-
No Headline
హోల్సేల్ రిటైల్ హోల్సేల్ రిటైల్టమాట 24 40 బెండకాయ 20 40 బీరకాయ 40 70 దొండకాయ 20 40 బీర్నిసుకాయ 120 150 కాకరకాయ 40 60 వంకాయ 15 30 పాలకూర 30 50 మెంతికూర 50 80 కొత్తిమీర 100 130 పుదీనా 60 80 క్యాప్సికం 40 60 గాజరుగడ్డ 30 50 పచ్చిమిర్చి 50 80 దోసకాయ 15 30 ఆలుగడ్డ 25 40 గోబిగడ్డ 20 40 గోబిపువ్వు 20 40 బీట్రూట్ 20 40 కరివేపాకు 40 70 చామగడ్డ 40 70 గోరుచిక్కుడు 70 100 చిక్కుడుకాయ 80 100 – సుభాష్నగర్కూరగాయల ధ రలు(రూ.) -
కొరవడిన నాణ్యత.. ధ్వంసమైన రోడ్డు
సిరికొండ: రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తుంటే.. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఏళ్లపాటు ఉండాల్సిన రోడ్లు ముణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. ఇటీవల మండల కేంద్రం నుంచి తూంపల్లి వరకు 1.8 కి.మీ తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.77 కోట్ల నిధులు మంజూరు చేసింది. పనులను ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంట్రాక్టర్ ఫిబ్రవరిలో పనులు పూర్తి చేశాడు. కానీ నాలుగు నెలలు కూడా గడవకముందే తారు లేచిపోయి, రోడ్డు అక్కడక్కడ ధ్వంసమైంది. అలాగే రోడ్డుకు ఇరువైపులా మొరం వేయకపోవడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు రోడ్డు కిందికి దిగడానికి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు రోడ్డు కిందికి దిగి మళ్లీ పైకి ఎక్కుతున్నప్పుడు మొరం లేకపోవడంతో రోడ్డు అంచుల వద్ద తారు లేచిపోతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ పనులను నాసిరకంగా నిర్మించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల సిరికొండ–తూంపల్లి గ్రామాల మధ్య తారు రోడ్డు వేసిన అధికారులు నాలుగు నెలలకే అధ్వానంగా మారిన వైనంమరమ్మతులు చేయిస్తాం.. తూంపల్లి గ్రామానికి వేసిన తారు రోడ్డు అక్కడక్కడ ధ్వంసమైంది. ధ్వంసమైన చోట మరమ్మతులు చేయిస్తాం. రోడ్డుకు సైడ్ మొరం వేయిస్తాం. రహదారి నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. రోడ్డు నిర్మాణాన్ని నాణ్యతతోనే చేయించాం. –ప్రవీణ్, ఆర్అండ్బీ ఏఈ తారు లేచిపోతోంది.. మా గ్రామానికి ఇటీవల నిర్మించిన రోడ్డు అప్పుడే ధ్వంసమవుతున్నది. తారు సరిగా వేయకపోవడం, రోలింగ్ సరిగా చేయకపోవడంతో అక్కడక్కడ తారు లేచిపోయింది. రోడ్డుకు ఇరుపక్కలా మొరం కూడా పోయలేదు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలి. –భీమన్న, తూంపల్లి -
మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలి
మోపాల్: మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో హరితహారం నర్సరీల్లో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టిసారించాలని, అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రతిరోజూ నీరు పట్టాలని ఎంపీడీవో లింగం సూచించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం ఆయన పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీవో సునీత, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. స్కూల్ యూనిఫామ్ల తయారీ ప్రారంభం మోపాల్(నిజామాబాద్రూరల్): మండలకేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో స్కూల్ యూనిఫారాల తయారీ కోసం మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఏపీఎం మోహన్ మాట్లాడుతూ.. సుమారు 3వేల యూనిఫారాలు తయారు చేసేందుకు మహిళా సంఘ సభ్యులకు ఒప్పందం కుదిరిందన్నారు. ఒక్కో యూనిఫాంకు రూ.75 ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. స్కూళ్లు ప్రారంభమయ్యేలోపు యూనిఫారాలు అందించాలని మహిళా సభ్యులకు సూచించారు. నిజామాబాద్రూరల్ మండలంలో.. నిజామాబాద్రూరల్: మండలంలోని మల్కాపూర్(ఎం), గాంధీనగర్ గ్రామంలో బుధవారం స్కూల్ యూనిఫారాల తయారీ సెంటర్లను ఐకేపీ ఏపీఎం మహేశ్కుమార్ ప్రారంభించారు. గ్రామ అధ్యక్షురాలు, సీసీలు సంతో ష్, సుజాత, వీణరాణి, వీవోఏలు మహిళలు, టైలర్స్ పాల్గొన్నారు. కూలి రూ.600 ఇవ్వాలి నిజామాబాద్రూరల్: ఉపాధి కూలీలకు కొలతలు లేకుండా పని కల్పించి, రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు చంద్రపుసాయగౌడ్ పేర్కొన్నారు. రూరల్ పరిధిలోని కొత్తపేట, ముత్తకుంట, మల్లారం గ్రామాల ఉపాధి కూలీల సమస్యలపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలకు 250 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. పని చేసే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఇచ్చి, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు క ల్పించాలని డిమాండ్ చేశారు. గంగమల్లు, గంగారాం, నారాయణ, సాయిబాబాగౌడ్, సాయి లు, మల్కయ్య, పోశెట్టి, వనిత, కళావతి, లలి త, యశోద పాల్గొన్నారు ఆర్టీసీ డీఎంకు వినతి బోధన్: ఇటీవల నూతనంగా ఎన్నికై న ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రీజినల్ కమిటీ ప్రతినిధుల బృందం బుధవారం బోధన్ ఆర్టీసీ డిపో అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. డిపో ఉద్యోగుల సమస్యల పరిష్కార అంశాలపై చర్చించి డీఎం శ్రీనివాస్కు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే డిపో ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎం శ్రీనివాస్, ఎంఎఫ్ హరిప్రసాద్, సీఐ జానాబాయి, పరిపాలనాధికారి గిరి, ఎస్టీఐ లక్ష్మణ్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. వెల్ఫేర్ అసోసియేషన్ రీజినల్ కమిటీ కార్యదర్శి మధుకర్, సహాయ కార్యదర్శి రవీందర్, ఆర్గనైజేషన్ కార్యదర్శి మోహన్, ప్రచార కార్యదర్శి దత్తాత్రి, ఉపాధ్యక్షుడు నవీన్, డిపో ఉద్యోగులు నర్సింలు, రత్నం, దేవేందర్, సురేశ్, లక్ష్మణ్, రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం నిజామాబాద్అర్బన్: నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా పండితులు కందాలై నరసింహమూర్తి, నాని స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం అందించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ ముక్కా దేవేందర్ గుప్తా, సభ్యులు తాటి వీరేశం దాతలకు సన్మానం నిర్వహించారు. వేడుకల్లో పలు జంటలు పాల్గొన్నాయి. ఆలయ హుండీ లెక్కింపు నిజామాబాద్రూరల్: నగరంలోని మాధవనగర్ సాయిబాబా ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రి య, ఆలయ ఏవో శ్రీరాంరవీందర్గుప్తా ఆధ్వర్యంలో హుండీలను తెరిచారు. రెండు నెలల నాలుగు రోజుల్లో హుండీ ద్వారా రూ.3,02,485 ఆదాయం వచ్చినట్లు సహాయ కమిషనర్ పేర్కొన్నారు. ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికం -
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
వర్ని: తాగునీటి సరఫరా శాఖ అధికారుల నిర్లక్ష్యంపై మండల సభలో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మేక శ్రీలక్ష్మి వీర్రాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఇటీవల గ్రామాల్లో తాగునీటి అవసరాలకు వేసిన బోర్లు స్థానిక ప్రజాప్రతినిధులకు, మండల అధికారు లకు, ప్రజలకు సంప్రదించకుండా ఇరిగేషన్ నీటిపారుదల శాఖ అధికారులు ఇష్టానుసారంగా వేయడంతో వృథా అయ్యాయని ఎంపీపీ మేక శ్రీలక్ష్మి, మండల ఉపాధ్యక్షులు బాలరాజు, జాకోరా ఎంపీటీసీ సాయిలు అధికారులపై మండిపడ్డారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోయి నెలలు కావస్తున్నా మరమ్మతులు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు అటవీశాఖ అనుమతులు లేకుండా పనులు ఎలా ప్రారంభించారని జెడ్పీటీసీ హరిదాసు అధికారులను ప్రశ్నించారు. విధులపై నిర్లక్ష్యం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సత్యనారాయణపురం ఎంపీటీసీ వెంకట రమణి ఐసీడీఎస్ సూపర్వైజర్ను ప్రశ్నించారు. సభకు హాజరుకాని అధికారులపై చర్యలకు సిఫారసు చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఎంపీడీవో వెంకటేశ్వర్, తహసీల్దార్ సాయిలు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందిస్తాం
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ నగరవాసులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్ సీజీఎం అశోక్ అన్నారు. నగరంలోని సుభాష్నగర్ సబ్స్టేషన్లో ప్రస్తుతం ఉన్న 5.00ఎమ్వీఏకు అదనంగా 3.15ఎమ్వీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుభాష్నగర్ ప్రాంతంలోని హమాల్వాడీ, కంఠేశ్వర్, విద్యుత్నగర్, బ్యాంక్కాలనీ, నాందేవాడ, పాముల బస్తీ ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ను అందించడానికి కెపాసిటి పెంచినట్లు తెలిపారు. ఇందుకు గాను రూ. 40లక్షలు ఖర్చు చేసిన్నట్లు తెలిపారు. ఎస్ఈ రవీంధర్, డీఈలు ఎం శ్రీనివాస్రావు, రాజేశ్వర్రావు, ఏడీఈ తోట రాజశేఖర్, చంద్రశేఖర్, ఏఈ గంగాశేఖర్, సుమిత, గంగారం, ఇలియాస్, దేవిదాస్, గజేంధర్, దశరథ్, రమేష్, సంజీవ్, ప్రేమ్లాల్, కృష్ణయ్య, సుదాకర్, తదితరులుపాల్గొన్నారు. సబ్స్టేషన్ తనిఖీ డిచ్పల్లి: మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ డిచ్పల్లి సెక్షన్ కార్యాలయాన్ని బుధవా రం సీజీఎం అశోక్కుమార్ సందర్శించి, తనిఖీ చేశా రు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫ రా చేయాలని సిబ్బందికి సూచించారు. వ్యవసాయ ఫీడర్ల ద్వారా రైతులకు అందిస్తున్న విద్యుత్ వివరా లను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఎస్ఈ రవీందర్, డీఈ ఉత్తమ్కుమార్ జాడే, ఏడీ శ్రీనివాస్, ఏఈ సాయిలు ఉన్నారు. ఎన్పీడీసీఎల్ సీజీఎం అశోక్ సుభాష్నగర్ సబ్స్టేషన్లో నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ధర్పల్లి: నకిలీ విత్తనాలు అమ్మే డీలర్లపై కఠిన చ ర్యలు తీసుకుంటామని నిజామాబాద్ రూరల్ డివిజన్ వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం విత్తన దుకాణాల డీలర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏవో వెంకటేష్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ.. విత్తనాలను విక్రయించేటప్పుడు రైతుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీలర్లు తప్పనిసరిగా స్టాక్బుక్, రిజిస్టర్లను మెయింటెన్ చేయాలని సూ చించారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని అన్నారు. ఏఈవోలు మనోజ్, స్నేహాలత, లక్ష్మీ ప్రసన్న లావణ్య, డీలర్లు తదిత రులు పాల్గొన్నారు. జక్రాన్పల్లి: నకిలీ విత్తనాలు విక్రయించిన విత్తన కంపెనీలపై పీడీ యాక్టు నమోదు చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో దేవిక తెలిపారు. మండల పరిధిలోని వివిధ విత్తన కంపెనీలలో బుధవారం ఏవో దేవిక, ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రిటైల్ వ్యాపారులు విత్తనాలను ఎమ్మార్పీ ధరకే విక్రయించాలని సూచించారు. సిరికొండ: మండలంలోని కుర్దుల్పేట్ గ్రామంలో బుధవారం విత్తనాలపై ఏఈవో సతీష్, రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాలను ఏవిధంగా ఎంపిక చేసుకోవాలి, విత్తనాలను ఎక్కడ కొనుగోలు చేయాలి అనే విషయాలను ఆయన వివరించారు. లూజ్ విత్తనాలను కొనుగోలు చేయవద్దని, లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే సరైన విత్తనాలను కొనుగోలు చేయాలని తెలిపారు. విత్తనోత్పత్తి కర్మాగారం తనిఖీ నిజామాబాద్రూరల్: మండలంలోని సారంగాపూర్ గ్రామంలో గల విత్తనోత్పత్తి కర్మాగారాన్ని సీఐ సురేష్కుమార్, ఏవో జాదవ్ హీరా బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కర్మాగారంలో నాణ్యత లోపించిన విత్తనాలు రైతులకు విక్రయించరాదని పేర్కొన్నారు. రైతులకు విత్తనాలు విక్రయించే ముందు విత్తనాలకు సంబంధించిన రశీదును ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు విడి విత్తనాలు కొనుగోలు చేయరాదని ప్రభుత్వంచే గుర్తింపు పొందిన కంపెనీల ద్వారా సరఫరా చేసే విత్తనాలను కొనుగోలు చేయాలని కోరారు. కర్మాగారంలో ఇప్పటి వరకు ఇచ్చిన విత్తనాలకు రశీదులను , బిల్బుక్లు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది, ఏఈవోలు పాల్గొన్నారు. -
No Headline
ఘనంగా జగన్నాథ శోభాయాత్ర నవీపేట: మండల కేంద్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన జగన్నాథ శోభాయాత్ర భక్తులను ఆకట్టుకుంది. భగవద్గీత శ్లోకాలతో పాటు భక్తి పాటలతో వీధుల గుండా నృత్యాలు చేశారు. భగవద్గీతపై అవగాహన కల్పించేందుకు ఈ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు పేర్కొన్నారు. రామానందగౌరవ ప్రభూజీ, లోకేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నిధులు మంజూరు పెర్కిట్: ఆలూర్ మండలం దేగాం గ్రామంలో దళిత గోవిందంలో భాగంగా దళితవాడలో ఉన్న వేంకటేశ్వర స్వామి భజన మండపానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు రూ.10 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు టీటీడీ శ్రీవారి ట్రస్టు నిధుల నుంచి రూ.10లక్షలు మంజూరు చేస్తూ బుధవారం తెలంగాణ దేవాదాయ శాఖ నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్కు ప్రొసీడింగ్ కాపీని పంపారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మంజూరైన నిధులతో మండప నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి యాదగిరి తెలిపారు. -
No Headline
ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్) స్క్రీన్–2 ఆ ఒక్కటీ ఆడక్కు(తెలుగు)–11.00, 4.30,10.30 లవ్మీ(తెలుగు)–1.45 7.30 ప్యూరియస్ మ్యాడ్ మాక్స్–(ఇంగ్లీష్)–4.45 స్క్రీన్–3 ఫ్యూరియోసా(తెలుగు)–10.45,10.40బాక్(తెలుగు)–1.45 రాజుయాదవ్(తెలుగు)–4.40 ,7.45 పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్) స్క్రీన్–1 ప్యూరియస్ మ్యాడ్ మాక్స్ (తెలుగు)– 1.15, ప్యూరియస్ మ్యాడ్ మాక్స్ (ఇంగ్లిష్) – 4.30, 7.45, 11.00 స్క్రీన్–2 శ్రీకాంత్ (హిందీ) – 1.15, లవ్మీ(తెలుగు)–4.00,10.10 ఫ్యూరియోసా(తెలుగు)–6.55 స్క్రీన్–3 డర్టీ ఫ్లవర్ (తెలుగు) – 1.25, ఆ ఒక్కటీ అడక్కు (తెలుగు) – 4.05, శ్రీకాంత్ (హిందీ) – 7.00, సీడీ (క్రిమినల్ ఆర్ డెవిల్ (తెలుగు) – 10.00 స్క్రీన్ –4 బిగ్ బ్రదర్ (తెలుగు) – 11.25, సిల్క్ సారీ (తెలుగు) – 2.00, రాజు యాదవ్ (తెలుగు) – 7.50, 10.30 దేవి రాజు యాదవ్ నటరాజ్ ప్యూరియస్ మ్యాడ్ మాక్స్ (తెలుగు) విజయ్ లవ్మీ(తెలుగు)వెండితెరతెలుగు/హిందీ/ఇంగ్లిష్ -
క్రికెట్ టోర్నీ ప్రారంభం
నిజామాబాద్రూరల్: మండలంలోని కాలూరు గ్రా మంలో నవయువ భారత్ యూత్ ఆధ్వర్యంలో బు ధవారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. నిజా మాబాద్ నగరం నుంచేకాకుండా సమీప గ్రామా ల్లోని క్రికెట్ జట్లు పాల్గొన్నాయని టోర్నీ నిర్వాహకు లు తెలిపారు. రోజుకు రెండు మ్యాచ్లు చొప్పున పది రోజుల పాటు టోర్ని కొనసాగుతుందన్నారు. విజేతకు రూ.11,111, రన్నరప్కు రూ.5,555 అందించనున్నట్లు తెలిపారు. ప్రదీప్, సిద్ధార్థ్, శశాంక్, అక్షయ్, అరుణ్, బన్నీ, ప్రశాంత్ ఉన్నారు. -
పసుపు పంట అభివృద్ధిపై ఎంపీ అర్వింద్కు నివేదిక
సుభాష్నగర్: మేఘాలయలో పర్యటించి పసుపు ఉత్పత్తులపై తయారు చేసిన నివేదిక ను పసుపు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి బుధవారం ఎంపీ అర్వింద్ను తన నివాసంలో కలిసి అందజేశారు. ముఖ్యంగా మార్కెట్లో ఆలూ చిప్స్ ఎలాగైతే విక్రయిస్తున్నారో.. భవిష్యత్లో పసుపు చిప్స్ తయా రు చేసి అమ్మాలనే ఆలోచన ఉందని అక్కడి రైతులు, ఆదర్శ రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ట్రినిటీ సాయి వివరించారని ఎంపీ దృష్టికి తెచ్చారు. పసుపు చిప్స్ తయారు చేసి విక్రయిస్తే.. మార్కెట్లో వినియోగం పెరిగి పంటకు మరింత ధర వచ్చే అవకాశముందని పేర్కొ న్నారు. ఈ విషయమై ఉత్పత్తుల ఆధారంగా దేశంలో పసుపు పండించే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. దేశంలోనే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా పసుపు సాగవుతున్న దృష్ట్యా దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు రైతులతో కమిటీ వేయాలని, రైతులకు మంచి ధరతోపాటు దిగుబడి పెంచే విధంగా చొరవ తీసుకోవాలని తిరుపతిరెడ్డి ఎంపీ అర్వింద్ను కోరారు. ఈ అంశాలపై ఎంపీ సానుకూలంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో పసుపు రైతులకు మంచి లాభాలు వచ్చేలా తోడ్పాటునందిస్తానని హామీనిచ్చినట్లు పే ర్కొన్నారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అంతరెడ్డి హరీశ్రెడ్డి, నా యకులు నాజర్, తదితరులు పాల్గొన్నారు. -
బాధితులు నష్టపరిహారం పొందవచ్చు
అయ్యప్ప స్కానింగ్ సెంటర్ బాధితులు వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేస్తే వారి మానసిక వేదనకు నష్టపరిహారం పొందే అవకాశం ఉందని వినియోగదారుల మండలి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ తెలిపారు. బాధితులు కలెక్టర్కు ఫిర్యాదుతో పాటు వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ scpconsumer@gmail.com, 94403 28239 నంబరుకు వాట్సాప్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. స్కానింగ్ సెంటర్ తతంగంపై చర్యలు తీసుకోవాలని బుధవారం అనిల్తో పాటు మండలి ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, సంయుక్త కార్యదర్శులు మహాదేవుని శ్రీనివాస్, గైని రత్నాకర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అడ్మినిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు చేశారు. -
అందుబాటులో సరిపడా జీలుగ విత్తనాలు
డిచ్పల్లి: జిల్లాలోని రైతులకు అవసరమైన జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో అందుబాటులో ఉన్నాయని జిల్లావ్యవసాయాధికారి కార్యాలయం ఏడీఏ అనిత తెలిపారు. మండలంలోని బర్ధిపూర్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (సొసైటీ) లో బుధవారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం అన్ని సొసైటీల్లో సరిపడా జీలుగ విత్తనాలు ఉన్నాయని, ఇంకా అవసరం అయితే మరిన్ని జీలుగ విత్తనాలను సొసైటీలకు సరఫరా చేస్తామని అనిత పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ ఏడీఏ ప్రదీప్ మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు విధిగా డీలర్ల నుంచి రసీదు తీసుకోవాలన్నారు. బర్ధిపూర్ సొసైటీ పరిధిలో 416 బస్తాల జీలుగ విత్తనాలు రైతులు అందించినట్లు ఏవో రాంబాబు తెలిపారు. సొసైటీ చైర్మన్ రామకృష్ణ, ఏఈవోలు అశ్రిత, వంశీకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్మెయిల్ చేసి.. భయపెట్టి..
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ‘అయ్యప్ప’ స్కానింగ్ సెంటర్లో మహిళల అ శ్లీల చిత్రాలు, వీడియోల చిత్రీకరణ చేసిన ఆపరే టర్ బాధిత మహిళలను తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది. కొంతమంది తమ పరువును బజారుకీడ్చవద్దని వేడుకున్నప్పటికీ నిందితుడు బ్లాక్ మెయిలింగ్తో భయపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడైన స్కానింగ్ సెంటర్లోని ఆపరేటర్ను పోలీసులు ఇది వరకే అరెస్టు చేశారు. స్కానింగ్ సెంటర్లో రోగుల ఫోన్ నంబర్లను నిర్వాహకులు నమోదు చేస్తారు. స్కానింగ్ కోసం వచ్చిన మహిళల అశ్లీల ఫొటోలు, వీడియోలను వారికి తెలియకుండా తీసి నిందితుడు వారి ఫోన్ నంబర్లకు పంపించే వాడు. తనకు సన్నిహితంగా ఉండాలని లేకపోతే సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. పోలీసులు నిందితుడి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని వీడియోలు, మెసేజ్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. విచారణ ప్రారంభించిన కమిటీ జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు డీఎంహెచ్వో నలుగురితో కూడిన విచారణ కమిటీ వేశారు. బుధవారం కమిటీ సభ్యులు అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు వెళ్లి విచారణ జరిపి వివరాలు సేకరించారు. మరింత క్షేత్రస్థాయిలో విచారణ చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పోలీసుల వద్ద ఇప్పటికే అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ఇదిలా ఉండగా ఐఎంఏ సభ్యు లు కొందరు డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ను, కలెక్టర్ను కలిసి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరినట్లు తెలిసింది. స్కానింగ్ సెంటర్లో జరిగి ఘటన సంబంధిత వైద్యునికి తెలియదని, ఆపరేటరే పూర్తి బాధ్యుడని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో జరిగిన ఘటనపై ‘సాక్షి’లో కథనాలు సైతం వెలువడ్డాయి. నిందితుడి అరెస్టు ఖలీల్వాడి: అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఘటన కేసులో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. సీపీ తన చాంబర్తో మీడియాతో మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లో ఘటనపై 20 రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. నిందితుడి నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, అందులో ఇద్దరి మహిళలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయన్నారు. నిందితుడు ఇద్దరు మహిళలను బెదిరించినట్లు తెలిపారు. అన్ని స్కానింగ్ సెంటర్ లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కమిటీ పరిశీలిస్తుందన్నారు. స్కానింగ్ సెంటర్లలో మెడికల్, నాన్ మెడికల్ సిబ్బందిపై నిర్వాహకులు దృష్టి పెట్టాలన్నారు. ప్రజలు స్కానింగ్ సెంటర్ వెళ్లినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే పోలీసులను సంప్రదించాలన్నారు. స్కానింగ్ సెంటర్లో మహిళల అశ్లీల చిత్రాలు, వీడియోలు తీసిన ఆపరేటర్ వాట్సాప్లో పోస్ట్చేసి బెదిరింపులు కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్న కమిటీ -
సకాలంలో పనులను పూర్తిచేయాలి
మోపాల్(నిజామాబాద్రూరల్): ప్రభుత్వ బడుల్లో అమ్మ ఆదర్శ పథకం కింద చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని ఎంపీడీవో లింగం నాయక్ సూచించారు. మండలంలోని కంజర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని 28 పాఠశాలల్లో అభివృద్ధి పనులకు రూ.2.18కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పనులు నాణ్యతతో చేపట్టాలన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వీలైనంత త్వరగా అన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం పలు సూచనలు, సలహాలు చేశారు. పీఆర్ ఏఈ స్రవంతి, జీపీ కార్యదర్శి వెంకటరమణ, హెచ్ఎం, సిబ్బంది ఉన్నారు. -
ఉపాధ్యాయుల బడిబాట
బాల్కొండ: తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ముప్కాల్ మండల ప్రభుత్వ ఉన్నత పాఠఽశాల ఉపాధ్యాయులు బుధవారం బడిబాట నిర్వ హించారు. ఈ సందర్భంగా ముప్కాల్, వేంపల్లి, నల్లూర్ గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, గతేడాది విద్యార్థులు సాధించిన విజయాల గురించి వివరించారు. సర్కార్ బడిలో చదివితేనే పిల్లలు ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం గంగాఽరాం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న ఫొటోగ్రఫీ – వీడియోగ్రఫీతో పాటు ఎలక్ట్రీషియన్ కోర్సుల్లో ఇస్తున్న ఉచి త శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నాబార్డు డీడీఎం ప్రవీణ్ సూచించారు. డిచ్పల్లిలోని ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్ఎస్ఈటీఐ) ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ల్లోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ తరగతులను బుధవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆర్ఎం నవీన్కుమార్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీడీఎం మాట్లాడుతూ.. యువకులకు ఫోటోగ్రఫీ– వీడియోగ్రఫీ, ఎలక్ట్రీషియన్ శిక్షణ ద్వారా భవిష్యత్లో మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఆర్ఎం మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, ఆఫీస్ సిబ్బంది, గెస్ట్ ఫాకల్టీలు పాల్గొన్నారు. -
‘ఈ–నామ్’ అమలు తీరు పరిశీలన
సుభాష్నగర్: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ–నామ్ అమలు తీరును జాతీయ అడిషనల్ ఎకనమిక్ అడ్వయిజర్ (ఐఈఎస్) కె కావైరసన్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఎకనమిక్, అగ్రికల్చర్ మార్కెటింగ్ సలహాదారులు బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా మార్కెట్లో పసుపు, ఆమ్చూర్, ఇతర పంటల క్రయవిక్రయాల ను యార్డులో తిరిగి క్షేత్రస్థాయిలో సందర్శించారు. రైతుల అభిప్రాయాలు, వ్యాపారుల సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. పంట యార్డు కు వచ్చినప్పటి నుంచి ఈ–నామ్లో అన్ని ప్రక్రియలను ప్రొజెక్టర్ ద్వారా మార్కెటింగ్శాఖ అధికారు లు వివరించారు. అనంతరం పసుపు గ్రేడింగ్ పరిశీలన, కుర్కిమిన్ శాతం తెలిపే యంత్రం, పసుపు నాణ్యత, తదితర వివరాలను బృందానికి తెలియజేశారు. బృందంలో జాతీయ అగ్రికల్చర్ మార్కెటింగ్ డిప్యూటీ అడ్వయిజర్ ఎం జవర్, మార్కెటింగ్ ఇంటలిజెన్స్ యూనిట్ అసిస్టెంట్ ఎకనమిక్ అడ్వయిజర్ శశిరాజన్ వర్మ, ఎంఆర్ఐఎన్ పీఎండీ పీయూష్ ఉన్నారు. వారి వెంట రాష్ట్ర మార్కెటింగ్శాఖ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు, రీజినల్ డిప్యూ టీ డైరెక్టర్ పద్మ హర్ష, సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ వెంకటేశం, నిజామాబాద్, కామారెడ్డి డీఎంవోలు గంగు, రమ్య, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్ కిషోర్ ఇనానీ, వ్యాపారులు తదితరులున్నారు. -
విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దు
నిజామాబాద్రూరల్: పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇ బ్బందులు కలుగకుండా చూసుకోవాలని జెడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జెడ్పీ కార్యాలయంలో విద్య, వైద్యం, మహిళా సీ్త్రశిశు సంక్షేమంపై స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠల్రావు మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం కానుండడంతో మౌలి క సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు సుమలత, శంకర్, య మున, కమల, కో–ఆప్షన్ సభ్యులు మోయి జ్, సీఈవో బి.ఉష, డిప్యూటీ సీఈవో సుందర వరదరాజన్, డీఆర్డీవో సాయన్న, డీపీవో తరుణ్, డీఎస్వో చంద్రప్రకాశ్, జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి ముత్తన్న వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ సేవలందించిన అధికారులకు సన్మానం నిజామాబాద్నాగారం: విద్యుత్ శాఖలో వినియోగదారులకు ఉత్తమ సేవలందించిన ఉ మ్మడి జిల్లా అధికారులను ఎన్పీడీసీఎల్ సీజీఎం నిజామాబాద్ జిల్లా నోడల్ ఆఫీసర్ అశోక్, విద్యుత్శాఖ ఎస్ఈ రవీందర్లు బు ధవారం సన్మానించారు. బుధవారం నగరంలోని విద్యుత్శాఖ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఉత్తమ డీఈగా ఎం.శ్రీనివాసరావు(నిజామాబాద్ డివిజన్), అర్బన్ ఏడీఈ పైడి వీరేశం(టౌన్–3), రూరల్ ఏడీఈ జనార్దన్, ఆర్మూర్ ఏడీఈ శ్రీధర్, ఏఈ జపా ఆశ్రితరెడ్డి (ఆర్మూ ర్ టౌన్– 2), ఉత్తమ రూరల్ ఏఈ దారం ప్రవీణ్ కుమార్(నవీపేట్)లను సత్కరించారు. కార్యక్రమంలో డీఈ టెక్నికల్ వెంకటరమణ, డీఈలు జాడే ఉత్తం, పీవీ రాజేశ్వరరావు, హరిచంద్ర నాయక్, ఎస్ఏవో శ్రీనివాస్, ఏడీఈలు ప్రశాంత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్, తోట రాజశేఖర్, సుహాసిని, జి.శ్రీనివాస్, ఆర్.బాలేష్ కుమార్, ఎన్.రాజే శ్వర్, ఆర్.శ్రీధర్, బి.వినోద్ పాల్గొన్నారు. పనులను వేగంగా పూర్తిచేయాలి నిజామాబాద్ అర్బన్: ప్రభుత్వ బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద జరుగుతున్న పనులను వేగవంతంగా పూర్తిచేయాలని డీఈవో దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. నగరంలోని రాజీవ్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు పనులన్నీ పూర్తి చేయాలని నిర్వాహకులకు సూచించారు. పనులు నాణ్యతగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు, హెచ్ఎం, ఉపాధ్యాయులు ఉన్నారు. పాల్దా సొసైటీ చైర్మన్గా శ్రీనివాస్ నిజామాబాద్రూరల్: మండలంలోని పాల్దా సొసైటీ నూతన చైర్మన్గా కే శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా కోఆపరేటివ్ అసిస్టెంట్ రిజిస్టర్ దేవకళ ఆధ్వర్యంలో బుధవారం చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 11 మంది సభ్యులు శ్రీనివాస్కు మద్దతు తెలుపడంతో అదేవిధంగా చైర్మన్ పదవికి నామినేషన్ ఒక్కటే రావడంతో శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆమె ప్రకటించారు. అనంతరం నియమకపత్రాలను శ్రీనివాస్కు అందజేశారు. అనంతరం సొసైటీ డైరెక్టర్లు నూతన చైర్మన్ను శాలువ, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. డైరెక్టర్లను చైర్మన్ సన్మానించారు. గతంలో చైర్మన్గా పనిచేసిన గాడి జితేందర్ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశారు. -
స్కానింగ్ సెంటర్ను సీజ్ చేయాలి
నిజామాబాద్నాగారం: స్కానింగ్ పేరుతో మహిళల అశ్లీల చిత్రీకరణ చేసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ను వెంటనే సీజ్ చేయాలని, అధికారులు కమిటీల పేర్లతో కాలయాపన చేయొద్దని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలు రోగం వచ్చి స్కానింగ్ కోసం వెళ్తే ఆపరేటర్ ప్రశాంత్ కీచక పర్వానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కామారెడ్డి డీఎంహెవోను అరెస్టు చేసి ఉద్యోగం నుంచి భర్త రఫ్ చేయాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, నాయకులు మీనా తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురిపై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ జిల్లాలో బుధవారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొదటి సంవత్సరం విద్యార్థి, ఇద్దరు రెండో సంవత్సరం విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ రవికుమార్ తెలిపారు. డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం ఒక విద్యార్థి, మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు చీటీలతో కాపీయింగ్ చేస్తుండగా దొరికారు. బుధవారం గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 8,468 మంది విద్యార్థులకు గాను 8,102 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు. మధ్యాహ్నం రెండోవ సంవత్సరం పరీక్షలకు 2,800 మంది విద్యార్థులకు గాను 2,690 మంది హాజరయ్యారు. కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. నిజామాబాద్ నగరం నిశిత కామర్స్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రంలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు ఆయన తెలిపారు. వర్సిటీ పరిధిలో 38 కేంద్రాల్లో ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 7,258 మంది విద్యార్థులకు గానూ 6,765 మంది హాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన 2వ సెమిస్టర్ రెగ్యులర్, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 9,890 మంది విద్యార్థులకు గానూ 9,261 మంది హాజరైనట్లు తెలిపారు. ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్, జాయింట్ డైరెక్టర్ అతిక్ సుల్తాన్ ఘోరీ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. బాలల సాహిత్య సమ్మేళనానికి సమన్వయకర్తగా నాగరాజు పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మంథని ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కోకిల నాగరాజు రాష్ట్ర స్థాయి బాలల సాహిత్య సమ్మేళనానికి సమన్వయకర్తగా వ్యవహరించడానికి తెలంగాణ సారస్వత పరిషత్తు నుంచి ఆహ్వానం లభించింది. హైదరాబాద్లో ఈ నెల 29, 30 తేదీల్లో సమ్మేళనం నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు నిర్వహించే సమ్మేళనంలో బాలల సాహిత్యం కోసం సేవలు చేస్తు న్న రచయితలు, వక్తలు ప్రసంగించనున్నారు. మదర్హుడ్ ఆస్పత్రికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ నోటీసు నిజామాబాద్నాగారం: అవసరం లేకున్నా ఆపరేషన్ చేశారని నవీపేట్ మండలానికి చెందిన ఆశాతాయి ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించడంతో బుధవారం నగరంలోని మదర్హుడ్ ఆస్పత్రికి నోటీసు జారీ చేశారు. ఇదివరకే జిల్లా కలెక్టర్కు, డీఎంహెచ్వోకు సైతం విన్నవించారు. ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి వస్తే రొమ్ము క్యాన్సర్ ఉందని, ఆపరేషన్ చేయాలని వైద్యులు భయభ్రాంతులకు గురి చేశారన్నారు. తన భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో రీయంబర్స్మెంట్ కోసం వెళ్లితే అదనంగా రూ.లక్ష చెల్లించాలని బెదిరించారని ఆరోపించారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష బోధన్టౌన్(బోధన్): డ్రంకెన్ డ్రైవ్ కేసులో బోధన్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి బుధవారం ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ను వెల్లడించినట్లు పట్టణ సీఐ వీరయ్య తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో 3 రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. మొరం టిప్పర్ పట్టివేత రుద్రూర్: పొతంగల్ మండలం చేతన్నగర్ శివారులో అనుమతి లేకుండా మొరం తరలిస్తున్న టిప్పర్ను బుధవారం సాయంత్రం పట్టుకుని కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించినట్లు తహసీల్దార్ మల్లేష్ తెలిపారు. తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు సమాచారం అందించామన్నారు. అనుమతి లేకుండా మొరం, ఇసుక తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మృత్యు కూపాలుగా చెరువులు
మాక్లూర్: చెరువుల్లో మొరం తీయగా ఏర్పడిన భారీ గుంతల కారణంగా ఆ చోట గుంత ఉన్న విషయం తెలియక అనేక మంది ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందుతున్న ఘటనలు మండలంలోని ఆయా గ్రామాల్లో ఇటీవల కాలంలో నిత్యకృత్యం అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చెరువుల్లో జరుగుతున్న అడ్డగోలు తవ్వకాలపై చర్యలు తీసుకోవటంలో విఫలమువుతున్నారనే విమర్శలు ఆయా గ్రామాల ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. గత నెలలో ఒడ్డేట్పల్లి చెరువులో స్నానానికని వెళ్లి ప్రమాదవశాత్తూ మొరం గుంతలో పడి అదే గ్రామానికి చెందిన నరేష్, మహేష్, సాయితేజ అనే యువకులు మృతి చెందారు. అంతకు ముందు మదన్పల్లికి చెందిన లక్ష్మి అదే మొరం గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. తాజాగా ఈ నెల 26న కొత్తపల్లి చెరువులోనికి పశువులను తీసుకుని వెళ్లిన 22 సంవత్సరాల పశువుల కాపరి పశువులను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు మొరం గుంతలో పడి మృతి చెందాడు. 27వ తేదీ సాయంత్రం రాంచంద్రపల్లికి చెందిన జ్వాల దుర్గయ్య(65) అనే పశువుల కాపరి సింగ సముద్రం చెరువులో ఉన్న పశువులను బయటకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తూ మొరం గుంతలో పడి మృతి చెందాడు. ఈ నెల 28న మండలంలోని చిక్లీ చెరువులో యువతి ప్రమాదవశాత్తు మొరం గుంతలో పడి గల్లంతు కాగా ఆ యువతి శవం బుధవారం తేలింది. అంతే కాకుండా మండలంలోని అడవి మామిడిపల్లి, వల్లభాపూర్, గుంజ్లి, రాంచంద్రాపల్లి తదితర చెరువులు గ్రామాలకు అతి సమీపంలో ఉండటం మొరం వ్యాపారులు వాటినే ఎంచుకుని అడ్డగోలుగా మొరం తవ్వకాలు జరిపి వ్యాపారం చేసుకోవటం జరుగుతోంది. మొరం తీయగా ఏర్పడిన భారీ గుంతలను అలాగే వదిలేస్తున్నారు. నిలువెత్తు లోతుగా ఉండటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు స్థానికుల నుంచి వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే మొరం గుంతలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే మొరం వ్యాపారులు కొన్ని సందర్భాల్లో వెంటనే ఘటన స్థలానికి చేరుకుని తమ మీదికి వస్తుందన్న ఉద్దేశంతో హడావిడి చేసి పోస్టుమార్టం చేయించకుండానే గుట్టుగా దహన కార్యక్రమాలు పూర్తి చేయించేస్తున్నారు. మొరం వ్యాపారులు కొందరు గ్రామాభివృద్ధి కమిటీలకు మందు విందులు ఇచ్చి చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి ప్రమాదాలు చెచ్చి పెడుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికై న సంబంధిత తహసీల్దార్ చెరువుల్లో జరుగుతున్న తవ్వకాలపై తగిన చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. గాలిలో కలుస్తున్న ప్రాణాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు మొరం గుంతల్లో ప్రమాదవశాత్తు పడి వారం రోజుల వ్యవధిలో 8 మంది మృతి గుంతగా తవ్వకూడదు చెరువులో మొరం, మట్టి తీసేటప్పుడు గుంతగా తవ్వకూడదు. ఒకే లెవెల్లో తవ్వితే గుంతలు ఏర్పడవు. పైగా చెరువు పూడిక తీసినట్లు అవుతుంది. తద్వారా చెరువు లోతు పెరిగి నీటి నిలువ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొరం వ్యాపారులు చెరువుల్లో ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు జరపటంవల్ల పెద్ద గుంతలు ఏర్పడటం, ఆ విషయం తెలియక చెరువులోకి వెళ్లిన వారు ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందుతున్నారు. ఈ విషయంలో తహసీల్దార్ ప్రత్యేక చర్యలు చేపట్టాలి. – గంగాధర్, ఒడ్డేట్పల్లి, మాక్లూర్ -
భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త ఆత్మహత్య
డిచ్పల్లి: భార్య తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయి తిరిగి రాలేదని, జీవితంపై విరక్తి తో పురుగు మందు తాగి మగ్గిడి రాజు(39) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు డిచ్పల్లి ఎస్సై మహేష్ బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు.. డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామానికి చెందిన రాజు భార్య ఆయనతో గొడవ పడి రెండేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇంటికి రాకపోవడంతో రాజు ఒక్కడే ఉంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి పురుగు మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి తల్లి పోసాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నం బోధన్: సాలూర మండల కేంద్రానికి చెందిన ఆశావర్కర్ సునీత మంగళవారం ఇంట్లో పురుగు మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబీకులు గమనించి వెంటనే చికిత్స కోసం బోధన్ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా ఆమె కోలుకుని బుధవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యింది. ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్యోగం నుంచి తొలగించేస్తామని ఇబ్బందులకు గురి చేస్తున్నందున ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ బైక్ల సీజ్ కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ పరిధిలో ఎక్కువ మోతాదులో శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ బైక్లపై బుధవారం పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు 12 బుల్లెట్ బైక్లను సీజ్ చేశారు. వాహనదారులు నిబంధనలకు అతిక్రమిస్తూ శబ్ద కాల్యుష్యానికి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్ చేసిన బైక్లను పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఉత్కంఠగా ఎదురుచూపు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగి లి ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, శ్రేణులతో పాటు ఆసక్తి కలిగిన వివిధ వర్గాల వారంతా పోలింగ్ పూర్తయిన నాటినుంచి రోజు ల వారీగా లెక్కపెట్టుకుంటూ వస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం ఇక గంటలవారీగా ఎదురు చూసే తరుణం వచ్చింది. పోలింగ్ పూర్తయ్యాక వారం రోజుల పా టు కూడికలు, తీసివేతలతో సెగ్మెంట్లు, బూత్ల వారీగా లెక్కగట్టుకుంటూ గడిపిన ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు మళ్లీ ఇప్పుడు అదే పనిలో పడ్డారు. ● నిజామాబాద్ లోక్సభ స్థానంలో 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు అంశంతో బీజేపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ధర్మపురి అర్వింద్ అప్పటి సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితపై ఘనవిజయం సాధించారు. అర్వింద్కు 4,80,584(45.22 శాతం) ఓట్లు వచ్చాయి. కవితకు 4,09,709(38.55 శాతం) ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ మూడో స్థానానికి పడిపోయారు. యాష్కీకి 69,240 (6.52 శాతం) ఓట్లు వచ్చాయి. ● జహీరాబాద్ లోక్సభ స్థానంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీబీపాటిల్, కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్పై స్వల్ప తేడాతో గెలుపొందారు. బీబీపాటిల్కు 4,34,244 (42 శాతం) ఓట్లు వచ్చాయి. మదన్మోహన్కు 4,28,015 (41 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డికి 1,38,947 (13 శాతం) ఓట్లు వచ్చాయి. ● తాజా ఎన్నికల్లో సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. శాసనసభ ఎన్నికల తరువాత ఐదు నెలల తేడాతో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నడిచినప్పటికీ రెండు జాతీయ పార్టీల మధ్యే నువ్వా నేనా అనే స్థాయిలో పోరు జరిగింది. జాతీయ స్థాయి ఎన్నికలు కావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ గట్టిగానే తలపడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఓట్లు ఎటువైపు క్రాస్ అయ్యాయనే విషయమై నాయకులు, కార్యకర్తలు సెగ్మెంట్ల వారీగా లెక్కలు వేసుకునే పనిలో ఉన్నారు. ● జహీరాబాద్ స్థానంలో బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్, కాంగ్రెస్ నుంచి సురేశ్ షెట్కార్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్కుమార్ బరిలో ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో పాటు ప్రధాని మోదీ హవా నడుస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ అభ్యర్థి బీబీపాటిల్ గట్టి పోటీ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ సైతం విజయంపై ధీమాతో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బలమైన బీసీ వర్గానికి చెందినప్పటికీ బీఆర్ఎస్ ఓట్లు క్రాస్ అయినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఓట్లను రెండు జాతీయ పార్టీలు ఎంత మేరకు రాబట్టుకున్నాయనే విషయమై స్పష్టత లేదు. దీంతో ఈ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్కు కౌంట్డౌన్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇంకా ఐదు రోజులే.. సెగ్మెంట్లు, బూత్ల వారీగా వచ్చే ఓట్ల విషయమై అభ్యర్థుల లెక్కలు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో త్రిముఖ పోటీ నడిచినప్పటికీ రెండు జాతీయ పార్టీల మధ్యే నువ్వా నేనా అనే స్థాయిలో పోరు జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ అర్వింద్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రధాని మోదీతో ప్రకటన చేయించారు. మోదీ మేనియా ఈ నియోజకవర్గంలో భారీగా ఉంది. దీంతో తనకు మంచి మెజారిటీతో గెలుపు దక్కనుందనే ధీమాతో అర్వింద్ ఉన్నా రు. కాంగ్రెస్ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి సై తం తనకు సైలెంట్ ఓటింగ్ నమోదైందని గెలుపుపై నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తనకు వచ్చే ఓట్ల విషయమై అంచనాలు వేసుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ ఓట్లు బాగా క్రాస్ అయ్యాయని, ఈ ఓట్లు తమకే పడ్డాయని బీజేపీ అంటోంది. తమకు సైలెంట్గా ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
‘గోల్డెన్’ అవర్..!
ఖలీల్వాడి: నగరానికి చెందిన ఓ బాధితుడు సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 20 లక్షలు మోసపోయారు. వెంటనే సైబర్ క్రైం పోలీస్స్టేషన్కు రావడంతో పోలీసుల సూచన మేరకు డయల్ 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేయించారు. దీంతో రూ. 20 లక్షలను సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా పోలీసులు ఫ్రీజ్ చేశారు. బాధితుడికి రూ. 20 లక్షలు తిరిగి అందించారు. సైబర్ మోసం జరిగిన వెంటనే స్పందిస్తే ఇలా డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుంది. సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బులు పొగొట్టుకున్న బాధితులు అర గంట, గంటలోపు టోల్ఫ్రీ నంబర్ 1930 ఫోన్ గాని www.cybercrime.gov. inకు మెయిల్ గాని చేస్తే డబ్బులను ఫ్రీజ్ చేస్తారు. దీనినే డైమండ్ అవర్, గోల్డెన్ అవర్గా పేర్కొంటున్నారు. చదువుకున్న వారే అధికం.. జిల్లాలో ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మోసగాళ్లు వివిధ పద్ధతుల్లో ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఖాతాల నుంచి డబ్బులు పోతున్నట్లు సైబర్ పోలీసులు గుర్తించారు. ఇలా మోసపోయిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులు, యువతీ, యువకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులే ఉండడం గమనార్హం. మెయిల్ లేదా ఫోన్చేస్తే చాలు బాధితలు మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే ‘1930’ టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేయాలి. ఎన్సీఆర్పీ(నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్)లో ఫిర్యాదు నమోదు చేయాలి. ఆది అరగంట, గంట సమయంలో చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. బాధితుల ఖాతాలో నుంచి నగదు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా హోల్డ్ చేస్తారు. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ‘సైబర్ వారియర్స్’ అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గత మూడేళ్లలో చాలామంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన అరగంట, గంట సేపు ఫిర్యాదు చేసే 90 నుంచి 100 శాతం రికవరీ అవకాశం ఉంటుంది అవుతుంది. ఆరు గంటల వరకై తే 60 శాతం, ఆ తర్వాత కేవలం 30 శాతం వరకే రికవరీ చేసే చాన్స్ ఉంటుంది. జిల్లా కేంద్రంలో సైబర్ పోలీస్స్టేషన్ నిజామాబాద్ కమిషనరేట్లో ఏప్రిల్ 2న సైబర్ పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. స్టేషన్లో ఎస్హెచ్వోగా ఏసీపీ, ఇద్దరు ఎస్సైలు, సరిపోయే పోలీసు సిబ్బందిని నియమించారు. స్టేషన్లో ఇప్పటి వరకు 25 కేసులు నమోదు కాగా రూ. 31.70 లక్షలు రికవరీ చేశారు. 1930 ట్రోల్ ఫ్రీ నంబర్ ద్వారా రూ. 20 లక్షలు రికవరీ చేసి బాధితులకు తిరిగిచ్చారు. రూ. లక్షలోపు నష్టపోతే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. రూ. లక్షకు పైగా నష్టపోతే సైబర్ క్రైం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. స్మార్ట్ఫోన్లో వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దుస్మార్ట్ఫోన్లో వచ్చే అనవసర లింకులు, యాప్ లు ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. అలాగే సోషల్ మీడియా యాప్ లు ఇన్స్ట్రాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వివరాల తో పాటు బ్యాంక్ వివరాలను పొందపర్చవద్ద ని సూచిస్తున్నారు. లక్కీ లాటరీలో మొబైల్ నంబర్ వచ్చిందని లింకులు వస్తే ఓపెన్ చేయవద్దని పేర్కొంటున్నారు. దీంతో పాటు మ్యాట్రి మోనీ పేరిట, కాల్గర్ల్స్ కాల్స్, ఆన్లైన్ గేమ్స్, కేవైసీ పేరిట ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడతారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద లింకులు ఓపెన్ చేసినా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా ఖాతాల్లోంచి నగదు మాయమవుతుందని చెబుతున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని పేర్కొంటున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే స్పందించాలి 1930 టోల్ఫ్రీకి ఫోన్చేసి ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ చేయొచ్చు వెంటనే ఫిర్యాదు చేయాలి సైబర్ మోసగాళ్ల చేతిలో ఎక్కువగా చదువుకున్నవారే మోసపోతున్నారు. డబ్బులు నష్టపోతే అరగంట, గంటలోపు డయల్ 1930కు ఫోన్చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుంది. సైబర్ నేరగాళ్లకు సంబంధించిన ఖాతాను ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అర గంటను డైమండ్, గంటను గోల్డెన్ అవర్ అవుతుంది. – వెంకటేశ్వర్, ఏసీపీ, సైబర్ క్రైం
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement