-
పార్కింగ్ పరేషాన్
రోడ్డుపైనే వాహనాలు నిలిపిన ఈ ఫొటోని ప్రాంతం మంథని మున్సిపల్లోని అంబేడ్కర్ చౌరస్తాలోనిది. గాంధీచౌక్, పాత పెట్రోల్ బంక్ నుంచి ఆర్టీసీ బస్ డిపో వరకు ఎక్కడా పార్కింగ్ స్థలాలు లేవు. దీంతో రోడ్డుకు ఇరువైపులా ఇలా వాహనాలు భారీ సంఖ్యలో నిలుపుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని గోదావరిఖని లక్ష్మీనగర్లోని ఈ ఫొటో. వాహనాలు నిలపడానికి బల్దియా పాలకులు, అధికారులు స్థలాలు కేటాయించలేదు. వ్యాపారులు, కస్టమర్లు ఎక్కడ ఖాళీస్థలం కనిపిస్తే అక్కడే తమ వాహనాలు పార్క్ చేస్తున్నారు. -
స్వచ్ఛత అందరి బాధ్యత
జ్యోతినగర్(రామగుండం): స్వచ్ఛత అందరి బాధ్యత అని ఎన్టీపీసీ ప్రాజెక్టు ఏజీఎం(హెచ్ఆర్) బిజయ్కుమార్ సిగ్దర్ అన్నారు. ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతీఒక్కరు తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పని స్థలాల్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కేకే సింగ్రాయ్, ఎంజే నాయుడుతోపాటు ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
● ఫుట్పాత్ల ఆక్రమణ.. ఆపై బిజినెస్ ● చిరువ్యాపారులకు అద్దెకిస్తూ మరికొందరి అక్రమార్జన ● తరచూ తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్య ● ఈ – చలాన్లతో వాహనదారుల జేబులు గుళ్ల ● రామగుండం కార్పొరేషన్ సహా బల్దియాల్లో దుస్థితి ఇది
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ సహా పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపల్ ప్రాంతాలకు వివిధ గ్రామాల నుంచి నిత్యం వే లాది మంది ప్రజలు తమ అవసరాల కోసం వ చ్చిపోతున్నారు. అయితే, మెడికల్, ఎరువులు, బో రు మోటార్లు, బ్యాంకులు, కిరాణాలు, వస్త్ర వ్యాపారాలు ప్రధాన రోడ్ల వెంటే ఉన్నాయి. అయితే, బల్ది యాల్లో పార్కింగ్ స్థలాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నా.. రోడ్లను ఆనుకున్నాయి. వాహనాలు ఎక్కువసంఖ్య లో వస్తే రోడ్డుపై నిలపాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. విరుద్ధంగా పార్క్ చేశారంటూ పోలీసులు ఫొ టోలు తీసి ఈ చలాన్లు పంపుతున్నారు. పెరుగు తున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేప ట్టి, పార్కింగ్ స్థలాలు కేటాయించకపోవడంతో ట్రా ఫిక్ సమస్యలు ప్రజలకు చుక్కలు చూపుతున్నాయి. అమలుకు నోచుకోని మాస్టర్ ప్లాన్.. ● రామగుండం కార్పొరేషన్లో 2001లో మరో 20 ఏళ్ల వరకు సరిపడా సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ గతేడాదే ముగిసింది. ● అందుకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టలేదు. ● ముఖ్యంగా వాహనాల రద్దీకి అనుగుణంగా వ్యాపార కూడళ్లు, ప్రధాన, గల్లీ రోడ్లు విస్తరించడంలేదు. ● 2001మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించిన అనేక అంశాలు అమలుకు నోచుకోవడంలేదు. ● ప్రధాన వ్యాపార కూడళ్లు లక్ష్మీనగర్, కల్యాణ్నగర్, శివాజీనగర్, మేదరిబస్తీ, స్వతంత్రచౌక్, సీటీ స్కాన్ కూడలి తదితర ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు టౌన్ ప్లానింగ్ అధికారులు గతంలోనే మార్కింగ్ చేశారు. ● కానీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల ఒత్తిళ్లుతో అది అమలుకు నోచుకోవడంలేదు. ● ఫలితంగా నగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆక్రమణలకు అడ్డుకట్టేది? పెద్దపల్లి బల్దియాలో మాస్టర్ ప్లాన్ అమలైతే ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు మోక్షం కలుగుతంది. నిత్యం రద్దీగా ఉండే జెండా కూడలి నుంచి భారీ వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే వ్యాపారులు రోడ్డు ఆక్రమించి సామగ్రి నిల్వచేయడంతో వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా మారిందని వాహనదారులు చెబుతున్నారు. స్పెషల్ డ్రైవ్ల ద్వారా ఫుట్పత్లపై ఆక్రమణలు తొలగిస్తే నాలుగు రోజుల తర్వాత పూర్వస్థితికి చేరుకుంటోంది. పరిష్కార మార్గా ఇవి.. ● ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ జోన్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ● రద్దీ ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వాహనాలను అనుమతించొద్దు. ● బల్దియాల ఖాళీ స్థలాల్లో పార్కింగ్కు చర్యలు చేపట్టాలి. ● ఇందుకోసం నిర్ణీత రుసుం వసూలు చేస్తే బల్దియాకు ఆదాయం కూడా సమకూరనుంది. -
భూసేకరణ వేగవంతం చేయాలి
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగిరి మండ లం సుందిళ్ల, ముస్త్యాల గ్రామాల్లో చేపట్టిన సింగరేణి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ప్రసా ద్లాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవా రం సమావేశమై భూసేకరణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. భూసేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సమావేశంలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు పెద్దపల్లిరూరల్: నకిలీ, కల్తీ విత్తనాలను రైతులకు అంటగట్టే వ్యాపారులపై కఠిన చర్యలు తీ సుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరె డ్డి హెచ్చరించారు. అప్పన్నపేట తదితర గ్రా మాల్లో మంగళవారం ఏవో అలివేణి, ఎస్సై శి వానితో కలిసి విత్తన, ఎరువుల దుకాణాలు త నిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా టాస్క్ఫోర్స్ బృందా లు ఆకస్మిక తనిఖీలు చేశాయని ఆయన తెలిపారు. నకిలీ, కల్తీ విత్తనాల కట్టడికి టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని, సమాచారం తెలిసిన వారు అగ్రికల్చరల్ ఏడీ శ్రీనాథ్ 72888 94148, విత్తన అధికారి కిశోర్కుమార్ 72888 79669, మంథని ఏఎస్సై మల్లయ్య 94404 61918 నంబర్లకు ఫోన్చేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఉన్నత స్థాయికి ఎదగాలి గోదావరిఖని/యైటింక్లయిన్కాలనీ(రామగుండం): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో ప్ర తిభ చూపి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆ ర్జీ–2 జీఎం సూర్యనారాయణ సూచించారు. వ ర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న వేసవి ఉచిత క్రీడాశిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా జీఎం మాట్లాడారు. అనుభవజ్ఞులైన కోచ్లతో ఫుట్బాల్, వాలీ బా ల్, బాస్కెట్బాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. క్రీ డాకారులకు సింగరేణి అన్నివిధాలా తోడ్పాటు అందిస్తుందని జీఎం తెలిపారు. ఏఐటీయూసీ ప్రతినిధి శాంసన్, అధికారులు రాజేంద్రప్రసాద్, షరీఫ్ మహ్మద్, వేణుగోపాల్, నరేందర్రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. భూసార పరీక్షలు చేయిచండి కమాన్పూర్(మంథని): సాగుకు ముందు రైతు లు పొలాల్లో మట్టి నమూనాలు తీసుకెళ్లి భూ సార పరీక్షలు చేయించుకోవాలని కేవీకే శాస్త్రవే త్త కిరణ్ పిల్లి సూచించారు. నాగారంలో మట్టి నమూనా పరీక్షలపై మంగళవారం ఆయన అ వగాహన కల్పించారు. భూసార పరీక్ష ఫలితా ల ఆధారంగా పంటలు వేసి, ఎరువులు వాడి తే మంచి దిగుబడి వస్తుందని ఆయన తెలిపా రు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి గోదావరిఖని: బొగ్గు రవాణా చేస్తున్న లారీ డ్రై వర్లు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ, ప్రమాదాల నియంత్రణలో సహకరించాలని గోదావరిఖని ఏసీపీ రమేశ్ సూచించారు. ఆ ర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణతో కలిసి ఓసీపీ–3 ఫేజ్–2లో లారీ డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై మంగళవారం అవగాహన కల్పించారు. ఏసీపీ మాట్లాడుతూ బొగ్గు రవాణా చే స్తున్న లారీలతో కొద్దిరోజులుగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోందన్నారు. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు ఆర్టీఏలో పొందుపరిచిన రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని సూ చించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, నిద్రమత్తులో వాహనాలు నడపవద్దన్నా రు. అతివేగంతో వాహనాలు నడపరాదని ఆ యన పేర్కొన్నారు. టూటౌన్ సీఐ రవీందర్, ఓసీపీ–3 అధికారి మధుసూదన్, ఫేజ్–2 ఇన్చార్జి జీకేరెడ్డి, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
పెద్దపల్లిరూరల్: లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. రాష్ట్రంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ హాజరయ్యారు. జూన్ 4న ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్లలెక్కింపు ప్రారంభించాలన్నారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించాలని ఆయన సూచించారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈవీఎంలను గోదాములకు తరలించాలని సూచించా రు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో లెక్కింపు కోసం అన్నిఏర్పాట్లు పూర్తిచేశామని రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు గంగయ్య, హనుమా నాయక్, డెప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ పాల్గొన్నారు. కౌంటింగ్కు సన్నద్ధం రామగిరి(మంథని): పార్లమెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకోసం అధికారులు సన్నద్ధం కావాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ఖాన్ సూచించారు. సెంటనరీకాలనీ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అధికారులకు శిక్షణ శిబిరం నిర్వహించారు. అదనపు కలెక్టర్లు శ్యామ్ప్రసాద్లాల్, అరుణ శ్రీల తో కలిసి ఆయన హాజరయ్యారు. జూన్4న ఉద యం 8 గంటలకు మంథని, ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. కౌంటింగ్ హాల్లోకి సెల్ఫోన్ల అనుమతి లేదని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో టేబుల్ వద్ద సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ విధులు నిర్వర్తిస్తారని ఆయన వివరించారు. 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ బృందాలు అందుబాటులో ఉంటాయన్నారు. కంట్రోల్ యూనిట్ వివరాలను సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తెలియజేశాక తదుపరి లెక్కింపు చేపట్టాలని అన్నారు. కంట్రోల్ యూనిట్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వీవీ ప్యాట్ల ఓట్లు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఈటీపీబీఎస్ విధానం ద్వారా సర్వీస్ ఓట్లు లెక్కించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మంథని, పెద్దపల్లి సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు హనుమా నాయక్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తదితరులు పరిశీలించారు. ఈనెలాఖరునాటికి కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన అన్నిఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. జూన్ 3న ట్రయల్ కౌంటింగ్ నిర్వహించాలని తెలిపారు. తర్వాత స్ట్రాంగ్రూంలను తనిఖీ చేశారు. చురుకుగా ఏర్పాట్లు కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ -
రైతులకు నష్టం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం
మంథని: నకిలీ, కల్తీ విత్తనాలు, ఎరువులతో అన్నదాతలను మోసం చేస్తే పీడీయాక్ట్ నమోదు చే స్తామని గోదావరిఖని టేసీపీ రమేశ్ హెచ్చరించా రు. పట్టణంలో మంథని, ముత్తారం, రామగిరి మండలాలకు చెందిన విత్తనాలు, ఎరువుల డీలర్లు, వ్యాపారులతో నకిలీ, కల్తీ విత్తనాల నివారణపై సో మవారం అవగాహన సదస్సు నిర్వహించారు. నకి లీ విత్తనాలని తేలితే సీడ్ కంపెనీ నుంచి రైతులకు పరిహారం అందేలా డీలర్లు చొరవ చూపాలన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రైతులు వ్యాపారుల నుంచి రసీదులు తీసుకొని భ ద్రపర్చుకోవాలని సూచించారు. ఆశించినస్థాయిలో వర్షాలు కురిశాకే విత్తనాలు వేసుకోవాలని మంథని ఏడీఏ మురళి సూచించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసిన అన్నదాతలకు రసీదులు ఇవ్వాల ని వ్యాపారులకు సూచించారు. వ్యవసాయ అధికారులు శ్రీకాంత్, మోహన్, మంథని, ముత్తారం, రామగిరి ఎస్సైలు, వ్యాపారులు పాల్గొన్నారు. -
పాతరోడ్డు పునరుద్ధరణకు హామీ
గోదావరిఖని: వారం రోజుల్లో పాతరోడ్డు పునరుద్ధ రించేందుకు, రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందు కు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇ చ్చినట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. సోమవారం జీడీకే–11గని ఏజెంట్ శ్రీనివాస్, మేనేజర్ నెహ్రూతో చందర్ సమావేశమయాయరు. అనంతరం ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమా దంలో యువకార్మికుడు రాసపల్లి నాగరాజు మృతి చెందాడని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. -
క్షయ నిర్మూలనే లక్ష్యం
పెద్దపల్లిరూరల్: మనదేశాన్ని 2025 నాటికల్లా ‘టీబీ ముక్త్భారత్’గా తీర్చిదిద్దాలనే లక్ష్య సాధనకు జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. క్షయ(టీబీ)ను నియంత్రించేందుకు ఇంటింటి సర్వే చేపట్టి వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై వైద్యాధికారులకు సోమవారం శిక్షణ ఇచ్చారు. జూన్ 10వ తేదీవరకు ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు ఇంటింటి సర్వే చేయాల్సిన తీరుపై అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో ఎంపిక చేసిన 17 జిల్లాల్లో మనజిల్లాకు కూడా స్థానం కల్పించారు. దీంతో క్షయను సమూలంగా నిర్మూలించేందుకు వీలుగా అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా శిశువు జన్మించిన 24గంటల్లోపే బీసీజీ టీకా వేస్తారు. ప్రస్తుతం రీ–వ్యాక్సినేషన్గా ఈ టీకాను అవసరమైతే వయోజనులకు వేయనున్నట్లు అధికావర్గాలు తెలిపాయి. జిల్లాలో 397మంది వ్యాధిగ్రస్తులు ● జిల్లాలో ప్రస్తుతం 397మంది క్షయ వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. ● వారందరికీ ప్రభుత్వం ప్రతినెలా ఉచితంగా మందులు అందిస్తోంది. ● బాధితుల ద్వారా వారి కుటుంబీకులు, సన్నిహితులు, పొగతాగేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు టీబీ సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ● 18ఏళ్ల వయసు దాటిన, 60ఏళ్ల వయసుపైబడిన వారిని ఇంటింటి సర్వే ద్వారా వైద్యసిబ్బంది గుర్తిస్తారు. ● అంతేకాక బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ప్రకారం తక్కువ బరువు ఉన్న వారిని సైతం గుర్తించి వివరాలు నమోదు చేస్తారు. ● ఐదేళ్లుగా టీబీకి సంబంధించిన మందులు వాడిన వారు, బాధితుడితో సన్నిహితంగా ఉన్న 18ఏళ్ల పైబడిన వారిని గుర్తించి బీసీజీ టీకా ఇస్తారు. ● అయితే, బాధితుల అనుమతి తీసుకున్నాకే వారికి టీకా ఇవ్వనున్నారు. ● టీకా తీసుకునేందుకు నిరాకరిస్తే ఇవ్వబోమని ఓ వైద్యాధికారి తెలిపారు. బీసీజీ టీకాపై అవగాహన జ్యోతినగర్(రామగుండం): బీసీజీ టీకాపై జిల్లాస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య, పర్యవేక్షణ అధికారులు, ఆశ, నోడల్ పర్సన్, టీబీ నోడల్ పర్సన్లకు శిక్షణ అందించామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి ప్రమోద్కుమార్ అన్నారు. సోమవారం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో టీబీ వాక్సిన్పై బీసీజీ టీకా అందించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. బీసీజీ టీకా ఉచితంగా అందించేందుకు కార్యాచరణ చురుకుగా సాగుతోందని ఆయన చెప్పారు. వ్యాక్సిన్పై పోహలు వద్దని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, వ్యాక్సినేషన్ కేంద్రాల్లో పెద్దలందరికీ టీకా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటి సర్వే ఆధారంగా అర్హులను గుర్తిస్తున్నామని అన్నారు. డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్లు విష్ణు, అతుల్ నజీమ్, స్టేట్ టీబీ కో ఆర్డినేటర్ ఆదిత్య, ఎంఎస్హెచ్ రాజేశ్వర్.. వైద్యులు, సిబ్బందికి ఇంటింటికి వెళ్లి సర్వే ద్వారా బీసీజీ వాక్సిన్ వేసేందుకు అర్హులను గుర్తించే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో కృపాబాయి, డాక్టర్ సుధాకర్రెడ్డి, ప్రోగ్రామ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. టీబీ ముక్త్భారత్ లక్ష్యంగా ముందుకు ఇంటింటి సర్వేతో జిల్లావ్యాప్తంగా వ్యాధిగ్రస్తుల గుర్తింపు అవసరమైన వయోజనులకు బీసీజీ టీకా వేసేందుకు ఏర్పాట్లు 10లోగా అధికారులు, సిబ్బందికి శిక్షణపూర్తి బాధితులను గుర్తిస్తాం జిల్లాలో క్షయను సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన టీబీ ముక్త్ భారత్ను అమలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ విషయంపై అధికారులకు శిక్షణ పూర్తయింది. ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలకు జూన్ 10లోగా శిక్షణ పూర్తిచేస్తాం. ఇంటింటి సర్వేతో అర్హులను గుర్తిస్తాం. బీసీజీ టీకా వేసుకుంటే కనీసం 12ఏళ్ల పాటు టీబీ దరిచేరదు. – సుధాకర్రెడ్డి, జిల్లా క్షయ నివారణ ప్రోగ్రాం అధికారి -
ఆస్తులు పంచుకున్నరు
● బాగోగులు పట్టించుకుంటలేరు ● ఠాణా మెట్లెక్కిన వృద్ధురాలు ● న్యాయం చేయాలని వేడుకోలు పాలకుర్తి(రామగుండం): ‘అయ్యా.. నేను, మా ఆ యన సంపాదించిన ఆ స్తులు నా కొడుకులు పంచుకున్నరు.. గిప్పుడు గింత బువ్వ కూడా పెడ్తలేరు.. గిదేంది బిడ్డా అంటే.. ఏవేవో సాకులు చె బ్తున్నరు.. మీరైనా నా యం జేయుండ్రి’ అని కన్నాల బోడగుట్టపల్లి గ్రా మానికి చెందిన గణపతి కిష్టమ్మ(90) సోమవారం బసంత్నగర్ పోలీసులను వేడుకుంది. ఓ ఆటోలో ఠాణాకు చేరుకున్న కిష్టమ్మ.. తనకు లక్ష్మీనారాయ ణ, దామోదర్, రాంకిషన్, శ్రీమన్నారాయణ కుమారులు ఉన్నారని తెలిపింది. తన ఆస్తిని నలుగురు కొడుకులు పంచుకున్నారని పేర్కొంది. ఆ తర్వాత బాగోగులు చూసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన ఆస్తులు తనకు ఇప్పిస్తేనే వాళ్లు తన పోషణ చూసుకుంటారని తెలిపింది. కిష్టమ్మ వచ్చి న సమయంలో ఠాణాలో ఎస్సై స్వామి అందుబాటులో లేరు. దీంతో పోలీసు సిబ్బంది ఆమె నుంచి వివరాలు సేకరించారు. ఆటోలో మళ్లీ ఇంటికి పంపించారు. ఈ విషయమై ఎస్సై స్వామిని సంప్రదించగా.. వృద్ధురాలి కుమారులను మంగళవారం ఉదయం పిలిపిస్తామన్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య పరిష్కరిస్తామని ఎస్సై తెలిపారు. షార్జాలో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ గోదావరిఖని: షార్జా ఇండియన్ అసోసియేషన్తో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ సో మవారం భేటీ అయ్యారు. ఇండియన్ అసోసియేషన్ కృషిని అభినందిస్తూ ప్రస్తావించిన అంశాలను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అ మెరికా వెళ్లిన ఎమ్మెల్యే.. ఇండియన్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు షార్జాలో పర్యటించారు. పలు అంశాలపై వారితో చర్చించారు. ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాజీర్అహ్మద్, ప్రతినిధులు ఎస్ఎన్ రెడ్డి, అలీ, రవీందర్ పాల్గొన్నారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
గోదావరిఖని: నూతన చట్టాలపై పోలీసు అధికా రులు, సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవా లని రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాస్ సూ చించారు. కమిషనరేట్లో సోమవారం కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా జూలై ఒ కటో తేదీ నుంచి భారత ప్రభుత్వం ‘నూతన నేర న్యాయ చట్టాలు–2023’ అమలులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన విధానాలపై వివరించారు. కొత్త చట్టాలపై అ వగాహన ఉంటేనే ఫిర్యాదుల స్వీకరణ, సెక్షన్లు, కే సుల నమోదుపై పట్టు ఉంటుందన్నారు. స్టేషన్ బె యిల్కు అర్హులు, చార్జీషీట్ తయారీ విధానం, నిందితులకు శిక్ష ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారుల వ్యవహార శైలి తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు, చేర్పులు గురించి వివరించారు. అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతా ప్, సీసీ అర్బీ సీఐ స్వామి తదితరులు ఉన్నారు. రైతులను మోసం చేస్తే చర్యలు నకిలీ, కల్తీ విత్తనాలకు అంటగట్టి రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని సీపీ శ్రీనివాస్ హెచ్చరించా రు. నకిలీ, కల్తీ విత్తనాలు, నిషేధిత హెచ్టీ కాటన్ విత్తనాలను తనిఖీల్లో గుర్తించడం కోసం పాటించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)పై ఆయన అధికారులకు అవగాహన కల్పించారు. లైసెన్స్ లే కుండా వ్యాపారం చేసినా, దుకాణాలు, ఏజెంట్లు, దళారులు నకిలీ విత్తనాలు విక్రయించినా ఊరుకు నేది లేదన్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నాసిర కం విత్తనాలు అమ్మినా, నిల్వచేసినా, రవాణా చేసి నా కేసులు నమోదు చేయాలని, గోదాములు, విత్త న దుకాణాలు, తయారీ కేంద్రాల్లో తరచూ తనిఖీ చేయాలన్నారు. ఈ సమయంలో లైసెన్స్, ఫారం–బి, ఈ(రేనివాల్), ఆథరైజేషన్ సర్టిఫికెట్, కాలపరిమితి, ధరల పట్టిక, బిల్లులు తనిఖీ చేయాలన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
● అధికారులు, సిబ్బంది సన్నద్ధం కావాలి ● చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి లోక్సభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్కుమార్ ఆదేశించారు. ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్సింగ్ సందుతో కలిసి సోమవారం ఓట్ల లెక్కింపు, సన్నద్ధతపై రిటర్నింగ్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరె న్స్ ద్వారా మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ ఎన్నికల అధికారి ముజమ్మిల్ఖాన్ హాజరయ్యారు. జూన్ 4న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రత చేపట్టాలని అన్నారు. ఫలితాల సరళిని వెలువరించేందుకు మీడియాకు ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్కు కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్రూంల నుంచి కౌంటింగ్హాల్కు ఈవీఎంల తరలింపు ప క్కాగా చేపట్టాలని చెప్పారు. ఓట్ల లెక్కింపులో పా ల్గొనే సిబ్బందికి సంపూర్ణ శిక్షణ ఇవ్వాలన్నారు. పో స్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుల్ ఏర్పా టు చేయాలని, వీవీ ప్యాట్ల లెక్కింపునకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కౌంటింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
రెండో పింఛన్ విధానం అమలు చేయాలి
గోదావరిఖని: రిటైర్డ్ కార్మికులకు రెండో పింఛన్ స్కీం అమలు చేయాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ కోరారు. సోమవారం సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్(పా) శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కొత్తగా రిటైర్డ్ అయ్యే కార్మికులకు రెండో పింఛన్ స్కీం అమలు చేస్తే రూ.20లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. దీనిపై త్వరలో కోల్ఇండియా అధికారులతో కూడా సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక పెండింగ్లోని పనులను వేగవంతం చేయాలన్నారు. కొత్త బొగ్గు గనుల ప్రారంభం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం వంటి పనులను వేగవంతం చేయాలని ఆయన కోరారు. ‘ఎల్లంపల్లి’లో 5 టీఎంసీలు రామగుండం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అడుగంటిపోయింది. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా నీటి నిల్వ సా మర్థ్యం 20.175 టీఎంసీలు. సోమవారం నీటి మట్టం 140.3 మీటర్లుకాగా, నీటి నిల్వలు 5.31 టీఎంసీలకు పడిపోయాయి. గతేడాది ఇదేరోజు ప్రాజెక్టులో 13.48 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో ప్రజలకు 330 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 127 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉందని నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం తెలిపారు. పాలస్తీనాపై దాడులు ఆపాలి జ్యోతినగర్(రామగుండం): పాలస్తీనాపై ఇ జ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులను వెంటనే నిలిపివేయాలని పీవైఎల్ రాష్ట్ర నాయకుడు ఆరుముళ్ల తిరుపతి, జిల్లా అధ్యక్షుడు కాసిపేట ధర్మేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఎన్టీపీసీ ఆటోనగర్లోని ఐఎఫ్టీయూ కార్యాయలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇజ్రాయిల్కు భారత్ నుంచి ఆ యుధాల సరఫరా నిలిపివేయాలని అన్నారు. జాతి ఆకాంక్షలను అణచివేయడానికి బాంబు లు, వైమానిక దాడులు చేస్తూ మారణ హోమం సృష్టిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ఈ దాడులను నిరసిస్తూ ఈనెల 29న హైదరాబాద్ ఓయూలో చేపట్టిన రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని వారు కోరారు. సీపీఐ(ఎంఎల్)న్యూడెమొక్రసీ నాయకులు చిలుక శంకర్, ఆనంద్, సుధాకర్, సతీశ్, బాబు, మహేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన కరాటే శిక్షణ శిబిరం జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్షిప్లో జపాన్ షిటోరియా కరాటే స్కూ ల్ మూడు రోజులుగా నిర్వహిస్తున్న బ్లాక్బెల్ట్ శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. తెలంగాణ స్టేట్ చీఫ్ అండ్ బెల్ట్ ఎగ్జామినర్ శ్రీనివా స్ ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్ఆర్)బిజయ్కుమార్ సిగ్దర్ హాజరయ్యారు. కరాటే సాధన తో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. జీవితంలో క్రమశిక్షణ నేర్చుకుంటారని తెలిపారు. వేసవి సెలవులు వృథా చేయకుండా శిబిరంలో విద్యార్థులు కరాటే నేర్చుకోవడం అభినందనీయమన్నారు. స్పందన క్లబ్ అధ్యక్షుడు మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పించాలని ధర్నా గోదావరిఖని: సోలార్, ఐడీపీఎల్లో కాంట్రా క్టు కార్మికులకు ఉపాధి కల్పించాలనే డిమాండ్తో ఎస్ఎంఎస్ ప్లాంట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేశారు. నాయకుడు బుర్ర తిరుపతి మాట్లాడుతూ, 18ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు ప్రస్తుతం ఉపాధి లేక రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి అవకాశం కల్పించాలని ఆయన కోరారు. -
రాకాసి రోడ్డు!
సోమవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2024బీరన్న పట్నాలుజూలపల్లి: మండల కేంద్రంలో మహంకాళి బీరప్ప కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీరన్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయంలో సుంకుపట్టడం, బోనాలను పూజించి పట్నాలు వేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎల్కపెల్లి లచ్చయ్య, ప్రధాన కార్యదర్శి బండారి రమేశ్, ఉపాధ్యక్షుడు బొప్పనపెల్లి రవి, గుంటి అశోక్, శంకర్, ఇరుమల్ల పెద్దాపూరం, పెద్ద ఐలయ్య, బొప్పనపెల్లి మల్లేశం, బండారి శంకర్ ఉన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయంజ్యోతినగర్: గోదావరిఖని పీజీ సెంటర్ సబ్స్టేషన్ మల్కాపూర్ ఫీడర్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు ఇన్చార్జి విద్యుత్ శాఖ అధికారి మహిపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రశాంత్నగర్, జంగాలపల్లె, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో 11కేవీ లైన్లో మరమ్మతులు చేపట్టనున్న సందర్భంగా సోమవారం ఉదయం 8:30 నుంచి 11:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలిగోదావరిఖని: కార్మికుల హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.భూపాల్ అన్నారు. ఆదివారం శ్రామికభవన్లో నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, లేబర్ కోడ్లు అంశాలపై వివరించారు. సీఐటీయూ నినాదమైన ‘ఐక్యత–పోరాటం’ ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్మిక వర్గ హక్కులపై బీఎంఎస్ మినహా కలిసివచ్చే కార్మిక సంఘాలతో పోరాటాలకు సంసిద్దులు కావాలన్నారు. పరిశ్రమల్లో కనీస వేతనాలు పెంచకుండా కేవలం బేసిక్లో కరువు భత్యం (డీఏ)ను కలిపి నూతన జీవోలు విడుదల చేయడం దురదృష్టకరమన్నారు. కనీస వేతనం రూ.26వేలు ఉండాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. శిక్షణ తరగతుల్లో జిల్లాలోని సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలు, సింగరేణిలోని పర్మినెంట్, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, ఎన్టీపీసీలోని ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్, గ్రామపంచాయతీ నాయకులు, రైల్వే కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులతో పాటు పార్టీ ప్రతినిధులు జి.జ్యోతి, రామాచారి, మెండె శ్రీనివాస్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, ఎస్.వెంకటస్వామి, వి.నాగమణి, ఉల్లి మొగిలి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నెత్తురొడుతున్న గోదావరిఖని–మంథని రహదారిగోదావరిఖని: గోదావరిఖని–మంథని ప్రధాన రహదారి ప్రమాదభరితంగా మారింది. ప్రధానంగా గోదావరిఖని ఫైవింక్లయిన్ నుంచి ముస్తాల వరకు ఉన్న రోడ్డు మూలమలుపులు, స్పీడ్బ్రేకర్లతో మృత్యుకుహురంగా తయారైంది. ఈక్రమంలో విధులకు వెళ్తున్న సింగరేణి కార్మికులు ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. జీడీకే–6 ఓపీసీ విస్తరణతో.. సింగరేణి యాజమాన్యం జీడీకే–5 ఓసీపీ విస్తరణతో నూతన రోడ్డు నిర్మాణం చేపట్టి గోదావరిఖని నుంచి మంథనికి వెళ్లే రోడ్డును మళ్లించారు. నూతన రోడ్డు నిర్మాణం తర్వాత ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ముగ్గురు మృతి చెందగా చాలా మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. రోడ్డు మళ్లింపు తర్వాత కార్మికులకు దూరభారం పెరగడంతో పాటు ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. రెండు షిఫ్టు కార్మికులకు వెళ్లే సింగరేణి కార్మికులు ప్రమాదాల పాలవుతున్నారు. రాత్రి 11గంటల షిఫ్టు పూర్తయి ఇంటికి వచ్చే సమయం, రాత్రి షిఫ్టు డ్యూటీకి వెళ్లే సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా శనివారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి బైక్తో బలంగా ఢీకొట్టడంతో రాసపెల్లి నాగరాజు(31) బదిలీ వర్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో జీడీకే–2ఏ మోరీ వద్ద లారీ ఢీకొన్న ప్రమాదంలో జీడీకే–11 గనికి చెందిన సింగరేణి కార్మికుడు మృతి చెందాడు. ఇద్దరు కార్మికులు ఈ రోడ్డు వెంట ప్రయాణించే క్రమంలో మృత్యువాత పడగా, పలువురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతోనే ప్రమాదం సింగరేణి యాజమాన్యం నిర్మించిన రోడ్డు వెంట వీధిదీపాలు ఏర్పాటు చేశారు. అయితే శనివారం రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో వీధిదీపాలు ఆన్చేయక పోవడంతో ఎదురుగా నిలిపిఉన్న లారీ కనపడక బలంగా వెనుక నుంచి ఢీకొనడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. యాజమాన్యం తీరువల్లే కార్మికుడు మృతి చెందాడని తోటి కార్మికులు ఆందోళన నిర్వహించారు. కాగా ప్రమాదం జరిగిందని తెలియడంతో వీధిలైట్లు వేశారని కార్మికులు పేర్కొంటున్నారు. పాతరోడ్డును అనుకూలంగా తీర్చిదిద్దాలి జీడీకే–11 గనికి వెళ్లే పాతరోడ్డును విధులకు వెళ్లేందుకు అనుకూలంగా తీర్చిదిద్దాలని కార్మికులు కోరుతున్నారు. రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో కొత్త రోడ్డు వెంట ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా యాజమాన్యం స్పందించి జీడీకే–11 గని పాత రోడ్డును ప్రయాణానికి అనుకూలంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. కార్మికుడి కుటుంబంలో విషాదం.. రాసపెల్లి పోశం మెడికల్ అన్ఫిట్ అయ్యి కొడుకు నాగరాజుకు ఉద్యోగం పెట్టించాడు. ఏడాదిన్నర కిందటే విధుల్లో చేరిన నాగరాజు అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోశంకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు కాగా ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆకుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సింగరేణి ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉన్న కార్మికుడి మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీటీసీ, బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య సందర్శించి నివాళి అర్పించారు. ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్సుల్తానాబాద్: ఇద్దరు విద్యుత్ ఉద్యోగులను సస్పెన్షన్ చేసినట్లు ట్రాన్స్కో డీఈ తిరుపతి తెలిపారు. లైన్మెన్ దీన్దయాల్ను మీసేవా కేంద్రాలకు మీటర్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించినందుకు, లైన్ ఇన్స్పెక్టర్ నర్సయ్యను లేబర్లకు విద్యుత్ షాక్కొట్టి గాయాల పాలు కావడానికి కారణమయ్యారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్ చేసినట్లు తెలిపారు. రహదారి వెంట జరిగిన ప్రమాదాలు శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాసపెల్లి నాగరాజు అనే సింగరేణి బదిలీ వర్కర్ కార్మికుడు మృతి చెందాడు. 21మార్చి 2024న జరిగిన రోడ్డు ప్రమాదంలో మండె కిరణ్ అనే యువకుడు మృతి చెందగా, మరో యువకుడు రాకేశ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవల జీడీకే–2ఏ గని మోరీ వద్ద లారీ ఢీకొట్టిన ప్రమాదంలో జీడీకే–11 గనిలో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు టి.సంపత్ జనరల్ మజ్ధూర్ మృతి చెందాడు. ఫిబ్రవరిలో గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో సుందిళ్లకు చెందిన రాజమ్మ అనే మహిళ మృతి చెందింది. గతేడాది డిసెంబర్ 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎండీ మన్సూర్ అనే లారీ డ్రైవర్ మృతి చెందాడు. న్యూస్రీల్ రోడ్డు ప్రమాదాలకు బలవుతున్న సింగరేణి కార్మికులు పట్టించుకోని యాజమాన్యం -
రోహింగ్యాలకు ప్రభుత్వ ఉద్యోగాలా?
పెద్దపల్లిరూరల్: రోహింగ్యా ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధంగా పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడాన్ని నిరసిస్తూ ఆదివారం బీజేపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ మాట్లాడుతూ 15 ఏళ్ల కాలంగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పొరుగు దేశాల నుంచి వలస వచ్చిన రోహింగ్యాలకు ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేస్తూ ఆ కోటా కింద ఉద్యోగాలను కట్టబెడుతున్నారని ఆరోపించారు. హైకోర్టు ఓబీసీ సర్టిఫికెట్టు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసినా కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలారపు పర్వతాలు, దాడి సంతోష్, మేకల శ్రీనివాస్, కావేటి రాజ్గోపాల్, పడాల శ్రీధర్, రాజం మహంత, రమేశ్, కుమారస్వామి, సంపత్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
జూలపల్లి(పెద్దపల్లి): గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం జూలపల్లిలో దారబోయిన లింగయ్య యాదవ్ స్మారక ఉమ్మడి జిల్లా స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. క్రీడా టోర్నమెంట్ యువతలో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు శారీరక ఆరోగ్యం, స్నేహభావం పెంపొందిస్తాయని అన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని, క్రీడాకారులు జాతీయస్థాయిలో ఆడేందుకు తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, అబ్బాపూర్ ఎంపీటీసీ దండె వెంకటేశం, సుల్తానాబాద్ జెడ్పీటీసీ ప్రకాశరావు, టోర్నమెంట్ నిర్వాహకులు మాజీ సర్పంచ్ నర్సింహయాదవ్, సీనియర్ క్రీడాకారులు రాజయ్య, భూసారపు రవీందర్, గంగాధర్, అమరగాని వెంకటేశ్, బాలెంగల హన్మయ్య, ఆవుల రాజు, కొమ్మ సతీశ్, టీమ్ క్రీడా సభ్యులు, మాజీ సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు -
ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ..
కోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో చెత్త సేకరణకు ఉపయోగించే విలువైన వాహనాలు ఎండకు ఎండుతూ.. వానలకు తడుస్తూ చెడిపోతున్నాయి. బల్దియా కార్యాలయంలో వాహనాలను పార్కింగ్ చేయడానికి పార్కింగ్ షెడ్డు కూడా లేదు. అలాగే వాహనాలకు సకాలంలో మరమ్మతు చేసేందుకు మెకానిక్ షెడ్డు లేదు. చిన్నపాటి మరమ్మతులకు ప్రైవేట్ గ్యారేజ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. చెత్త సేకరణకు ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు, జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్లు, డంపర్ ప్లేసర్ తదితర వాహనాలు సుమారు 100 వరకు ఉన్నాయి. మరమ్మతుల సమస్యలతో కొన్ని వాహనాలు ప్రైవేట్ గ్యారేజీల్లో మూలకుపడి ఉన్నాయి. బల్దియాలో వాహనాల సంఖ్య పెరుగుతున్నా వాటి రక్షణపై అధికారులకు పట్టింపు లేకుండా పోయిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరమ్మతులకు రూ.లక్షల్లో ఖర్చు పారిశుధ్య వాహనాల మరమ్మతులకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. పెద్ద సమస్యలు తలెత్తితే నిధులు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. దీంతో బల్దియా నిధులు ప్రైవేటు వ్యక్తులకు దరాదత్తం చేయాల్సి వస్తోంది. బల్దియా ఆధ్వర్యంలో మరమ్మతుల కేంద్రం నిర్వహిస్తే ఆ నిధులను ఆదాచేయొచ్చు. దీనిపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతంలో వర్క్షాప్పై ప్రతిపాదన నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వర్క్షాప్ ఏర్పాటు చేయాలనే ఆలోచనపై గతంలో ఉన్నతాధికారులు దృష్టిసారించారు. బల్దియా కార్యాలయం వెనుక వర్క్షాప్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఉన్నతాధికారులు అప్పుడు చర్చించి, ప్రతిపాదన కూడా చేశారు. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. బల్దియాలో వాహనాలుఆటో ట్రాలీలు 50 ట్రాక్టర్లు 18 ఫాగింగ్ వాహనాలు 03 జేసీబీ వాహనం 02 బ్లేడ్ ట్రాక్టర్లు 02 డంపర్ ప్లేసర్ వాహనం 02 కంపాక్టర్ వాహనం 02 జెట్టింగ్ సెక్షన్ మిషన్ వాహనం 01 లిట్టర్ పిక్కర్స్ వాహనం 01 స్వీపింగ్ మిషన్ వాహనం 01 బొలోరో వాహనాలు 02 స్కైలిఫ్టర్ వాహనం 02 వైకుంఠ రథాలు 04 వాటర్ ట్యాంక్ వాహనాలు 06 బాబ్కాట్ వాహనం 01 బల్దియా వాహనాలకు పార్కింగ్ షెడ్డు కరువు తరచూ పాడవుతున్న పారిశుధ్య వాహనాలు వాహనాల సంఖ్య పెరిగినా పట్టించుకోని అధికారులుపార్కింగ్ షెడ్, గ్యారేజీపై దృష్టిసారిస్తాం నగరపాలక సంస్థ వాహనాల పార్కింగ్ కోసం బల్దియా ఆవరణలోనే పార్కింగ్ షెడ్డు నిర్మించడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు చేపట్టడానికి అనుకూలంగా ఉండేలా గ్యారేజీ నిర్మాణాలపై దృష్టిసారిస్తాం. ఇప్పటికే అధికారులు కూడా ఈ విషయంపై తనతో చర్చించారు. దీనిపై ఇంజినీరింగ్ విభాగం అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. – సీహెచ్.శ్రీకాంత్, నగరపాలక కమిషనర్ -
ప్రశాంతంగా జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్
రామగిరి: ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఎన్ఐటీ విద్యాలయాల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ పరీక్ష రామగిరి మండలం సెంటనరీకాలనీ మంథని జేఎన్టీయూలో ప్రశాంతంగా ముగిసింది. రెండు సెషన్స్లో జరిగిన పరీక్షలో 106 మంది విద్యార్థులకు 104 మంది హాజరయ్యారని ప్రిన్సిపాల్ చెరుకు శ్రీధర్రెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును హైదరాబాద్ యూనివర్సిటీ అధికారులు పరిశీలించారు. పరీక్ష రాసే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగిరి ఎస్సై కె.సందీప్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మల్లన్న సన్నిధిలో భక్తుల సందడి
ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తొలుత కోనేటిలో స్నానాలు ఆచరించారు. ఆ తర్వాత మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి, ఖండేలరాయుడిని దర్శించుకున్నారు. స్వామి వారి పేరిట ఒగ్గు పూజారులతో పట్నాలు వేయించారు. బోనాలు తయారు చేసి నైవేద్యం సమర్పించారు. ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశంయాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. – ఓదెల(పెద్దపల్లి) -
అక్రమార్కులపై ఉక్కుపాదం
పీడీ యాక్ట్ నమోదు చేస్తాం నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. కొందరి పేర్లతో జాబితా సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకు ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా సమాచారం సేకరిస్తున్నాం. – శ్రీనివాస్, పోలీస్కమిషనర్, రామగుండం గోదావరిఖని: ఆరుగాలం శ్రమిస్తున్న రైతులను నకిలీ విత్తనాలు, ఎరువులు నిండా ముంచుతున్నా యి. అందమైన ప్యాక్లు, ఆకట్టుకునే డిజైన్లు, అ ద్భుతమైన పేర్లతో విత్తనాలను వ్యాపారులు రైతులకు అంటగడుతున్నారు. ఇవేమీ తెలియని అన్నదాతలు.. పంటవేసిన తర్వాత విత్తనాలు మొలకెత్తక పోవడం, మరికొన్ని ఆశించిన దిగుబడి రాకపోవడంతో నష్టపోతున్నారు. వాణిజ్య పంటల్లో పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన కొందరు రైతులు మనస్తాపంతో ఆత్మహత్య లు చేసుకున్న సంఘటలు కూడా అనేకం ఉన్నాయి. అయితే, రైతులను మోసం చేసే విత్తన సంస్థలపై కఠిన చర్యలకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. వర్షాకాలం సమీపించడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుపై రైతులు దృష్టి సారించారు. దీనిని అదనుగా చేసుకుని నకిలీవి అంటగట్టి అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలని కొందరు వ్యాపారులు కాచుకుకూర్చున్నారు. ఇలాంటి వారి ఆటకట్టించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆగని నకిలీ విత్తనాల దందా.. ● ధనార్జనే ధ్యేయంగా కొందరు అక్రమార్కులు ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ● కొన్ని కంపెనీలు కాలం చెల్లిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి కొత్త విత్తనాలుగా చెప్పి రైతులకు అంటగడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ● తీరా ఆశించిన దిగుబడి రాక అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు. ● రైతులు నకిలీ, కల్తీ విత్తన ముఠాల బారిన పడకుండా మేలు రకం విత్తనాలు విక్రయించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ● వానాకాలంలో సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టిసారించారు. నిఘా కోసం టాస్క్ఫోర్స్ కమిటీలు.. నకిలీ, కల్తీ విత్తనాల స్మగ్లింగ్పై ఉక్కుపాదం మో పాలని పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అక్రమార్కులను అరికట్టడం కోసం వ్యవసాయ శాఖ, పోలీసు టాస్క్ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు రైతులను మోసం చేసే నకిలీ విత్తనాలు, ఎరువులను సరఫరా చేసే వారిని గుర్తించేందుకు నిఘా పెడతాయి. ● సమాచారం సేకరించి అక్రమార్కులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాయి. ● ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విత్తన, ఎరువుల దుకాణాలు, గోదాముల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నాయి. ● అనుమానం వస్తే విత్తన శాంపిళ్లు సేకరించి పరీక్ష కోసం ల్యాబ్కు పంపిస్తున్నారు. ● విత్తనాలు రవాణా చేసే వాహనాలనూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ● లైసెన్స్ లేకుండా వ్యాపారం చేసే వారిపై చర్యలు చేపడుతున్నారు. ● అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ● రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు చేపట్టారు. ● ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలు కొనుగోలు చేసేలా ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో రైతులకు ఈ కమిటీల సభ్యులు అవగాహన కల్పిస్తున్నారు. ● ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా సరిహద్దుల్లో చెక్పోస్ట్లు ఏర్పాటు చేశారు. ● ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి అక్రమ రవాణా జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ● మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు నకిలీ, కల్తీ విత్తనాల అక్రమ రవాణా, సరఫరా నిరోధించేందుకు ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేశారు. 2021 నుంచి ఇప్పటివరకు నమోదైన కేసులు, ఇతర సమాచారం ఏడాది కేసులు అరెస్ట్లు సీజ్ విత్తనాలు విలువ (కేజీల్లో) (రూ.లక్షల్లో) 2021 65 158 5,083 95.92 2022 13 27 1,483 27.97 2023 04 13 1,333 26.81 2024 02 02 6.5 0.13 నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై నిఘా రామగుండం కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ టీంల ఏర్పాటు అనుమానం వస్తే విత్తనాల శాంపిళ్ల సేకరణ -
జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదగాలి
గోదావరిఖని: చిన్నారులు జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగి సింగరేణి పేరును దేశస్థాయిలో నిలపాలని ఆర్జీ–1 జీఎం శ్రీనివాస్ కోరారు. స్థానిక సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నెలరోజులపాటు కొనసాగిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈసందర్భంగా జీఎం మాట్లాడుతూ సాధించాలనే తపన, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. క్రీడలతో గెలుపొందాలనే తపన పోటీతత్వం, క్రమశిక్షణ అలవర్చుతుందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సెల్ఫోన్, టీవీలపై విద్యార్థులు ఆసక్తి పెంచుకుని మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన సమయాన్ని క్రీడలపై వెచ్చిస్తే జీవితం అందంగా ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ శిబిరంలో ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్, బాస్కెట్బాల్, వెయిట్ లిఫ్టింగ్, కరాటే విభాగాల్లో 150మందికి శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు లక్ష్మీనారాయణ, రాంమోహన్, మల్లేశ్, రంగు శ్రీనివాస్, సారంగపాణి, రమేశ్, గాండ్ల రాజయ్య, కోచ్లు షాభాన, సోనియా, వినోద్, శ్రీనివాస్, మొండయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జీ–1 జీఎం శ్రీనివాస్ -
గాలివాన బీభత్సం
● విరిగిపడిన చెట్లు.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం పాలకుర్తి(రామగుండం): వివిధ గ్రామాల్లో శుక్రవా రం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డా యి. బసంత్నగర్ కేశోరాం స్టాఫ్కాలనీ, వర్కర్స్కాలనీల్లో పదుల సంఖ్యలో చెట్లు కూలి క్వార్టర్లపై పడిపోయాయి. దీంతో గోడలు, ప్రహరీలు ధ్వంసమ య్యాయి. పోచమ్మవాడలో పార్కింగ్ చేసి ఉన్న కా రుపై చెట్టు విరిగి పడటంతో ధ్వంసమైంది. బసంత్ నగర్ బస్టాండ్ – ఈసాలతక్కళ్లపల్లి మధ్య ప్రధాన రహదారిపై చెట్లు ఎక్కడికక్కడే విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక కోదండ రామాలయంలోని రావిచెట్టు కూలి నవగ్రహాల ఆలయంపై పడింది. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది. కేశోరాం పరిశ్రమ సిబ్బంది శనివరాం ఉదయం పునరుద్ధరణ పనులు చేపట్టారు. మరోవైపు కన్నాల రజ్వీకాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికుల సమాచారం మేరకు విద్యుత్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. -
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం
ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోటలోని శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీమదలమేల్మంగా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి తిరుకల్యాణోత్సవంలో భాగంగా ఈ క్రతువు నిర్వహించారు. ఆలయంలో చక్రతీర్థం, బలిహరణం, సాయంత్రం పుష్పయాగం, ధ్వజారోహణం, భూతబలి, సప్తవరణాల సేవ వంటి పూజాకార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి దేవతామూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. 15రోజులు గా సాగుతున్న ఉత్సవాలు రథోత్సవం, జాతరతో ముగిశాయి. ఆలయ అర్చకులు కొండపాక రామాచార్యులు, రామిడి వెంకటరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కొండల్రెడ్డి, నిరంజన్రెడ్డి, సుదర్శన్రెడ్డి, ఎంపీటీసీ నారగోని ఎల్లవ్వ, జెడ్పీ వైస్ చైర్పర్సన్ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, బీజేపీ నాయకులు గొట్టెముక్కుల సురేశ్రెడ్డి తదితరులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ముప్పిరితోటలో ముగిసిన తిరుకల్యాణోత్సవం -
స్టడీ మెటీరియల్ అందజేత
సాక్షి, పెద్దపల్లి: స్థానిక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలోని స్టడీ స ర్కిల్ విద్యార్థులకు అదనపు కలెక్టర్ అరుణశ్రీ శనివారం స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థులు ఇష్టంతో చదివితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. ఎస్సీ అభివృద్ధి అధికారి నాగలైశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిరంతరం బొగ్గు ఉత్పత్తిగోదావరిఖని: రాబోయే వర్షాకాలంలో ఓసీపీ ల్లో బొగ్గు, ఓబీ వెలికితీతకు అంతరాయం లే కుండా చర్యలు చేపట్టాలని సింగరేణీ సీఎండీ బలరాం కోరారు. శనివారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిచారు. ఆర్జీ–1 జీఎం శ్రీనివాస్ హాజరయ్యారు. 2024 –25 ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన బొ గ్గు ఉత్పత్తిపై దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం దృష్ట్యా నూతన పంపుల ఏర్పాటు, వాటి సా మర్థ్యం పెంపొందించేందుకు చేపట్టవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. భూగర్బ గనుల్లో యంత్రాల వినియోగం, వాటిపనితీరు గురించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణరావు, ఎన్వీకే శ్రీనివాస్, జి.వెంకటేశ్వరరెడ్డి, ఆర్జీ–1 ఐఈడీ ఏజీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. పుట్నూరులో డీపీవో పర్యటన పాలకుర్తి(రామగుండం): జిల్లా పంచాయతీ అ ధికారి(డీపీవో) ఆశాలత శనివారం పుట్నూరు గ్రామంలో పర్యటించారు. వైకుంఠధామం, షె గ్రిగేషన్షెడ్డు, పల్లెప్రకృతి వనం, క్రీడాప్రాంగ ణం, నర్సరీ పరిశీలించారు. నర్సరీలో మొక్క లు ఎండిపోకుండా కాపాడి, వచ్చే హరితహా రం కోసం సిద్ధం చేయాలని సూచించారు. గ్రా మంలో సేకరించిన చెత్తను షెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి తడి, పొడ్డి చెత్తను వేరుచేయాలని, తడిచెత్తతో ఎరువు తయారు చేసి విక్రయించి పంచాయతీకి ఆదాయం సమకూర్చుకోవాలని పంచాయతీ కార్యదర్శి పవన్కు సూచించారు. మండల పంచాయతీ అధికారి షబ్బీర్పాషా, కార్యదర్శి పవన్, కారోబార్ సతీశ్ ఉన్నారు. కనీస వేతనాలు చెల్లించండి యైంటింక్లయిన్కాలనీ(రామగుండం): సింగరే ణిలో పనిచేస్తున్న దాదాపు 30వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల ని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూ నియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.అశోక్ డిమాండ్ చేశారు. ఆర్జీ–2 ఏరియాలోని జోన్–2లో శని వారం ఆయన వివిధ సెక్షన్ల కార్మికులతో స మావేశమయ్యారు. చట్టబద్ధమైన హక్కులతోపాటు కోల్ ఇండియా తరహాలో వేతనాలు చె ల్లించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్డు తీ ర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని కోరారు. ఈకార్యకరమంలో నాయకులు మధునమ్మ, రాజేశ్వరి, లింగయ్య, రాయమల్లు, నాగరాజు, లక్ష్మి, స్వామి, రజిత, నరేశ్ తదిరుతరులు పాల్గొన్నారు. ‘బకాయిలు ఎప్పుడిస్తారు?’రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టు సెక్యూరిటీ సి బ్బంది, గేట్ మెయింటనెన్స్ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు అందడంలేదు. దీంతో కుటుంబ పోషణకు కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టు నిర్వహణలో భా గంగా 8 గంటలు విధులు నిర్వర్తిస్తున్నారు. అయినా, కార్మిక చట్టం ప్రకారం కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు జోక్యం చేసుకుని తమకు బకాయిలతోపాటు కార్మిక చట్ట ప్రకారం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. రెండోరోజు ప్రశాంతం సాక్షి, పెద్దపల్లి: రెండోరోజు శనివారం జరిగిన ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షకు 512 మంది, ద్వితీయ సంవత్సరంలో 187 మంది హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. మొ దటి సంవత్సరం పరీక్షకు 45 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 10 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అన్నారు. రెండోరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. 31లోగా దరఖాస్తు చేయాలి సాక్షి పెద్దపల్లి: ఎస్సీ గురుకులాల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గు రుకుల సొసైటీ జిల్లా సమన్వయ అధికారి జేజే థెరిసా తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరానికి నాన్ సీవోఈ కళాశాలల్లో ఇంటర్ మొ దటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. -
ప్రజలను జాగృతం చేస్తున్న కళాకారులు
గోదావరిఖని: కళాకారులు తమ కళారూపాల ద్వారా ప్రజలను జాగృతం చేస్తున్నారని ‘ఇప్టా’ నాయకుడు కె.స్వామి, సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్ అన్నారు. స్థానిక భాస్కర్రావుభవన్లో శనివారం జరిగిన ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్(ఇప్టా) ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. దేశ స్వాతంత్య్రానికి ముందు ముంబయిలో 1943 మే 25న ఇప్టా ఆవిర్భవించిందన్నారు. అప్పటి నుంచి నేటివరకు దేశం, రాష్ట్రంలో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ పోరాటాలకు సంసిద్ధం చేస్తోందని తెలిపారు. ఎంతోమంది కళాకారులు ఇప్టాలో భాగస్వాములై కళలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానాట్యమండలి పేరిట తెలంగాణలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను కళారూపాల ద్వారా చైతన్యవంతం చేశారని గుర్తుచేశారు. సమస్యలపై కళాకారులు అనేక గీతాలు రచించి తమ గళం ద్వారా ప్రజలు, కార్మికులను చైతన్యం పరిచేందుకు మాభూమి, వీధి బాగోతంలాంటి కళలు ప్రదర్శించారన్నారు. కళాకారులు నాగభూషణం, మాదాల రంగారావు, అట్లు రామలింగయ్య, గుమ్మడి వెంకటేశ్వరరావు, టి.కృష్ణ ప్రజానాట్య మండలి, ఇప్టా సభ్యులుగా, సినీ కళాకారులుగా కొనసాగారని గుర్తుచేశారు. ఇప్టాలో పనిచేసి అమరులైనవారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఈసందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుముల రాజమౌళి పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎజ్జ రాజయ్య, గౌతం గోవర్ధన్, తాళ్లపెల్లి మల్లయ్య, తొడుపునూరి రమేశ్కుమార్, సూర్య, ఓదెమ్మ, పడాల కనకరాజు, సంబోదు కొమురయ్య, నూకల మొండయ్య, జూల మోహన్, ఆసాల రమ తదితరులు పాల్గొన్నారు. -
ఊరిస్తున్న ‘నామినేటెడ్’
సాక్షి, పెద్దపల్లి: సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్, వివిధ జిల్లాస్థాయి పదవుల్లో నియామకాలు చేపడుతుందనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నవారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలోని నామినేటెడ్ పదవులన్నీ రద్దు చేసింది. ఆ ర్వాత తొలివిడతలో రాష్ట్రస్థాయిలోని కొన్ని నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు చేపట్టింది. ఇందులో జిల్లా నుంచి రామగుండం ప్రాంతానికి చెందిన హర్కర వేణుగోపాల్రావును ప్రభుత్వ సలహాదారుగా, జిల్లాతో అనుబంధం ఉన్న మంచిర్యాలకు చెందిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ప్రసాద్ను కనీస వేతనాల కమిటీ చైర్మన్గా నియమించింది. అయితే, తొలివిడతతో జిల్లాపై ప్రభుత్వం శీతకన్ను చూపించినట్లు స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిశాక నామినేటెడ్ పదవులు భర్తీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఊహాగానాల నేపథ్యంలో పలువురు నేతలు పదవుల కోసం గాంధీభవన్ బాటపడుతున్నారు. ఫలితాల ఆధారంగానే.. పార్లమెంట్ ఎన్నికల వేళ నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రచార వేళ సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం పనిచేసిన తీరు ఆధారంగానే పదవులు, సీట్లు ఇస్తామని ప్రకటించిడమే దీనికి కారణం. మండలం, గ్రామం, బూత్ల వారీగా వచ్చిన ఓట్లు, ప్రత్యర్థి పార్టీకన్నా సాధించిన ఆధిక్యం ఆధారంగా పనితీరు అంచనా వేస్తామని వారు ప్రకటించడం ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. అన్ని పార్టీల్లోంచి బీజేపీకి సైలెంట్ ఓటింగ్ అనూహ్యంగా పెరిగిందని, తద్వారా ఫలితం ఎలా వస్తుందోననే బెంగ కూడా ఆశావహులను వెంటాడుతోంది. పదవి కోసం.. ఏ పోస్టుకు ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఎప్పటిలోగా భర్తీ చేస్తారు? భర్తీ చేస్తారా? లేదా? అనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని భావిస్తున్న పలువురు నేతలు.. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబుతోఉన్న సాన్నిహిత్యం, ఎమ్మెల్యేల అండదండలతో వాటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. సీని యర్ నేతలు రాష్ట్రస్థాయిలోని కార్పొరేషన్ పదవుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తుండగా, మరికొందరు ఆశావహులు జిల్లాస్థాయి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆదినుంచీ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నవారు, వివిధ పార్టీల నుంచి ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పార్టీలో చేరినవారు, వివిధ జేఏసీ ల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమా న్ని ఉధృతంగా నడిపించిన వారు పదవులు తమకు దక్కుతాయనే ఆశతో ఉన్నారు. ఆశావాహుల జాబితా పెద్దదే.. ● పెద్దపల్లి నుంచి గోపగాని సారయ్య, సయ్యద్ మస్రత్, అన్నయ్యగౌడ్, మినుపాల ప్రకాశ్రావు, గీట్ల రాజేందర్రెడ్డి, భూషణవేని రమేశ్గౌడ్, ఎలువాక రాజయ్య, రేగుంట అశోక్, డి.దామోదర్రావు, ఎల్.జలపతిరెడ్డి, మెండే పోశాలు, సాంబిరెడ్డి, బైరి రవిగౌడ్, పుప్పాల శంకర్, గట్టుయాదవ్, ఈర్ల సురేందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, గుండేటి అయిలయ్య యాదవ్, కట్ట నరేంద్రాచారి, శ్రీమాన్, చీటీ సతీశ్రావు, కల్లెపల్లి జానీ, మాదాసు వెంకన్న పటేల్, చిలుక సతీశ్, వేగోళం అబ్బయ్యగౌడ్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. ● మంథని నుంచి గంట వెంకటరామణారెడ్డి, శశిభూషణ్ కాచె, తోట చంద్రయ్య, ఆరెపల్లి కొ మరయ్య, ఇనుముల సతీశ్, ఒడ్నాల శ్రీనివాస్, తొట్ల తిరుపతియాదవ్, ఉప్పట్ల శ్రీనివాస్, నాగినేని జగన్మోహన్రావు, చొప్పరి సదానందం పదువుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ● ఇక రామగుండం ప్రాంతం నుంచి ఏఐసీసీ నేత గుమ్మడి కుమారస్వామి, సీనియర్ నేత బాబర్ సలీం పాషా, మహంకాళి స్వామి, పెద్దెల్లి ప్రకాశ్, సూర సమ్మయ్య తదితరులు పదవులను ఆశిస్తున్నవారిలో ఉన్నారు. కోడ్ ముగిశాక పదవుల పందేరం లెక్కలేసుకుంటున్న ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు కోసం ప్రయత్నాలు జిల్లాస్థాయి పదవులు, మార్కెట్ కమిటీలకు ఫుల్ డిమాండ్
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
పోలీసులతో హీరోయిన్ గొడవ.. వీడియో వైరల్
పాక్ను శక్తివంతం చేస్తున్న చైనా? లక్ష్యం ఏమిటి?
ఎంసీఏ కీలక నిర్ణయం.. ముంబై మెంటార్గా మాజీ క్రికెటర్
పర్యాటకులకు స్వర్గధామాలు ఈ బీచ్లు
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..
ప్రాణం తీసిన ఫొటో సరదా
ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ సెన్సార్ తప్పిదమే: ఐఎండీ
నేటితో చివరి అంకం..ప్రచారం ముగింపు
తప్పక చదవండి
- Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
- కౌంటింగ్లో ఏజెంట్లు కీలకం!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
- జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక రైలు
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- ఇప్పట్లో ‘స్థానిక’ ఎన్నికలు లేనట్టేనా?
- ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement