిబార్ కాగా... మధ్యాహ్నం జరిగిన సరీక్షలో ఆరుగురు విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్ప డుతూ చిక్కారు. ఇందులో ఒక్క ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఎనిమిది మంది విద్యార్థులుడిబార్ అయినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజ్కుమార్ పేర్కొన్నారు. -
పోలీస్ గ్రీవెన్స్కు 12అర్జీలు
గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల దినోత్సవానికి 12 అర్జీలు అందినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు. వాటిలో పొలం బాట, ఆస్తి పంపకాలు, భార్యభర్తల తగాదాలతోపాటు పలు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. ఈమేరకు ఫిర్యాదుదారులతో ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, సివిల్ తగాదాలు కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. వేరుశనగ క్వింటా రూ.6,109 గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్యార్డుకు సోమవారం 136 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ. 6109, కనిష్టం రూ.4006, సరాసరి రూ.4430 ధరలు పలికాయి. 4క్వింటాళ్ళ ఆముదాలు రాగా, గరిష్టం రూ.5416, కనిష్టం రూ.5359, సరాసరి రూ 5380 ధరలు వచ్చాయి. దీంతోపాటు 4 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 10606, కనిష్టం రూ. 9029, సరాసరి రూ. 10606 ధరలు లభించాయి 194 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ. 2529, కనిష్టం రూ.1769, సరాసరి ధర రూ.1919 ధరలు వచ్చాయి. 7 క్వింటాళ్ల వరి (హంస) రాగ గరిష్టం, కనిష్టం, సరాసరి ధర రూ. 1829 పలికింది. 31న మెగా జాబ్ మేళా పెబ్బేరు రూరల్: హైదరాబాద్ రాణిగంజ్లోని గుజరాతి ఉన్నత పాఠశాలలో ఈ నెల 31న పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకి ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (గ్రీన్ ల్యాండ్స్) సంయుక్తంగా మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ గద్దె భాస్కర్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయత్రం 5 వరకు జరిగే జాబ్ మేళాలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఇతర పేరొందిన 25 సంస్థలు పాల్గొంటాయని.. వివిధ రకాల ఉద్యోగాలకు రెండు వేల మందిని నియమించుకోనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ తదితర ఉన్నత చదువులు చదివిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువత అర్హులని.. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్నంబర్ 95424 33427లో గాని పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వెబ్సైట్, ఫేస్బుక్, యూట్యూబ్లో సంప్రదించాలన్నారు. నేడు ‘సురవరం’ గ్రంథావిష్కరణ స్టేషన్ మహబూబ్నగర్: తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి జయంతిని పురస్కరించుకొని మంగళవారం ‘బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి’ గ్రంథావిష్కరణ చేయనున్నట్లు పాలమూరు సాహితీ అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రం మెట్టుగడ్డలోని లిటిల్ స్కాలర్స్ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి హాజరై గ్రంథాన్ని ఆవిష్కరిస్తారని, అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, గ్రంథ సంపాదకులు, తెలంగాణ బాషా సాంస్కృతిక మండలి అధ్యక్షులు డాక్టర్ గంటా జలంధర్రెడ్డి పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి జిల్లాలోని కవులు, రచయితలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
చిన్నచింతకుంట: బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని నారాయణపేట పీఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సుందర్రావు తెలిపారు. సోమవారం మండలంలోని రెడ్డి బీడీ, వస్తాద్ బీడీ ఫ్యాక్టరీలను సందర్శించి కార్మికుల సమస్యలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికుల పీఎఫ్ సమస్యలు ఎన్నో ఉన్నాయన్నారు. అవి ఇప్పుడే మా దృష్టికి వచ్చాయని తెలిపారు. త్వరలోనే నిధి ఆప్కే నికట్లో పీఎఫ్ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లు నరేష్, సాయులు, బీడీ కార్మిక సంఘం నాయకులు కోళ్ల వెంకటన్న, దేవదానం, అరుణ్కుమార్, చంద్రన్న పలువురు ఉన్నారు. -
పూడిక తొలగేనా..?
● చెత్తాచెదారంతో నిండిన డ్రెయినేజీలు ● మురికి కాల్వల ఆక్రమణ.. యథేచ్ఛగా దుకాణాల ఏర్పాటు ● వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు ● ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంలో మున్సిపల్ యంత్రాంగం విఫలం ప్రణాళిక రూపొందిస్తున్నాం డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తా చెదారాన్ని తొలగించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం. పూడికతీయడానికి అవసరమైన డ్రైన్లు గుర్తించడం జరిగింది. కౌన్సిల్లో చర్చించి వాటిని మెరుగుపరుస్తాం. యంత్రాలను ఉపయోగించి పెద్ద డ్రైన్లలో పేరుకపోయిన పూడికతీత తొలగిస్తాం. – శంకర్సింగ్, కమిషనర్, గద్వాల ●గద్వాల: గద్వాల పురపాలక సంఘం పాలకులకు, అధికారులకు వర్షాకాలం వస్తుందంటే చీమ కుట్టినట్లు కూడా లేదు. పట్టణంలోని డ్రైన్లన్నీ చెత్తా చెదారంతో, శివారు ప్రాంతాల్లోని ప్రధాన మురికి కాల్వలు పిచ్చి మొక్కలతో నిండిపోయినా కౌన్సిల్ సభ్యులు, అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. వర్షం కురిస్తే అవన్ని పొంగి పొర్లడంతోపాటు పట్టణం దుర్గంధంగా మారుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిసినా పాలకులు, అధికారులు మాత్రం మేల్కోవడం లేదు. ప్రజలను వర్షకాలం కష్టాల నుంచి తప్పించేందుకు ముందు జాగ్రత చర్యలు చేపట్టాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిసినా..తమకంటే నత్తలే చాలా నయమని నిరూపిస్తున్నారు. తూతూ మంత్రంగా యాక్షన్ ప్లాన్ ప్రతి వేసవి చివర్లో వర్షాలు రావడానికి చాలా ముందుగా పూర్తి చేయాల్సిన యాక్షన్ ప్లాన్ అమలు తూతూ మంత్రంగా సాగుతోంది. పట్టణంలో రద్దీగా ఉండే ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలలో దుకాణ దారులు డ్రైనేజీలను కూడా ఆక్రమించారు. డ్రైన్లపై పక్కాగా స్లాబ్లు కూడా వేసుకొని తమ షాపుల ముందు పార్కింగ్ కోసం, ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో కాల్వల్లో పూడిక తీయడం చాలా కష్టమవుతుంది. ఈ విషయంలో అధికారులు చూసి చూడనట్లుగా వెళ్లిపోతున్నారు. పట్టణ శివారులోని చాలా కాలనీల్లో ఖాళీ స్థలాలు తగిన డ్రైనేజీ సదుపాయం లేక ఇప్పటికే చెరువుల్లా మారాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరీ దుర్బరంగా మారనుంది. డ్రైన్లు బాగుండకపోవడంతోనే చాలా చోట్ల పారిశుధ్యం కూడా అధ్వాన్నంగా మారుతోంది. అధికారుల తీరుపట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానొస్తే మురుగొస్తుంది వేసవిలోనే వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు ఉపశమనం. అందరూ సంతోషపడాల్సిన విషయం. కానీ పట్టణంలో కొన్ని ప్రాంతాల ప్రజలకు మాత్రం వర్షాకాలం వస్తోందంటేనే భయం మొదలవుతుంది. అవన్నీ లోతట్టు ప్రాంతాలు కావడంతో వానొస్తే నీరు నిలిచిపోతుంది. మురికి నీరు డ్రెయిన్లలోంచి పొంగి ప్రవహిస్తోంది. కుంట వీధి, నల్లకుంట, జివిలివీధి, హౌసింగ్బోర్డు కాలనీలోని కొంతభాగం, సుంకులమ్మమెట్టు, తదితర కాలనీలు జలమయమవుతూ ఉంటాయి. పట్టణంలోని తుల్జారాం గుడి, కూరగాయల మార్కెట్, రథశాల పరిసర ప్రాంతాలు అధ్వాన్నంగా మారుతాయి. ఈ విషయాలన్ని పాలకవర్గానికి, అధికారులకు తెలిసినా.. ముందస్తు జాగ్రతలు చేపట్టడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ కాలనీలలో డ్రైనేజీ వ్యవస్త అస్తవ్యస్థంగా ఉంది. ఇప్పటికై నా అధికారులు ముందస్తుతో సమగ్రమైన ప్రణాళిక రూపొందించుకొని డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దాలని ప్రజలు ఆశిస్తున్నారు. -
ఎదిర: బ్యాటరీ పరిశ్రమ వద్దే వద్దు..
మహబూబ్నగర్ శివారులోని దివిటిపల్లి వద్ద గత ప్రభుత్వం ఐటీ కారిడార్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు దివిటిపల్లి, ఎదిర, అంబటిపల్లి, సిద్దాయిపల్లి గ్రామాల్లోని రైతుల నుంచి దాదాపు 380 ఎకరాల భూసేకరణ చేపట్టింది. ఇందులో అత్యధికంగా ఎదిర గ్రామ రైతులే ఉన్నారు. ఐటీ పరిశ్రమలు వస్తే తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని భావించిన రైతులు తమ భూములు అప్పగించారు. తీరా పాలకులు అమరరాజ బ్యాటరీ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టారు. ఆ పరిశ్రమకు దాదాపు 260 ఎకరాల స్థలం కేటాయించారు. ప్రజాభిప్రాయ సేకరణ సైతం జరగగా.. ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. ఆ తర్వాత క్రమంలో సదరు కంపెనీ భవన నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ క్రమంలో ఎదిర గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. కాలుష్యం వెదజల్లే ఈ పరిశ్రమతో తమ పంట పొలాలు నాశనం అవుతాయని, అనారోగ్యం బారిన పడతామంటూ సుమారు 70 రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టారు. ‘అధికార’ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఇటీవల పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన వారు.. ఈ పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని.. లేకుంటే భవిష్యత్లో జరిగే ఏ ఎన్నికల్లోనూ ఓటు వేసేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో ఉన్న వారు వరుస ఆందోళనలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
చర్యలకు రంగం సిద్ధం
జిల్లా ఆస్పత్రిలో కీలక హోదాలో ఉన్న వైద్యుడి ఇష్టారాజ్యం వైద్యం అందక రోగుల ఆందోళన ఆస్పత్రిలో పర్యవేక్షించే అధికారే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండడంతో మిగతా సిబ్బంది సైతం అదే బాటపట్టారు. ఇదే నెలలో కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణికి సరైన వైద్యం అందక శిశువు మృతిచెందడం, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటనతో మరోసారి ఆస్పత్రిలో వైద్యుల తీరు చర్చనీయాంశమైంది. అదేవిధంగా, ఈనెల 9న గద్వాలకు చెందిన సుందర్రాజు షుగర్ పరీక్షలు చేయించుకోవటానికి జిల్లా ఆస్పత్రికి వెళ్లగా రక్త నమూనాలు తీసుకుని షుగర్ ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు. అనుమానంతో 20వ తేదీన మరోసారి ప్రైవేటు ల్యాబ్లో పరీక్ష చేయించుకోగా షుగర్ లేదని తేలింది. దీంతో సుందర్రాజు ఊపిరి పీల్చుకున్నట్లు ‘సాక్షి’తో చెప్పుకొచ్చారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటేనే భయమేస్తుందని.. ఇది తన ఒక్కరి పరిస్థితి కాదని, గతంలో ఇలా ఎంతమందికి జరిగిందోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. గద్వాల రూరల్: జిల్లా ఆస్పత్రిలో కీలక హోదాలో పనిచేస్తున్న ఓ వైద్యుడి తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇష్టానుసారంగా విధులకు హాజరవడం.. రోగులకు అందించే వైద్యం విషయంలో ఏదైనా తేడా జరిగితే సింపుల్గా సెలవుపెట్టి జంప్ అయిపోవడం ఆయన నైజంగా మారింది. సదరు వైద్యుడి నిర్వాకంపై ‘సాక్షి’ ఈనెల 21, 22 తేదీల్లో వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనాలపై కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తనిఖీకి రానుండడంతో ఎక్కడ తన లోపాలు వెలుగు చూస్తాయనే భయంతో మరోసారి సెలవు పెట్టి వెళ్లాడు. పదేపదే దీర్ఘకాలిక సెలవులు పెట్టి వెళ్లడంపై కలెక్టర్ తీవ్రంగా పరిగణించి చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆది నుంచి అదే ధోరణి సదరు వైద్యుడు గద్వాలకు 15ఏళ్ల క్రితం వచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన విధుల నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తను సొంతంగా నడుపుతున్న ప్రైవేటు ఆసుపత్రిలో తను చదివిన చదువు (జనరల్ సర్జరీ)కు భిన్నంగా డెలివరీ కేసులకు సంబంధించి ఆపరేషన్లు చేసి కొన్ని ఫెయిలై పేషంట్లు మృత్యువాతకు గురైన ఘటనలు అనేకం. వీటి నుంచి తప్పించుకునేందుకు బాధిత కుటుంబాలకు డబ్బుతో వెలకట్టి తప్పించుకున్న ఘటనలు కోకొల్ల్లలు. అదేవిధంగా గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ చేయాల్సిన తన స్థానంలో ఏకంగా తన సొంత ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే ఓ వైద్యుడితో డ్యూటీ చేయిస్తూ దొరికిపోయాడంటే సదరు వైద్యుడికి సామాన్య ప్రజల ప్రాణాలంటే ఎంత లెక్కలేని తనమో స్పష్టమవుతుంది. ఆస్పత్రికి వచ్చేది.. వెళ్లేది అంతా ఆయన ఇష్టమే తాజాగా శిశుమరణాలు.. పలు ఆరోపణలతో దీర్ఘకాలిక సెలవు చెప్పా పెట్టకుండా సెలవుపై వెళ్లడంతో కలెక్టర్ ఆగ్రహం వైద్య ఆరోగ్య కమిషనర్తో చర్చించి చర్య తీసుకునే అవకాశం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఇతర వైద్యులకు త్వరలో నోటీసులు ప్రక్షాళన చేస్తాం.. జిల్లా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు.. తాజా ఘటనల నేపథ్యంలో వైద్యుల రోజువారి హాజరు పట్టిక రిపోర్టును తెప్పించుకున్నా. కొంతమంది విధులకు సమయపాలన లేకుండా హాజరవుతున్నట్లు గుర్తించాను. వీరికి హెచ్చరికతో కూడిన నోటీసులు జారీచేస్తాను. సదరు పర్యవేక్షణ వైద్యుడు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో కూడా పలుమార్లు సెలవులపై వెళ్లినట్లు తెలిసింది. వీటన్నింటిపై రిపోర్టు తీసుకొని వైద్యారోగ్యశాఖ కమిషనర్తో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటాం. జిల్లా ఆస్పత్రిని ప్రక్షాళన చేస్తాం. విధుల్లో ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు. – బీఎం సంతోష్, కలెక్టర్ -
జిల్లా ఆస్పత్రే అడ్డాగా..
ఇదిలా ఉండగా, 2021లో జూన్లో జిల్లా ఆసుపత్రి పర్యవేక్షణ బాధ్యతలు ఈ వైద్యుడు చేపట్టగా.. నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిని అడ్డాగా చేసుకుని మరింత అరాచకానికి తెరలేపాడు. రోగులకు వైద్యం అందించాల్సింది పోయి అందుకు భిన్నంగా డ్యాన్సులు, విచిత్ర వేషధారణలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. పైగా ఆస్పత్రి పర్యవేక్షణ బాధ్యతలు గాలికొదిలేసి 2022లో 92రోజులు, ఈ ఏడాది జనవరి–మార్చి వరకు 60రోజులు సెలవులు తీసుకోగా, తాజాగా మరోసారి నెలరోజులపాటు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లాడు. దీంతోపాటు ఏ చిన్న వైద్య పరీక్షలు అయినా ప్రైవేటు ల్యాబ్లకు పంపడంపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి
శాంతినగర్: ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ అపూర్వచౌహాన్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా వడ్డేపల్లి మండల పరిధిలోని వెంకట్రామగనర్ ప్రాథమిక పాఠశాలలో రూ.4 లక్షలతో, జిల్లెడుదిన్నె పాఠశాలలో రూ.5 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులను వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఆయా పాఠశాలల్లో చేపడుతున్న డోర్లు, కిటికీలు, పైకప్పు లీకేజీల పనులు, కరెంట్, తాగునీరు, సంపులు, మరుగుదొడ్ల పనులు ఎంతవరకు పూర్తిచేశారో అనే విషయాలను ఏఈ రాజు, ఎంఈఓ నరసింహలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ రమేష్కుమార్, ఎంపీఓ తిరుపతన్న, ప్రధానోపాధ్యాయులు విరూపాక్షి ఉన్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement