-
అదనపు కట్నం కోసం వేధించిన ఐదుగురిపై కేసు
నెన్నెల: అదనపు కట్నం కోసం వేధించిన భర్త, మామ, అత్తతోపాటు ఆడబిడ్డ, ఆమె భర్తపై స్థానిక పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమో దు చేసినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లికి చెందిన నాగుల మల్యాల రాజు, నెన్నెల మండల కేంద్రానికి చెందిన మౌనికతో గతేడాది జూన్ 14న వివాహం జరిగింది. పెళ్లి ఖర్చు కింద రూ.3 లక్షలు నగదు, తులం బంగారాన్ని మౌనిక తల్లిదండ్రులు ఇచ్చారు. సుమారు 3 నెలల పాటు సజావుగా సాగిన వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. అదనపు క ట్నం, మరో రూ.3 లక్షలు తీసుకురావాలంటూ భర్త రాజు, అత్త నాగుల మల్యాల అమ్మాయి, మామ ఆనందంలతోపాటు ఆడబిడ్డ బ్ర మ్మోజు స్వప్న, ఆమె భర్త రవిబాబు వేధించసాగారు. పెళ్లయిన 15 రోజుల నుంచే అదనపు కట్నం తేవాలని భర్త రాజు ఇంట్లో తలుపులు పెట్టి చిత్రహింసలు పెట్టేవాడని పేర్కొన్నాడు. బాధితురాలు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. అడవిపంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలుకాసిపేట: మండలంలోని ధర్మరావుపేట ప్రధాన రహదారిపై ఆదివారం అడవి పంది దాడిలో పశువుల కాపరి చిలువే రు శంకరయ్యకు తీ వ్ర గాయాలయ్యా యి. స్థానికుల కథ నం ప్రకారం.. శంకరయ్య ఉదయం పశువుల ను మేతకు తీసుకెళ్తుండగా అడవి పంది దాడి చేసింది. గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్యకౌటాల/కాగజ్నగర్రూరల్: కాగజ్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి గుర్తుతెలియని యువకుడు (28) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు కాగజ్నగర్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేష్గౌడ్ తెలిపారు. మృతుడి ఎడమ చేతి పై కుంత అని, కుడి చేతి భుజం పై త్రిశూల్ సింబల్ పచ్చబొట్టు ఉందని పేర్కొన్నారు. మృతుడు షర్టు ధరించలేదని, బూడిద కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని సిర్పూర్(టి)లోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలోని మార్చరీ గదిలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. ఇతని వివరాలు తెలిస్తే 8712658596, 8712658605 సెల్నంబర్లలో సంప్రదించాలని కోరారు. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి ఖానాపూర్: మండలంలోని బీర్నంది గ్రామానికి చెందిన ఉపాధి కూలీ జాడి గంగవ్వ(43) వడదెబ్బతో మృతిచెందింది. ఈనెల 15న వడదెబ్బతో అస్వస్థతకు గురికాగా, ఆర్ఎంపీ వద్ద ప్రథమ చికిత్స పొందింది. గురువారం ఖానాపూర్, శుక్రవారం నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. శనివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతురాలికి భర్త లింగన్న, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
ఎస్టీపీపీలో ఏం జరుగుతోంది!
● ఎనిమిదేళ్ల స్టోర్స్ మెయింటనెన్స్ స్పేర్స్పాట్స్పై విజిలెన్స్ తనిఖీలు ● ఒక్కటే మెయిన్ స్టోర్.. దాని సబ్స్టోర్స్ లేని వైనం ● అధికారుల ప్రాణాల మీదకు వస్తున్న ఎంక్వెయిరీ ● కలకలం రేపుతున్న యువ ఇంజినీర్ కిరీటి ఆత్మహత్య జైపూర్: జైపూర్లోని ఎస్టీపీపీలో విజిలెన్స్ తనిఖీలు సిబ్బంది ప్రాణాల మీదికి తెస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్లాంటులో రూ.కోట్ల విలువైన సామగ్రి విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణలో భాగంగా వినియోగిస్తుంటారు. సింగరేణి సంస్థ ప్లాంటు నిర్మించినప్పటికీ క్షేత్రస్థాయిలో నిర్వహణకు ఏర్పాట్లు చేయలేదు. ఐదేళ్లకోసారి వీటి బాధ్యతలకు ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. దాన్ని పర్యవేక్షించేందుకు నామమాత్రంగా అధికారులను నియమించింది. క్షేత్రస్థాయిలో సామగ్రిని స్టోర్ చేసే మెయిన్ స్టోర్ సబ్ స్టోర్స్ లేకపోవడం, విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అధికారులు అవసరాలను బట్టి లక్షల విలువైన సామగ్రి వినియోగించడం ఏళ్లు గడిచాక విజిలెన్స్ తనిఖీ చేపట్టడం అధికారుల ప్రాణాలు తీస్తోంది. వోఅండ్ఎం ఎస్ఈ బి.కిరీటి అనే యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకోవడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. గతనెల 22న వారం పాటు విజిలెన్స్ బృందం ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా మెయిన్ స్టోర్స్ను తనిఖీ చేసింది. వోఅండ్ఎం మెయింటనెన్స్ అధికారులను ప్రశ్నించింది. సామగ్రిని ఎప్పుడు తెచ్చారు.. ఎక్కడ వినియోగించారు. ఒకవేళ వినియోగించని పక్షంలో ఎక్కడ ఉంచారన్న ప్రశ్నలు అడిగారు. వోఅండ్ఎంలో బాయిలర్, ట ర్బైన్, ఎలక్ట్రికల్ మెయింటనెన్స్ అధికారులు మెయిన్ స్టోర్స్ నుంచి సామగ్రి విత్డ్రా చేసి స్పెర్స్, మోటా ర్స్, బేరింగ్స్, ఆయిల్స్ ఇలా ఎన్నో వినియోగిస్తా రు. కొన్ని సందర్భాల్లో వినియోగించనివి అధికారులు వాళ్ల పరిధిలో భద్రంగా ఉంచారు. మీ వద్ద ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించడం, 8 ఏళ్ల తర్వాత తనిఖీ చేపట్టడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. క్షేత్రస్థాయిలో సరిపడగా ఇంజి నీర్లు లేకపోవడం, ఉన్న వారిపై పని ఒత్తిడి చేయ డం, మరో వైపు విజిలెన్స్ విచారణ ఎదుర్కొలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా కిరీటి రెండు పేజీల సూసైడ్ నోట్ రాసి బలవనర్మణానికి పాల్పడ్డాడు. ఇప్పటి వరకు ఉపయోగించిన సామగ్రి వివరాలు, విజిలెన్స్ బృందానికి అందించడానికి అధికార యంత్రాంగం నివేదిక తయారు చేసింది. -
రైల్వే ట్రాక్మెన్ ఉద్యోగుల నూతన కార్యవర్గం
మంచిర్యాలక్రైం: సౌత్ సెంట్రల్ రైల్వే ట్రాక్మెన్ల ఎంప్లాయ్ అసోసియేషన్ సికింద్రాబాద్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ అధ్యక్షుడు జిలకర రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి కళ్ల ప్రభాకర్, మీసాల శేఖర్ ఆధ్వర్యంలో కాజీపేటలోని ఎస్సీ, ఎస్టీ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఎన్నుకున్నారు. సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా నక్కల రాజు, డివిజన్ కార్యదర్శిగా కట్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కారంగుల నాగరాజు, ట్రెజరర్గా మొరపూటాల మల్లేశ్, అసిస్టెంట్ డివిజన్ కార్యదర్శులుగా గూళ్ల శ్రీనివాస్, వీర్ల రాధకృష్ణ, ఆవుల కుమార్, కె.శరత్బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను అమోదించారు. ● తరుచూ ట్రాక్మెన్లు రన్ ఓవర్ బారినపడి చనిపోతున్నారు. దీనిపైన రైల్వే బోర్డ్ సమక్షంలో సమగ్రమైన సేఫ్టీ కమిషన్ ఏర్పా టు చేసి ట్రాక్మెన్ మరణాలను తగ్గించాలి. ● ట్రాక్ మెన్ ప్రాణాల రక్షణకు రక్షక్ పరికరాలు ఇవ్వాలి. రైల్వేలో సేఫ్టీ విధులకు దూరంగా ఉన్న సీనియర్ ట్రాక్మెన్లను ఓపెన్ లైన్లోకి పంపించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. ఆకాశంలో అద్భుతంచింతలమానెపల్లి/బెజ్జూర్: జిల్లాలో ఆదివారం రాత్రి ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో చింతలమానెపల్లి మండల కేంద్రంలో సుమారు 20 వరకు నక్షత్రాలు వెలుగుతూ నిమిషంపాటు కనిపించాయి. బెజ్జూర్లో నక్షత్రాలు కనిపించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. తమ సెల్ఫోన్లలో బంధించారు. ఇలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. జిల్లా అంతటా ఈ నక్షత్రాలపై చర్చించుకున్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
● ఆశ్రమ విద్యార్థులకు సమ్మర్ క్యాంపు ● 120 మంది బాల,బాలికలకు శిక్షణఆసిఫాబాద్రూరల్: వేసవి సెలవుల్లో క్రీడా శిబిరంలో బాల, బాలికలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కుమురం భీం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల మైదానంలో ఈనెల 15 నుంచి సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. 31వ తేదీ వరకు జరిగే ఈ క్యాంప్లో 12 రకాల క్రీడలకు శిక్షణ ఇస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 60 మంది చొప్పున మొత్తం 120 మంది బాల,బాలికలకు వివిధ ఆటల్లో శిక్షణ ఇస్తున్నారు. కోచ్లు క్రీడల్లో మెలకువలు, తర్ఫీదునిస్తున్నారు. 31 వరకు సమ్మర్ క్యాంప్ గిరిజన బాల, బాలికలకు క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు ఈనెల 15 నుంచి 31 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఆదర్శ పాఠశాలల నుంచి కుమురం భీం జిల్లా నుంచి 60 మంది, మంచిర్యాల జిల్లా నుంచి 60 మందిని బాల, బాలికలను ఎంపిక చేశారు. ఉదయం 5:30 నుంచి 7:30 వరకు, సాయంత్రం 5 నుంచి 7:00 గంటల వేళలో క్రీడా శిక్షణ కొనసాగుతోంది. 15 మంది కోచ్లతో 12 రకాల క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. గతేడాది నిర్వహించిన క్యాంపుతో స్పందన వచ్చింది. అథ్లెటిక్స్ విభాగంలో ముగ్గురు జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. 27 మంది జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నారు. ఒక్కో క్రీడకు ఇద్దరు కోచ్లు ఒక్కో క్రీడకు ఇద్దరు కోచ్లు ఉన్నారు. వివిధ ఆ టలపై బాల,బాలికలకు శిక్షణ అందిస్తున్నారు. అథ్లెటిక్స్కు విద్యాసాగర్ ఈయన ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య నిర్వహించిన లెవల్ 1,2 పరీక్షల్లో అర్హత సాధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకై క శిక్షకుడు. ఈయన వద్ద శిక్షణ పొందిన 15 మంది క్రీడాకారులు జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. 30 మంది రక్షణ దళంలో ఉద్యోగం చేస్తున్నారు. ఈయన ప్రస్తుతం ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ క్రీడ పాఠశాలకు శిక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. హ్యాండ్ బాల్కు అరవింద్, ఖోఖోకు తిరుమల్, సుమలత, బాక్సింగ్కు శేఖర్, వంశీ, కబడ్డీకి కృష్ణమూర్తి, మధుసూదన్, చెస్కు రవీందర్, లక్ష్మణ్, వాలీబాల్కు కోచ్లుగా శ్రీనివాస్, సుభాష్ ఉన్నారు. వీరితో పాటు ఆసిఫాబాద్ డీఎస్వో మీనారెడ్డి, మంచి ర్యాల డీఎస్వో జీవరత్నం పర్యవేక్షణలో డీటీడీవో సమక్షంలో సమ్మర్ క్యాంపు కొనసాగుతుంది.సంతోషంగా ఉందినేను తిర్యాణి స్కూల్ నుంచి వచ్చాను. కోచ్లు ఉదయం, సాయంత్రం పూట క్రీడల్లో మెలకువలు నేర్పుతున్నారు. పీటీ సార్ రోజు వాలీబాల్ ఆడించేవారు. ఇక్కడ అందరితో ఆడితే సంతోషంగా ఉంది. – శివమణి, తిర్యాణి కోచ్ కావాలని ఉందిక్రీడల్లో ప్రతిభ కనబ ర్చి కోచ్ అయి గిరిజ న విద్యార్థులకు క్రీడల్లో మెలకువలు నే ర్పించాలి. ఇటీవల వాలీబాల్ పోటీల్లో జాతీయస్థాయిలో తృతీయ స్థానం వచ్చింది. – వరలక్ష్మి, లక్సెట్టిపేటసద్వినియోగం చేసుకోవాలివేసవి సెలవుల్లో విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలు వెలికితీయడానికి గిరిజన శాఖ ద్వారా అందిస్తున్న సమ్మర్ శిక్షణ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – రమాదేవి, డీటీడీవో, కుమురంభీం జిల్లాఆర్మీ జవాన్ అవ్వాలని..రన్నింగ్లో మూడు సార్లు గోల్డ్ మెడల్, రెండు సార్లు సిల్వర్ మెడల్ సాధించాను. ఆర్మీ జవాన్ అవ్వాలని ఉంది. అందుకే రన్నింగ్ చేస్తున్నాను. జవాన్ అయి దేశానికి సేవ చేయాలని ఉంది. – ఆకాశ్, జన్నారంజాతీయస్థాయిలో రాణిస్తాహ్యాండ్బాల్ పోటీలో గతంలో రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాను. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలని ఉంది. సమ్మర్ క్యాంపులో మంచి శిక్షణ ఇస్తున్నారు. – సత్యభామ, ఆసిఫాబాద్ నాకు ఖోఖో ఇష్టంఖోఖో అంటే ఇష్టం. సమ్మర్ క్యాంపులో కోచ్లు మెలకువలు నేర్పిస్తున్నారు. ఆటల్లో తర్పీదు ఇస్తున్నారు. గతంలో రాష్ట్ర స్థాయి గోల్డ్మెడల్ సాధించాను. జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ తన లక్ష్యం. – నాగేశ్వరి, జైనూర్ -
‘ఉమర్మియా’ బాధితులకు ఊరట
● సొసైటీ సభ్యులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ● 17 మందికి అనుమతులు ఇవ్వాలని ఉత్తర్వులు మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని ఉమర్మియా హౌసింగ్ సొసైటీ వివాదంలో, అందులో ప్లాట్లు కొని మున్సిపల్ అనుమతులు రాక ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న 17 మందికి ఊరట లభించింది. వారికి అనుకూలంగా హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. 1978లో ఏర్పడిన ఉమర్మియా హౌసింగ్ సొసైటీ భూముల్లో వివాదాలు సృష్టిస్తూ, కొందరు కౌన్సిలర్లు ఇబ్బందులకు గురిచేస్తూ దాదాపుగా 40కి పైగా కేసులను వేశారని తెలిపారు. ఇందులో 86 మందికి ప్లాట్లు ఉండగా, 30కిపైగా ఇళ్ల నిర్మాణాలను చేశారని, ఆ తరువాత కొన్ని దొంగ రిజిస్ట్రేషన్లను చేసి, అసలైన యజమానులకు ఇబ్బందులను సృష్టించారని పేర్కొన్నారు. కేసులతో ఇన్నాళ్లు ఇబ్బంది పడిన తమకు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊరట లభించిందని తెలిపారు. ఉమర్మియాకాలనీ మంచిర్యాల పట్టణానికే రెండో పట్టణం అని, 1978లో లేఔట్ ఏర్పడి, వంద ఫీట్ల రోడ్డుతో, కాలనీలో 30 ఫీట్ల రోడ్లతో, ఎకరంపావు పార్కు స్థలంతో ఏర్పడిన కాలనీ అని వివరించారు. ఈ కేసులను గెలిచేందుకు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రాధాకృష్ణ, రిటైర్డ్ టీపీవో ఉదయ్కుమార్ సహకారంతో ఇన్నాళ్లు పోరాటం చేసి, పార్కు స్థలంను, తమ భూములను కాపాడుకున్నామని వెల్లడించారు. ఉమర్మియా కాలనీ అంటే అదో సమస్యాత్మకమైన ఏరియా అంటూ అపోహలను సృష్టిస్తూ, దొంగ రిజిస్ట్రేషన్ల ద్వారా కోట్ల రూపాయలను కొందరు కౌన్సిలర్లు కొల్లగొట్టారని ఆరోపించారు. కోర్టు కేసుల ద్వారా ఇన్నాళ్లు 17 మందికి మున్సిపల్ నుంచి అనుమతులు రాలేదని, కేసులను హైకోర్టు కొట్టివేసి, 17 మందికి అనుమతులను ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారంగా మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వాలని లేకుంటే కోర్టు ధిక్కరణ కింద మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తామని, అనుమతులను పొందడంతోపాటు, పార్కును, స్థలాలను కాపాడుకుంటామని చెప్పారు. సమావేశంలో ఉమర్మియా సొసైటీ అధ్యక్షుడు జుబేరా అహ్మద్(మినాజ్), ఉపాధ్యక్షుడు శ్రీపతి కేశవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం నరేశ్, ఎండీ.హైదర్, ఆకుల బుచ్చన్న, చెక్క రాజన్న పాల్గొన్నారు. -
ఇక ‘చేనేత’ ఎన్నికలు
● 12 ఏళ్లకు మోక్షం ● ఉమ్మడి జిల్లాలో రెండు సంఘాలు ● ఎన్నికలకు అధికారుల కసరత్తుప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాకే..ఉన్నతాధికారుల అదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని చేనేత సహకార సంఘాల ఓటరు జాబితాలను సిద్ధం చేస్తున్నాం. పర్సన్ ఇన్చార్జీల పదవీ కాలం ముగిసింది. కొత్తగా ఎవరికి చార్జీ ఇవ్వలేదు. సంఘాల బలోపేతం కోసం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే ఎన్నికలు నిర్వహిస్తాం. – చరణ్ చేనేత జౌళిశాఖ కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ ఏడీ చెన్నూర్: చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పన్నెండేళ్ల తర్వాత ఎన్నికలకు మోక్షం లభించింది. ఎన్నికల నిర్వహణ కోసం చేనేత జౌళిశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో మంచిర్యాల జిల్లా చెన్నూర్, కుమురం భీం జిల్లాలోని బెజ్జూర్లో సంఘాలు ఉన్నాయి. అధికారులు సభ్యుల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 240 మందికి పై సభ్యులు ఉన్నారు. ఆరేళ్లుగా పర్సన్ ఇన్చార్జిలే.. చేనేత సహకార సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 11, 2013న ఎన్నికలు జరిగాయి. వీటి గడువు 2018 ఫిబ్రవరి 12న ముగిసింది. పదవీ కాలం ము గిసిన వెంటనే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా జీవో 568 ప్రకారం పర్సన్ ఇన్చార్జీలను నియమించింది. 2018 ఫిబ్రవరి నుంచి 2023 ఆగష్టు వరకు పర్సన్ ఇన్చార్జీలతో సహకార సంఘాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో నాడు 8 సంఘాలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకప్పుడు పది చేనేత సహకార సంఘాలతో జిల్లాలో చేనేత వస్త్రాలకు పె ట్టింది పేరుగా నిలిచింది. సుమారు 8 వేల కుటుంబాలకు చేనేత సంఘాలపై ఆధారపడి జీవనం సా గించారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సంఘాలు ఢీలా పడ్డాయి. ఆదిలాబాద్, నిర్మల్, లక్సెట్టిపేట, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్నగర్లో సంఘాలు మూతపడ్డాయి. ప్రస్తుతం చెన్నూర్, బెజ్జూర్లో రెండు చేనేత సహకార సంఘాల్లో కార్మికులు వస్త్ర ఉత్పత్తి చేస్తున్నారు. చెన్నూర్ సంఘంలోనే అత్యధిక.. చెన్నూర్ చేనేత సహకార సంఘంలో కార్మికులు ఎ క్కువ సంఖ్యలో మగ్గాలు నేస్తున్నారు. సుమారు 140 మందికి పైగా కార్మికులు ఉండగా బెజ్జూర్లో మాత్రం వంద మంది మాత్రమే కార్మికులు ఉన్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
రామకృష్ణాపూర్: పట్టణంలోని సీవీ రామన్ ఉన్నత పాఠశాలకు చెందిన 1998–99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 25 ఏళ్ల అనంతరం సుమారు 150 మంది పాఠశాలలో కలుసుకుని సిల్వర్ జాబ్లీ వేడుకలను జరుపుకున్నారు. ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తీపిగుర్తులను నెమెరువేసుకున్నారు. రోజంతా సంతోషంగా గడిపారు. అప్పటి పాఠశాల కరస్పాండెంట్ గురిజాల రవీందర్రావు, హెచ్ఎంలు సురేందర్రావు, పెద్దపెల్లి ఉప్పలయ్య, చిరంజీవి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గురిజాల రవీందర్రావు రచించిన బొగ్గురవ్వలు పుస్తకాన్ని కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఎంవీఎన్ డిగ్రీ కళాశాలలో.. మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మైక్రో బయాలజీ పూర్వ విద్యార్థులు 20 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. విద్యార్థులంతా ఒకచోట చేరి సందడి చేశారు. చదువుకునే రోజుల్లో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సహ విద్యార్థి జిల్లా రచయితల వ్యవస్థాపక అధ్యక్షుడు బొడ్డు మహేందర్ను సన్మానించారు. రాజేశ్, మల్లాగౌడ్, రమేశ్, నరేశ్, స్రవంతి, స్వప్న, హారిక, అనిత, సురేశ్ పాల్గొన్నారు. కప్పర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. తాంసి: మండలంలోని కప్పర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989–90 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 34 ఏళ్ల అనంత రం దాదాపు 50మంది పాఠశాలలో కలుసుకుని సందడి చేశారు. ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోజంతా సంతోషంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను నారాయణ రె డ్డి, రత్నాకర్రెడ్డి, సుదర్శన్ తదితరులను సన్మానించారు. జైనథ్లో.. జైనథ్: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2007–08 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఒకచోట చేరారు. పాఠశాలలో పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. కుభీర్లో.. కుభీర్: కుభీర్ ఉన్నత పాఠశాలలో 2004–05 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. రోజంతా సంతోషంగా గడిపారు. మేమున్నాం ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరించి తోటివారిని ఆదుకుంటామన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. పూర్వ విద్యార్థులు రంజిత్గౌడ్, జీవన్, చంద్రశేఖర్, వికాస్, అనిల్, ప్రగతి, సవిత, సంగీత, పద్మ, ఉపాధ్యాయులు జి.దత్తాత్రి, విజయ్కుమార్, సదానంద్, గజరాజ్గౌడ్, మల్లాగౌడ్, రాజశేఖర్రెడ్డి ఉన్నారు. -
ఈఏపీ సెట్లో సీఓఈ విద్యార్థుల ప్రతిభ
బెల్లంపల్లి: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఈఏపీ సెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ(సీఓఈ) కళాశాల విద్యార్థులు ర్యాంకులు సాధించారు. శనివారం ఈఏపీ సెట్ ఫలితాలు వెలువడ్డాయి. బైపీసీ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 23 మంది అర్హత సాధించారు. జుమ్మిడి ప్రణయ్ 4,885వ ర్యాంకుతో కళా శాల టాపర్గా నిలువగా, ఎం.శివకృష్ణ 7,123వ ర్యాంకు, యార్కర్ నికిత్ 17,928వ ర్యాంకు, గోమాస అఖిల్ 18,578వ ర్యాంకు సాధించారని ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ప్రకటించారు. ఎంపీసీ విభాగంలో 38 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 37 మంది అర్హులయ్యారు. వీరిలో వెలుతురు అఖిల్ 17,133వ ర్యాంకుతో కళాశాల టాపర్గా నిలిచాడు. విద్యార్థులను ప్రిన్సిపాల్ సైదులు, అధ్యాపకులు పిన్నింటి కిరణ్, శ్రీరామవర్మ, మిట్ట రమేష్, చందా లక్ష్మీనారాయణ, శోభ, కట్ల రవీందర్, అనుముల అనిరుధ్ అభినందించారు. -
No Headline
జిల్లా కేంద్రంలో కొందరు అక్రమార్కులు నాలాలను సైతం ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. నాలాలు కనిపించకుండా నివాస గృహాలు, దుకాణ సముదాయాలు నిర్మిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో వరదనీరు ఇళ్లలోకే ప్రవహిస్తోంది. మూడేళ్లుగా ప్రధాన రహదారులన్నీ జలమయమై జిల్లా వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ -
పచ్చిరొట్ట ఎరువుల వినియోగం పెంచాలి
భీమారం: భూసారం పెంపునకు దోహద పడే పచ్చిరొట్ట ఎరువుల వినియోగాన్ని రైతులు మరింత పెంచాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేఖ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు జీలుగ విత్తనాల బస్తాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా పచ్చిరొట్ట ఎరువుల విని యోగం పెంచేందుకు రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వా డకంపై దృష్టి సారించాలని కోరారు. భూమిలో పో షకాలు పెరిగి సారవంతంగా తయారవుతుందని తెలిపారు. ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల తయారీ కోసం జీలుగ విత్తనాలు సబ్సిడీపై అందజేస్తోందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి మార్క్గ్లాడ్స్టన్, ఏఈవో అరుణ్కుమార్ పాల్గొన్నారు. -
45 మంది ఉపాధ్యాయులకు షోకాజ్
ఆదిలాబాద్టౌన్: ఎన్నికల్లో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జా రీ చేయడం విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 13న నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల విధులకు గైర్హాజరయ్యారని పేర్కొంటూ ఐటీడీఏ పీవో, బోథ్ ని యోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఖుష్బూ గుప్తా 45 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆదిలాబాద్ రూరల్లో ఆరుగురు, ఆదిలాబాద్ అర్బన్లో ఏడుగురు, తలమడుగులో ముగ్గురు, గుడిహత్నూర్లో ఐదుగురు, బేలలో ముగ్గురు, బోథ్లో ఎనిమిది మంది, ఇంద్రవెల్లిలో ఐదుగురు, భీంపూర్లో ఇద్దరు, తాంసిలో ఒకరు, ఇచ్చోడలో ఒకరు, ఉట్నూర్లో ఒకరు చొప్పున 45 మందికి నోటీసులిచ్చారు. ఇందులో 43 మంది డీఈవో పరిధిలోని ఉపాధ్యాయులుండగా ఇద్దరు ఐ టీడీఏ ఉపాధ్యాయులున్నారు. అయితే వీరిలో చా లామంది బోథ్ నియోజకవర్గ పరిధిలోని తమకు కేటాయించిన వివిధ పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించారు. అయితే కొంతమంది సకాలంలో రిపోర్టు చేయకపోవడం, రిజిస్టర్లో సంతకాలు చే యకపోవడంతో వారిని గైర్హాజరుగా పరిగణిస్తూ నోటీసులు జారీ చేయాలని డీఈవోను ఆదేశిస్తూ పీవో ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో డీఈఓ సంబంధిత మండల విద్యాధికారుల ద్వారా ఆ ఉపాధ్యాయులందరికీ షోకాజ్ జారీ చేశారు. విధులకు గైర్హాజరు కావడానికి గల కారణాలేంటో రెండు రో జుల్లోగా తెలపాలంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. వారిచ్చే వివరణల ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాగా, ఈ నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు విస్తుపోవడంతో పాటు అధికా రుల తీరును తప్పుపడుతున్నారు. విధులు నిర్వహించి, ఎన్నికల రెమ్యూనరేషన్, డ్యూటీ సర్టిఫికెట్ పొందిన తమకు నోటీసులివ్వడమేంటని మండిపడుతున్నారు. దీనిపై సంబంధితాధికారులు పునఃపరిశీలన చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై డీఈవో ప్రణీతను వివరణ కోరగా.. బోథ్ ఏఆర్వో ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. వారిచ్చే వివరణల ఆధారంగా చర్యలు తీసుకుం టామని తెలిపారు. మరోవైపు అధికారుల తీరుపై పీఆర్టీయూ, ఎస్జీటీయూ, పీఆర్టీయూ తెలంగాణ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధులు నిర్వహించిన వారికి సైతం నోటీసులు విమర్శలకు తావిస్తున్న అధికారుల తీరు -
రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి
● జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ మంచిర్యాలఅగ్రికల్చర్: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో బెల్లంపల్లి ఆర్డీవో, ఇన్చార్జీ పౌరసరఫరాల శాఖ అధికారి హరికృష్ణ, డీఎం గోపాల్తో కలిసి జిల్లాలోని రేషన్డీలర్లు, గోదాముల ఇన్చార్జీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ నెల ఒకటి నుంచి 17 వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతీ డీలర్ బయోమెట్రిక్ విధానంలో బియ్యం తీసుకోవాలని, బస్తాలను తూకం వేసే సమయంలో డీలర్లు అక్కడే ఉండి పరిశీలించుకోవాలని తెలిపారు. చౌకధరల దుకాణాల్లో రేషన్ డీలర్ పేరు, మొబైల్ నంబర్, నిల్వలు, పంపిణీ వివరాలతో బోర్డులు నిర్వహించాలని తెలిపారు. పంపిణీ సమయంలో రేషన్డీలర్లు చౌకధరల దుకాణాల్లోనే ఉండాలని తెలిపారు. లబ్ధిదారులకు ఇబ్బంది తలెత్తకుండా బియ్యం పంపిణీ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. అధికారికంగా టీజీ అమలు మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇకపై టీఎస్ బదులుగా టీజీ అని అధికారంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, అధికారిక పత్రాలు(లెటర్ హెడ్, రిపోర్టు, నోటిఫికేషన్ ఇతరత్రా), ప్రభుత్వ కార్యాలయాలు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇతర అధికారిక సంప్రదింపుల్లో టీజీ అని తక్షణమే అమలు అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన అధికారిక కమ్యూనికేషన్ అంతర్గతంగా, బహిర్గతంగా టీజీ అని ఉపయోగించాలని, టీజీగా నవీకరించి ప్రచురించిన సామగ్రిని వినియోగించాలని తెలిపారు. -
‘ఆపరేషన్ కగార్ ఆపాలి’
పాతమంచిర్యాల: ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీల హత్యాకాండ ఆపాలని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మార్క్స్భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ మోదీ, అమిత్షా ప్రభుత్వం గత ఐదు నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో 120 మందికి పైగా గిరిజనులు, మహిళలు, పిల్లలను బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చి చంపిందని ఆరోపించారు. పాలకవర్గాలు విప్లవ సంస్థల కార్యకలాపాలను శాంతిభద్రతల సమస్యగా చూడడం సరైంది కాదని అన్నారు. విప్లవ సంస్థల లక్ష్యం ప్రజల ఆర్థిక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలపై పోరాటమేనని తెలిపారు. దేశంలో అసమానతలు, దోపిడీ, పీడన ఉన్నంత కాలం విప్లవ సంస్థల కార్యకలాపాలు, ఉద్యమాలు ఉంటాయని అన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి బ్రహ్మానందం, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ, అధ్యక్షురాలు జ్యోతి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లాల్కుమార్, అరుణోదయ సమితి రాష్ట్ర కోశాధికారి మల్లన్న, డి.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
ఎస్టీపీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీపీ) కాంట్రాక్టు, భూనిర్వాసిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి సీఎండీ బలరాంను బీఎంఎస్ అనుబంధ కాంట్రాక్టు ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యూ నియన్ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో సీఎండీ కార్యాలయంలో పలు స మస్యలపై వినతిపత్రం అందజేశారు. అర్హతకు తగి న వేతనాలు, పదోన్నతులు, అలవెన్సులు, కార్మి కుల కనీస వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బోడకుంట శ్రీధర్, జాయింట్ సెక్రెటరీ పెద్దిరెడ్డి, కిషన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో క్షేత్ర సహాయకుల కొరత
● జిల్లాలో పంచాయతీలు 311 ● పనిచేసేది 165 మందిప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే..జిల్లాలో ఉపాధి హామీలో క్షేత్ర సహాయకుల కొరత ఉన్నది వాస్తవమే. కొత్తగా ఏర్పడిన పంచాయతీల ప్రకారం కొత్తవారిని నియమించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే మాత్రం నియమిస్తాం. – కిషన్, డీఆర్డీవో, మంచిర్యాలదండేపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుల(ఫీల్డ్ అసిస్టెంట్ల) కొరత ఏర్పడింది. జిల్లాలో 311 పంచాయతీల్లో 165మంది మాత్రమే పని చేస్తున్నారు. జిల్లా ఏర్పాటు తర్వాత కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో వాటి సంఖ్య 311 చేరింది. పంచాయతీలకు అనుగుణంగా క్షేత్ర సహాయకులను నియమించలేదు. ప్రస్తుతం పాత పంచాయతీల వారీగానే పని చేస్తున్నారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్కు ఒకటి రెండు గ్రామ పంచాయతీలు అదనంగా.. లేనిపక్షంలో సీనియర్ మేట్లకు ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరికొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు నిర్వర్తిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్లను క్రమబద్ధీకరించాలని సమ్మె చేపట్టడంతో అందరినీ విధుల నుంచి తొలగించింది. ఒక దశలో ఆ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వారిని విధుల్లోకి తీసుకుంది. కానీ పంచాయతీకి ఒకరి చొప్పున మాత్రం కేటాయించలేదు. కొత్త సాఫ్ట్వేర్తో.. ఉపాధి హామీ పథకంలో గత రెండేళ్ల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్వేర్ను ఉపయోగించేవారు. అన్ని రాష్ట్రాల సాఫ్ట్వేర్లు ఒకేలా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అప్పటి నుంచి కొత్త సాఫ్ట్వేర్ వినియోగిస్తున్నారు. మొదట్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని గ్రామాలు పాత పంచాయతీ నుంచి విడిపోయి కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డా.. కూలీల పేర్లు రెండు పంచాయతీల్లో కనిపించడంతో చెల్లింపులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అధికారులు సాఫ్ట్వేర్లో పంచాయతీలను వేరు చేశారు. అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షించారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాఫ్ట్వేర్ ప్రకారం పంచాయతీలను యూనిట్గా చేసి పనులు గుర్తించారు. ఈ లెక్కన పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఉండాలి. కానీ అలా జరగడం లేదు. అన్ని చోట్ల కూలీల హాజరు నమోదు, క్షేత్రస్థాయిలో ఫొటోలు అప్లోడ్ చేయడం కొంత ఇబ్బందిగా మారుతోంది. సీనియర్ మేట్లతో.. ఫీల్డ్ అసిస్టెంట్ల కొరతతో పని ప్రదేశాల్లో ఉపాధి కూలీల హాజరు, ఫొటోలు తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో కొన్ని చోట్ల సీనియర్ మేట్లకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో అక్రమాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీకో క్షేత్ర సహాయకుడిని నియమించాలని పలువురు కోరుతున్నారు. -
కదిలిన మున్సిపల్ అధికారులు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులో ‘పారిశుధ్యం అస్తవ్యస్తం’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వార్డులో పేరుకు పోయిన చెత్తా చెదారాన్ని తొలగించారు. మురుగు కాలువలను శుభ్రం చేయించారు. రోడ్లపై పారుతున్న నీటిని పక్కకు మళ్లించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించారు. అనుమతి లేని పాఠశాలకు గుర్తింపు ఇవ్వొద్దుబెల్లంపల్లి: బెల్లంపల్లిలో ప్రారంభించనున్న ఓ ప్రైవేట్ పాఠశాలకు ఎలాంటి అనుమతులు లేవని, ఆ పాఠశాలకు గుర్తింపు ఇవ్వొద్దని స్థానికులు డీఈవో యాదయ్యను కోరారు. ఈ మేరకు శనివారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. పాఠశాలకు విద్య, అగ్నిమాపక, మున్సిపల్, పోలీసు ఇతర శాఖల నుంచి అనుమతులు రాలేదని తెలిపారు. రేకులషెడ్డులో పాఠశాల నిర్వహణకు సిద్ధమవుతున్నారని, ఫ్లెక్సీలు, కరపత్రాలు పంపిణీ చేసి మోసపూరిత ప్రకటనలతో అమాయక తల్లిదండ్రులను వంచిస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్కే.సల్మాన్పాషా, నస్పూరి అఖిల్, కళ్యాణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘పల్లె’ సమరానికి సన్నద్ధం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇక ‘పల్లె’ సమరానికి సన్నద్ధత మొ దలైంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వా త పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. బ్యాలెట్ బాక్సులు సరి చూసుకోవాలని, అవసరమైతే కర్నాటక, మహారాష్ట్ర రా ష్ట్రాల నుంచి తెప్పించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పంచాయతీ పాలకవర్గం గడువు ముగిసి ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. నిబంధనల ప్రకా రం ప్రత్యేక అధికారుల పాలన మూడు నెలలకు మించి కొనసాగించడానికి వీలు లేదని తెలుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ వచ్చేలోగా జిల్లాలో ఓటరు జాబితా తయారీ, బ్యాలెట్ బ్యాక్సులు సమకూర్చడం, బ్యాలెట్ పేపర్లు, సిబ్బంది నియామకం తదితర ఏర్పాట్లు పూర్తి చేసుకునేలా ప్రణాళికతో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో నిర్వహించాల్సి ఉంది. కానీ అప్పుడే కొలువుదీరిన రాష్ట్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన తీసుకొచ్చింది. పార్లమెంటు ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితా రూపొందించే అవకాశం ఉంది. ఓటరు సంఖ్య ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా రూపకల్పన ఉంటాయి. జిల్లాలో 311 గ్రామ పంచాయతీలు ఉండగా.. 2,730 వార్డులు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు లోక్సభ ఫలితాల అనంతరం నోటిఫికేషన్..? జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలుగత ఏర్పాట్లను సమీక్షిస్తాం...ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు జరుగుతాయి. గతంలోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఓటర్లు పెరగడంతోపాటు పోలింగ్ కేంద్రాలు కూడా పెరగవచ్చు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు మరోసారి ఏర్పాట్లు పునః సమీక్షిస్తాం. బ్యాలెట్ బాక్సులు, సిబ్బంది నియామకం వంటి వాటిపై కసరత్తు పూర్తి చేశాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయితీ అధికారి -
చెడు స్నేహాలు దరిచేర నీయొద్దు
మానవుని జీవిత కాలంలో టీనేజ్ అత్యంత కీలకమైన దశ. ఈ వయసు వారిలో పిల్లలు, యువత చాలా ఉత్తేజ స్థితిలో ఉంటారు. ఇలాంటి వారిపై వారి తల్లిదండ్రులే తగిన జాగ్రత్తలు వహిస్తూ క్రమశిక్షణలో ఉంచుకోవాలి. అనుక్షణం వారిని పర్యవేక్షించాలి. వేసవి సెలవులను వృధా చేయకుండా పోటీ పరీక్షలకు సిద్ధంకావడం, ఉన్నత తరగతుల పుస్తకాలు చదవడం, క్రీడల కోసం శిక్షణ తీసుకోవడం వంటి అలవాట్లవైపు వారి దృష్టి మళ్లించాలి. చెడుస్నేహాలకు దూరంగా ఉంచాలి. – డా.అల్లాడి సురేష్, సైకియాట్రిస్ట్, మానసిక వైద్యనిపుణులు, నిర్మల్ -
● ఏటా వరదలతో ప్రజలు అతలాకుతలం ● గోదావరి, ప్రాణహిత నదీ తీర పంటలపై ప్రభావం ● జిల్లా కేంద్రంలో పలు కాలనీలకు జలగండం ● ముందస్తు చర్యలపై ఇప్పటికీ పట్టింపు కరువే
చర్యలు ప్రారంభిస్తే మేలువరదలతో ముప్పుపై ముందస్తుగా చర్యలు చేపడితే నష్టం తగ్గించే అవకాశం ఉంది. వరదల తీవ్రత అంచనా వేసి ఉపశమన చర్యలు తీసుకోవాలి. గోదావరిలో భారీగా నీటి నిల్వ లేకుండా పర్యవేక్షించడంతోపాటు ముందస్తుగానే లోతట్టు కాలనీల్లో అవసరమైన చర్యలు చేపట్టాలి. తీరం వెంట చాలా మంది రైతులు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ముప్పుపై వ్యవసాయ అధికా రులు అవగాహన కల్పించాల్సి ఉంది. మా తాశిశు సంరక్షణ కేంద్రంలో వర్షకాలం సీజన్ ముందే జాగ్రత్త వహించాల్సి ఉంది. కరకట్టల నిర్మాణానికి తగిన అధ్యయనం చేయాల్సి ఉంది. జిల్లా కేంద్రంలో రాళ్లవాగుకు ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడంతోపాటు ఇరువైపుల వాగు బఫర్ ప్రాంతాన్ని రక్షించాల్సి ఉంది. ముంచుతున్న వరదలుగోదావరి, ప్రాణహిత నదీ తీరాల్లో అధిక వర్షాలకు పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత సీజన్లో చెన్నూర్, కోట పల్లి, జైపూర్ మండలాల్లోనే 42 గ్రామాలు ప్రభావితం అయ్యాయి. వేమనపల్లి మండలంలో పది గ్రామాలు, మంచిర్యాల, నస్పూర్ మండలాల నుంచి రెండేసి చొప్పున ప్రభావి తం అయ్యాయి. 5,201 మంది రైతులకు సంబంధించిన 9,065ఎకరాల్లోని పంటలు నీట మునిగినట్లు అధికారులు అంచనా వేశారు. మొదట అంచనా వేసి చివరకు జరిగిన నష్టం మేరకే ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. పరిహారం కోసం గత ఏడాది రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. జిల్లాలో దాదాపు 27వేల ఎకరాలపై వరద ప్రభావం పడుతోంది. అధి కంగా పత్తి పంట వేస్తున్న రైతులు పెట్టుబడి నష్టపోతున్నారు. విత్తనం వేసిన నెల రోజుల వ్యవధిలోనే నీట మునిగి నష్టం వాటిల్లుతోంది. మొక్క దశ నుంచే చేనుపై ప్రభావం చూపుతోంది. గోదావరి తీర ప్రాంతం చెన్నూర్, ప్రాణ హిత తీర ప్రాంతాలైన కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో రైతులకు మరింత ఇబ్బందిగా మా రింది. ఈ ప్రాంతాల్లో రైతుల భూములు సేకరించడమో లేక పరిహారం చెల్లించడం, ప్రత్యామ్నాయం చూపించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో రైతులకు వరదల గోస తప్పేలా లేదు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గత మూడేళ్లుగా జిల్లాను వరద నీరు ముంచెత్తుతోంది. అటు రైతుల పంటలు మునిగి.. ఇటు గోదావరి తీర ప్రాంతంలోని మంచిర్యాల, నస్పూర్ పట్టణాలు, శివారు ప్రాంతాలకు నీటిగండం పొంచి ఉంటోంది. వచ్చే నెల మొదటి వారం నుంచే నైరుతి రుతు పవనాల రాకతో వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో వరదలపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ అధికార యంత్రాంగం ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో రాబోయే ముప్పు ఎలా ఎదుర్కొంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల హడావుడిలో ఉంటూ వరద ముప్పుపై పట్టింపు లేదనే వాదనలున్నాయి. హామీల అమలు ఎప్పుడో.. వరద ముంపు తగ్గించేందుకు మంచిర్యాల పట్టణ శివారు గోదావరికి, రాళ్లవాగుకు కరకట్టల నిర్మాణంతోపాటు లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ నాయకులు హామీలు గుప్పించారు. వానకాలం సమీపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసి వరద ఉధృతి సమయంలో గేట్లు ఎత్తితే దిగువన ప్రభావం చూపిస్తోంది. ఇక జిల్లా కేంద్రంలో రాళ్లవాగు, శివారులోని మంచిర్యాల పట్టణం రాళ్లవాగుకు ఆనుకుని ఉన్న కాలనీ అధికంగా ప్రభావానికి గురవుతున్నాయి. ర్యాలీ వాగుతో వేంపల్లి వరకు ప్రభావం చూపుతోంది. గోదావరి ఒడ్డున ఉన్న మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఏటా తిప్పలు తప్పడం లేదు. అత్యవసర వేళ గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలను వరద వస్తే హుటాహుటిన తరలించాల్సి వస్తోంది. ఆ సమయంలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదల తర్వాత ఆస్పత్రి మళ్లీ ప్రారంభించే వరకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి వస్తోంది. ఇక ముంపు కాలనీలను పునరావాస కేంద్రాలకు తరలించడంతోపాటు నీట మునిగితే భారీగా బాధితులకు ఆస్తినష్టం ఏర్పడుతోంది. -
కజకిస్తాన్ దేశంలో అల్లర్లు
● చిక్కుకున్న పలువురు తెలుగు విద్యార్థులు ● మంచిర్యాల విద్యార్థిని సురక్షితం మంచిర్యాలక్రైం: కజకిస్తాన్ దేశంలో జరుగుతున్న అల్లర్లలో కొందరు తెలుగు విద్యార్థులు చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులకు అందిన సమాచారంతో ఆందోళన చెందుతున్నారు. ఇందులో మంచిర్యాలకు చెందిన ఎంబీబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని కూడా ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అల్ల ర్లు జరుగుతున్న ప్రాంతానికి 250 కిలోమీటర్ల దూరంలోని ఆల్మైటి ప్రాంతంలో పలువురు తెలుగు విద్యార్థులతో కలిసి క్షేమంగానే ఉన్నట్లు ఫోన్ ద్వారా తెలుసుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ముందస్తుగా లాక్డౌన్ ప్రకటించి, తెలుగు విద్యార్థులు బయటకు వెళ్లవద్దని ఆంక్షలు విధించింది. దీంతో కొంత ఆందోళన నెలకొంది. -
No Headline
ఇటీవల సారంగాపూర్ మండలంలోని బోరిగాం గ్రామంలో పదమూడేళ్ల బాలుడు మొబైల్ ఫోన్కు బాగా అలవాటుపడ్డాడు. రో జంతా సెల్ఫోన్లలో సోషల్ మీడియా, రీల్స్ తదితర మాధ్యమాల్లో మునిగితేలుతుండడంతో ఆ అలవాటు మాన్పించాలని అతని తండ్రి మందలించాడు. అయితే మనస్తాపానికి గు రైన ఆ యువకుడు ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ సమీపంలోని జాతీయ రహదారిపై రాత్రి 9 గంటల తర్వాత దాదాపు 18 నుంచి 25 సంవత్సరాల లోపు యువకులు ద్విచక్ర వాహనాలపై ఇష్టారీతిన నడుపుకుంటూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కారు. ఆరా తీస్తే అప్పటికే వారు దాబాహోటల్లో మద్యం సేవించి ఇంటికి తిరిగి వస్తున్నట్టు తెలిసింది. పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మందలించి ఇంటికి పంపించారు. -
ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్సనే చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని ఆర్ఎంపీలు, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, పేరు ముందు డాక్టర్ అని రాసుకోవద్దని, ఎలాంటి మందులను ప్రిస్క్రిప్షన్పై రాయవద్దని, అర్హతకు మించి వైద్యం చేయకూడదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం జిల్లాలోని ఆర్ఎంపీలు, పీఎంపీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ జిల్లాలో జాతీయ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్ ద్వారా ఆర్ఎంపీలు, పీఎంపీలపై తనిఖీలు చేపడుతున్నాయని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారంగా ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, ఇష్టారీతిన మందులు ఇవ్వడం, రాయడం వంటివి చేస్తే చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
రైతు వేదికలో కిష్కింద కాండ
● ఫ్యాన్లు, ట్యూబ్లు, ఫైళ్లు చిందరవందర ● ఇద్దరిని కరిచిన వానరాలు జన్నారం: మండలంలోని కలమడుగులో రైతుల కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదిక వానరాల చిలిపి చేష్టలతో కిష్కింద కాండ సృష్టించాయి. మూడు రోజుల క్రితం భవనంలోకి చొరబడిన కోతులు విద్యుత్ పరికరాలు, ఫైళ్లను చిందర వందర చేశాయి. ఫ్యాన్ల రెక్కలు వంచాయి. ట్యూబ్ లైట్లను తొలగించాయి. ఏఈవో గదిలోకి ప్రవేశించి కాగితాలు, ఫైళ్లను చించివేశాయి. రాత్రి కూడా అందులోనే ఉంటూ గది మొత్తం మలమూత్రాలతో నింపాయి. రెండు రోజుల క్రితం రైతు వేదికను శు భ్రం చేయడానికి వెళ్లిన పనిమనిషి భీమక్కపై దాడిచేసి గాయపరిచాయి. రైతు వేదికకు వచ్చిన రైతులను కూడా తరిమినట్లు రైతులు పేర్కొంటున్నారు. కాన్ఫరెన్స్ ఎలా నడిపేది? ప్రస్తుత ప్రభుత్వం త్వరలో రైతులకు సూచనలు అందించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉందని ఏఈవో దివ్య తెలిపారు. ఒకవేళ టీవీ అమర్చితే కోతులు పడేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఫ్యాన్లను వంచి పనికి రాకుండా చేశాయని, బాత్ రూమ్ ట్యాంక్ పైపులను తొలగించడంతో నిరుపయోగంగా మారాయన్నారు. కోతులు రైతువేదిక లోనికి చొరబడకుండా జాలీలు ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ చైర్మన్ స్వదేశ్కుమార్, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఏవో సంగీతను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశానని, ఏదైనా ఫండ్ వస్తే పరిష్కారం చేసే అవకాశం ఉందన్నారు. -
‘ఇంజనీర్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలి’
శ్రీరాంపూర్: జైపూర్ ఎస్టీపీపీలో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్ కిరీటి మృతికి కారకులపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సింగరేణి అఽధికారుల సంఘం (సీఎంఓఏఐ) నాయకులు డిమాండ్ చేశారు. శనివారం శ్రీరాంపూర్ ఇన్చార్జి జీఎం పీ.శ్రీనివాసును కలిసి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పనిఒత్తిడి, విజిలెన్స్ అధికారుల ఎంక్వయిరీ వలన మరణిస్తున్నట్లు నోటు రాసి సదరు ఇంజనీర్ చనిపోయాడని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సరైన వసతులు లేకున్నా, సంస్థ కోసం అహర్నిశలు పనిచేస్తున్న అధికారుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా అనాలోచిత చర్యలు తీసుకోవడం వలన వారి ఆత్మస్థైర్యం దెబ్బతిని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ శ్రీధర్, అధికారులు మురళీధర్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ‘అధికారులపై వేధింపులు ఆపాలి’ మందమర్రిరూరల్: సింగరేణిలో అధికారులపై విచారణ పేరిట వేధింపులకు ఆపాలని డిమాండ్ చేస్తూ సింగరేణి అధికారుల సంఘం మందమర్రి ఏరియా అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో శనివారం ఎస్వో టూ జీఎం రాజేశ్వరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కిరీటి ఆత్మహత్యకు పనిఒత్తిడి, విజిలెన్స్ అధికారుల వేధింపులే కారణమన్నారు. మృతిపై విచారణ జరిపించాలి జైపూర్: ఎస్టీపీపీలో వోఅండ్ఎం ఎస్ఈగా పనిచేసిన బి.కిరీటి మృతిపై విచారణ జరిపించాలని ఎస్టీపీపీ జీఎం బసివిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఎంవోఏఐ అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, సెక్రెటరీ సంతోశ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
భయాందోళన సృష్టించిన ఎద్దులు
బెల్లంపల్లి: పట్టణంలోని బజార్ ఏరియా ప్రాంతంలో శనివారం రాత్రి ఆంబోతులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. రోడ్డు పైకి వచ్చిన రెండు ఆంబోతులు ఒక్కసారిగా కుమ్ములాటకు దిగాయి. డివైడర్కు అటు ఇటుగా ఆంబోతులు కొమ్ములతో కలబడి తీవ్ర భయబ్రాంతులకు గురిచేశాయి. రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్డు మీద నడిచి వెళ్లే పాదచారులు షాపులకు పరుగులు పెట్టారు. కొందరు యువకులు కర్రలు పట్టుకుని ఆంబోతులను విడగొట్టడానికి యత్నించిన ప్రయోజనం లేకుండా పోయింది. బజార్ ఏరియా రోడ్ నంబర్ 3 గల్లీ వద్ద నుంచి రోడ్ నంబర్ 4 , పై గల్లీ వరకు రంకెలు వేస్తూ భయానక పరిస్థితులు కల్పించాయి.పెద్ద ఎత్తున జనం గుమిగూడి కర్రలు పట్టుకుని అదిరిస్తూ అతి కష్టంగా రెండింటిని విడగొట్టారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిమందమర్రిరూరల్: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇల్లందు క్లబ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన కుర్మ రాధమ్మ(60) అల్లుడు ఇటీవల చనిపోగా ఆదివారం నిర్వహించనున్న దశదినకర్మ కోసం శనివారం మందమర్రికి వచ్చింది. స్థానిక ఇల్లందు క్లబ్ వద్ద బస్సు దిగి సీఎస్పీ రోడ్డు వైపు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. తేనెటీగల దాడిలో పూజారి మృతిరెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గోలేటి భీమన్న ఆలయ పూజారి పోషం (68) శనివారం తేనెటీగల దాడిలో మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని రేకులగూడకు చెందిన పోషం (68) గోలేటి టౌన్షిప్ లోని భీమన్న ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం సమయంలో ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ పరిసరాల్లో వంటలు చేసుకునే కట్టెలతో పొయ్యి వెలిగించారు. దీంతో పొగ వ్యాపించడంతో సమీపంలోని వేపచెట్టుపై ఉన్న తేనెటీగలు మూకుమ్మడిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన పోషం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు భీంరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement