-
ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఆసిఫాబాద్: ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యాధికారి తుకారాం భట్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 40వ అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లు ప్రదర్శించారు. అనంతరం అంబేద్కర్చౌక్ వద్ద హెచ్ఐవీతో మృతి చెందిన వారికి సంతాపంగా కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజం కోసం ‘ప్రేమ సంఘీభావంతో గతం నే ర్పిన పాఠాలతో బంగారు భవిత నిర్మిద్దామని, హె చ్ఐవీ పరిధిని దాటి ఆరోగ్యవంతంగా జీవిద్దాం’ అని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2016 నుంచి మార్చి 2024 వరకు 1,46,339 మందికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా, 300 మందికి నిర్ధారణ జరిగిందని తెలిపారు. వీరిలో 154 మంది పురుషులు, 119 మంది సీ్త్రలు, ముగ్గురు ట్రాన్స్జెండర్లు, 24 మంది ఏఎన్సీ ఉన్నారని వెల్లడించారు. మందులు వాడుతున్న వారిలో 172 మంది ఆసరా పింఛన్ పొందుతున్నారని వివరించారు. హెచ్ఐవీ నివారణ చర్యలు పాటిస్తూ, నియంత్రణలో భాగస్వామ్యం కావా లన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్, సీఎస్వో రాజేశ్, డీఎండీవో సంతోష్, ఐసీటీసీ కౌన్సిలర్లు సతీశ్, హరీశ్, రవీందర్, ఎల్టీ రఫీ, రాజశేఖర్, చేతన స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సతీశ్, శ్రీసాయి మహిళా మండలి ప్రాజెక్టు మేనేజర్ సునీల్, సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్వో తుకారాం భట్ -
మొక్కలపై పట్టింపేది..?
రెబ్బెన: మండలంలోని రాజారాంలో ఏర్పాటు చేసిన ప్రకృతివనంలో నాటిన మొక్కల్లో సగానికి పైగా పశువుల పాలయ్యాయి. చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేసినా గేటు బిగించలేదు. పశువులు లోపలికి ప్రవేశించి మొక్కలు తినేశాయి. మిగిలిన మొక్కల సంరక్షణను సైతం అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాల్సి ఉండగా కళావిహీనంగా మారిపోయింది. తుంగెడ పంచాయతీ పరిధిలోని సన్యాసికుంట పల్లె ప్రకృతివనం పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రకృతివనం చుట్టూ ముళ్ల కంచె, ముందు భాగంలో పెద్ద గేటు సైతం ఏర్పాటు చేశారు. మొక్కలను కాపాడుకోవటంలో అధికారులు విఫలమయ్యారు. సక్రమంగా నీరందించకపోవడంతో మొక్కలన్నీ చనిపోయాయి. కొత్త మొక్కలు నాటాల్సి ఉన్నా అధికారుల పట్టింపులేని తనంతో రూ.లక్షల ప్రజాధనం వృథాగా మారింది. తుంగెడ పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కలు కొన్ని నెలల క్రితం అగ్నికి అహూతి అయ్యాయి. ఇందిరానగర్, కొండపల్లి, రాంపూర్, వంకులం, కై రిగాం, లక్ష్మిపూర్, రెబ్బెన పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచే రీతిలో ఉన్నాయి. -
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్రూరల్: ఉన్నత విద్యావకాశాలను ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీ తెగలకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జి ల్లా కేంద్రంలోని పీటీజీ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్ అన్నారు. 2023– 24 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులను ఆదివారం హయత్నగర్లోని పీవీటీజీ కళాశాలలో ఇంటర్ ప్రవేశాల కోసం పంపించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పీవీటీజీ గురుకుల కళాశాలలో 2024– 25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొలాం, మన్నె తెగలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్తో పాటు జేఈఈ, నీట్, ఎంసెట్కు ఉచితంగా కోచింగ్ ఇస్తారని పేర్కొన్నారు. విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇస్తున్న ప్రిన్సిపాల్ సురేశ్ -
న్యూస్రీల్
జేసీబీ డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం ఆసిఫాబాద్: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జేసీబీ డ్రైవింగ్పై మూడు నెలల ఉచిత శిక్షణ అందిస్తున్న ట్లు న్యాక్ సెంటర్ ఇన్చార్జి ద్యావంత్ రమేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం రూ.25 వేల వేతనంతో ఉద్యోగం లభిస్తుందని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉ చిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తామని తె లిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూ చించారు. పూర్తి వివరాలకు 98665 65156 నంబర్లో సంప్రదించాలని కోరారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు జైనూర్(ఆసిఫాబాద్): చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ సదయ్య హె చ్చరించారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దరఖాస్తులకు నేడే చివరి అవకాశం ఆసిఫాబాద్రూరల్: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు కాగజ్నగర్ ఏకలవ్య గురుకు ల పాఠశాల ప్రిన్సిపాల్ సాయి ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి న విద్యార్థులు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వి ద్యార్థులు పదో తరగతి మెమో, ఆధార్కార్డు, రెండు ఫొటోలతో కాగజ్నగర్ లేదా ఉట్నూర్లోని ఎంఆర్ఎస్ గురుకుల కళాశాలలో దరఖాస్తు అందించాలని పేర్కొన్నారు. అనంత రం ఈ నెల 24న ఉట్నూర్ కుమురంభీం కాంప్లెక్స్లో నిర్వహించే కౌన్సిలింగ్కు హాజరు కావాలని సూచించారు. -
పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళి
ఆసిఫాబాద్అర్బన్: దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట రథసారధి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఏరియా కమిటీ నాయకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డివిజన్ కన్వీనర్ దినకర్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి ఇంటి నుంచే పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. భూస్వాముల కుటుంబంలో జన్మించిన ఆయన సుందర్ రాంరెడ్డి పేరును సుందరయ్యగా మార్చుకుని యావత్ ఆస్తిని పేదలకు పంచిపెట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ సభ్యులు టీకానంద్, మాలశ్రీ, తిరుపతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పేరు మారేనా?
● సింగరేణిలో మారు పేర్లపై 3 వేల మంది విధులు ● అన్ఫిట్, రిటైర్డ్ అయ్యాక ఇబ్బందులు ● కన్న బిడ్డలను కూడా నిరూపించుకోలేని దుస్థితి ● ఎన్నికల హామీగా పేర్ల క్రమబద్ధీకరణశ్రీరాంపూర్: సింగరేణిలో మారు పేర్లతో పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లను క్రమబద్ధీకరించాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. దీనిని గుర్తించిన కార్మిక సంఘాలు ఎన్నికల వేళ హామీ ఇస్తున్నాయి. గెలిచాక పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికల అంశంగానే దీనిని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. దీంతో ఏళ్లు గడుస్తున్నా పేర్ల క్రమబద్ధీకరణకు మోక్షం కలగడం లేదు. సంస్థ వ్యాప్తంగా 3 వేల మంది..సింగరేణి వ్యాప్తంగా మారు పేర్లతో పనిచేసే ఉద్యోగులు సుమారు 3 వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. వీరే కాకుండా పనిచేసి ఇప్పటికే రిటైర్ అయిన వారు కూడా వేలల్లో ఉన్నారు. మెడికల్ బోర్డుకు వెళ్లి అన్ఫిట్ అయి మారు పేర్ల కారణంగా డిపెండెంట్ ఉద్యోగాలు రానివారు మరికొందరు ఉన్నారు. మారు పేర్ల సమస్యతో సంస్థలో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మారు పేర్లు ఎందుకు..సింగరేణి యాజమాన్యం 1986లో పరుగుపందెం పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నట్లు నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో గ్రామాల్లో నుంచి వేలాది మంది దరఖాస్తులు చేసుకోగా వారికి ఎంప్లాయ్మెంట్ కార్డులు జారీ అయ్యాయి. కార్డులు వచ్చిన వారిలో కొందరు పరుగుపందెంలో పాల్గొనడానికి ఇష్టపడలేదు. మరి కొందరికి వీలు కాలేదు. తప్పుడు అడ్రస్లో మరికొ న్ని రావడంతో వారి స్థానంలో ఇతరులు ఆ కార్డు పట్టుకుని వచ్చి పందెంలో పాల్గొని గెలిచారు. సింగరేణి కొలువు సాధించారు. కార్డులో ఏ పేరు ఉందో అదే పేరుతో ఉద్యోగంలో కొనసాగుతున్నారు. 1990 సమయంలో సింగరేణికి భూములిచ్చిన వారికి కూడా ఉద్యోగాలిచ్చారు. భూములు పోని వారు కూడా పోయిన వారి పేరుతో వచ్చి వారి స్థానంలో ఉద్యోగంలో చేరారు. 1998 వరకు కొందరు సింగరేణి ఉద్యోగాలను కొనుక్కున్నారు. ఇలా వివిధ కారణాలతో వారి గ్రామంలో ఉన్న సొంత పేర్లు కాకుండా మారు పేర్లతో పనిచేస్తున్నారు. ఆధార్ రాకతో తిప్పలు..గతంలో ఎలా ఉన్నా ఆధార్ కార్డు ప్రక్రియ మొదలై న తరువాత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంద రూ వారి గ్రామాల్లో భూములు ఇతర ఆస్తుల కో సం అసలు పేర్లుతో అధార్ కార్డులు తీసుకున్నారు. వారి పిల్లల చదువులు, అన్ని సర్టిఫికెట్లు కూడా కంపెనీలో ఉన్నట్లు కాకుండా స్వగ్రామంలో ఉన్నట్లు అసలు పేర్లతో కొనసాగిస్తున్నారు. ఇలా సింగరేణిలో ఒక పేరు, ఊళ్లలో ఒక పేరుతో కొనసాగుతున్నా రు. ఇక మారు పేర్లతో పనిచేసిన వారికి రిటైర్మెంట్ తరువాత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెన్షన్ రావాలంటే ఆధార్ కార్డు తప్పనిసరైంది. ఆధార్ కార్డులో ఒక పేరు, కంపెనీలో ఒక పేరు ఉండటంతో పెన్షన్ పొందలేకపోతున్నారు. ఇప్పటికే చాలా మంది పెన్షన్కు దూరంగా ఉన్నారు. మరో పక్క మెడికల్ అన్ఫిట్ అయితే వారిస్థానంలో డిపెండెంట్లకు ఉద్యోగం ఇవ్వడం సమస్యగా మారుతోంది. ఇలా చాలా మంది ఉద్యోగం పొందలేకపోయారు. ఎన్నికలప్పుడే హామీ...ఆరో విడత గుర్తింపు సంఘం ఎన్నికల ముందు కే సీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఇదొకటి ఉంది. గెలిచిన తరువాత మారు పేర్లతో పనిచేసే వారి పే ర్లు క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఎన్నికల్లో టీబీ జీకేఎస్ గెలిచింది. బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కానీ ఇది అమలు కాలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చా యి. టీబీజీకేఎస్ ఓడిపోయి ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా వచ్చింది. ఏఐటీయూసీ కూడా ఎన్నికల కు ముందు తాము గెలిస్తే ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ సంఘం నాయకులైనా దీ నిని పరిష్కరిస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. విజిలెన్సు కేసులు..పొరుగు వారితో గొడవ అయితే.. వారు కంపెనీకి ఫలానా ఉద్యోగి మారు పేర్లతో పని చేస్తున్నారంటూ ఫిర్యాదు ఇవ్వడంతో చాలా మంది విజిలెన్సు కేసులు ఎదుర్కొంటున్నారు. మారు పేర్లతో పనిచేసే వారు మెడికల్ ఇన్వాలిడేషన్ అయి వారి పిల్ల లకు కారుణ్య ఉద్యోగాలు పెట్టించే ప్రయత్నంలో పేర్లలో తేడా కనిపిస్తే విజిలెన్సు కేసులు నమోదు అవుతున్నాయి. ఇంటి పేరు, తండ్రి పేరు, అభ్యర్థి పేరులో ఏమాత్రం తేడా అనిపించినా అధికారులు విజిలెన్సుకు రాస్తున్నారు. దీంతో కొడుకును కూడా కొడుకుగా నిరూపించుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని మారు పేర్లతో పనిచేసే ఉద్యోగులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఇబ్బందులు..పేర్లు మార్చడానికి చాలా సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగి పేరును కంపెనీ ఏదైనా గెజిట్తో మారిస్తే వారి సీఎంపీఎఫ్లో పేర్లు మార్చడం చాలా కష్టం. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కంపెనీ తీసుకునే నిర్ణయం అంతా సులువుగా అమలు చేయడానికి సీఎంపీఎఫ్ శాఖ సిద్ధంగా ఉండదు. ఈ ఇబ్బందుల నడుమ మారు పేర్లతో పనిచేసే ఉద్యోగులు వారి భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే మారు పేర్లతో పనిచేసే వారు పేర్ల మార్పునకు యాజమాన్యం అనుమతి ఇచ్చినా తమకు తాము మారుపేర్లతో పనిచేస్తున్నామని చెప్పుకోరని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. యాజమాన్యంతో చర్చిస్తాం మారుపేర్లతో పనిచేసే వారి పేర్లను క్రమబద్ధీకరించాలి. చాలా మంది కార్మికులు దీనితో ఇబ్బందులు పడుతున్నారు. కారుణ్య ఉద్యోగాలు ఇప్పించుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్ అయ్యాక పెన్షన్ పొందలేకపోతున్నారు. దీనిపై యాజమాన్యంతో చర్చించి న్యాయం చేసేలా చూస్తాం. వి.సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు -
పేరుకే వనాలు..!
● గ్రామాల్లో ఆహ్లాదం పంచని పల్లె ప్రకృతి వనాలు ● అధిక ఉష్ణోగ్రతలతో ఎండిపోయిన మొక్కలు ● గ్రామ పంచాయతీలపై నిర్వహణ భారం ● పట్టించుకోని ప్రత్యేకాధికారులు!తిర్యాణి(ఆసిఫాబాద్): ప్రజలకు ఆహ్లాదం పంచాల్సిన ప్రకృతి వనాలు కళావిహీనంగా మారాయి. నిర్వహణ లేక చాలా చోట్ల మొక్కలు ఎండిపోయి పచ్చదనం కరువైంది. జిల్లాలో 334 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అనుబంధ గ్రామాల్లో పచ్చదనం పెంపునకు జిల్లా వ్యాప్తంగా 1056 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ప్రతి వనంలో దాదాపు 30వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. 2021 వరకు పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాధ్యతలు ఉపాధిహామీ సిబ్బంది చేపట్టేవారు. ప్రస్తుతం వాటి బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ప్రస్తుతం పంచాయతీల్లో మొక్కల సంరక్షణను పట్టించుకునే వారు కరువయ్యారు. ఊరికి దూరం.. నిర్వహణ భారంజిల్లాలోని 15 మండలాల్లో భిన్న పరిస్థితులు ఉన్నాయి. ఏజెన్సీ మండలాలైన తిర్యాణి, కెరమెరి, సిర్పూర్(యూ), జైనూర్, లింగాపూర్లో ఎక్కువగా గుట్టలు కనిపిస్తాయి. ఇక్కడ భూమి రాళ్లతో నిండి ఉంటుంది. ఆయా మండలాల్లో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా గ్రామాలకు దూరంగా గుట్టల వద్ద ప్రకృతి వనాలు నిర్మించారు. జిల్లాలోని పలు మండలాల్లో స్థలం దొరకకపోవడంతో మూడు, నాలుగు గ్రామాలకు కలిపి ఒకేచోట వనాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటి నిర్వహణ కూడా సక్రమంగా చేపట్టకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో పంచాయతీ నాలుగైదు పల్లె ప్రకృతి వనాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. చిన్న పంచాయతీలు, ఆదాయం తక్కువగా ఉన్న జీపీలకు ఇది భారంగా మారింది. పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహణ పల్లె ప్రకృతి వనాల నిర్వహణను సంబంధిత గ్రామ పంచాయతీల ద్వారా చేపడుతున్నాం. మొక్కలు ఎండిపోయిన చోట కొత్తవి నాటుతాం. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – భిక్షపతిగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి -
అధికారులు బాధ్యతతో పని చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పనుల అమలులో అధికారులు బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతి, ధరణిలో పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణిలో దరఖాస్తుల పరిష్కా రం, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ లబ్ధిదారులకు అందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. ధరణి పోర్టల్, ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. రైతులకు మద్దతు ధర అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రైసు మిల్లులకు సకాలంలో రవాణా చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. జిల్లాలో 685 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 37 కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని వివరించారు. రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి, వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీవో సురేశ్, డీఈవో అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
రెబ్బెన: మండలంలో 57 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా యూడైస్ నివేదిక ప్రకారం ప్ర భుత్వం 55 పాఠశాలలకు నిధులు మంజూ రు చేసింది. ఇప్పటివరకు కేవలం రాళ్లపేట, మాద్వాయిగూడ పాఠశాలల్లో మాత్రమే పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలిన చోట నెమ్మదిగా సాగుతున్నాయి. ఫ్లోరింగ్, మరుగుదొడ్ల మరమ్మతు, తాగునీటి కోసం నల్లాల బిగింపు వంటి పనులు చేపడుతున్నారు. చిలుకమర్రిగూడ పాఠశాలలో మరుగుదొడ్ల మరమ్మతులు అసంపూర్తిగానే ఉండగా ఫ్లోరింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. నంబాలలో పాఠశాల భవనం ప్లాస్టింగ్ పనులు చేపడుతున్నారు. రాజారాం, పోతపెల్లి పాఠశాలల భవనాలు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. రాజారాం పాఠశాలలో మూత్రశాలల పనులు ప్రారంభం కాలేదు. -
నీటి సంరక్షణ అందరి బాధ్యత
కౌటాల(సిర్పూర్): నీటిని సంరక్షించడం అందరి బాధ్యత అని సీడబ్ల్యూసీ కేంద్ర బృందం సభ్యులు సతీశ్కుమార్, మోహంత అన్నారు. కౌటాల గ్రామ పంచాయతీ 5వ జాతీయ జల అవార్డుకు ఎంపిక కావడంతో శుక్రవారం సీడబ్ల్యూసీ బృందం సభ్యులు కౌటాలలో పర్యటించారు. స్థానిక పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీడీవో కార్యాలయంలోని ఇంకుడు గుంతలను పరిశీలించారు. గ్రామ శివారులోని ఫామ్ పాండ్, ఫిష్ పాండ్, అడవి ప్రాంతంలోని కందకాలను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతిఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తులో నీటికొరత రాకుండా ఇంకుడు గుంతలు, నీటి నిల్వ కుంటలు నిర్మించుకోవాలని సూచించారు. నీటి వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉపాధిహామీ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో సురేందర్, ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, ఎంపీవో పూర్ణిమ, మాజీ సర్పంచ్ వొజ్జల మౌనిశ్, పంచాయతీ కార్యదర్శులు సాయికృష్ణ, తిరుపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
యూనిఫాం, పుస్తకాలు సకాలంలో అందించాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు సకాలంలో అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలి కల ఉన్నత పాఠశాలలో పంపిణీకి సిద్ధంగా ఉన్న దుస్తులు, పాఠ్యపుస్తకాలను శుక్రవారం డీఈవో అశోక్తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల పునఃప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. 685 ప్రభుత్వ పాఠశాలల్లోని 25,322 మంది బాలికలు, 22,926 మంది బాలురులకు అవసరమైన 1,96,031 మీటర్ల క్లాత్ వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 18 మండలాల వారీగా పంపిణీ చేసి, జూన్ 10లోగా పాఠశాలలకు అందించాలన్నారు. అలాగే అడ గ్రామ పంచాయతీలోని నర్సరీని కలెక్టర్ పరిశీలించారు. వేసవి దృష్ట్యా మొక్కలు ఎండిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట డీపీవో భిక్షపతి, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, ఎంపీవో మౌనిక, పీవో చంద్రశేఖర్, కోఆర్డినేటర్ మధుకర్ తదితరులు ఉన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలికెరమెరి(ఆసిఫాబాద్): అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు నాణ్యతతో ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని గోయగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పనులను శుక్రవారం డీఈవో అశోక్తో కలిసి పరిశీలించారు. ఫ్లోరింగ్ పగిలి, పైకప్పు ఉరుస్తుండటంతో ఇబ్బంది పడుతున్నామని తరగతి గదుల్లో కూడా మరమ్మతులు చేపట్టాలని హెచ్ఎం ఆడే ప్రకాశ్ కోరారు. నిధుల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వీవో సంఘం సభ్యులతో మాట్లాడి సక్రమంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మార్సీ కార్యాలయాల నుంచి క్లాత్ తీసుకుని జూన్ 1లోగా విద్యార్థులకు యూనిఫాం అందించాలన్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేసిన వారికి డబ్బులు రావడం లేదని, చేయని వారికి వస్తున్నాయని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మరుగుదొడ్లు నిర్మించి 15 ఏళ్లు పూర్తవుతున్నా బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ మంజూరైనట్లు చూపుతున్నా ఖాతాల్లో మాత్రం జమ కాలేదని వారు పేర్కొన్నారు. తక్షణం సమస్య పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఈజీఎస్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్వో భరత్, డీపీవో భిక్షపతిగౌడ్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, ఐకేపీ ఏపీడీ రామకృష్ణ, ఎంపీడీవో కృష్ణారావు, తహసీల్దార్ దత్తుప్రసాద్, ఎంపీవో అంజద్ పాషా, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, ఏఈ నజీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
‘చలో బస్ భవన్’ జయప్రదం చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 21న చేపట్టిన చ లో బస్ భవన్ కార్యక్రమాన్ని జయప్రదం చే యాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో శుక్రవారం కార్మికులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించా రు. ఆయన మాట్లాడుతూ టీఎస్ ఆర్టీసీని ప్ర భుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చే యాలని, చట్టప్రకారం ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 2013 కు సంబంధించి పీఆర్సీ బాండ్ల నగదు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖాళీ లు భర్తీ చేసి కార్మికులకు పనిభారం తగ్గించా లని, కారుణ్య నియామకాలు రెగ్యులర్ ప్రా తిపదిక భర్తీ చేయాలని, 2017 వేతన సవరణ బకాయిలు చెల్లించాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్ డిపో కార్యదర్శి దివాకర్, నాయకులు రాజన్న, అయుబ్, మల్లేశ్, తాజొద్దీన్, కార్మికులు పాల్గొన్నారు. -
పూర్తయ్యేనా..?
‘ఆదర్శ’ పనులు ● జిల్లాలో 685 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ● అమ్మ ఆదర్శ కమిటీలకు నిర్వహణ బాధ్యతలు ● జిల్లాకు రూ.25.50 కోట్లు మంజూరు ● బడుల పునఃప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ● పలుచోట్ల నత్తనడకన సాగుతున్న వైనంకొనసా..గుతున్నాయి..ఆసిఫాబాద్రూరల్: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో చేపట్టిన అభివృద్ధి పనులు పలుచోట్ల నెమ్మదిగా సాగుతున్నాయి. పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసిన చోట్ల మాత్రమే పూర్తిస్థాయిలో విద్యుత్ సౌకర్యం కల్పించారు. మ రుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, ఇతర మరమ్మతులు చేపట్టడంలో జాప్యం జరుగుతుండటంతో సకాలంలో పూర్తి కావడం అనుమానంగా మా రింది. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రత్యేక దృష్టి సారించి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. తరచూ సమీక్ష నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై ‘సాక్షి’ విజిట్. 685 పాఠశాలల్లో పనులుగత ప్రభుత్వ హయాంలో మన ఊరు– మన బడి కార్యక్రమం కింద 251 పాఠశాలలను ఎంపిక చేసి రూ.75 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో 78 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి కాగా.. 173 చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర సర్కా రు జిల్లాలోని 685 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు రూ.25.50 కోట్లు కేటా యించింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లోని స్వయం సహయక సంఘాల సభ్యులు ఈ పనులు చేపడుతున్నారు. 623 బడుల్లో తాగునీటి సౌకర్యం, 202 చోట్ల చిన్న తరహా మరమ్మతులు, 15 ఆర్బన్ స్కూళ్లలో నూతన మరుగుదొడ్లు, 140 గ్రామీణ పాఠశాలల్లోని మరుగుదొడ్లకు మరమ్మతులు, 607 చోట్ల ఎలక్ట్రికల్ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులకు రూ.1.67 కోట్ల నిధులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. పనుల పూర్తి అనుమానమే..ఎలక్ట్రికల్ పనుల కోసం ఒక్కో రూంకు రూ.25 వేలు వెచ్చిస్తున్నారు. పది మంది విద్యార్థులకు ఒక నల్లా ఏర్పాటు చేయనున్నారు. కిటికీలు, తలుపులు, మరుగుదొడ్ల మరమ్మతులు తదితర పనులు చేపడుతున్నారు. పాత మరుగుదొడ్లలో మరమ్మతుల కోసం ఒక్కో టాయిలెట్కు రూ.35వేలు కేటా యించారు. మొత్తం ఈ పనులన్నీ జూన్ 10లోగా పూర్తి చేయాలని గడువు నిర్ణయించారు. లోక్సభ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు కేటాయించిన పాఠశాలల్లో ఒక్కో గదిలో ఎలక్ట్రికల్ పనులు పూర్తి కాగా.. మిగిలిన గదుల్లో విద్యుత్ పనులు కొనసాగుతున్నాయి. మిగితా అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావడం అనుమానంగా మారింది. నిధుల కొరతతోనూ కొన్నిచోట్ల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది.జూన్ 10లోగా పూర్తి చేస్తాం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయి. మిగితా పనులు కొనసాగుతున్నాయి. పూర్తి చేసిన పనులకు రూ.1.16 కోట్లు విడుదల చేశాం. జూన్ 10లోగా అన్నిచోట్ల పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – అశోక్, డీఈవో -
జాతీయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్అర్బన్: మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం తరఫున అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024– 25 సంవత్సరానికి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు 6 నుంచి 18 ఏళ్ల బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, సైన్స్, టెక్నాలజీ, ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన బాలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల వారు జూలై 31లోగా https://awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94914 60658 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
నిరుపయోగంగా మరుగుదొడ్లు
దహెగాం: మండలంలో 53 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉండగా మన ఊరు– మనబడి కార్యక్రమం కింద మరమ్మతులు చేపట్టారు. ఇదే పాఠశాలలో అదనపు తరగతి గదుల కోసం పనులు ప్రారంభించినా పునాది దశలోనే ఉన్నాయి. మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. నూతనంగా నిర్మించిన వాటిని ప్రారంభించలేదు. లోహా, పార్వతిపేట, చినరాస్పెల్లి ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. జూన్లో పాఠశాలలు పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు పాత సమస్యలు స్వాగతం పలికే అవకాశం ఉంది. -
ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి
ఆసిఫాబాద్అర్బన్: ఆర్టీసీ ఆదాయం మరింత పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని డిపో మేనేజర్ విశ్వనాథ్ అన్నారు. ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి రికార్డు స్థాయి ఆదా యం వచ్చిన నేపథ్యంలో సంస్థ ఎండీ సజ్జనా ర్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిపో ఉద్యోగులు, కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఆదాయం పెంచడంలో ఆర్టీ సీ కార్మికులు, ఉద్యోగుల శ్రమ ఎంతో దాగి ఉందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. మరింత ఆదాయం పెంచేందుకు ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్టీఐ సరియా, సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు నష్టం
కాంగ్రెస్ విధానాలతో ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, దీంతో అన్నదాతలకు నష్టం వాటిల్లుతోందని ఎమ్మె ల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమి టీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంతర్రాష్ట్రీయ రహదారిపై నల్లబ్యాడ్జీలు, జెండాలతో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. రైతుబంధు రూ.15,000 ఇస్తామని చెప్పి, గతంలో ఇచ్చిన రూ.10వేలు కూడా పూర్తిస్థాయిలో రైతులకు చె ల్లించడం లేదన్నారు. ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో రైతు రుణమాఫీ పూర్తి చేస్తారని ప్రకటించారని, ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15 అంటున్నారని పేర్కొన్నారు. 2024 ఆగస్టు 15వ తేదీనా.. లేదా 2025 ఆగస్టు 15వ తేదీనా స్పష్టం చేయాలని డి మాండ్ చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్నా ఆలస్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యాసంగిలో పండించిన దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశా రు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నిరసనతో జిల్లా కేంద్రంలో గంటవరకు ట్రాఫిక్ నిలిచి పోయింది. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, మాజీ సర్పంచులు భీమేశ్, శ్రీనివాస్, కిష్టయ్య, నాయకులు సుప్రజ, నిసార్, కుమార్, వెంకన్న, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో -
ఓపీ.. ఇక ఈజీ
● క్యూఆర్ కోడ్ స్కాన్తో రిజిస్ట్రేషన్కు అవకాశం ● రోగులకు వేగంగా టోకెన్ నంబర్.. ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అందుబాటులోకి సేవలు ● సమయం ఆదా అవుతుందంటున్న వైద్యులుఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ పేషెంట్(ఓపీ) రిజిస్ట్రేషన్ మరింత సులభతరం కానుంది. వైద్యం కోసం వచ్చే వారు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొనే అవసరం లేకుండా పదిరోజుల క్రితం క్యూఆర్ కోడ్ స్కానర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. రద్దీ సమయంలో ఈ సేవలు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా ఆస్పత్రిలో రద్దీ..జిల్లాలోని ప్రజలకు వైద్యం కోసం ఉన్న ఏకైక ఆధారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రే.. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభం తర్వాత ఈ ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల నుంచి 300 పడకలకు అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం మూడో ఫ్లోర్ పనులు కొనసాగుతున్నాయి. వైద్యం కోసం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికే వస్తుంటారు. రోగులు ఓపీ రికార్డులో తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గంటల తరబడి లైన్లతో నిరీక్షించాల్సి వచ్చేది. ముఖ్యంగా వర్షాకాలంతోపాటు విషజ్వరాలు ప్రబలిన సమయాల్లో ఇక్కడ తీవ్రమైన రద్దీ ఉంటుంది. జ్వరాలతో బాధపడే వారు ఓపీ కోసం నిరీక్షించాల్సి రావడంతో ఇబ్బందులకు గురయ్యేవారు. కంప్యూటర్లో వివరాలు నమోదు చేసి రోగులకు ఓపీ స్లిప్ ఇచ్చేందుకు కొంత సమయం పట్టేది. ఫోన్తో స్కాన్ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూఆర్ కోడ్ స్కానర్ను అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ను మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే వెంటనే రిజిస్ట్రేషన్ టోకెన్ నంబర్ వస్తుంది. ఆ సంఖ్యను రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద సిబ్బందికి చెబితే వెంటనే ఓపీ స్లిప్ అందిస్తున్నారు. ఔట్ పేషెంట్ల సంఖ్య అధికంగా నమోదయ్యే ఆస్పత్రుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. -
సెలవుల్లో పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రేఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేసవి సెలవుల్లో పూర్తి చేయాల ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఈవో అశోక్తో కలిసి సంబంధిత అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2024– 25 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 685 ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమై న తాగునీరు, విద్యుత్, బోర్వెల్స్, ఇతర మరమ్మతులు చేపట్టాలన్నారు. బాలికలకు ప్రత్యేక మూ త్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా యూనిఫాంలు అందించడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. సమావేశంలో నోడల్ అధికారి భరత్, డీఆర్డీవో సురేందర్, ఇంజనీరింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
న్యూస్రీల్
దరఖాస్తుల ఆహ్వానం ఆసిఫాబాద్అర్బన్: ప్రతిష్టాత్మక కొండాలక్ష్మ ణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డుల కోసం అర్హత గల చేనేత కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహా య సంచాలకుడు ఎస్.చరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల చేనేత కార్మికులు ఈ నెల 20లోగా https://handlooms. nic.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల ని సూచించారు. ఆగస్టు 7న అవార్డుల ప్రదా నోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 18న జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ ముఖ్య ప్రణాళిక అధికారి అనిల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులు తమ నివేదికలతో సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు. -
జూన్ 8న జాతీయ లోక్ అదాలత్
ఆసిఫాబాద్అర్బన్: రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకునేందుకు జూన్ 8న జిల్లాలో జాతీ య లోక్అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో జూన్ 8న ఉదయం 10.30 గంట లకు నిర్వహించే లోక్అదాలత్ కార్యక్రమంలో క్రిమి నల్, సివిల్, భూసమస్యలు, వివాహం, కుటుంబ సమస్యలు, మోటర్ వాహనాల ప్రమాద కేసులు, చిట్ఫండ్, చెక్బౌన్స్ ఇతర అన్ని కేసులను ఇరుపక్షా ల మధ్య రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాజీమార్గం ద్వారా కాలం వృథా కాకుండా, ఆర్థికంగా కూడా కక్షిదారులకు మేలు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ లోక్అదాలత్ మొదటి బెంచ్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్, రెండో బెంచ్లో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ్, మూడో బెంచ్లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి న్యాయాధికారులుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణపై ఈ నెల 17న మధ్యాహ్నం కోర్టు భవన సముదాయంలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్, సెషన్స్ జడ్జి కోర్టు భవనంలో పోలీసు ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. -
డెంగీపై అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లావ్యాప్తంగా ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ, డెంగీ జ్వరంపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్ అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. డిప్యూటీ డీఎంహెచ్వో మాట్లాడుతూ డెంగీ వ్యాధి ఏడిస్ ఈజిప్ట్ అనే దోమకాటుతో వ్యాప్తి చెందుతుందన్నారు. ఇది చికెన్ గున్యా కంటే ఎక్కువగా శక్తిని హరిస్తుందని పేర్కొన్నారు. పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో లేకపోవటంతో నివారణ ఒక్కటే మార్గమన్నారు. ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. దోమకాటు బారిన పడకుండా దోమతెరలు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఆదర్శ’లో ప్రవేశాలు
● జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 320 ఇంటర్ సీట్లు ● వందమంది విద్యార్థినులకు హాస్టల్ వసతి ● ఈ నెల 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● మెరిట్ ఆధారంగా సీట్ల భర్తీ ● సద్వినియోగం చేసుకోవాలంటున్న అధ్యాపకులుఆసిఫాబాద్రూరల్: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాలకు వేళైంది. 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 5 నుంచి 25 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని ఇంటర్మీడియేట్ ఇంగ్లిష్ మీడియంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఈ తెలంగాణ ఆదర్శ పాఠశాలలు వరంగా మారాయి. మోడల్ స్కూళ్లలోని విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చూపుతున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతున్నారు. జిల్లాలో టాప్ ర్యాంకులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పది పాసైన విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు స్కూళ్లు.. 320 సీట్లుజిల్లాలో రెండు తెలంగాణ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. ఆసిఫాబాద్ పట్టణంతోపాటు సిర్పూర్(యూ)లోని కళాశాలలో సీఈసీ, ఎంఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున ఒక్కో కళాశాలలో 160 సీట్లు ఉన్నాయి. మొత్తం 320 సీట్లు భర్తీ చేయనున్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రోస్టర్ విధానంలో ఎంపిక ఉంటుంది. వందమంది బాలికలకు హాస్టల్ వసతి కల్పించనున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే 9, 10, ఇంటర్ చదివే విద్యార్థులకు భోజన సదుపాయం కూడా ఉంటుంది. సీట్ల భర్తీ ఇలా..ఇంటర్మీడియట్కు సంబంధించి జిల్లాలోని రెండు మోడల్ స్కూళ్లలో 320 సీట్లు భర్తీ చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎలాంటి దరఖాస్తు రుసుం లేకుండా ఈ నెల 25లోగా http s:// www.tsmodelsc hools.co m/ admissions/ లింక్ ద్వారా వివరాలు సమర్పించాలి. ఈ నెల 27న జాబితా విడుదల చేస్తారు. 29వ తేదీ నుంచి 31 వరకు ధ్రువపత్రాలు పరిశీలించి ఎంపికైన వారి జాబితా విడుదల చేస్తారు. విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, యూనిఫాం, కంప్యూటర్ విద్య, ఐఎఫ్పీ డిజిటల్ బోర్డులతో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధన చేస్తారు. ఫలితాల్లో సత్తా..కొన్నేళ్లుగా ఇంటర్ వార్షిక ఫలితాల్లో మోడల్ పాఠశాల విద్యార్థులు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. 2021– 22 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో 28 మంది సెకండియర్ విద్యార్థులు 900లకు పైగా మార్కులు సాధించారు. 2022– 23లో 92 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది కూడా సెకండియర్ ఫలితాల్లో 35 మంది విద్యార్థులు 900 పైగా మార్కులు సాధించారు. అక్షయ, పూజిత 983 మార్కులతో జిల్లాలో టాపర్లుగా నిలిచారు. అలాగే నేషనల్ కం మెరిట్ స్కాలర్షిప్, జేఈఈ ప్రిలిమ్స్, మెయిన్స్లో సత్తా చాటుతున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల తల్లిదండ్రులు ఇక్కడ ప్రవేశాలకు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ పీఎం శ్రీ పథకానికి ఎంపిక కావడంతో రానున్న రోజుల్లో ఇక్కడ కార్పొరేట్ స్థాయి ప్రమాణాలతో కూడిన వసతులు అందుబాటులోకి రానున్నాయి.రిజర్వేషన్ల వారీగా సీట్ల వివరాలు...కేటగిరి శాతం సీట్లు జనరల్ బాలికలు జనరల్ 50 20 13 07 ఎస్సీ 15 06 04 02 ఎస్టీ 06 02 01 01 బీసీ– ఏ 07 03 02 01 బీసీ– బీ 10 04 03 01 బీసీ– సీ 01 00 00 00 బీసీ– డీ 07 03 02 01 బీసీ– ఈ 04 02 02 00 -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యార్థులు క్రీడల్లో రా ణించి ఉన్నతస్థాయికి ఎదగాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడా పాఠశాలలో గురువారం స మ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు. డీటీడీవో మాట్లాడుతూ గతంలో రాష్ట్ర, జాతీ య స్థాయి పోటీల్లో పాల్గొన్న 60 మంది బాలి కలు, 60 బాలికలను ఎంపిక చేసి 15 రోజులపాటు శిక్షణ అందిస్తున్నామన్నారు. క్రీడాకా రులు నైపుణ్యాలు పెంచుకునేందుకు ఈ శిబి రం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఎస్వో మీనారెడ్డి, ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, ఏటీడీవో క్షేత్రయ్య, హెచ్ఎం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
వేటగాళ్ల బరితెగింపు!
కౌటాల మండలం మొగడ్దగడ్లో ఎల్ములే జిత్రుకు చెందిన వ్యవసాయ ఎద్దు ఈ నెల 15న గ్రామ శివారులోని చెరువు వద్దకు మేతకు వెళ్లింది. మేత మేస్తుండగా నాటుబాంబు కొరకడంతో నోరు ఛిద్రమైంది. వేటగాళ్లు అడవి పందిని వేటాడేందుకు పెట్టిన నాటుబాంబు పేలి ఎద్దు దవడ భాగం పూర్తిగా దెబ్బతింది. రూ.50 వేల విలువైన వ్యవసాయ ఎద్దుకు తీవ్ర గాయాలు కావడంతో బాధిత రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. ఎద్దును రూ.5 వేలకు కబేళాలకు విక్రయించాడు. కౌటాల(సిర్పూర్): వేటగాళ్లు బరి తెగిస్తున్నారు. అడవి పందులు, ఇతర వన్యప్రాణుల వేటకు ఇష్టారీతిన నాటుబాంబులు వినియోగిస్తున్నారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి నీరు, ఆహారం కోసం పొలాల వైపు వచ్చే జంతువులను హతమారుస్తున్నారు. ఈ నాటుబాంబులు పశువులు, మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారాయి. గ్రామాల శివారు ప్రాంతాల్లోనే విచ్చలవిడిగా నాటుబాంబులు ఏర్పాటు చేస్తుండడంతో రైతులు వేసవి దుక్కులు దున్నేందుకు కూడా ఆందోళన చెందుతున్నారు. మొగడ్దగడ్ ఎద్దుకు తీవ్రగాయం కావడం వారిని మరింత భయంలోకి నెట్టింది. యథేచ్ఛగా వేట..జిల్లాలోని తిర్యాణి, కెరమెరి, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, సిర్పూర్(టి), కాగజ్నగర్, దహెగాం, రెబ్బెన మండలాల్లో అధికంగా అటవీప్రాంతం విస్తరించి ఉంది. కొందరు గ్రూపులుగా ఏర్పడి అడవి పందులు, కొండగొర్రెలు, ఇతర వన్యప్రాణులను నాటుబాంబులతో వేటాడుతున్నారు. అడవి పందుల సంచరించే ప్రాంతాలను పసిగట్టి అవి తినే ఆహారంలో నాటుబాంబులు కలిపి అక్కడక్కడా పడేస్తున్నారు. అటవీ జంతువులు వాటిని కొరకగానే బాంబు పేలుతోంది. రక్తమోడుతూ కొంతదూరం పరిగెత్తి అడవుల్లో ప్రాణాలు వదులుతున్నాయి. కొన్నిచోట్ల వేటగాళ్లు కాపుకాచి అడవి పందులు బాంబు పేలుడుతో గాయపడగానే కత్తులతో చంపుతున్నారు. వీరిలో కొందరు గ్రామ శివారు ప్రాంతాల్లోని చెరువులు, పొలాలను అడ్డా గా చేసుకుని నాటుబాంబులు పెడుతున్నారు. మేత కు వెళ్లిన పశువులు నాటుబాంబులు పేలి మృత్యువాత పడుతున్నాయి. మహారాష్ట్ర ప్రాంతాలు, ఇతర జిల్లాల నుంచి నాటు బాంబులను రహస్యంగా తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తున్నట్లు సమాచారం. కరెంటు తీగలతో చిక్కులు..వేటగాళ్లు ఎక్కువగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి వన్యప్రాణులను వేటాడుతున్నారు. పంట పొలాలు, చెరువులు, వాగులను అడ్డాగా ఏర్పాటు చేసుకుంటారు. కొన్నిసార్లు విద్యుత్ తీగలను గమనించకుండా రైతులు మృతి చెందిన సంఘటనలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అడవి పందుల మాంసాన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి పట్టణాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వన్యప్రాణులు విద్యుత్ తీగలకు చిక్కుకున్నప్పుడు సంబంధిత విద్యుత్ సబ్స్టేషన్లో ఫ్యూజులు పోతున్నాయి. ఎక్కడ వేట జరిగిందనే విషయం ట్రాన్స్కో సిబ్బందికి తెలిసే అవకాశముంది. ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో వేటగాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదంవేటగాళ్లు అమర్చుతున్న నాటుబాంబులతో ప్రమాదం పొంచి ఉంది. పొలాల సమీపంలో ఏర్పాటు చేసిన నాటు బాంబులు కొన్నిసార్లు జంతువులు తినకుంటే ఎలుకలు రంధ్రాల్లోకి లాక్కెళ్లే అవకాశం ఉంది. ట్రాక్టర్లతో దుక్కి దున్నే క్రమంలో అవి పేలుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చిలో కౌటాల మండలంలోని ముత్తంపేట గ్రామంలోని జాడి విలాస్కు చెందిన వ్యవసాయ ఎద్దు గ్రామ శివారులో మేత మేస్తున్న క్రమంలో నాటు బాంబు పేలింది. రూ.40 వేల విలువైన ఎద్దు తీవ్రంగా గాయపడి మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మరో రైతు ఎద్దు సైతం నాటు బాంబు పేలి చనిపోయింది. ముఖ్యంగా కౌటాల మండలంలో వరుస సంఘటనలతో రైతులను తీ వ్రంగా నష్టపరుస్తున్నాయి. పోలీస్శాఖ, అటవీశాఖ అధికారులు స్పందించి వేటగాళ్లపై దృష్టి సారించాలని అన్నదాతలు కోరుతున్నారు. వేట నేరం అటవీ జంతువుల వేట చట్టరీత్యా నేరం. నాటు బాంబులతో చంపడం దారుణం. అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న గ్రామాల పరిధిలో వేటగాళ్ల కదలికలపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. విద్యుత్ తీగల అమర్చినా చర్యలు తప్పవు. మొగడ్దగడ్ ఘటనపై గురువారం గ్రామంలో విచారణ చేపట్టాం. – ప్రభాకర్, ఎఫ్బీవో, కౌటాల చర్యలు తీసుకుంటాం నాటుబాంబు పేలి మొగడ్దగడ్లో ఎద్దు మృతి చెందడం చాలా బాధాకరం. వేటగాళ్లను గుర్తించి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. నాటుబాంబులు ఎక్కడ కొనుగోలు చేస్తున్నారో తెలుసుకొని, విక్రయదారులపైనా కేసు నమోదు చేస్తాం. – మధుకర్, ఎస్సై, కౌటాల అడవి పందుల వేట కోసం నాటు బాంబులు, విద్యుత్ తీగలు గ్రామాల సమీప ప్రాంతాల్లోనే యథేచ్ఛగా వినియోగం నాటు బాంబులు పేలి పశువులకు తీవ్ర గాయాలు ఆందోళన చెందుతున్న అన్నదాతలు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement