-
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
కరీంనగర్: జిల్లా కేంద్రంలోని కుమార్వాడీ ప్రభుత్వ పాఠశాలలో 1975–76 విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుకున్నవారు ఆదివారం ఒక్కచోట చేరారు. నగరంలోని కాపువాడలో గల ఓ ఫంక్షన్హాల్లో కార్యక్రమానికి వేదికై ంది. వివిధ రంగాల్లో స్థిరపడిన 20 మంది వచ్చారు. 48 ఏళ్ల తర్వాత తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని, కుటుంబ క్షేమ సమాచారం తెలుసుకున్నారు. తరగతి గదిలో చేసిన అల్లరిని గుర్తు చేసుకొని, నవ్వుకున్నారు. అందరూ కలిసి భోజనం చేసి, ఫొటోలు తీసుకున్నారు. కార్యక్రమంలో మాదాసు శ్రీనివాస్, నాగరాజు, శంకర్, శ్రవణ్, వెంకటాచారి, రవీంద్రబాబు, దాశరథి, విద్యాసాగర్, కనకయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి: కొత్తపల్లి(హెచ్) జెడ్పీ ఉన్నత పాఠశాల(బాలురు)లో 1998–99 బ్యాచ్ పదోతరగతి విద్యార్థులు ఆదివారం ఓ గార్డెన్స్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్నారు. సుమారు 60 మంది హాజరయ్యారు. 25 ఏళ్ల తర్వాత తమ చిన్ననాటి మిత్రులను కలవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాల రోజుల్లో చేసిన అల్లరిని గుర్తు చేసుకొని, నవ్వుకున్నారు. తమకు పాఠాలు బోధించిన గురువులు ప్రేమ్కుమార్, కిషన్రావు, లక్ష్మణ్, స్వామి రెడ్డి, పీఈటీ మల్లారెడ్డిలను సన్మానించారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు. ఆటపాటలతో సందడిగా గడిపారు. -
ధాన్యం కొనుగోలు చేయకుంటే ఆందోళనలు
కొత్తపల్లి: కొనుగోలు కేంద్రాల్లోని వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని వైస్ ఎంపీపీ భూక్య తిరుపతినాయక్ హెచ్చరించారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్కు వారి ఉసురు తగిలి, గద్దె దిగడం ఖాయమన్నారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ అన్నదాతలను అరగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని సకాలంలో కొనకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల వారు రోడ్డున పరిస్థితి ఏర్పడిందన్నారు. సన్న, దొడ్డు అనే తేడా లేకుండా వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నాయకులు సయ్యద్ చాంద్ పాషా, సతీశ్, లచ్చిరెడ్డి, శంకర్, మల్లేశం, సాగర్, సలీం, రవీందర్ రెడ్డి, మారుతి, శశిధర్, లక్ష్మణ్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
పరిధి దాటితే బిల్లు
● వేసవిలో పెరిగిన విద్యుత్ వినియోగం ● 200 యూనిట్లు మించడంతో బిల్లు ● ‘గృహజ్యోతి’కి తగ్గిన లబ్ధిదారులుకరీంనగర్రూరల్: వేసవిలో ఎండల తీవ్రత కారణంగా విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. అత్యవసర పనులకు తప్పా ప్రజలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఎండ తీవ్రతకు విద్యుత్ వాడకం రెట్టింపు కావడంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తూ జీరో బిల్లు అందిస్తోంది. రెండు నెలలుగా ఉష్ణోగ్రతలు 44–45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను నిరంతరాయంగా ఉపయోగించారు. గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరగడంతో జీరో బిల్లు కోల్పోవాల్సి వస్తోంది. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్లో 200 యూనిట్ల పరిధి దాటడంతో పలువురు లబ్ధిదారులకు బిల్లులు వచ్చాయి. ఒకవేళ మరుసటి నెలలో మళ్లీ 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకుంటే జీరో బిల్లు వస్తోంది. లబ్ధిదారులు తగ్గిపోయారు.. కరీంనగర్రూరల్ డివిజన్ పరిధిలో మొత్తం 53,571 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గృహజ్యోతి పథకంలో 19,231 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారు. మార్చిలో 18,445 విద్యుత్ కనెక్షన్లు ఉండగా మే నెలలో 16,227 కనెక్షన్లకు తగ్గినప్పటికీ సబ్సిడీ సొమ్ము పెరిగింది. గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరగడంతో సబ్సిడీ సొమ్ము ఎక్కువైంది. వరికోతలు పూర్తవడంతో వ్యవసాయానికి విద్యుత్ వినియోగం తగ్గిపోవడంతో ఏప్రిల్, మే నెలల్లో గృహ అవసరాలకు పెరిగిపోయింది. ఇళ్లల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరంతరంగా నడుస్తుండటంతో పలువురు లబ్ధిదారులు జీరో బిల్లు పొందలేకపోయారు. పొదుపుగా వినియోగిస్తే జీరో బిల్లు గృహ అవసరాలకు పొదుపుగా విద్యుత్ వినియోగిస్తే జీరో బిల్లు వస్తుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఉపయోగించాలి. నిరంతరం వాడితే విద్యుత్తు వినియోగం పెరుగుతుంది. ఏప్రిల్లో 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడకంతో బిల్లు వచ్చిన లబ్ధిదారులకు మరుసటి నెలలో తక్కువగా వాడుకుంటే జీరో బిల్లు పొందే అవకాశముంది. – కె.రాజు, ఏడీఈ, కరీంనగర్రూరల్కరీంనగర్ మండలంలో గృహజ్యోతి లబ్ధిదారుల వివరాలు మొత్తం గృహ విద్యుత్ కనెక్షన్లు 53,571 గృహజ్యోతి పథకానికి అర్హులు 19,231 మంది మార్చిలో కనెక్షన్లు 18,445 సబ్సిడీ రూ.66,29,249 ఏప్రిల్లో.. 17,279, సబ్సిడీ రూ.75,40,791 మే నెలలో.. 16,227, సబ్సిడీ రూ.77,03,964 -
రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలి
కొత్తపల్లి: రైతులకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, కౌన్సిలర్ వాసాల రమేశ్ డిమాండ్ చేశారు. కొత్తపల్లి(హవేలి)లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్దయిందని, తరుగు, తాలు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. రూ.500 బోనస్, రైతు కూలీలకు రూ.12 వేలు, రూ.2 లక్షల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభమవుతున్నందున రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తూ కొత్తపల్లిలో 10 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. ప్రభుత్వం హామీలన్నీ నెరవేర్చే వరకు రైతులకు బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. నాయకులు కెంచ శేఖర్, ప్రదీప్, హరిప్రసాద్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, నర్సయ్య, శ్రీనివాస్, పోచమల్లు, సేనారెడ్డి, రాజు, శ్రీనివాస్, కిశోర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మోహినీ ఏకాదశి ఉత్సవాలు
కరీంనగర్కల్చరల్: తిరుమల నగర్లోని మయూరగిరి పీఠం శ్రీ నిలయంలో మోహినీ ఏకాదశి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జ్యోతిష్య, వాస్తు, ఆగమ శాస్త్ర పండితుడు నమిలకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం లక్ష్మీనారాయణ స్వామికి ఫల పంచామృత అభిషేకం, అష్టోత్తర ఆరాధన, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, అష్టాక్షరి మూలమంత్ర సహిత లక్ష్మీనారాయణ హోమం జరిపించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఏకాదశి నాడు నారాయణమూర్తిని ఆరాధించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, మనశ్శాంతి కలుగుతుందని, ఆరోగ్యం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో రామకృష్టమాచార్యులు, వివేక్ స్వామి, రమేశ్ స్వామి, శ్రీరామ సేవా తరంగిణి ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ‘మెడికవర్’ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం కరీంనగర్టౌన్: కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం తీగలగుట్టపల్లి బృందావన్ కాలనీలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ డాక్టర్ గుర్రం కిరణ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెడికవర్ ఆస్పత్రి సామాజిక బాధ్యతగా వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పిస్తోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిజీషియన్ డాక్టర్ కార్తీక్, డీఎంవో డాక్టర్ కిశోర్ 80 మంది స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండెకు సంబంధించి ఈసీజీ, 2డీ–ఇకో పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది చంద్రశేఖర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్య తీసుకోండి కరీంనగర్: నిబంధనలు పాటించని, గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్య తీసుకోవాలని ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పేరెంట్స్, స్టూడెంట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బత్తిని సత్యనారాయణగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్లోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవాభావంతో వెలసిన విద్యాలయాలు నేడు వ్యాపార ధోరణితో ప్రజలను ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయని ఆరోపించారు. మేధావులు మౌనం వహించడం వల్లే సమాజంలో దోపిడీ జరుగుతోందని, అధికా రుల అండదండలతో విద్యాలయాలు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయని పేర్కొన్నారు. ఏటా ఫీజులు పెంచుతూ, బుక్స్, స్కూ ల్ డ్రెస్లు అందిస్తూ విద్యాసంస్థలు వ్యాపారం చేస్తున్నాయని మండిపడ్డారు. సంఘం అధ్యక్షురాలు లత, నగర అధ్యక్షుడు ఓంప్రసాద్, మహిళా కన్వీనర్ సరోజన, ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోజ్కుమార్, కోశాధికారి సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి సృజన్, కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్, సభ్యులు పాల్గొన్నారు. -
‘పుచ్చలపల్లి’ స్ఫూర్తితో ఉద్యమిస్తాం
కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. పేదల పక్షపాతి, కార్మిక, కర్షక ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య అన్నారు. పిల్లలు పుడితే స్వార్థం ఏర్పడుతుందని వద్దనుకున్నారని, సమాజం కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడని కొనియాడారు. పేరు చివరన రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని, కుల, మతాలకతీతంగా సమసమాజ స్థాపనకు కృషి చేశారని తెలిపారు. కిరాణ కొట్టు పెట్టి, లాభం లేకుండా పేద ప్రజలకు సరుకులు అందించారని, పార్లమెంటుకు సైతం సైకిల్ మీద వెళ్లి. తన నిరాడంబరతను చాటుకున్నారని పేర్కొన్నారు. కూలీ సంఘాలను ఏర్పాటు చేసి, కనీస వేతనాలు, పంటలకు గిట్టుబాటు ధర కోసం కొట్లాడారని, తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది పేదలను ఏకం చేసి, పోరాడారన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, జి.భీమాసాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేశ్, జి.రాజేశం, నరేశ్, నాయకులు తిప్పారపు సురేశ్, జి.తిరుపతి, కోనేటి నాగమణి, గజ్జల శ్రీకాంత్, పుల్లెల మల్లయ్య, గాజుల కనకరాజ్, ఓబులేశ్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి -
మల్లికార్జునస్వామి ఉత్సవాలు ప్రారంభం
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలంలోని గోపాల్పూర్లో ఆదివారం శ్రీ జీల్గుల మల్లికార్జున స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గ్రామస్తులు ఎడ్ల బండ్లపై ఊరేగింపుగా ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడినుంచి డప్పుచప్పుళ్ల మధ్య పుట్ట బంగారం తీసుకొచ్చారు. రాత్రి ఒగ్గు పూజారులు పెద్ద పట్నం వేసి, మల్లికార్జునస్వామితో కేతమ్మ, మేడలమ్మలకు కల్యాణం జరిపించారు. కాగా, అంతకుముందు మాజీ ఉపసర్పంచ్ ఆరె శ్రీకాంత్ దంపతులు స్వామివారితోపాటు అమ్మవార్లకు వెండి కిరీటాలు, కోరమీసాలు, పట్టువస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
వైభవోపేతం.. శ్రీవారి కల్యాణ ం
కొత్తపల్లి: బద్ధిపల్లి శ్రీ అలివేలు మంగ, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం ఉదయం వైకుంఠ పార్షద హోమం, బలిహరణం, తీర్థప్రసాద వితరణ, వసంతోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం వేద పండితుడు విష్ణువర్దనాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి, రాచమల్ల నితిన్రెడ్డి, గోలి రాజు, ప్రధాన అర్చకుడు మారుతీస్వామి, సుడా చైర్మన్ కె.నరేందర్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. శర్మ బృందం ఆలపించిన వేంకటేశ్వర స్వామి సంకీర్తనలు అలరించాయి. భక్తులకు రాచమల్ల శ్రీనివాస్ రెడ్డి దంపతులు అన్నదానం చేపట్టారు. -
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
కరీంనగర్: ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ) జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 23న కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 9.30 గంటలకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముస్కు తిరుపతిరెడ్డి, మర్రి జైపాల్రెడ్డిలు తెలిపారు. ఆదివారం సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ.. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన 84మంది ప్రధానోపాధ్యాయులకు శాలువా, మెమొంటోలు, 10జీపీఏ సాధించిన 80 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్ ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథిలుగా రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు భట్టాపురం మోహన్రెడ్డి, పూల రవీందర్ హాజరవుతున్నారని తెలిపారు. ప్రతీఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముగిసిన క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు కరీంనగర్కల్చరల్: సీయస్ఐ సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లోని సెయింట్మార్క్ చర్చ్ గ్రౌండ్లో జరుగుతున్న క్రెస్తవ ఉజ్జీవ మహాసభలు ఆదివారంతో ముగిశాయి. బిషప్ రూబెన్ మార్క్, జెన్నీ క్రిస్టోఫర్ వాక్య పరిచయం అందించారు. ప్రతీఒక్కరు శాంతి సామరస్యంతో ఉండాలని సూచించారు. మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిసిల్ల పరిమళ, పాల్ కొమ్మాలు, ఎస్.జాన్, ఆర్.ప్రసాద్,బి.ప్రసాద్, ఏ.మధుమోహన్, డీకన్ పింటు, డీకన్ రోజీ, రెనాల్డ్, పాస్టర్ తిమోతి, పాస్టర్ క్రిస్టోఫర్ పాల్గొన్నారు. పేదలకు అండగా లయన్స్క్లబ్ ● ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు కరీంనగర్టౌన్: నిరుపేదలకు అన్ని విధాలుగా ఆపన్నహస్తం అందిస్తున్న లయన్స్క్లబ్ సేవలు విలువకట్టలేనివని క్లబ్ అంతర్జాతీయ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు అన్నారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మల్టిపుల్ కన్వెన్షన్ సమావేశాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ లయనిజమ్ ద్వారా సేవల విస్తరణకు నూతన సభ్యుల ఆహ్వానం, మండల స్థాయి, పట్టణాల్లో కొత్త క్లబ్లు ఏర్పాటు చేయడం, విపత్తుల చట్రంలో నలుగుతున్న ప్రపంచ మానవాళిని ఆదుకోవడానికి ఫౌండేషన్కు నిధులు అందజేయడంలో మన క్లబ్బులు చొరవ తీసుకోవడం సంతోషదాయకమన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛంద సేవాసంస్థగా గత 107ఏళ్లుగా సేవలందించడం హర్షణీయమన్నారు. మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ తీగల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్యాట్ ఏరియా లీడర్ రుమా ళ్ల సునీల్కుమార్, హనుమాండ్ల రాజి రెడ్డి, మినేశ్ నారాయణ్ టాండన్, ఎన్వీ.రావు, ఎస్ కోదండరాం, ఎం భద్రేశం, దీపక్ బట్టాచారి, నరేందర్ రెడ్డి, మోహన్, విద్యాసాగర్ రెడ్డి, డాక్టర్ గుర్రం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం జమ్మికుంట: ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఈనెల 30లోపు గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఫైన్ఆర్ట్స్, ఆర్ముడ్ ఫోర్సెస్ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ ఆదివారం తెలిపారు. మహిళల ఫైన్ఆర్ట్స్ అకాడమీ(సిరిసిల్ల)లో బీఏ ఆనర్స్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ డిజిటల్ ఇమేజింగ్ డీగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, గిరిజన గురుకుల ఆర్మ్డ్ ఫోర్సెస్ అకాడమీ (పురుషులు) వరగంల్లో బీఎస్సీ(ఎంపీసీ), బీఏ(హెచ్ఈసీ)కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
కరీంనగర్:టెట్ పరీక్ష కేటాయింపులో రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బ ందులకు గురవుతున్నారని, పరీక్ష కేంద్రాలు దూర ప్రాంతాల్లో కేటాయించడం సరికాదని, సొంత జిల్లాల్లో కేటాయించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేశ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసే సందర్భంలో సొంత జిల్లాలో సెంటర్లో కేటాయింపు కోసం ఆప్షన్లు ఇచ్చి, ఆన్లైన్ పరీక్ష పేరుతో హైదరాబాద్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వం గతం కన్నా పరీక్ష ఫీజును రూ.400 నుంచి రూ. 1000కి పెంచి, పరీక్ష కేంద్రాలు దూరప్రాంతాల కేటాయించడంతో అభ్యర్థులు వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి పరీక్ష రాయాలంటే తీవ్ర ఒత్తిడి పడుతుందని అన్నారు. అభ్యర్థులకు సొంత జిల్లాలో పరీక్ష కేంద్రాలు కేటాయించాలని కోరారు. -
జీపీ కార్మికులకు వేతనాలేవి?
కరీంనగర్ రూరల్: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికులకు నాలుగు నెలల నుంచి వేతనాలు రావడం లేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో 103 మంది కార్మికులున్నారు. బొమ్మకల్లో అవుట్సోర్సింగ్ విధానంలో 38 మంది పని చేస్తున్నారు. వీరితో ప్రతీరోజు గ్రామాల్లో ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించడం, మురికి కాలువలను శుభ్రం చేయడం, ప్రధాన వీధులు, రహదారుల్లో చెత్తాచెదారం తొలగించడం తదితర పనులు చేయిస్తూ నెలకు రూ.9,500 చెల్లిస్తున్నారు. అయితే, గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. బొమ్మకల్, నగునూరు, దుర్శేడ్, గోపాల్పూర్, చామనపల్లి గ్రామ పంచాయతీల్లో గత నెల వరకు చెల్లించారు. మిగతా గ్రామాల్లో రూ.6 లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి. 6 నెలలుగా మంజూరవడం లేదు పంచాయతీలకు సాధారణ నిధులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీఎఫ్సీ, ఎస్ఎఫ్సీ, పీఎంఎస్ నిధులు జనాభా ప్రాతిపదికన రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ప్రతినెలా మంజూరయ్యేవి. వీటితో గ్రామాల్లో పనులతోపాటు కార్మికులకు వేతనాలను చెల్లించారు. అయితే, గత 6 నెలలుగా మంజూరు కాకపోవడంతో పంచాయతీల్లో నిధుల కొరత ఏర్పడింది. కార్మికులకు ప్రతినెలా వేతనం చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ నిధుల్లేక ఇవ్వడం లేదని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. రూ.6 లక్షలు పెండింగ్ నాలుగు నెలలుగా రాక ఇబ్బందులు పంచాయతీల్లో నిధుల కొరత కరీంనగర్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పరిస్థితిబిల్లులు, కిస్తీలతో ఆర్థికభారం గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను మొదటి ప్రాధాన్యతగా కార్మికుల వేతనాలకు చెల్లిస్తున్నాం. విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ కిస్తీల చెల్లింపులతో పంచాయతీలపై ఆర్థికభారం పడుతోంది. చిన్న పంచాయతీల్లో నిధుల్లేక పోవడంతో కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. – సీహెచ్.జగన్మోహన్రెడ్డి, ఎంపీవో, కరీంనగర్రూరల్ మండలం అప్పులు చేయాల్సిన పరిస్థితి పంచాయతీ కార్మికులకు నాలు గు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. దీంతో వారు నానాతంటాలు పడుతున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. – కూర అంజిరెడ్డి, అధ్యక్షుడు, పంచాయతీ కార్మిక సంఘం -
అలకాపురికాలనీలో ఆక్రమణ
కరీంనగర్ కార్పొరేషన్: ఓ వైపు ఏళ్లక్రితం జరిగిన భూ ఆక్రమణలను కూడా ప్రస్తుతం పోలీసులు వెలికి తీస్తుంటే, మరోవైపు అవేవీ తమకు పట్టవన్నట్లుగా ఏకంగా రోడ్డు, డ్రైనేజీనే కబ్జాకు పెట్టారు కొంతమంది. నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని అలకాపురికాలనీలో ఏళ్లకాలంగా ఉన్న రోడ్డు, డ్రైనేజీని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్రోడ్లోని కోతిరాంపూర్ ఆగ్రా హోటల్ పక్కనుంచి వెళ్లే ఈ రోడ్డు అలకాపురికాలనీ గుండా వెళ్తుంది. కానీ ఈ రోడ్డును ఆనుకుని ప్లాట్స్ కొనుగోలు చేసిన కొంతమంది, ఇక్కడ రోడ్డే లేదంటూ మట్టితో చదును చేయడం వివాదాస్పదమైంది. ఈ స్థలాన్ని కూడా తమకు విక్రయించారంటూ స్థల యజమానులు కాలనీవాసులతో వాదిస్తున్నారు. రోడ్డుతో పాటు డ్రైనేజీ కూడా కనుమరుగు కానుండడంతో తమకు ఇబ్బందులు తప్పవని ఈ ప్రాంత వాసులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మానేరువాగుకు సమీపంలో ఈ కాలనీ ఉన్నందున, సీపేజీ వాటర్ (ఊటనీరు) ఈ రోడ్డు పక్కనున్న డ్రైనేజీ నుంచి వెళ్తోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఊటనీరు, డ్రైనేజీ నీళ్లతో ఈ ప్రాంతం ముంచెత్తుతుంది. డ్రైనేజీ ఉంటేనే ఈ పరిస్థితి ఉంటే, ప్రస్తుతం డ్రైనేజీని లేకుండా చేస్తుండడంతో తమ ఇళ్లు సీపేజీతో మునగడం ఖాయమని ఆ ప్రాంతవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన స్వల్పవర్షాలకే ఈ ప్రాంతం జలమయమైంది. అలాంటిది ఈ డ్రైనేజీని పూడ్చడంతో నీళ్లు ఎటూ వెళ్లలేక, ఇండ్ల నుంచి వచ్చే పైప్లైన్ల ద్వారా రివర్స్లో ఇండ్లల్లోకి వెళ్లే పరిస్థితి నెలకొననుంది. శ్రీగత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ డ్రైనేజీ ఉంది. పై నుంచి వస్తున్న సీపేజీ వాటర్ డ్రైనేజీ గుండా హైదరాబాద్ రోడ్లో ఉన్న పెద్ద మోరీకి కలుస్తాయి. ఇప్పుడు ఈ డ్రైనేజీని పూడ్చడం ద్వారా ఈ వర్షాకాలంలో మా ఇండ్లు మునుగుతాయి...కబ్జా చేసే వాళ్లతో మేం గొడవలు పెట్టుకోలేం...అధికారులే చర్యలు తీసుకోవాలిశ్రీ అంటూ కాలనీ వాసులు శ్రీసాక్షిశ్రీతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకొని, ఈ రోడ్డు, డ్రైనేజీని కబ్జా నుంచి కాపాడాలని కోరుతున్నారు. ● ఏళ్లుగా ఉన్న డ్రైనేజీకి అడ్డుకట్ట -
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
కరీంనగర్టౌన్: రాష్ట్ర ప్రభుత్వం 1977 గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, ప్రతి జిల్లాలో కనీసం 10ఎకరాల స్థలంలో గోశాలను ఏర్పాటు చేయాలని జిల్లా గోరక్ష ప్రముఖ్ విభాగ్ కార్యదర్శి ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి డిమాండ్ చేశా రు. ఆదివారం నగరంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోరక్ష విభాగ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రమ గో రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వం శాశ్వత పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, గో ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. ఈ నెల 25న కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల్, మంచిర్యాల, సిరిసిల్ల, కొమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల గోరక్ష ప్రముఖ్ విభాగ్ బైటక్ సమావేశం జిల్లాలో ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా గోరక్ష ప్రముఖ్ విభాగ్ అధ్యక్షుడు మధుసూదన్ రావు, కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, ధర్మ ప్రచార విభాగ్ విఠలాచారి, నగర అధ్యక్షుడు ఇనగంటి రమేశ్, జగదీశ్, బజరంగ్ దళ్ ప్రదీప్ కుమార్, కన్నం శంకర్, సాయి, శ్రీకాంత్ పాల్గొన్నారు. సెలవులో డిప్యూటీ సిటీ ప్లానర్ కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్ సుభాశ్ సెలవుపై వెళ్లారు. ఆనారోగ్యకారణాలరీత్యా దాదాపు నెల రోజుల పాటు సెలవు పెట్టినట్లు సమాచారం. దీనితో ఏసీపీ భానుచందర్కు డీసీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. -
తడిసిన ధాన్యం కొనాల్సిందే
కరీంనగర్టౌన్: అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, తాలు, తరుగు, తేమ పేరిట రైతాంగాన్ని వేధించొద్దని, ఖరీఫ్ రైతు భరోసా సాయం ఇప్పుడు ఇస్తే, యాసంగి రైతు భరోసా సహాయం ఎప్పుడిస్తారని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ ప్రశ్నించారు. ఆదివారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టించి పండించిన పంటను రైతు కండ్ల ముందే దోచుకుంటున్నారని, వడ్లను కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ నేడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని అన్నారు. మాటమీద ఉండని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. నాయకులు దుబాల శ్రీనివాస్, కన్నకృష్ణ, బండ రమణారెడ్డి, పవన్, సత్యనారాయణ, కటకం లోకేశ్, పర్వతం మల్లేశం, గుంజేటి శివ, రవి పాల్గొన్నారు. -
తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే
కరీంనగర్టౌన్: అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనాల్సిందేనని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి జాడి బాల్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. 20 రోజుల నుంచి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరిధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలతో తేమశాతం వచ్చినా మళ్లీ వర్షాలు పడడంతో తేమశాతం కోసం మళ్లీ మళ్లీ వడ్లను ఆరబోసే పరిస్థితి వచ్చిందన్నారు. వరి ధాన్యం తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తే రైతులకు నష్టం జరిగి ఉండేది కాదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టోపోతున్నారని, వరి ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జొన్నకూటి సుధాకర్, కొమ్మెర రవీందర్రెడ్డి, వొడ్నాల కోటేశ్వర్, గోదారి నరేశ్, చిగురు శ్రీకాంత్, సాగర్, రావుల భాస్కరచారి తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి కొత్తపల్లి: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపుమేరకు కొత్తపల్లి మండలంలో వరిధాన్యం కేంద్రాలను శనివారం బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ వడ్ల కొనుగోలు మీద లేదని మండిపడ్డారు. పంటకు బోనస్ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఎకరాకు రూ.14 వేల చొప్పున వెంటనే బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. మండల నాయకులు రతన్ కుమార్, అనిల్, రేణు, ప్రశాంత్, అనిల్, మహేశ్, ప్రతాప్, ఆనందచారి, మల్లారెడ్డి, శ్రీనివాస్, సదానందం, తిరుపతి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తపల్లిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కౌన్సిలర్ వాసాల రమేశ్, శేఖర్, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో తమ పిల్లలను చదివించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సీహెచ్.జనార్దన్రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుర్తింపు పొందని పాఠశాలలో చదివిస్తే ఏమైనా సమస్యలు తలెత్తితే జిల్లా విద్యాశాఖ నుంచి ఎలాంటి బాధ్యత వహించదని, ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి చర్యలు ఉండవని తెలిపారు. ‘డీఈఓను విధుల నుంచి తొలగించాలి’ సప్తగిరికాలనీ(కరీంనగర్): అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారిన జిల్లా విద్యాధికారి సీహెచ్.జనార్దన్రావుపై సమగ్ర విచారణ చేపట్టి విధుల నుంచి తొలగించాలని సీపీఐ (ఎంఎల్) పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ శనివారం ఒక ప్రకటనలో కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. కులాన్ని బట్టి రూల్స్, మనిషిని బట్టి పనిష్మెంట్, వారి సర్వీస్ వివరాలు గోప్యంగా ఉంచడం, బహిర్గతం చేయకుండా దీని వెనుక ఉన్న ఉన్నత విద్యాధికారులపై కూడా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై పర్యవేక్షణ చేయకుండా తొత్తుగా మారిన డీఈఓపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలపై తనకు ఇష్టం వచ్చినట్టు రూల్స్ పక్కనపెట్టి బదిలీలు చేయడం, పంపించడంపై కూడా విచారణ చేపట్టాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి సప్తగిరికాలనీ(కరీంనగర్): పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంవత్సరం చివరి దశకు వచ్చినా ఫీజు రీయింబర్స్మెంట్ అందలేదని, 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిల్లా బీసీ సంక్షేమ శాఖలోనే రూ.114కోట్ల బకాయిలు పేరుకు పోయాయని తెలిపారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కేసులు ఉపసంహరించండి సప్తగిరికాలనీ(కరీంనగర్): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యమకాలంలో అన్ని వర్గాల ప్రజలపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని కోరుతూ టీపీసీసీ సీనియర్ వైస్ చైర్మన్ వెన్న రాజమల్లయ్య శనివారం సీఎం రేవంత్రెడ్డికి సచివాలయం ద్వారా వినతిపత్రం అందజేశారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో ఫెలోషిప్స్ స్కీంను పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ విద్యార్థులకు మంజూరు చేయాలని అన్నారు. జూన్ 2న 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్బంగా కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు సోనియా గాంధీ పేరుతో ఫెలోషిఫ్స్ స్కీంను ప్రారంబించాలని కోరారు. -
వ్యానును ఢీకొన్న కారు
శంకరపట్నం: కేశవపట్నం శివారు స్పీడ్ బ్రేకర్ సమీపంలో శనివారం వ్యానును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న కరీంనగర్ పట్టణ ప్లానింగ్ అధికారి కిరణ్కుమార్, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా బయటపడ్డారు. కరీంనగర్ నుంచి సొంత గ్రామమైన వీణవంక మండలం కనపర్తి గ్రామానికి కిరణ్కుమార్ కుటుంబ సభ్యులతో కారులో బయలుదేరాడు. మార్గమధ్యలో కేశవపట్నం శివారులో స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెళ్తున్న వ్యాన్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. వెనక వస్తున్న కిరణ్ అప్రమత్తమై బ్రేకులు వేసినా కారు వ్యానును ఢీకొట్టి ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకుండా క్షేమంగా బయటపడ్డారు. -
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
సప్తగిరికాలనీ(కరీంనగర్): టీఎస్ ఎప్సెట్ 2024 ఫలితాల్లో కరీంనగర్లోని శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేసినట్లు విద్యాసంస్థల చైర్మన్ రమేశ్ రెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన అభిరామ్ 206 ర్యాంక్ సాధించగా ధనుష్కుమార్ 566, మణిదీప్ రెడ్డి 751 ర్యాంక్లను కై వసం చేసుకున్నారని అన్నారు. అదే విధంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో 22 మంది విద్యార్థులు 10 వేల లోపు ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. కళాశాల నుంచి 80 శాతం మంది విద్యార్థులు టీఎస్ ఎప్సెట్ 2024 లో క్వాలీఫై అయ్యాయరాన్నరు. ఈ సందర్బంగా శనివారం అత్యుత్తమ ర్యాంక్లు సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులను కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, రాధాకృష్ణ, మోహన్రావు, ఏజీయం శ్రీనివాస్తో పాటు అధ్యాపకులు తదితరులు అభినందించారు. -
వేసవిలో ‘చల్లని’ సేవ
కరీంనగర్ అర్బన్: విధుల నిర్వహణే కాదు సేవలోనూ తమకు తామే సాటని చాటుతున్నారీ ఉద్యోగులు. నిత్యం పని ఒత్తిడిలో విరామం లేకుండా ఉన్నా సేవాభావాన్ని చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వేసవి వచ్చిందంటే ఖరీదయ్యే నీటిని ఉచితంగా అందిస్తూ ఔదార్యాన్ని చాటుతున్నారు. నిండు వేసవిలో చల్లని నీరు అందజేస్తూ సామాన్య ప్రజలకు మేమున్నామని బాసటగా నిలుస్తున్నారు. నీరు కొనలేని నిస్సహాయులకు అండగా నిలుస్తున్నారు. పన్నెండేళ్లుగా చలివేంద్రం నగరంలో ఏటా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దప్పిక తీరుస్తున్నారు టీఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగులు. సదరు సంఘాల నేతలు 12 ఏళ్లుగా తాగునీరు అందిస్తున్నారు. పోలీస్ ఔట్పోస్టు విభాగం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం కలెక్టర్తో ప్రారంభించడం అనవాయితీగా సాగుతోంది. పరిశుభ్రమైన నీటిని తెప్పించి చలివేంద్ర ం కొనసాగేలా రోజూ పర్యవేక్షిస్తున్నారు. కార్యవర్గాలు మారుతున్నా సంఘ సేవాభావం మాత్రం ఆగడం లేదు. కేంద్రం నిర్వహణకు ఇద్దరు రోజు వారీ కూలీలను నియమించి నీటి సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చలివేంద్రంచల్లచల్లగా తెలంగాణ నాన్గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) ఆధ్వర్యంలో మజ్జిగ అందిస్తున్నారు. వడదెబ్బ మరణాలు సంభవిస్తుండటంతో దిగువ తరగతి వర్గాల ప్రాణాలను ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండో పట్టణ సమీపంలోని టీఎన్జీవో భవన్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. గతంలో ప్రజావాణికి వచ్చే బాధితులతో పాటు వివిధ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు మజ్జిగను అందించారు. కాగా ఈసారి ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం మజ్జిగను అందించాలని నిర్ణయించారు. తాగునీటితో పాటు మజ్జిగ అందించి మనసున్న సంఘంగా సేవలందిస్తున్నారు. ప్రజలకు ఏదో రకంగా ఉపయోగపడాలని.. కనీస అవసరమైన తాగునీరు కూడా వ్యాపారంగా మారడం ఆందోళనకర పరిణామం. గతంలో బాటసారులకు నీటిని ఉచితంగా అందించేవారు. ఇళ్ల ముందు నీటిని ఉంచేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. అందువల్ల వాహనదారులు, కార్యాలయాలకు వచ్చే ప్రజలకు చల్లని తాగునీటిని అందిస్తున్నం. – కోట రామస్వామి, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మానవ సేవే.. మాధవ సేవ మనిషి మనుగడకు తాగునీరే ప్రధాన వనరు. దాహమని అడిగితే ఒకప్పుడు సేవాభావంతో నీటిని ఇచ్చేవారు. క్రమేణా తాగునీరు వ్యాపారంగా మారింది. వేసవికాలంలో మరింత ఎక్కువగా సాగుతోంది. ఈనేపథ్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీరు అందిస్తున్నం. – గడ్డం సుధాకర్, కలెక్టరేట్ ఏవోప్రతి వేసవిలో నిర్వహిస్తాం ప్రతి వేసవిలో మా సంఘం చలివేంద్రాన్ని నిర్వహిస్తోంది. నగరంలోని కార్యాలయం వద్ద, కలెక్టరేట్లో సేవలు కొనసాగిస్తున్నం. మా సంఘం ఉన్నంత వరకు ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతాం.– దారం శ్రీనివాస్రెడ్డి, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడువందల మంది దాహార్తిని తీరుస్తూ.. కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి ఇతర పనులకు రోజూ వందల మంది ప్రజలు వస్తుంటారు. బయట దుకాణాల్లో నీటిని కొనుక్కుని తాగుతుండటం చూస్తూనే ఉన్నాం. కనీస తాగునీరు అందించాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. – పెద్ది విజయ్కుమార్, ట్రెసా జిల్లా నేత -
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
కరీంనగర్కల్చరల్: రేకుర్తిలోని కంటి ఆస్పత్రి సమీపంలో గల బుద్ధ విహార్లో ఈనెల 23న నిర్వహించే బుద్దుని 2568వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని బుద్ధ జయంతోత్సవ కమిటీ చైర్మన్ లక్షణబోధ ముల్కల, ప్రధాన కార్యదర్శి దుర్గం మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, మేధావులు, బౌద్ధ అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కుట్టు శిక్షణ ప్రారంభం శంకరపట్నం: మండల కేంద్రంలో శనివారం డీఆర్డీఓ, బీపీఎం రవీందర్ స్వశక్తి మహిళల కోసం శనివారం కుట్టుశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టేందుకు సరిపడా క్లాత్, సరుకులు అందించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కరీంనగర్క్రైం: మద్యానికి బానిసైన వ్యక్తి మద్యంలో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కాపువాడకు చెందిన మంద నరేశ్(38) హమాలీ పనిచేసుకుంటున్నాడు. 10 ఏళ్ల కిత్రం వివాహమై విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి నత్తి ఉన్న కారణంగా పెళ్లి సంబంధాలు రాలేదు. పెళ్లి కాలేదన్న మనోవేదనతో పాటు తన తల్లి ఆరోగ్యం బాగా ఉండడం లేదని బాధపడుతూ ఈనెల 4న మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగాడు. అతడి కళ్లు పసుపు పచ్చగా మారడంతో తన తండ్రి భూమయ్య అడుగగా మద్యంలో పురుగుల మందు కలిపి తాగానని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం కోసం వివిధ ఆసుపత్రులు తిరిగి చివరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ విషయంపై మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం గోపాల్పూర్లో ఆదివారం నుంచి శ్రీ జీల్గుల మల్లికార్జునస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సాయిని మధు, కార్యదర్శి గోనె ఎల్లారెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు గ్రామస్తులు ఎడ్లబండ్లతో ఆల యం వద్దకు ఊరేగింపుగా తరలివెళ్తారని వివరించారు. ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో రాత్రి పుట్టబంగారం తీసుకొచ్చి పట్నం వేసి మల్లిఖార్జునస్వామి కల్యాణం నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం నాగవెల్లి పట్నం వేసిన అనంతరం మహిళలు బోనా లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించడంతో ఉత్సవాలు ముగుస్తాయని అన్నారు. -
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి నగరంలోని అశోక్నగర్లో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో శనివారం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషే కం, వాసవి హోమం, అష్టోత్తర శత వాసవి పారా యణం, డోలోత్సవం జరిపారు. ఆలయం నుంచి ప్రకాశం గంజ్ వరకు రథయాత్ర జరిగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, సేవా కార్యక్రమ కన్వీనర్ తాటిపెల్లి సుభాష్, కార్యదర్శి నార్ల శ్రీనివాస్, తొడుపునూరి దశరథం, ఆలయ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్కల్చరల్కొత్తపల్లి మండలం బద్ధిపల్లిలో శ్రీ అలివేలు మంగ, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రాభోధికః, విష్వక్సేనవిధిః, వాసుదేవ పుణ్యాహవాచనవిధిః, అవకురారోహణం, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, శ్రీవ్యూహహోమం, సర్వదేవతా ఆహ్వానం, సర్వదైవికహోమం బలిహరణం, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు తిరుపతి, మాజీ సర్పంచ్ మంగళారపు కొమురయ్య, గ్రామస్తులు ఉప్పు రాజశేఖర్, ఉప్పు శ్రీనివాస్, కోడూరి పర్శరాంగౌడ్తో పాటు భక్తులు పాల్గొన్నారు. – కొత్తపల్లి -
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
కరీంనగర్కల్చరల్: రెండు రోజులుగా రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా కార్యదర్శి పైడిపల్లి రాజు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. మార్కెట్ యార్డు, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, పండ్ల తోటలు మామిడి, సపోటా, బొప్పాయి ఈదురుగాలులకు నేలమట్టమై తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి ప్రభుత్వానికి అంచనాలు అందించాలని కోరారు. సన్న రకం, దొడ్డు రకం అని తేడా లేకుండా రూ.500 బోనసును వెంటనే అందజేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికుడికి గాయం కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం బొమ్మకల్లో శనివారం విద్యుత్ తీగెలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలను తొలగిస్తుండగా పంచాయతీ కార్మికుడు ర్యాకం శంకర్ ప్రమాదవశాత్తు చెట్టుమీద నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..వీధిలైట్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలను శంకర్ కొడుతున్న క్రమంలో చెట్టుపై నుంచి జారి కిందపడ్డాడు. వెంటనే శంకర్ను చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. శంకర్కు ఎడమచేయి విరగడంతో వైద్యులు కట్టు కట్టారు. -
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
కరీంనగర్స్పోర్ట్స్: హాంకాంగ్లో ఈనెల 6 నుంచి 11 వరకు జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో పాల్గొన్న జిల్లాకు చెందిన తుడి సిరిచందన ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. 52 కేజీల విభాగంలో పోటీ అత్యధిక స్కోర్ సాధించి గోల్మెడల్ అందుకుంది. ఈ సందర్భంగా శనివారం సిరిచందనకు సహాకారం అందించిన కరీంనగర్లోని ద్వారకామయి మల్టీస్పెషలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వంశీకృష్ణరావు శాలువాతో ఘనంగా సన్మానించారు. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలని సూచించారు. కోచ్ మల్లేశ్, రాజమహేందర్, రాజేశ్, వినీత్ మోహన్, రాజేశ్రెడ్డి, శ్రావణ్, శ్రీకాంత్లు అభినందించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement