-
కిక్ బాక్సింగ్లో జిల్లాకు పతకాలు
నిర్మల్టౌన్: ఈనెల 21 నుంచి 27 వరకు పూణేలోని ఛత్రపతి శివాజీ స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో నిర్మల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించారు. ఎల్.నాగలక్ష్మి కిక్ లైట్ 32 కేజీల విభాగంలో, సుజల కిక్ లైట్ 55 కేజీల విభాగంలో, నక్షత్ర లైట్ కాంటాక్ట్ 70 కేజీల విభగంలో వెండి పతాకాలు సాధించారని బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చందుల స్వామి వివరించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా క్రీడల అధికారి నప్పేఖాన్, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రామారావు ప్రత్యేకంగా అభినందించారు. -
నకలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
● జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ తానూరు: నకిలీ విత్తనాలు అమ్మే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి అంజిప్రసాద్ హెచ్చరించారు. వానకాలం సాగు నేపథ్యంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలపై రైతులు, విత్తన షాపుల డీలర్లకు మంగళవారం అవగాహన కల్పించారు. రైతులకు కాలం చెల్లిన, నకిలీ విత్తనాలు, మందులు అమ్మినా లైసెన్స్ రద్దు చేయడడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో విధిగా రశీదు పొందాలన్నారు. రశీదుపై వివరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచించారు. ప్యాకింగ్లేని విత్తనాలు కొనుగోలు చేయద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏడీఏ వీణ, ఏవో గణేశ్, వ్యవసాయ విస్తరణ అధికారులు పవన్, సంఘవి, అంబాదాస్, విష్ణు, మండలంలోని డీలర్లు పాల్గొన్నారు. రైతులకు అవగాహన ముధోల్: మండల కేంద్రంలో రైతులకు జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ మంగళవారం అవగాహన కల్పించారు. విత్తనాల కొనుగోలపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు కొనుగోలు చేయొద్దని తెలిపారు. ఎవరైనా విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రశీదు తీసుకోవాలని, దానిపై లాట్ నంబర్ నమోదు చేయించుకోవాలని తెలిపారు. సాగులో వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలన్నారు. సమావేశంలో ఏడీఏ వీణ, ఏవో అజ్మీర భాస్కర్, ఏఈవో ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు. -
నిర్మల్
అరచేతిలో వాతావరణం రైతులు, ప్రజలకు వాతావరణ మార్పులు తెలిసేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్లు రూపొందించింది. బుధవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 20248లోu నెలాఖరు వరకే జొన్నల కొనుగోళ్లు నిర్మల్చైన్గేట్: మార్కెఫెడ్ ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు జొన్నల కొనుగోళ్లు ఈనెల 31 వరకు మాత్రమే చేపట్టనున్నట్లు మర్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. జిల్లాలో మార్క్ఫెడ్ అధ్వర్యంలో తొమ్మిది ప్రాథమిక సహకార సంఘాల ద్వారా షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వ మద్దతు ధర రూ.3180తో ఇప్పటి వరకు 74,73,000 మెట్రిక్ టన్నులను జొన్నలు 3,359 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు వివరించారు. కొనుగోళ్లు గ్రామాల వారీ షెడ్యూల్ ప్రకారం దాదాపు అన్నీ గ్రామాల్లో పూర్తయినట్లు తెలిపారు. ఇంకా అమ్మకుండా ఉన్న రైతులు తమకు సంబంధించిన మార్కెట్ యార్డ్లో ఈనెల 31లోపు విక్రయించాలని సూచించారు. బీడీలు చుడుతున్న మహిళలు నిర్మల్చైన్గేట్: వేతనాల పెంపుకోసం బీడీ కార్మికులు దశాబ్దంగా చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత బీడీ కార్మికులకు చెల్లించే కూలితోపాటు, ఉద్యోగులు, ప్యాకర్ల వేతనాలను పెంచేందుకు యాజమాన్యాలు అంగీకరించాయి. ఈమేరకు యాజమాన్యాలకు, బీడీ కార్మిక సంఘాలకు మధ్య ఈనెల 25న హైదరాబాద్లో జరిగిన చర్చలు ఫలించాయి. వేతనాల పెంపుపై కార్మిక సంఘాలు, యాజమాన్యాలకు మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 1.7 లక్షల మంది బీడీ కార్మికులు, సుమారు 7,500 మంది బీడీప్యాకర్లు, ఉద్యోగులకు లబ్ధి కలుగనుంది. ఉమ్మడి జిల్లాలో 1.15 లక్షల మందికి లబ్ధి.. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 1.15 లక్షల మందికిపైగా కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఆదిలాబాద్, ని ర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో టెలిఫోన్ కంపెనీ, చార్బాయ్, దేశాయి, శివాజీ, ఠాకూర్, సదరన్ ఇండియా కంపెనీలతోపాటు పలు బీడీ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఉమ్మడి జిల్లాలో బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని బీడీలు చేయిస్తున్నారు. 1.15 లక్షల మంది కార్మికుల్లో 60 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించే జీవనభృతి సౌకర్యం ఉండగా.. మరో 55,000 మంది కార్మికులకు లేదు. బీడీ సాటర్లు, చెన్నవాలా, గంపవాలాలు సుమారు 5 వేల మంది వరకు పని చేస్తున్నారు. ధరలకు అనుకూలంగా లేని పెంపు.. బీడీ కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం వేతనాలు, కూలి అమలు చేయాలి. ఈమేరకు కార్మిక సంఘాలు 15 ఏళ్లుగా పోరాటాలు చేశాయి. బీడీ పరిశ్రమను ప్రభుత్వాలే సంక్షోభంలోకి నెట్టేయడంతో కార్మిక, యాజమాన్య సంఘాలు పరస్పర అవగాహనతోనే పరిశ్రమను కాపాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఈసారి జరిగిన చర్చల్లో కూడా యాజమాన్యం కూలీలకు కేవలం రూపాయి పెంచడానికి మాత్రమే మొదట అంగీకరించాయి. బీడీ ప్యాకర్లు, నెలసరి ఉద్యోగులకు కూడా అంతగా పెంచడానికి సుముఖుత చూపలేదు. ఇరువర్గాల మధ్య ఈనెల 20న జరిగిన చర్చలు సఫలం కాలేదు. ఆరోజు బీడీ కార్మికులకు పది రూపాయల కూలి పెంచాలని కార్మిక సంఘాలు పట్టుపట్టాయి. దీంతో చర్చలు వాయిదా పడ్డాయి. శనివారం రెండో దఫా చర్చలు కొనసాగించగా పరస్పర అంగీకారంతో బీడీ కార్మిక సంఘాలు, యాజమాన్యాలు కూలీ, వేతనం పెంచడానికి అంగీకరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తరువాత ఎక్కువ మందికి ఉపాధి నిచ్చేది బీడీ పరిశ్రమ. ఈ బీడీ పరిశ్రమలో ఇంటికి ఒక్కరు చొప్పున బీడీ కార్మికులు బీడీలు చుడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. 2016 సంవత్సరం నుంచి బీడీ పరిశ్రమ రోజురోజుకూ క్షీణిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తూ బీడీ కార్మికులను పట్టించుకోకుండా పరిశ్రమను మూసివేసే దిశగా కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కార్మికులను ప్రభుత్వాలే ఆదుకోవాలి. –కె.రాజన్న, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యూస్రీల్ బీడీ యాజమాన్యాలతో చర్చలు సఫలం 15 ఏళ్ల తర్వాత నూతన ఒప్పందం కార్మికుల కూలి రూ.4.25 పెంపు.. ఉద్యోగులకు రూ.1,700, ప్యాకర్లకు రూ.3,650 1.15 లక్షల మందికి ప్రయోజనం వేతనాల పెంపు ఇలా... వెయ్యి బీడీలకు గతంలో రూ.245.08 చొప్పున కూలి చెల్లించేవారు. తాజాగా రూ.4.25 పెంచిన యాజమాన్యాలు రూ.249.99 చొప్పున చెల్లించనున్నాయి. బీడీ ప్యాకర్లకు ప్రస్తుతం పొందుతున్న వేతనంపై నెలకి అదనంగా రూ.3,650, నెలవారీ వేతనం పొందే బట్టీవాలా, చెన్నీవాలా, బీడీ సాటర్లకు నెలకు రూ.1,700 పెంచేందుకు యాజమాన్యాలు ఒప్పుకున్నాయి. నూతన అగ్రిమెంట్ మే 1 నుంచి అమలులోకి రానుంది. కొత్త వేతనం రెండేళ్లపాటు అమలులో ఉండేలా ఒప్పందం కుదిరింది. -
పుస్తకాలు వచ్చేశాయ్
మామడ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పాఠ్యపుస్తకాలు ఆరంభంలోనే అందితే ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్ను పూర్తి చేయడంతోపాటు బోధనకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం జిల్లాకు అవసరమైన పుస్తకాల్లో 83 శాతం పుస్తకాలను ఇప్పటికే జిల్లాకు పంపింది. మరోవైపు ఒక జత యూనిఫాం అందించే పనులను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇవిలా ఉండగా, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కార్యక్రమంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో 533 ప్రాథమిక పాఠశాలలు 85 ప్రాథమికోన్నత పాఠశాలలో 117 ఉన్నత పాఠశాలలు, 18 కేజీబీవీలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 6,389 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను రెండు సెట్లుగా విభజించారు. ఇప్పుడు మొదటి సెట్ పుస్తకాలు గోదాంకు చేరుకున్నాయి. విద్యార్థులకు 3,63,946 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, పాతవి 2,170 అందుబాటులో ఉన్నాయి. పుస్తకాల నిల్వ కేంద్రానికి 3,01032 పుస్తకాలు చేరుకున్నాయి. 1 నుంచి బడిబాట.. జూన్ 1 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. పాఠశాలల్లో అందించే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య, పాఠశాలలో అందించే సౌకర్యాలను పోషకులకు వివరించి విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం పెంచాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు పుస్తకాలు.. మరోవైపు జూన్ 12న విద్యార్థులకు పంపిణీ చేసేందుకు జిల్లా కేంద్రంలోని గోదాం నుంచి పుస్తకాలను ఎమ్మార్సీలకు తరలిస్తున్నారు. ఉన్న త పాఠశాలలకు నేరుగా పుస్తకాలను అందిస్తున్నారు. గతంలో పాఠ్యపుస్తకాలు రావడం ఆలస్యం కావడంతో పాఠ్యాంశాల బోధన ఆలస్యమయ్యేది. ఈ ఏడాది పాఠశాల ఆరంభానికి ముందే పాఠ్యపుస్తకాలు రావడంతో ప్రణాళిక ప్రకా రం తరగతులు కొనసాగనున్నాయి. ఆటంకం లేకుండా విద్యార్థుల చదువులు సాగనున్నాయి. ఎమ్మార్సీలకు చేరిన పుస్తకాలను అక్కడి నుంచి పాఠశాలలకు చేరేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నారు. మొదటి పార్ట్లోని పుస్తకాలలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ ఉంటుంది. సెప్టెంబర్లో పార్ట్ 2కు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు అందిస్తారు. మొదటి రోజే పాఠ్యపుస్తకాలు.. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు పాఠశాలల్లో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 83 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటిని ఎమ్మార్సీలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడి నుంచి పాఠశాలలకు తీసుకువెళ్లాలని ప్రధానోపాధ్యాయులకు సూచించాం. పాఠశాలల ఆరంభం రోజే విద్యార్థులకు అందిస్తాం. – రవీందర్రెడ్డి, డీఈవో జిల్లాకు 83 శాతం చేరిక -
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం
నిర్మల్ టౌన్: పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల తెలిపారు. ఇటీవ ల అనారోగ్యంతో మరణించిన భైంసా పట్టణ ఏఎస్సై బాలాజీ కుటుంబానికి పోలీస్ భద్రత నుంచి మంజూరైన చెక్కును పోలీస్ ప్రధాన కార్యాలయంలో అతని కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. భైంసా పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించే బాలాజీ మార్చి 01న అనారోగ్యంతో మరణించాడు. దీంతో తెలంగాణ పోలీస్ భద్రత పథకం ద్వారా ఏఎస్ఐ కు టుంబానికి రూ.7,99,895 చెక్కును బాలాజీ భార్య సురేఖకు ఎస్పీ అందజేశారు. కుటుంబ స్థితిగతుల పై ఆరా తీయడంతోపాటు, శాఖాపరంగా రావాల్సి న బెనిఫిట్లను త్వరగా అందేలా చూస్తామని తెలి పారు. పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధి విరాసత్ అలీ, ఏవో యూనుస్ అలీ పాల్గొన్నారు. ఎస్పీ జానకీషర్మిల -
సదరం స్లాట్.. సమస్య లేదిక..!
భైంసాటౌన్: దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే ధ్రువీకరణపత్రం ఉండాల్సిందే. ఇందుకు వైద్యారోగ్యశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ సంయుక్తంగా ప్రతినెలా శిబిరాలు నిర్వహిస్తారు. అర్హులైన దివ్యాంగులు ముందుగా స్లాట్ బుక్ చేసుకుని సదరం శిబిరాల్లో వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలి. వారి వైకల్య పరిస్థితిని బట్టి తాత్కాలిక(రెండేళ్లు), శాశ్వత దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. తాత్కాలిక దివ్యాంగ సదరం సర్టిఫికెట్ పొందినవారు గడువు పూర్తికాగానే పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మళ్లీ మీసేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని, శిబిరానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఇబ్బందులకు చెక్.. అయితే, ఇదివరకు సదరం స్లాట్ బుకింగ్ అంటే దివ్యాంగులకు ప్రయాసతో కూడిన పని. సదరం శిబిరం నిర్వహించే షెడ్యూల్ తేదీలకు వారం ముందు స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించేవారు. నెలకోసారి నిర్వహించే శిబిరానికి 60 మందికి మాత్రమే అవకాశమిచ్చేవారు. దరఖాస్తుదారులు వందల్లో ఉండడం, స్లాట్లు మాత్రం తక్కువ సంఖ్యలో ఉండడంతో స్లాట్ బుకింగ్కు అవకాశమిచ్చిన రోజు ఉదయమే బుక్ అయిపోయేవి. దీంతో చాలామంది అర్హులైన దివ్యాంగులు మీసేవా కేంద్రాలకు వెళ్లేలోపే స్లాట్లు బుక్ అయిపోయాయన్న సమాధానం మీసేవా కేంద్రాల నిర్వహకుల నుంచి వచ్చేది. ఫలితంగా వారు నిరాశతో వెనుదిరిగేవారు. ఇలా ప్రతినెలా స్లాట్ బుకింగ్కు అవకాశమిచ్చినా.. సరిపడా స్లాట్లు లేక నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. స్లాట్ బుకింగ్ కోసం దివ్యాంగులు వ్యయ, ప్రయాసలతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. అధికారికంగా ఆదేశాలు రాలేదు.. సదరం స్లాట్ బుకింగ్ నిరంతర ప్రక్రియగా మారింది. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు సైతం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఆదేశాలు రాలేదు. సదరం శిబిరాలకు నిరంతర స్లాట్ బుకింగ్తో దివ్యాంగులకు ప్రయోజనం కలుగుతుంది. – శోభారాణి, డీపీఎం, డీఆర్డీఏ నిరంతర ప్రక్రియగా స్లాట్ బుకింగ్ఇక నిరంతరం.. దివ్యాంగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సదరం స్లాట్ బుకింగ్ను నిరంతరం చేశారు. మీసేవా కేంద్రాల్లో ఎప్పుడైనా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఆయా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే స్లాట్ ఉంటే క్యాంపు తేదీ, శిబిరం నిర్వహించే చోటు చూపిస్తుంది. ఒకవేళ స్లాట్ లేకపోతే వెయిటింగ్లో చూపిస్తుంది. స్లాట్ అందుబాటులోకి రాగానే, దరఖాస్తు చేసుకున్నవారికి స్లాట్ కేటాయింపు జరుగుతుంది. ఈ మేరకు మొబైల్కు మెసేజ్ కూడా వస్తుంది. దీని ఆధారంగా ఆయా తేదీన నిర్వహించే శిబిరానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సదరం స్లాట్ బుకింగ్ నిరంతరం కావడంతో ఇప్పటికే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో దాదాపు 870 వరకు దరఖాస్తులు వెయిటింగ్లో ఉన్నాయి. -
తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్
నిర్మల్టౌన్: నటుడిగా, రాజకీయ నేతగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి ఏళ్లు గడుస్తున్నా తెలుగువారి గుండెల్లో నిలిచి ఉన్నారని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ అన్నారు. ఎన్టీఆర్ 101వ జయంతి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పార్టీలకు అతీతంగా మంగళవారం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రజాహిత, పాలనకు ప్రతీక నందమూరి తారక రామారావు అని కొనియాడారు. రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందజేసి పేదవారి గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి
నిర్మల్చైన్గేట్: లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అధికారులను ఆదేశించారు. హైదరా బాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓట్ల లెక్కింపుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బంది సకాలంలో కేంద్రాలకు చేరుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏ ర్పాటు చేయాలని సూచించారు. అనధికార వ్యక్తులేవరూ కౌంటింగ్ కేంద్రల్లోకి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపు సకాలంలో ప్రారంభించి, కచ్చితమైన ఫలితాలను వెలువరించాలని సూచించారు. రౌండ్ల వారీగా పూర్తయిన లెక్కింపు వివరాలను సంబంధిత ఫారాలలో నింపాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సందేహాలు, సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర మీడియా సెంటర్లు ఏర్పాటు చేసి లెక్కించిన ఓట్ల వివరాలను తెలియజేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని సీసీ టీవీ రికార్డు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లెక్కింపు విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించడానికి ఐటీ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, నిర్మల్, ముధోల్, ఉట్నూర్, ఆర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్రెడ్డి, జీవాకార్, డీఎస్పీ గంగారెడ్డి, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస్, ఈడీఎం నదీం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఈసీ వికాస్రాజ్ -
భగీరథకు.. నీటిగండం
కడెం ప్రాజెక్టులో గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో ఇంటెక్వెల్కు నీరందేలా అధికారులు పొక్లెయిన్తో కాలువ తీయిస్తున్నారు.8లోu సదుపాయాలు కల్పించాలి ప్రభుత్వం ముందస్తుగా అకాడమిక్ ప్లానింగ్ ప్రకటించడం స్వాగతిస్తున్నాం. చదువుతో పాటు బడుల్లో మౌలిక సదుపాయాలు కూడా మెరుగుపరచాలి. కోవిడ్ తర్వాత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కరిస్తే మరింత వృద్ధి సాధించే అవకాశం ఉంది. – రవికాంత్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పుస్తకాలు, యూనిఫాం ఇవ్వాలి ప్రభుత్వం ప్రకటించిన విద్య అకాడమిక్ క్యాలెండర్ను స్వాగతిస్తున్నాం. బడులు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం కూడా ఇవ్వాలి. బడిబాటలో పాల్గొనే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఎర్నింగ్ లివ్ (ఈఎల్) సదుపాయం కల్పించాలి. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై అధికారులు మరింత సమీక్ష చేయాలి. – భూమన్న యాదవ్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు -
సమష్టి కృషి ఫలితమే వేతనాల పెంపు
నిర్మల్చైన్గేట్: బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ కేటగిరీలకు చెందిన కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు పెరగడం సమష్టి కృషి ఫలితమే అని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.రాజన్న అన్నారు. కార్మికుల వేతనాలు పెరిగిన సందర్భంగా బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని సోఫీనగర్లో బీడీ ఫ్యాక్టరీ ఎదుట కార్మికులు టపాకాయలు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అనంతరం బీడీ వర్కర్స్ ప్యాకింగ్ జిల్లా కార్యదర్శి కిషన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో నాయకులు మాట్లాడుతూ పెరిగిన వేతనాలు మే నెల నుంచి అమలులోకి వస్తాయన్నారు. 1000 బీడీలకు రూ.4.25 పైసలు, బీడీ ప్యాకర్లకు నెలకు రూ.3,650, నెలసరి ఉద్యోగులకు రూ.1,700 వేతనం పెరిగినట్లు తెలిపారు. ఈ అగ్రిమెంటు 2026 వరకు అమలులో ఉంటుందని, రాష్ట్రంలో ఏడు లక్షల మందికి వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే.లక్ష్మి, గంగామణి, రాజేందర్, ఎల్లయ్య, రవి, వెంకటి, లక్ష్మణ్, కే.రాజు, మురళి, చిన్నయ్య, రవి, కమల, కవిత, నరసవ్వ, తదితరులు పాల్గొన్నారు. -
సేవల సౌలభ్యానికి సర్వే
● అంగన్వాడీ సేవలపై కుటుంబ సర్వే ● పలు వివరాలు ఆన్లైన్లో నమోదు ● అవకతవకలకు చెక్ నిర్మల్చైన్గేట్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం కుటుంబ సర్వే చేపడుతోంది. కేంద్రాల ద్వారా అందించే పాలు, గుడ్లు, బాలామృతం వంటివి లబ్ధిదారులకు చేరకుండానే చేరినట్లు రికార్డుల్లో రాసే విధానానికి చెక్ పెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ‘న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సి స్టం’ పేరిట సర్వే చేపడుతోం ది. మార్చి నుంచే ప్రక్రియ ప్రారంభం కాగా ఎన్నికల నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం సర్వే పనుల్లో వేగం పెంచారు. వివరాలు ఆన్లైన్లో నమోదు సర్వే ఆధారంగా వివరాలు సేకరించిన సిబ్బంది ఆ న్లైన్లో నమోదు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్లలో సర్వే ను ఒకేసారి పొందుపరుస్తున్నారు. కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని ఇంటినంబర్, కాలనీ పేరు, చిన్నారులు, తల్లిదండ్రులు గర్భిణులు, బాలింతలు, జనన, మరణాలు, ఇల్లు, ప్రస్తుతం ఉన్న కేంద్రం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. సర్వే అనంతరం కేంద్రాలకు సంబంధించి ఇళ్ల సర్దుబాటు ప్రక్రియ చేపడుతారు. కేంద్రానికి దూరంగా ఉండే ఇళ్లను సమీపంలో ఉన్న కేంద్రానికి దూరంగా ఉండే ఇళ్లను సమీపంలో ఉన్న కేంద్రానికి బదిలీ చేస్తారు. సర్వే లక్ష్యం ఇదే.. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి ఒక పూట సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. ఇందులో బాలింతలు, గర్భిణులకు రోజుకు బియ్యం 150 గ్రాములు, కందిపప్పు 30 గ్రాములు, నూనె 16 గ్రాములు, పాలు 200 మిల్లీ గ్రాములు, ఒక గుడ్డు ఇవ్వాలి. పిల్లలకు బియ్యం 75 గ్రాములు, కందిపప్పు 15 గ్రాములు, నూనె 5 గ్రాములు, మూడేళ్ల లోపు పిల్లలకు 16 గ్రాములు, ఆపై వయస్సు వారికి పనిరోజులు పరిగణనలోకి తీసుకుని రోజుకు ఒక గుడ్డు అందిస్తారు. సర్వేలో భాగంగా కుటుంబాల సంఖ్య, జనాభా వివరాలు, చిన్నారులు ఎత్తుకు తగిన బరువు ఉన్నారా? లేదా? అనేది తేలనుంది. తద్వారా పోషక లోపంతో బాధపడుతున్న వారి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం ఏ మేరకు అందుతుందో ఒక అంచనా ఏర్పడుతుంది. గుడ్లు, పాలు కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయా చిన్నారులు, గర్భిణులు, బాలింతల పేరిట ప్రభుత్వం అందిస్తున్న వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించడం, ఇంటికి తీసుకెళ్లడం వంటివి చేస్తున్నారనే విమర్శలున్నాయి. మరో వైపు ప్రతినెలా చిన్నారుల ఎత్తు, బరువు వివరాలు నమోదు చేయాలి. ఇది నామమాత్రంగా చేపట్టడం వల్ల పోషకలోపంతో బాధపడుతున్న వారి వివరాలు పక్కాగా తెలియడం లేదు. దీంతో చిన్నారులకు అందాల్సిన పౌష్టికాహారం పంపిణీ కాక వారు బక్కచిక్కిపోతున్నారు. ఈ ఇబ్బందులను అధిగ మించేందుకు సర్వే చేపడుతున్నారు. సర్వే తీరు ఇది.. సర్వేలో భాగంగా సిబ్బంది ప్రతీ అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మొదట కుటుంబ యజమాని పేరుతో న మోదు ప్రారంభించి తర్వాత సభ్యుల వివరాలు న మోదు చేస్తున్నారు. వయస్సు, ఫోన్ నంబర్, కులం, ఉపకులం, పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నంబర్ ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారి వివరాలు సైతం నమోదు చేస్తున్నా రు. ఈ ప్రక్రియ చేపట్టడానికి అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు అందించి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. పక్కదారికి అడ్డుకట్ట.. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు అందించే వస్తువులు ఇకపై పక్కదారి పట్టకుండా ఉంటాయి. గతంలో గర్భిణులు, బాలింతలు రాకపోయినా వచ్చినట్లే రాసేవారు. ఇకపై కేంద్రానికి వచ్చి భోజనం చేస్తేనే హాజరైనట్లు, కేంద్రానికి రాకుంటే చరవాణికి సంక్షిప్త సందేశం వెళ్తుంది. ఈ సర్వేతో తీవ్ర పోషకాహార సమస్యతో బాధపడే పిల్లల సంఖ్య జిల్లాస్థాయిలో తెలుస్తుంది. జిల్లా వివరాలు ప్రాజెక్టు మెయిన్ అంగన్వాడీ మినీ అంగన్వాడీ కేంద్రాలు కేంద్రాలు భైంసా 175 18 ఖానాపూర్ 194 37 ముధోల్ 154 18 నిర్మల్ 252 26గర్భిణులు : 6,014 బాలింతలు : 5,155 7 నెలల నుండి ఆరేళ్లలోపు చిన్నారులు : 59,129 పక్కాగా నిర్వహిస్తున్నాం జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 816 అంగన్ వాడీ కేంద్రాల్లో న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం సర్వే కొనసాగుతుంది. ఇప్పటికే 90 శాతం సర్వే పూర్తి చేశారు. వివరాలు పక్కాగా ఉండాలని సిబ్బందికి సూచించాం. చిన్నారులు, గర్భిణులు, బాలింతల వివరాలన్నింటినీ నమోదు చేస్తున్నాం. ఇకపై అవకతవకలకు అవకాశం ఉండదు. – ఏ.నాగమణి, సీడీపీవో, నిర్మల్ -
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టాలి
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నిర్మల్చైన్గేట్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నిర్మల్ జిల్లా ఓట్ల లెక్కింపును ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ అధికారులు జూన్ 4వ తేదీన ఉదయం 5.30 నిమిషాలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని, ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సమయానికి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభించాలని, అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించాలని ఆదేశించారు. రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్ల వివరాలను తెలిపేందుకు స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపు సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత ఏఆర్వోలకు సమాచారం అందించాలన్నారు. రౌండ్లవారీగా లెక్కింపు పూర్తికాగానే సంబంధిత ఫారాలన్నీ జాగ్రత్తగా నింపాలన్నారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాస్ సిబ్బందికి ఓట్ల లెక్కింపు సరళిని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో నిర్మల్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, శ్యామలాదేవి, నిర్మల్, భైంసా, ఉట్నూర్ ఆర్డీవోలు రత్న కళ్యాణి కోమల్రెడ్డి, జీవాకర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘రైతాంగ సమస్యలు పరిష్కరించాలి’
నిర్మల్చైన్గేట్: వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతాంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రజాసంఘాల భవన్ లో సోమవారం సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిరకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని, సమగ్ర భూసర్వే నిర్వహించి లోపాలను సవరించాలని, రెవెన్యూ రికార్డుల్లో కౌలురైతులు, వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేసేందుకు ‘కాలం’ ఏర్పాటు చేయాలని, 2011 కౌలుచట్టాన్ని అమలు చేయాలని, సాగుదారులందరికీ ప్రభుత్వం ప్రకటించిన రూ.12,500 సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని రూపొందించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటల పరిహారం ఇవ్వాలన్నారు. కల్తీ విత్తనాలను పట్టుకోవడమే తప్పా నేరస్తులపై ఎలాంటి శిక్షలు, నష్టపోయిన రైతులకు పరిహారాలు లేవన్నారు. వెంటనే ప్రభుత్వం రాష్ట్ర విత్తన చట్టాన్ని రూపొందించి కల్తీ విత్తన సంస్థల కంపెనీలను రద్దు చేయాలన్నారు. సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూరు తిరుపతి, రైతు సంఘం నాయకులు సుంచుల నారాయణ, జాదవ్ మోతీరాం, కిషన్ జాదవ్, పెద్ద గంగన్న, తదితరులు పాల్గొన్నారు. -
ఫైనల్స్లో భారీగా బెట్టింగ్..!
భైంసాటౌన్: ఐపీఎల్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం పట్టణంలో బెట్టింగ్ జోరుగా సాగినట్లు వినికిడి. ఈ ఒక్కరోజే రూ.కోట్లలో బెట్టింగ్ జరిగినట్లు తెలిసింది. ఎస్ఆర్హెచ్ జట్టు వరుస మ్యాచ్లు గెలుస్తూ వస్తుండడంతో ఎక్కువగా ఈ జట్టు గెలుపుపైనే పందెం కాసినట్లు సమాచారం. అయితే సదరు జట్టుపై ఎంతమొత్తం పందెం కాసినా అంతేమొత్తం చెల్లించేలా బెట్టింగ్ కాయగా ప్రత్యర్థి జట్టుపై మాత్రం ఏకంగా ఐదురెట్లు ఎక్కువగా పందెం కాసినట్లు తెలిసింది. దీంతో గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోగా బెట్టింగ్ రాయుళ్లు భారీగా నష్టపోయారు. కానీ నిర్వాహకులకు మాత్రం కాసులు కురిపించిందని సమాచారం. ఏదేమైనా పట్టణంలో బెట్టింగ్ దందా జోరుగా సాగుతున్నా.. అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఓట్ల లెక్కింపులో పొరపాట్లు జరగకుండా చూడాలి
● కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్మల్చైన్గేట్: ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఎన్నికల అధికారులతో సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ జూన్ 4న జరిగే లోకసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్లు అందుబాటులో ఉంచామన్నారు. ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీరౌండ్కు డేటా ఎంట్రీ నమోదు చేసి సమాచారం అందిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ గురుకులాల్లో ప్రవేశానికి దరఖాస్తులుసోన్: ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని నాన్ సీవోఈ విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని గాంధీనగర్ ఎస్సీ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపాల్, గురుకుల సొసైటీ జిల్లా సమన్వయ అధికారి ఎం.సరస్వతి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 24 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హెచ్ఈసీ, సీఈసీ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. -
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోని యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దీన్దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకంలో జనరల్ వర్క్, సూపర్వైజర్, వెల్డింగ్, ఎలక్ట్రీషియన్, పైపు ఫిట్టర్, ప్లంబింగ్, పెయింటింగ్ అండ్ డెకొరేషన్ తదితర కోర్సుల్లో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. భోజనంతోపాటు యూనిఫామ్, శిక్షణ సామగ్రి అందిస్తామని తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు సెల్: 9154548063, 8328507232 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
నిర్మల్
మంగళవారం శ్రీ 28 శ్రీ మే శ్రీ 2024సూర్యాపూర్ ఆలయంలో మహారాష్ట్ర రైతుల పూజలుకుంటాల: ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్నగర్ తాలూకా పోనం గ్రామానికి చెందిన రైతులు సోమవారం సూర్యాపూర్ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించారు. శివలింగానికి అభిషేకం, అన్నపూజ, సత్యనారాయణ వ్రతం ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. జిల్లాలోని పాఠశాలల వివరాలు పాఠశాలలు సంఖ్య ప్రాథమిక పాఠశాలలు 533 ప్రాథమికోన్నత 85 ఉన్నత పాఠశాలలు 117 మొత్తం 735 విద్యార్థుల సంఖ్య 52,667 ‘పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి’నిర్మల్చైన్గేట్: మధ్యాహ్న భోజన కా ర్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని అఖిల భారత ట్రేడ్ యూ నియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్, డీఈవో కార్యాలయంలో వేర్వేరుగా వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జనవరి నుంచి ఇప్పటి వరకు కోడిగుడ్ల బిల్లులు కూడా వి డుదల చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకా రం కనీస వేతనం రూ.10 వేలు, వంటసామగ్రి, యూనిఫామ్ అలవెన్స్, వంటషెడ్లు సమకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో బుక్యా రమేశ్, చిట్యాల లక్ష్మి, ఏనుగుల ల క్ష్మి, సంగ్వి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. జూన్ 1 నుంచి ‘బడిబాట’ సర్కార్ బడుల్లో బడిబాట షెడ్యూల్ను విద్యాశాఖ ఖరారు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగానే ఉన్నా ఉన్నత పాఠశాలల్లో మాత్రం క్రమక్రమంగా తగ్గుతోంది. ఈసారి విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉపాధి హామీ పనిస్థలాలకు, ఇంటింటికీ వెళ్లడం, గ్రామ సభలు నిర్వహించడం, తదితర ఆక్టివిటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల అనుభవం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫాం, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలపై తల్లిదండ్రులకు వివరిస్తారు. నిర్మల్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పనివేళల్లో మార్పు చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను మళ్లీ మార్చింది. జూన్ 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు తాజాగా పాఠశాల విద్య అకాడమిక్ క్యాలెండర్ను ప్రకటించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం 9 గంటలకే బడిగంట మోగనుంది. 2022–23 విద్యా సంవత్సరం వరకు ఈ పాఠశాలలు ఉదయం 9 గంటలకే తెరుచుకునేవి. కానీ గతేడాది 9:30 గంటలకు ప్రారంభమయ్యేలా షెడ్యూల్మార్చారు. మళ్లీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని 9 గంటలకే ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభంకాగా సాయంత్రం 4:45 గంటల వరకు నిర్వహిస్తారు. నూతన అకాడమిక్ క్యాలెండర్ విడుదల విద్యాశాఖలో ఏటా బడులు ప్రారంభమైన రెండు నెలల తర్వాత అధికారులు నూతన అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసేవారు. కానీ ఈసారి మాత్రం ఇందుకు భిన్నంగా బడులు ప్రారంభానికి 20 రోజుల ముందుగానే విడుదల చేశారు. దీని ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఉన్నత పాఠశాలలు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు పనిచేస్తాయి. నాలుగో శనివారం నో బ్యాగ్ డే... బడుల్లో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల బరువు కంటే వారి పుస్తకాల బరువు ఎక్కువగా ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. దీంతో చిన్నారులకు వెన్నెము క సమస్యలు వస్తున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల స్కూల్ బ్యాగ్పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఈ వి ద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు చే యనుంది. నెలలో ఓ రోజును శ్రీనో బ్యాగ్డేశ్రీగా ప్ర కటించింది. ప్రతీనెల నాలుగో శనివారం విద్యార్థులు పాఠశాలకు పుస్తకాలు లేకుండా రావాల్సి ఉంటుంది. ఆరోజు బోధనకు సంబంధించి ఎస్సీఈఆర్టీ ప్రత్యేక ప్రణాళిక ప్రకటించనుంది. ఆటపాటలతో చదువు చెప్పే విధానానికి ప్రణాళికలు రూపొంది స్తోంది. ఈ విధానాన్ని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పా ఠశాలలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గత విద్యా సంవత్స రం కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురాగా జిల్లాలో ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. ఈ ఏడాదైనా అధికారులు పకడ్బందీగా చేపడతారా? లేదా? అనేది వేచిచూడాల్సి ఉంది. 12న పాఠశాలలు పునఃప్రారంభం నూతన విద్యాసంవత్సరం జూన్ 12న ప్రారంభమై 2025 ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను పాఠశాల విద్యాశాఖ శనివారం విడుదల చేసింది. మొత్తంగా పాఠశాలలకు 229 పనిదినాలు ఉంటాయి. రోజు 90 శాతానికి పైగా విద్యార్థుల హాజరు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతీరోజు 30 నిమిషాల పాటు పాఠ్య పుస్తకాలు, కథల పుస్తకాలు, దినపత్రికలు, మ్యాగజైన్లు చదివించాలి. టీవీ పాఠాలను యధావిధిగా ప్రసారం చేయాలి. విద్యార్థులతో ఐదు నిమిషాల పాటు యోగ ధ్యానం చేయించాలి. ఎఫ్ఏ–1పరీక్షలు జూలై 31 లోపు, ఎఫ్ఏ–2 సెప్టెంబర్ 30 లోపు, ఎస్ఏ–1 అక్టోబర్ 28 లోపు, ఎఫ్ఏ–3 డిసెంబర్ 17 లోపు, ఎఫ్ఏ–4 పదోతరగతికి జనవరి 29, ఇతర తరగతులకు ఫిబ్రవరి 28 నాటికి, ఎస్ఏ–2 ఏప్రిల్ 19 లోపు పూర్తి చేయాలి. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయి. ‘ట్రిపుల్ఐటీ’కి నోటిఫికేషన్ ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ఐటీలో నూతన విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి వర్సిటీ అధికారులు సోమవారం ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. 8లోu న్యూస్రీల్ పాఠశాలల పనివేళల్లో మార్పుచేసిన విద్యాశాఖ ప్రతీనెల నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం పాఠశాల విద్య అకాడమిక్ క్యాలెండర్ విడుదల -
అ‘పూర్వ’ సమ్మేళనం
లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2001–2002 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుకున్న విద్యార్థులు 22 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరిట వడ్యాల్లోని రాజరాజేశ్వర ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతా కలుసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుని ఉల్లాసంగా గడిపారు. నాడు విద్యాబుద్ధులు నేర్పించి తమ ఉన్నతికి కారకులైన గురువులకు పూలతో స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాటి గురువులు కిషన్రావు, నాజీర్ అహ్మద్, మోహన్రావు, అరవింద్ కుమార్, లక్ష్మణ్, నరేందర్, మంజుల, మచ్చేందర్, తదితరులు పాల్గొన్నారు. భైంసాటౌన్: పట్టణంలోని కిసాన్గల్లి శ్రీసరస్వతి శిశుమందిర్లో 2006–2007 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. చిన్ననాటి మిత్రులంతా ఒక్కచోట చేరి పాఠశాల రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాము చదువుకున్న పాఠశాలకు రూ.20వేల విలువైన సౌండ్ సిస్టం విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉమ్మడి ఆదిలాబాద్ శిశు మందిరాల అధ్యక్షుడు డాక్టర్ దామోదర్రెడ్డి, విభాగ్ సహ కార్యదర్శి సరికొండ దామోదర్, జిల్లా కార్యవర్గ సభ్యులు జీలకర రాజేశ్వర్, డా.మహిపాల్, ధర్మపురి సుదర్శన్, ఉపాధ్యాయులు నాగభూషన్, దత్తాత్రి, నితిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భోజన్న, తదితరులు పాల్గొన్నారు. -
‘గజ్జలమ్మ’కు పూజలు
కుంటాల: కుంటాల ఇలవేల్పు శ్రీ గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. గురుస్వామి జక్కని గజేందర్, అర్చకుడు నగేష్ ఆధ్వర్యంలో అమ్మవార్లకు అభిషేకం, అలంకరణ, పల్లకి సేవ నిర్వహించారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కడార్ల హరిప్రసాద్, బోయ సాయిలు, గట్టుపల్లి శ్రీనివాస్, తాటి శివ, చిప్ప సంజీవ్, గంగాధర రాజు, పల్లికొండ గజేందర్, భూమన్న, గజేందర్, తదితరులు పాల్గొన్నారు. -
‘కోనోకార్పస్’ కోరల్లో!
● పక్షులు వాలవు.. పశువులు తినవు ● పర్యావరణానికి ప్రయోజనం శూన్యం ● పువ్వుల రేణువులతో అనారోగ్యం ● జిల్లాలో విపరీతంగా పెరిగిన చెట్లు ● ఇప్పటికే ఈ చెట్లపై నిషేధం.. ● అయినా తొలగించని అధికారులు, పాలకులు నిర్మల్: సాధారణంగా అడవులను, చెట్లను ఎవరైనా నరికేస్తే.. పర్యావరణ ప్రేమికులు, సాధారణ పౌరులూ ఆందోళన చెందుతుంటారు. కానీ ఇప్పుడు ఏపుగా, పచ్చగా పెరుగుతున్న ‘కోనోకార్పస్’ చెట్లను చూస్తే పర్యావరణ వేత్తలే హడలిపోతున్నారు. ‘వద్దు బాబూ.. వీటిని వెంటనే తొలగించండి..’ అంటున్నారు. ఎందుకంటే.. ఇవి అంత ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటితో పర్యావరణానికి మేలు జరగకపోగా.. ప్రజారోగ్యానికి హాని కలుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని ఎన్నో దేశాలు, దేశంలోని చాలా రాష్ట్రాలు కోనోకార్పస్ చెట్లను నిషేధించాయి. చాలా దేశాల్లో కూకటివేళ్లతో పెకిలించి వేశాయి. జిల్లాల్లో మాత్రం ఈ చెట్లు వేళ్లానుకుని పోయాయి. హరితహారం తెచ్చిన శాపం.. గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం అద్భుతమైన కార్యక్రమం. కానీ.. అదే శాపంగానూ మారింది. ప్రభుత్వం పెట్టిన గడువు, నిబంధనలకు స్థానిక అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మంచి చెడులను ఆలోచించకుండా త్వరగా పెరిగే మొక్కలను తీసుకువచ్చి విరివిగా నాటేశారు. ఇప్పుడు వాటి దుష్ఫలితాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోకి వచ్చింది కోనోకార్పస్ మొక్క. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై డివైడర్ల మధ్యలో మొత్తం ఇవే మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లోనూ వీటినే పెంచారు. పచ్చగా, ఏపుగా పెరగడంతో అంతా ‘వావ్..’ అన్నారు. ఇప్పుడు పువ్వులు, కాయలూ కాస్తుండటం, అవి ప్రజారోగ్యానికి ప్రమాదకారిగా మారుతున్నాయని తెలియడంతో ‘ఈ చెట్లు వద్దు బాబో..’ అంటున్నారు. పుప్పొడితో పరేషాన్.. కోనోకార్పస్ చెట్ల పువ్వుల పుప్పొడి పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. దీని కారణంగా మనుషుల్లో అలర్జీలు, శ్వాసకోశ వ్యాధులు, అస్తమా వంటివి వస్తున్నట్లు తేలింది. ఈచెట్టు ఎంత ప్రమాదకరమంటే వీటి వేళ్లు భూమిలోతులోకి వెళ్లి బలంగా నాటుకుంటాయి. ఈక్రమంలో పునాదులతోపాటు భూమిలో వేసిన కేబుళ్లు, పైపులనూ ఇది ధ్వంసం చేస్తోంది. ఇక ఈ మొక్కలు హరితహారంలో పెంచడానికి మరోకారణం.. వీటిని పశువులు తినవు. కనీసం పక్షులు గూళ్లు కూడా పెట్టవు. వీటి పవ్వులు, పుప్పొడిపై సీతాకోక చిలుకలు కూడా వాలవు. అంటే.. ఆ చెట్టు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో నిషేధం.. భూమి లోతు వరకూ నాటుకుపోవడంతో కోతకు గురికాకుండా ఉంచే కోనోకార్పస్ చెట్లను తీరప్రాంతాల్లో విరివిగా పెంచారు. ప్రపంచంలోని చాలా దేశాలు మొదట్లో వీటిని విరివిగా పెంచాయి. తర్వాత వీటివల్ల కలుగుతున్న అనర్థాలు తెలియడంతో మూలాలతో సహా పెకిలించి వేశాయి. దుబాయ్లో వీటిని విస్తారంగా పెంచారు. తర్వాత ఎడారి దేశం సైతం వీటిని పీకేయించింది. మన దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా వీటిని నిషేధించాయి. తెలంగాణలోనూ ఈ మొక్కలను హరితహారంలో నాటవద్దని చెప్పినా.. అప్పటికే జరగాల్సి న నష్టం జరిగిపోయింది. కొమ్మలు కాదు.. చెట్లనే తొలగించాలి ఎక్కడా పెంచని కోనోకార్పస్ మొక్కలను జిల్లాలో మాత్రం నిత్యం నీళ్లు పోసి పెంచుతున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో ఈ మొక్కలు ఉన్నాయి. రియల్ఎస్టేట్ నిర్వాహకులు వెంచర్లలో వీటిని ఎక్కువగా పెంచారు. ఇప్పుడు ఈ చెట్లు అంతటా పువ్వులు, కాయలు కాసే దశకు చేరాయి. తరచూ వీటిపై ఫిర్యాదులు వస్తుండటంతో మున్సిపాలిటీలు, పంచాయతీలు ఆ పువ్వులు, కాయలు కాసే కొమ్మలను కొట్టేస్తున్నాయి. కానీ.. దీనివల్ల ప్రతీ ఏడాది రెండుసార్లు ఖర్చు తప్ప.. ప్రజారోగ్యానికి ఎలాంటి ఉపయోగం లేదన్న వాదన పెరుగుతోంది. వీటిని మొత్తానికే తొలగించాలన్న డిమాండ్ బలపడుతోంది. మొత్తానికే తొలగించాలి జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రోడ్డులో ఇటీవల కోనోకార్పస్ చెట్ల కొమ్మలను మున్సిపల్ సిబ్బంది కొట్టేశారు. ఇలా ఏడాదికి రెండుసార్లు చేయడం వల్ల ప్రజాధనం వృథా కావడంతో పాటు ఆ చెట్లవల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. కోనోకార్పస్ చెట్లను మొత్తానికే తీసివేయాలి. – దశరథ పోశెట్టి, నిర్మల్ నష్టాలే ఎక్కువ.. కోనోకార్పస్తోపాటు ఎనిమిది ఆకుల చెట్టు, గన్నేరుచెట్లతో లాభాలకంటే నష్టాలే ఎక్కువ. ఈ చెట్లను చాలాదేశాలు, రాష్ట్రాలు నిషేధించాయి. స్థానికంగా అవగాహన లేకపోవడంతోనే విరివిగా పెంచుతున్నారు. పర్యావరణంతోపాటు పశుపక్షాదులు, ప్రజారోగ్యానికీ ఇవి ప్రమాదకరం. వీటిని తొలగించాలి. – డాక్టర్ వెల్మల మధు, అసోసియేట్ ప్రొఫెసర్, భైంసా డిగ్రీ కళాశాల -
సన్నబియ్యంపై ఆశలు..!
భైంసాటౌన్: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యే యంగా పెట్టుకుందని, అందుకే సన్నవడ్ల సాగు ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్ ప్రకటించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులు సన్నబి య్యం పంపిణీపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తు తం రేషన్ దుకాణాల్లో దొడ్డురకం బియ్యం అందిస్తుండగా వాటిని తినలేక చాలామంది లబ్ధి దారులు బియ్యం అమ్ముకుంటున్నారు. రైతులు ఎక్కువగా దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తుండడంతో ఇప్పటి వరకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి సీఎంఆర్ కోసం రైస్మిల్లులకు కేటాయించేది. మిల్లర్లు బియ్యం మరాడించి ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖకు పంపితే వాటిని రేషన్ దుకాణాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు. 6.41 లక్షల మందికి ప్రయోజనం... జిల్లాలో తెల్లరేషన్ కార్డులు 2,08,462 ఉండగా 6,41,411 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతినెలా యూనిట్కు ఆరు కిలోల చొప్పున అందిస్తున్నారు. దీంతో నెలకు 40,560 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతోంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా దొడ్డుబియ్యం పంపిణీ చేస్తుండగా చాలావరకు నాసిరకంగా ఉంటున్నా యి. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని తినలేక కిలోకు రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయించుకుంటున్నారు. మార్కెట్లో సన్నబియ్యం కిలోకు రూ.50 నుంచి రూ.70 వరకు ధర పలుకుతున్నాయి. దీంతో ఆర్థికంగా భారమైనా సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా నెలకు 25 కిలోల బస్తాకు రూ.1300 నుంచి రూ.1700 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తే పేదలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అక్రమ రవాణాకు చెక్... ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో అందిస్తున్న దొడ్డుబియ్యాన్ని లబ్ధిదారులు విక్రయించుకోవడంతో అక్రమ రవాణకు తరలుతున్నాయి. కొందరు రైస్మిల్లర్లు సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యం మరాడించకుండా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. దళారుల ద్వారా లబ్ధిదారుల నుంచి సేకరించిన దొడ్డు బియ్యాన్నే తిరిగి ఎఫ్సీఐకి అప్పగిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం లబ్ధిదారుల నుంచి దళారులకు, వారి నుంచి రైస్మిల్లులకు, అక్కడి నుంచి ఎఫ్సీఐకి, మళ్లీ రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకే రీసైకిల్ అవుతోంది. ఫలితంగా నాసిరకం బియ్యం పంపిణీ అవుతోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తే లబ్ధిదారులు విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా రేషన్బియ్యం అక్రమ రవాణాకు చెక్ పడుతుంది. రేషన్ దుకాణాల్లో పంపిణీకి యోచన అమలు చేస్తే కార్డుదారులకు ప్రయోజనం దొడ్డు బియ్యం అక్రమ రవాణాకు చెక్జిల్లాలో రేషన్ కార్డుల వివరాలు ఏఎఫ్ఎస్సీ కార్డులు : 12,672ఎఫ్ఎస్సీ కార్డులు : 1,95,758అంత్యోదయ కార్డులు : 32మొత్తం రేషన్ కార్డులు : 2,08,462 లబ్ధిదారులు : 6,41,411 అవసరమైన బియ్యం కోటా : 40,56,074 కిలోలు -
అంగన్వాడీల ప్రక్షాళన
నిర్మల్● టీచర్లు, ఆయాలకు వయో పరిమితి ● 65 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ ● జూన్ నుంచి అమలుకు కసరత్తు ● జిల్లాలో ఖాళీ కానున్న 123 పోస్టులు ● కొత్త వారిని నియమించే అవకాశం రైతులూ జాగ్రత్త..! మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సాగు ప్రారంభం కానుంది. విత్తనాల కొనుగోళ్లలో రైతులు జా గ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 8లోuసోమవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2024‘బీడీ కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు చేయాలి’ ఖానాపూర్: బీడీ కార్మికులకు పెరిగిన వేతనాలు వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సునారికారి రాజేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీడీ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతన ఒప్పందం ఏప్రిల్ 30తో ముగిసిందన్నారు. కొత్త వేతన ఒప్పందం కోసం తమ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ నోటీస్ ఇవ్వగా ప్రభుత్వం ఈ నెల 25న బీడీ యాజమాన్య సంఘాలతో చర్చలు జరిపిందన్నారు. ఈ చర్చల్లో బీడీ ప్యాకర్లకు నెలకు రూ.3,650, నెలసరి ఉద్యోగులకు రూ.1,700 చొప్పున వేతనాలు పెరిగాయన్నారు. బీడీలు చుట్టే కార్మికులకు వేయి బీడీలకు రూ.4.25 పైసల చొప్పున కూలి రేట్ల పెంపునకు ఒప్పందం కుదిరిందన్నారు. పెరిగిన వేతనాలు మే 1 నుంచి అమలు చేయాలని, లేనిపక్షంలో బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు దుర్గం లింగన్న, చిన్న రాజన్న, తదితరులు పాల్గొన్నారు. జిల్లా వివరాలు ప్రాజెక్టులు : 4 సెక్టార్లు : 37 మెయిన్ అంగన్వాడీలు : 816 మినీ అంగన్వాడీలు : 110 ప్రాజెక్టుల వారీగా సిబ్బంది ప్రాజెక్టు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు భైంసా 11 14 ఖానాపూర్ 0 21 ముధోల్ 7 25 నిర్మల్ 9 36 నిర్మల్చైన్గేట్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ప్రక్షాళనకు సిద్ధమైంది. దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తూ వయోభారంతో ఉన్న టీచర్లు, ఆయాలకు ఉద్యోగ విరమణ కల్పించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్నా లోక్సభ ఎన్నికల దృష్ట్యా వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో అంగన్వాడీల వివరాలు సేకరిస్తోంది. ఏప్రిల్ 30వ తేదీ వరకు జిల్లాలో 65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 123 మంది ఉన్నారు. వీరంతా ఉద్యోగ విరమణ పొందనున్నారు. 123 మంది గుర్తింపు.. ప్రభుత్వ ఆదేశాలతో మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు జిల్లాలో 65 ఏళ్లు పైబడిన టీచర్లు, ఆయాల వివరాలు సేకరిస్తున్నారు. పదో తరగతి మెమో, టీసీ, బోనఫైడ్ సర్టిఫికెట్ ఆధారంగా వయస్సును నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే ఐసీడీఎస్ అధికారుల వద్ద ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టంలో వివరాలు సైతం ఉన్నాయి. టీచర్ల వయస్సు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. ఆయాలు పెద్దగా చదువుకోక పోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న వివరాలకు ఆయాల ఆధార్ కార్డులో ఉన్న వివరాలకు పొంతన లేకుండా ఉంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సివిల్ సర్జన్ వద్ద నుంచి వయస్సు నిర్ధారణ పత్రాలు తేవాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా అప్పటికే అధికారులు సేకరించిన వివరాల మేరకు జిల్లాలో 65 ఏళ్లు పైబడి రిటైర్మెంట్కు సిద్ధంగా ఉన్నవారు టీచర్లు 27 మంది, ఆయాలు 96 మందితో కలిపి మొత్తంగా 123 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరంతా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే కొంతమంది మాత్రం పుట్టినతేదీ సరిగాలేని కారణంగా తాము తొందరగా విధుల నుంచి తప్పుకోవాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ కొందరు అధికారులను ఆశ్రయించారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. అలాంటి వారిని జిల్లా ఆస్పత్రిలో వయస్సు నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. గందరగోళం.. ఐసీడీఎస్ అధికారుల వద్ద ఎంప్లాయ్ మేనేజ్మెంట్ సిస్టం (ఈఎంఎస్)లో ఉన్న వివరాలకు ఆయాల వద్ద ఉన్న వివరాలకు పొంతన లేకుండా పోయింది. అంగన్వాడీ టీచర్లకు పదో తరగతి సర్టిఫికెట్లు ఉండగా ఆయాలు చదువు కోకపోవడంతో వారి వయస్సు నిర్ధారణ కోసం అధికారులు ఆధార్ కార్డులు సేకరిస్తున్నారు. అందులో కూడా చాలామంది వయస్సు హెచ్చుతగ్గులు ఉండడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్ వద్ద నుంచి వయస్సు నిర్ధారణ పత్రాలు తేవాలని చెబుతున్నారు. ప్రభుత్వానికి జాబితా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 65 ఏళ్లు నిండిన అంగన్వాడీ టీచర్, ఆయాలను గుర్తిస్తున్నాం. అర్హులైన వారి జాబితా ఉన్నతాధికారులకు నివేదిస్తాం. ఏప్రిల్ 30 వరకు 65 ఏళ్ల వయస్సు పైబడిన వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాలో 123 మంది ఉద్యోగ విరమణ పొందనున్నారు. – ఏ.నాగమణి, డీడబ్ల్యూవోన్యూస్రీల్రిటైర్మెంట్ బెనిఫిట్స్పై చిన్నచూపు.. అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన వారు అనేకం. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి అనుకున్న మేర సాయం అందడం లేదు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో హఠాత్తుగా ఉద్యోగాలు కోల్పోతే మా పరిస్థితి ఏమిటని అంగన్వాడీలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ. 50 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వ సాయం ఏమాత్రం సరిపోదని టీచర్లు, ఆయాలు అంటున్నారు. అంగన్వాడీలకు రూ.5 లక్షలు, ఆయాలకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.926 అంగన్వాడీ కేంద్రాలు.. జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ముధోల్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 926 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 816, మినీ అంగన్వాడీ కేంద్రాలు 110 ఉన్నాయి. వీటిలో ప్రధాన సెంటర్లలో టీచర్, ఆయా, మినీ కేంద్రాల్లో టీచర్ ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల మినీ సెంటర్లలో కూడా టీచర్, ఆయాలు ఉండాల్సిందేనని ప్రభుత్వం చెప్పినా ఇంకా పోస్టులు భర్తీ చేయలేదు. ఇప్పటి వరకు అంగన్వాడీ సెంటర్లలో రిటైర్మెంట్ ప్రక్రియ లేకపోవడంతో వయస్సు పైబడిన వారి స్థానంలో కుటుంబ సభ్యులు విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే టీచర్లు, ఆయాలు తమకు ఉద్యోగ విరమణ చేపట్టి ప్రయోజనాలు కల్పించాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేల బెన్ఫిట్ కల్పిస్తామని ప్రకటించింది. -
డబుల్ రోడ్డు విస్తరణకు సహకరిస్తాం
● డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావులక్ష్మణచాంద: మండల కేంద్రంలో డబుల్ రోడ్డు పూర్తికి సహకరిస్తామని డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు వీడీసీ సభ్యులకు హామీ ఇచ్చారు. లక్ష్మణచాంద వీడీసీ సభ్యులు నిర్మల్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావును శనివారం కలిశారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేయించాలని కోరారు. స్పందించిన డీసీసీ చీఫ్ ఆర్అండ్బి ఎగ్జిక్యూట్ ఇంజినీర్ ఫోన్లో మాట్లాడారు. విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అట్ల రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఒడ్నాల రాజేశ్వర్, నాయకులు ఈటెల శ్రీనివాస్, జెడ్పీటీసీ వోస రాజేశ్వర్, నాయకులు నాగేశ్, అట్ల రవీందర్రెడ్డి, రవి, సుంకరి గంగయ్య, అట్ల శ్రీనివాస్రెడ్డి, నాయిడి రవి, జంగం రాజు, లక్కం రవి, ఈటల పరమేశ్, గోవింద్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
● వేసవి సెలవులకు అమ్మమ్మ, తాతయ్యల ఇళ్లకు చిన్నారులు ● వేసవి విరామం సొంత ఊర్లలోనే.. ● అనుభవాలను వల్లె వేస్తూ.. ఆత్మీయంగా గడుపుతూ.. ● బంధుత్వాలమధ్యన గడిపేందుకే ప్రాధాన్యం...
బంధుత్వాల ప్రాధాన్యతను గుర్తిస్తూ... ప్రస్తుతం ఉద్యోగం, ఉపాధి రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడుతూ ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నంగా మారుతున్నాయి. చదువులు, మార్కులు, ర్యాంకులు, సెల్ఫోన్ వంటివి తీవ్రప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితిల్లో గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించడానికి, పిల్లలు నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ వారింట్లో వారి సమక్షంలోనే వేసవి సెలవులను గడుపుతున్నారు. బంధుత్వాలు, కుటుంబసభ్యుల మధ్యన కొనసాగే కబుర్ల ద్వారా కుటుంబ బంధాల ప్రాధాన్యతను పిల్లలు తెలుసుకునే వీలుంటుంది. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షకు 100 మంది గైర్హాజరు
నిర్మల్ రూరల్: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు 100 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్లో మొత్తం 909 మంది విద్యార్థులకు 843 మంది హాజరయ్యారు. 66 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ కేటరీలో 833 మందికి 776 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 76 మందికి 67 మంది హాజరయ్యారు. సెకండియర్లో మొత్తం 608 మంది విద్యార్థులకు 574 మంది హాజరవగా, 34 మంది గైర్ హాజరయ్యారు. జనరల్ కేటగిరీలో 596 మందికి 566 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరీలో 12 మందికి 8 మంది హాజరయ్యారు. ఇంటర్ జిల్లా అధికారి పరుశురాం ముధోల్, భైంసాలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
పాక్ను శక్తివంతం చేస్తున్న చైనా? లక్ష్యం ఏమిటి?
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్గా మాజీ క్రికెటర్
పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్లు
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ప్రాణం తీసిన ఫొటో సరదా
ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ సెన్సార్ తప్పిదమే: ఐఎండీ
నేటితో చివరి అంకం..ప్రచారం ముగింపు
తప్పక చదవండి
- Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
- కౌంటింగ్లో ఏజెంట్లు కీలకం!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
- జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
- ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement