-
విత్తనాల కోసం రైతుల పడిగాపులు
దుబ్బాకటౌన్: దుబ్బాక మండలంలో జీలుగ విత్తనాలు దొరక్కపోవడంతో రైతులు ఇబ్బందిపడుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే రైతులు విత్తనాల కోసం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం దుబ్బాక ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి జీలుగ విత్తనాల లోడ్ లారీ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు ఎండని సైతం లెక్క చేయకుండా విత్తనాల కోసం కేంద్రం వద్ద పడిగాపులు కాయల్సివచ్చింది. ఓపికగా లైన్లో నిలుచున్నా చివరకు విత్తనాలు దొరక్కపోవడంతో సంబంధిత అధికారులపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. -
పాఠశాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలి
హుస్నాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం నాటికి విద్యార్థుల యూనిఫాం కుట్టుపని పూర్తి చేయాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజరు విద్యాసాగర్ అన్నారు. మంగళవారం పోతారం(ఎస్)లోని సీ్త్ర శక్తి టైలరింగ్ యూనిట్ను సందర్శించారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం విద్యార్థుల యూనిఫాం కుట్టుపనిని మహిళా సంఘాలకు అప్పగించిందన్నారు. ఆయన వెంట ఏపీఎం శ్రీనివాస్, సీసీ యాదగిరి తదితరులు ఉన్నారు. జాతీయ క్రీడలకు మిరుదొడ్డి క్రీడాకారులు మిరుదొడ్డి(దుబ్బాక): జాతీయ స్థాయి యూనివర్సిటీ క్రీడా పోటీలకు మిరుదొడ్డికి చెందిన ఇద్దరు క్రీడాకారులు పర్శరాములు, పవన్ ఎంపికయ్యారు. వీరు ఈనెల 31 నుంచి జూన్ 3వ తేదీ వరకు తమిళనాడులోని జెప్పియార్ యూనివర్శిటీలో జరిగే బాల్ బాడ్మింటన్ పోటీల్లో పాల్గొననున్నారు. ఒకే గ్రామం నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరు క్రీడాకారులు ఎంపిక కావడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. వేంనరేందర్ రెడ్డిన కలిసిన దరిపల్లి చంద్రం ప్రశాంత్నగర్(సిద్దిపేట): సీఎం వ్యవహారాల ప్రధాన సలహాదారుడు వేంనరేందర్రెడ్డిని మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసినట్లు టీపీసీసీ సభ్యుడు దరిపల్లిచంద్రం తెలిపారు. సిద్దిపేట అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన తెలిపారన్నారు. నర్సింగ్ కళాశాలతో పాటుగా, పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారన్నారు. -
విత్తన చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
మిరుదొడ్డి(దుబ్బాక): విత్తన చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి మల్లేశం హెచ్చరించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని విత్తన దుకాణాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీ రేట్లకంటే ఎక్కువ రేట్లకు విత్తనాలను విక్రయిస్తే లైసెన్స్ రద్దుచేసి చట్టపరమై చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోలు రశీదును భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో భూంపల్లి ఏఎస్ఐ భూక్యానాయక్, ఏఈఓ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. పీడీ యాక్టు నమోదు చేస్తాం కొండపాక(గజ్వేల్): అనుమతి లేని పురుగు మందులను విక్రయిస్తే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని టాస్క్ఫోర్స్ ఎస్ఐ సాయిరాం హెచ్చరించారు. మండల పరిధిలోని వెలికట్టలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని మంగళవారం వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. తెగుళ్ల నివారణ మందులను, విత్తనాలను విక్రయించేందుకు అనుమతి ఉందా లేదా అన్న విషయమై క్షుణ్ణంగా తనిఖీ చేశారు. క్రయ విక్రయాల రిజిస్టరు, స్టాక్ రిజిస్టరును పరిశీలించారు. కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయాధికారి బాబూనాయక్, ఏఓ ప్రియదర్శిని, ఏఈఓ రమ్మశ్రీ దుకాణ నిర్వాహకుడు రాంచంద్రారెడ్డి, టాస్క్ బృందం సభ్యుడు ప్రేమ్దీప్ తదితరులు పాల్గొన్నారు. కల్తీవిత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తొగుట(దుబ్బాక): కాలంచెల్లిన, కల్తీవిత్తనాలు విక్రయిస్టే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తొగుట ఎస్ఐ లింగం హెచ్చరించారు. మండలంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఎవో మోహన్తో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాల్లో కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రశీదు తీసుకోవాలని రైతులకు సూచించారు. తాము తరచుగా దుకాణాలను తనిఖీ చేస్తామని, రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనంతరం స్టాక్, డెలీవరీ రిజిస్టర్లు, బిల్లు బుక్కులు పరిశీలించారు. ఆకస్మిక తనిఖీలు అక్కన్నపేట(హుస్నాబాద్): రైతులకు కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ తాండ్ర వివేక్, ఏఈఓ శ్రీలత హెచ్చరించారు. అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గుబ్బడి గ్రామాల్లోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. విత్తనాల ధరల పట్టిక, స్టాక్ వివరాలు తెలిసేలా పట్టిక బోర్డు ఉంచాలన్నారు. -
శోభాయాత్ర .. పల్లకీ సేవ
బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకిలో హనుమాన్ దీక్షా స్వాములు మంగళవారం హనుమాన్ శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించారు. స్వామి వారి చిత్ర ప టాన్ని అలంకరించి గ్రామ ప్రధాన వీధుల గుండా భజనలు చేస్తూ ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. తోటపల్లిలో.. మండలంలోని తోటపెల్లిలోని రామాలయంలో మాజీ సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావు మంగళవారం హనుమాన్ పూజలు చేసి, దీక్ష చేపట్టిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి దుబ్బాక: వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూంరెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక వీరాంజనేయ ఆలయం వద్ద స్వాములు హనుమత్ యజ్ఞం నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితుడు వేలేటి రామకృష్ణశర్మ, స్వాములు పాల్గొన్నారు. ప్రశాంత్నగర్(సిద్దిపేట): అఖండ హనుమాన్ చాలీసా పఠనం జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది. హనుమాన్ స్వాములు మంగళవారం ఉదయం నుండే ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు హనుమాన్ పల్లకీ సేవలో పాల్గొన్నారు. -
లోతు దుక్కులపై దృష్టి పెట్టాలి
జగదేవ్పూర్(గజ్వేల్): రైతులు లోతు దుక్కులపై దృష్టి పెట్టాలని, వేసవిలో కురిసే వర్షాల వల్ల భూమికి మేలు జరుగుతుందని ఏరువాక కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల శాస్త్రవేత్తలు డాక్టర్ పల్లవి, విజయ్ అన్నారు. మంగళవారం మండలంలోని అలిరాజ్పేట గ్రామంలో వేసవి దుక్కులు, మట్టి నమూనా సేకరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమిని దున్నకుండా ఖాళీగా ఉంచటం వల్ల భూమి లోపల పొరలోని నీరు ఆవిరి అయిపోతుందన్నారు. ఖాళీ భూముల్లో చీడపీడలు భారీగా వృద్ధి చెంది తర్వాత వేసే పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. వేసవిలో లోతు దుక్కుల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వేసవిలో కురిసే వర్షాలకు ముందు భూమిని దున్నటం వల్ల తొలకరి వర్షాలు పడగానే మట్టి పెళ్లలు మెత్తబడతాయని వివరించారు. మూడేళ్లకు ఒకసారి రైతులు భూసార పరీక్షలు చేయించాలని, దీంతో భూమిలో పోషకాలు ఎంత మోతాదులో ఉన్నయో తెలుసుకుని వేసే పంటను బట్టి అవసరమైన ఎరువులను వాడొచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏఓ వసంతరావు, ఏఈఓలు శరణ్య, సమత రైతులు పాల్గొన్నారు. -
కూల్చిన ఇళ్లను నిర్మించాలి
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ సిద్దిపేటరూరల్: 2019లో సిద్దిపేట రూరల్ మండలం సీతారాంపల్లి గ్రామానికి చెందిన కొందరి ఇళ్లను పునరావాసం పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చివేసిన ఇళ్లను తిరిగి నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ అన్నారు. మంగళవారం సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి పనుల చేపట్టాలని కోరుతూ కలెక్టర్ మనుచౌదరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో పాక్షికంగా ధ్వంసమైన ఇళ్లను గుర్తించి ఇల్లు కట్టిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి కూల్చి వేసిందన్నారు. ఇల్లు నష్టపోయిన వారికి తిరిగి ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సిద్దిపేట రూరల్ మండల పరిధి ఇర్కోడ్ గ్రామంలో సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి 1.20 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, దానిపై విచారణ జరిపించాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్తు ఇమామ్, నంగునూరు మండల అధ్యక్షుడు శంకర్, యువజన కాంగ్రెస్ నాయకులు వహాబ్, అజ్మత్, అలీ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఎల్లమ్మ కల్యాణం
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎల్లమ్మ కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఎల్లమ్మ బోనాలు తీశారు. అలాగే ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ అమ్మవారిని దర్శించుకున్నారు. రూ.51,111 ఆలయానికి విరాళంగా అందజేశారు. ఆయనను ఆల య కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. భక్తి శ్రద్ధలతో హోమంమద్దూరు(హుస్నాబాద్): మండలంలోని నర్సయపల్లి, లద్నూరు గ్రామాల్లో హనుమాన్ హోమం, మహాయజ్ఞాలు జరిగాయి. మంగళవారం లద్నూరు, నర్సయపల్లి హనుమాన్ స్వాములు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో హనుమాన్ హోమం, మహాయజ్ఞలను వైభవంగా నిర్వహించారు. నర్సయపల్లి గ్రామంలో జరిగిన హోమ కార్యక్రమంలో జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రం పాడి పంటలతో కళకళలాడాలని, ప్రజలు ఆయురోగ్యాలతో బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రమేష్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామకంఠం భూమి కబ్జా జగదేవ్పూర్(గజ్వేల్): మండలంలోని అలిరాజ్పేట గ్రామంలో గ్రామకంఠం భూమిని కబ్జా చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సుమారు మూడు గుంటల స్థలాన్ని ఆక్రమించి చుట్టూ కంచె వేశాడని గ్రామస్తులు ఆరోపించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో అభివృద్ధి పనులకు స్థలం లేకుండా పోతుందని గ్రామస్తులు చెబుతున్నారు. పలుమార్లు గ్రామ కార్యదర్శికి, మండల రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. హనుమాన్ మాలధారులకు భిక్ష కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండల కేంద్రంలో న్యాలపోగుల హరీష్ ఆధ్వర్యంలో మంగళవారం వంద మంది హనుమాన్ దీక్షా స్వాములకు భిక్ష (ఒక్క పూట భోజనం) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జై హనుమాన్, జైజై హనుమాన్ భక్తి గీతాలతో ఆ ప్రాంతం మారుమోగింది. జీలుగ విత్తనాలు లేక అవస్థలు కొమురవెల్లి(సిద్దిపేట): జీలుగ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో మండలంలోని రైతులు అవస్థలు పడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే జీలుగ విత్తనాలను సరిపడా సరఫరా చేయాలన్నారు. విత్తనాలు అరకొరగా రావడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. అధికారులు స్పందించి జీలుగ విత్తనాలను అందజేయాలని, లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దరఖాస్తుల ఆహ్వానం దుబ్బాకటౌన్: దుబ్బాక పట్టణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సుజాత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. -
No Headline
● పారుశుద్ధ్య సిబ్బందిని నియమించాలి చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా అన్ని చోట్ల పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని ఎస్జీటీ ఫోరం రాష్ట్ర కార్యదర్శి పానుగంటి నర్సింహాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ సబ్జెక్టు టీచర్లను నియమించాలన్నారు. ●● కేంద్రంలో రానున్నది మోదీ ప్రభుత్వమే చిన్నకోడూరు(సిద్దిపేట): భారత దేశాన్ని ప్రపంచ దేశాలు గర్వించేలా సమున్నత స్థానంలో నిలుపుతున్న ప్రధాని నరేంద్రమోదీ మరోసారి దేశ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, బీజేవైఎం మండల అధ్యక్షుడు నాగరాజు అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పది స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మరోసారి ప్రధానిగా నరేంద్రమోదీ నిలవబోతున్నారన్నారు. దేశ అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి, దేశ, ధర్మ రక్షణకు మోదీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలే మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తున్నాయన్నారు. మెదక్ పార్లమెంట్లో రఘునందన్రావు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారన్నారు. ● రఘునందన్రావును కలిసిన నాయకులు తొగుట(దుబ్బాక): బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావును మండల నాయకులు మంగళవారం కలిశారు. హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో పార్టీ మండల అధ్యక్షుడు చిక్కుడు చంద్ర నాయకత్వంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రఘునందన్రావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తాచాటాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు స్వామిరెడ్డి, నర్సింహారెడ్డి, బుచ్చిరాజం, రాజు పాల్గొన్నారు. ● రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు ప్రశాంత్నగర్(సిద్దిపేట): రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని బీజేపీ జిల్లా మీడియా సెల్ కన్వీనర్ గోనె మార్కండేయులు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులపై లాఠీచార్జి చేయడం హేయమైన చర్యన్నారు. వ్యవసాయానికి సాగునీ రు, కరెంట్, విత్తనాలు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని విమర్శించారు. రైతులపై లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ● సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి దుబ్బాకటౌన్: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబ్బాక ఎస్ఐ గంగరాజు హెచ్చరించారు. మంగళవారం దుబ్బాకలో సైబర్ నేరాలు, 100 కాల్పై అవగాహన కల్పించారు. మారుతున్న కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. అపరిచితులకు వ్యక్తిగత వివరాలు చెప్పొదన్నారు. సైబర్ నేరాలపై 1930కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ● పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటు సిద్దిపేటజోన్: సబ్బండ వర్గాల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, సోనియా గాంధీ ఇస్తేనే వచ్చిందనే ప్రచారం చేయడం సరికాదని సిద్దిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం విమర్శించారు. మంగళవారం ఎమ్మెల్యే హరీశ్రావు నివాసంలో పార్టీ అధికార ప్రతినిధి మోహన్ లాల్, మాజీ ఆర్టీఏ మెంబర్ ఈర్షద్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ సాధించిన విషయం చరిత్రలో ఉంటుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని తెచ్చుకున్న విషయం కాంగ్రెస్ గుర్తించుకోవాలన్నారు.● వేసవి శిబిరంతో చిన్నారులకు లబ్ధి ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఆధ్యాత్మిక వేసవి శిబిరంతో చిన్నారులకు లబ్ధి చేకురుతుందని బ్రహ్మకుమారి భవానీ అన్నారు. బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలానంద ఆధ్యాత్మిక వేసవి శిబిరంలో కథల తాతయ్య, కవి ఎన్నవెళ్లి రాజమౌళి, మిమిక్రీ కళాకారుడు రమేష్, డెంటిస్ట్ డాక్టర్ స్వాతి చిన్నారులకు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు స్వప్న, బింధు, ఓంకార్, ఉదయ్ పాల్గొన్నారు. ● మైనర్లకు వాహనాలు ఇస్తే చర్యలు గజ్వేల్రూరల్: మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి హెచ్చరించారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా వద్ద మంగళవారం రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టప్రకారం నేరమన్నారు. నంబర్ ప్లేటులేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారిని పట్టుకొని వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సంక్షిప్త వార్తలు -
పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల ఒత్తిడి
ప్రస్తుత వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లాలో 5.50లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆశావహ దృక్పథంతో సాగు పనులకు రైతులు సన్నద్ధమవుతున్నారు. కానీ బ్యాంకర్ల నుంచి పంట రుణాలు చెల్లించాలని వరుసగా నోటీసులు వస్తుండటం కలవరపరుస్తున్నది. ప్రధాన బ్యాంకులన్నీ బకాయిపడిన రైతులందరికీ నోటీసులు పంపుతున్నాయి. గతంలో జరిగిన రుణమాఫీ వివిధ కారణాలతో చాలామంది రైతులకు వర్తించని కారణంగా, అప్పులకు వడ్డీలు పెరుగుతూ వస్తున్నాయి. కొత్త ప్రభుత్వం నుంచి రుణ మాఫీ ప్రకటన రావడంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఎదురుకావడం ఆందోళన కలిగిస్తున్నది. కొన్ని బ్యాంకులు గోల్డ్ లోన్లతో పంట రుణాలను లింకు పెడుతున్నాయి. గోల్డ్ లోన్లను చెల్లించినా క్లియర్ చేయకుండా పంట రుణాలు చెల్లించే వరకు బంగారం ఇవ్వడం లేదు. అమలు చేస్తేనే మేలు ఆగస్టు 15లోపు రుణమాఫీ పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. మాఫీకి సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది. గత ప్రభుత్వం 2014 నుంచి ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పినా.. క్షేత్రస్థాయిలో ఆశించినస్థాయిలో జరగలేదు. తాజాగా 2014కు పూర్వం ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తారా? లేదా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉన్నది. అన్నదాతల్లో కలవరం రుణమాఫీపైనే కోటి ఆశలు అందరికీ వర్తింపజేయాలి గజ్వేల్లోని ఓ ప్రధాన బ్యాంకులో పంట రుణం, గోల్డ్ లోన్ ఉంది. గోల్డ్ లోన్ చెల్లించాం. కానీ పంట రుణం పెండింగ్లో ఉండటం వల్ల దానిని గోల్డ్ లోన్ను క్లియర్ చేయడం లేదు. రుణమాఫీ వర్తిస్తే నా లాంటి రైతులకు ఇబ్బందులు తొలిగిపోతాయి. – దామరకుంట రామకృష్ణ, రైతు, రిమ్మనగూడ -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
నేడే పోలింగ్ ● కేంద్రాలకు తరలిన సిబ్బంది ● చేర్యాల, కొమురవెల్లి, దూల్మిట్ట, మద్దూరులో పకడ్బందీ ఏర్పాట్లు సిద్దిపేటరూరల్: నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం జరగనుంది. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొమురవెల్లి, చేర్యాల, దూల్మి ట్ట, మద్దూరు మండల కేంద్రాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి సిబ్బంది సామగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు బయలుదేరివెళ్లారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారులు ఆరుగురు చొప్పున, 12 మంది మైక్రో అబ్జర్వర్లు పాల్గొంటున్నారన్నారు. చేర్యాల మండల కేంద్రంలో రెండు, కొమురవెల్లి, దూల్మిట్ట, మద్దూర్లలో ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. నాలుగు మండలాల్లో మొత్తం 4,659 మంది పట్టభద్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. -
పూర్వ వైభవం వచ్చేనా? రాష్ట్ర ప్రభుత్వం మూతబడిన పాఠశాలలను తెరిపిస్తామని ప్రకటన చేయడంతో బడులకు పూర్వ వైభవం రానుందన్న ఆశాభావంనెలకొంది. వివరాలు 9లో u
స్వామి వారి రాజగోపురం ఎదుట భక్తుల సందడి, (ఇన్సెట్లో) గంగిరేణి చెట్టువద్ద భక్తుల కోలాహలంమల్లన్న ఆలయం.. భక్తజన సంద్రం మల్లన్న ఆలయం భక్తులతో సందడి నెలకొంది. ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి బారులు తీరారు. అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, గంగిరేణిచెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొంత మంది స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొన్నారు. కొందరు రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
అక్షరదేవతకు లక్ష పుష్పార్చన
● నేత్రపర్వంగా మూల మహోత్సవం ● భారీగా అక్షరాభ్యాసాలు ● వర్గల్ క్షేత్రంలో భక్తి పారవశ్యం వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం ఆదివారం మూల మహోత్సవ వైభవంతో అలరారింది. విద్యాప్రదాయనికి భక్తజన సామూహిక లక్షపుష్పార్చన నేత్రపర్వం చేసింది. పెద్ద సంఖ్యలో చిన్నారులకు అక్షరస్వీకారాలు జరిగాయి. జన్మ నక్షత్రవేళ అమ్మవారి దివ్యమంగళ రూపం దర్శించుకుని భక్తులు తరించారు. తెల్లవారుజామున ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేదపండితులు అమ్మవారి మూలవిరాట్టుకు విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. పట్టువస్త్రాలు, పూల మాలలు, ఆభరణాలతో కమనీయంగా అలంకరించారు. చతుషష్ట్యోపచార పూజలు, సామూహిక లక్షపుష్పార్చన చేశారు. ఆలయ యాగ మండపంలో చండీ హోమం నిర్వహించారు. అక్షరాభ్యాస మండపంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించారు. హైదరాబాద్కు చెందిన కొనతం శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతులు అమ్మవారికి వెండి పుష్పం బహుకరించారు. జంటనగరాలు, ఉమ్మడి జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు వేడుకలు తిలకించి తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్సిద్దిపేటఅర్బన్: ప్రజా సమస్యలు పరిష్కారానికి పోరాటాలే మార్గమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులు జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. శిక్షణ తరగతులను సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి ప్రారంభించారు. కమ్యూనిస్టు ఉద్యమ విశిష్టత–పార్టీ నిర్మాణం అనే అంశంపై బుర్రి ప్రసాద్ మాట్లాడారు. ప్రపంచ చరిత్ర మొత్తం పరిశీలిస్తే పోరాటాల వల్లనే ప్రజలు తమ బాధల నుంచి విముక్తి అయ్యారని అన్నారు. కేవలం పాలకులు మారినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. విధానాల ప్రాతిపదికన ప్రజలు చైతన్యవంతులై సరైన నాయకులను ఎన్నుకోవడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజాపోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. శిక్షణ తరగతుల్లో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శశిధర్, అర్బన్ మండల కార్యదర్శి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
సంగారెడ్డి టౌన్: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బీరం మల్లేశం డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్ కిషన్ భవన్లో రెండో రోజు జరిగిన శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక వర్గంపై బీజేపీ పదేళ్లుగా యుద్ధం చేస్తుందని విమర్శించారు. కనీస వేతనం కమిటీ తీర్మానం ప్రకారం రూ.26,000 చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదన్నారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని.. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల చార్జీలు విపరీతంగా పెంచారన్నారు. నల్లధనాన్ని వెనక్కి తెచ్చి పేదల బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానన్న వాగ్ధానం మోదీ మర్చిపోయారని విమర్శించారు. బీజేపీ ఈసారి గెలిస్తే కార్మికుల సంఘాలు, పోరాడే హక్కు ఉండదన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు బాగరెడ్డి, ప్రవీణ్, యాదగిరి, నాగభూషణం, శ్రీనివాస్, సువర్ణ పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2024
స్వామివారి సన్నిధిలో భక్తులు నాచగిరి.. ఆధ్యాత్మిక ఝరినాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వారాంతపు సెలవురోజు నగరం నుంచే కాక ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భక్తులు పోటెత్తారు. గర్భగుడిలో కొలువైన లక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకుని తరించారు. మరోవైపు దంపతులు ఆలయ వ్రతమండపంలో సామూహిక సత్యనారాయణ వ్రతమాచరించారు. అభిషేకం, కల్యాణ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ అన్నపూర్ణ క్షేత్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. – వర్గల్(గజ్వేల్) న్యూస్రీల్ -
రైతుల్లో సందిగ్ధం
గతేడాది 2014 ఏప్రీల్ 1 నుంచి, 2018 డిసెంబర్ 11వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడానికి నిర్ణయించిన సంగతి తెల్సిందే. దీని ప్రకారం జిల్లాలో 1,75,719మందిర రైతులకు చెందిన రూ.1360.49కోట్ల రుణాలు మాఫీ కావాల్సి ఉండగా, ఈ ప్రక్రియ వందశాతం పూర్తి కాలేదు. ఎకౌంట్ క్లోజ్డ్, బ్లాక్ కావడం, తప్పుడు ఖాతాలు వంటి సమస్యలు ఉండగా, వాటిని సరిచేసి ప్రక్రియలో జాప్యం జరిగింది. దీని వల్ల కొందరు రైతులకు ఇంకా రుణమాఫీ దరి చేరలేదు. బ్యాంకర్ల చుట్టూ తిరిగినా సరైన సమాధానం రాక ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు మాఫీ వర్తిస్తుందా? లేదా అనే ఆందోళనలో రైతులు ఉన్నారు. గ్రామం యూనిట్గా తీసుకొని రుణమాఫీ పూర్తి చేయాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలోకి బ్యాంకర్లు సక్రమంగా వెళ్లకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేకుండా సక్రమంగా ఖాతాలకు సంబంధించిన రైతుల విషయంలోనూ రుణమాఫీ పూర్తి చేయడంలో కొన్ని చోట్ల జాప్యం జరుగుతున్నది. ఈ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగాల్సి ఉండగా జరగలేదు. ఫలితంగా రుణమాఫీ సక్రమంగా సాగలేదనే చెప్పాలి. -
నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): వేంకటేశ్వర దేవస్థానం 49వ బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం వాసుదేవ వచనం, అంకురార్పణం, బుధవా రం విశేష హయగ్రీవ హోమం నిర్వహిస్తారు. గురువారం లక్ష్మీ హోమం, శుక్రవారం శ్రీ స్వామి వారి తిరుకల్యాణం, శనివారం స్వామి వారి దివ్య రథయాత్ర చేపడతారు. ఆదివారం చక్రతీర్థం, 108 కలశాలతో అభిషేకం, స్వామి వారి ఏకాంతసేవ తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గుట్కా తయారీ, విక్రయాలపై నిషేధం అభినందనీయం గజ్వేల్రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా తయారీ, విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని జాతీయ యువజన అవార్డు గ్రహిత దేశబోయిన నర్సింహులు అన్నారు. ఆదివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుట్కా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందన్నారు. వీటి బారిన పడినవారికి కౌన్సెలింగ్ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 99 మంది హాజరు సిద్దిపేటఅర్బన్: పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించిన తొలి సెషన్కు 50 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు నిర్వహించిన రెండో సెషన్కు 49 మంది హాజరయ్యారు. ఒకరు గైర్హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్లు రాజశేఖర్, నారాయణ, టీసీఎస్ రాకేష్, పీఆర్వో రఘు, షాదుల్లా, డీపీ రావు, కరీముద్దీన్, రాజేశ్వర్, నర్సింహులు పర్యవేక్షించారు. ఘనంగా 108 పైలట్ దినోత్సవం సిద్దిపేటకమాన్: జిల్లా కేంద్రం సిద్దిపేటలో 108 పైలట్ దినోత్సవాన్ని ఆదివారం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కార్యాలయంలో ఉద్యోగులు కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ మాట్లాడుతూ.. 15ఏళ్లుగా విధి నిర్వహణలో క్షతగాత్రులను ఆస్పత్రులకు చేరుస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేశ్, సిబ్బంది పాల్గొన్నారు. ‘ప్రజాదరణ ఓర్వలేకే కాంగ్రెస్పై ఆరోపణలు’నర్సాపూర్: ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించడం సరికాదని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను నట్టేట ముంచి తన స్వలాభం కోసం పార్టీ మారారని ఆరోపించారు. తమ పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగుతోందని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు అనుచరులు ఉన్నారని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. -
గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్ దుబ్బాక: ప్రమాదకర లక్షణాలతో ఉన్న గర్భిణులను ముందస్తుగా గుర్తించి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ వైద్యులను ఆదేశించారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని పీహెచ్సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు పట్టికతో పాటు ఆరోగ్య కార్యక్రమాల పనితీరును పరిశీలించారు. ప్రతి శుక్రవారం గర్భిణులకు నిర్వహించే పరీక్షలను పర్యవేక్షించారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషకార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారికి చికిత్స అందించాలని అన్నారు. మాతృ, శిశు మరణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఎచ్ఓ, వైద్యాధికారులు ఉన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బందోబస్తు
సిద్దిపేటకమాన్: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. ఈ నెల 27న ఓటింగ్ జరగనున్న దృష్ట్యా జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల నియమావళి ఉల్లంఘించినా, ఏ చిన్న సంఘటన జరిగినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ తెలిపారు.సిద్దిపేట సీపీ అనురాధ -
భూంపల్లి ఎస్ఐ సస్పెన్షన్
● ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ ● పలు కేసుల్లో అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ దుబ్బాక: భూంపల్లి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వి.రవికాంత్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం మల్టీజోన్ –1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మెదక్ జిల్లాలోని శివ్వంపేట ఎస్ఐగా పనిచేసిన రవికాంత్ సిగిల్లాపూర్ మామిడి తోటలో జరిగిన దొంగతనం కేసులో, అలాగే పలు భూతగాదా కేసుల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు మెదక్ జిల్లా ఎస్పీ విచారణ చేయగా నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేస్తూ ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా 4 నెలల క్రితమే శివ్వంపేట నుంచి బదిలీపై భూంపల్లి ఎస్ఐగా వచ్చారు. ఇక్కడా ఆయన పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
చెట్లపై రగడ
మున్సిపల్ వర్సెస్ ‘పవర్’ ● ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేతపై బల్దియా సీరియస్ ● పట్టణంలో 400పైగా నరికివేశారంటూ ఆగ్రహం ● రూ.24 లక్షల జరిమానా చెల్లించాలంటూ నోటీసు ● నిరంతర విద్యుత్ సరఫరా కోసమే అంటున్న ట్రాన్స్కో ● రెండు శాఖల మధ్య లోపించిన సమన్వయం సాక్షి, సిద్దిపేట: మున్సిపాలిటీ, విద్యుత్ శాఖల మధ్య కోల్డ్వార్ నెలకొంది. ప్రభుత్వ విభాగాలు విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే కరెంట్ కట్ చేసి విద్యుత్ శాఖ ఝలక్ ఇచ్చేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విద్యుత్ శాఖకు జరిమానా విధించి మున్సిపల్ శాఖ షాక్ ఇచ్చింది. ఈ నెల 19, 22వ తేదీల్లో సిద్దిపేట పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లను విద్యుత్ శాఖ నరికివేయడంతో మున్సిపల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని కొమ్మలు, చెట్లను తొలగించారు. మున్సిపల్ అధికారులు జరిమానా విధించడంతో ఆడకత్తెరలో పోకచెక్కలా విద్యుత్ శాఖ అధికారుల పరిస్థితి మారింది. ఒక్క మొక్కకు రెండు చొప్పున.. పట్టణం హరిత సిద్దిపేట పెరుగాంచింది. సుమారు పట్టణంలో 40వేల చెట్లను పెంచుతున్నారు. రోడ్లకు ఇరువైపులా ఎనిమిదేళ్ల క్రితం మొక్కలు నాటారు. అవి ఇప్పుడు పెద్దగా పెరిగాయి. విద్యుత్ వైర్ల కింద ఏపుగా పెరిగి విద్యుత్ తీగలకు తగులుతున్నాయి. దీంతో గాలి దుమారం వస్తే విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. ప్రతి యేడాది ఎండాకాలంలో చెట్ల కొమ్మలను తొలగించేవారు. అందులో భాగంగా చెట్ల కొమ్మలను తొలగించారు. సిద్దిపేట పట్టణంలో సుమారు 400 చెట్లను నరికివేడంతో వాటి స్థలంలో ఒక్క చెట్టుకు రెండు చొప్పున 800 మొక్కలు నాటాలి. లేనట్లయితే రూ.24లక్షల జరిమానా చెల్లించాలని విద్యుత్ శాఖకు సిద్దిపేట మున్సిపాలిటీ నోటీసులు జారీ చేసింది. శాఖల మధ్య సమన్వయ లోపం మున్సిపల్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలకు నిరంతరాయం విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ వైర్లకు కొమ్మలు తాకకుండా కొట్టివేయడం తప్పనిసరి. విద్యుత్ అధికారులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చి రెండు శాఖలు సమన్వయంతో ముందుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ సమన్వయం కుదరకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులే నేరుగా రంగంలోకి దిగి కొమ్మలను తొలగించారు. అలాగే విద్యుత్ వైర్ల కింద మొక్కలు నాటేసమయంలో మున్సిపల్ శాఖ పలు జాగ్రత్తలు పాటిస్తే కొమ్మల తొలగింపు సైతం ఉండే అవకాశం ఉండదు. పెద్దగా పెరిగే మొక్కలు కాకుండా చిన్నగా పెరిగే మొక్కలు నాటితే విద్యుత్ వైర్లకు తగిలే అవకాశం ఉండదు. ఇప్పటికై నా రెండు శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నారు. -
రైతులు అప్రమత్తంగా ఉండాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): హైనా వరుస దాడులతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు మండల పరిధిలోని మాచాపూర్లో శుక్రవారం బోన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రాత్రి వేళల్లో వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చేతిలో కర్ర పట్టుకుని వెళ్లాలన్నారు. పున్నం మల్లయ్య వ్యవసాయ బావి వద్ద బోను ఏర్పాటు చేశామన్నారు. రాత్రి వేళ బోనులో మేక పిల్లను వదిలి హైనా ను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చామన్నారు. గ్రామాల్లో సీఎఫ్ఓ పర్యటన చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని నాగపురి, ముస్త్యాల గ్రామాల్లో శుక్రవారం రూరల్ డెవలప్మెంట్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన చెరువులు, నర్సరీలు, డంపింగ్యార్డు, గ్రేవ్యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. ఇప్పటి వరకు గ్రామాల్లో చేపట్టిన, కొనసాగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. అలాగే చెరువు వద్దకు వెళ్లి ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఆయన వెంట డీఆర్డీఓ జయ్దేవ్ ఆర్య, ఏపీడీలు సతీష్, శివాజీ, ఏపీఓ మంజుల, కార్యదర్శులు, ఎఫ్ఎలు, టీఏలున్నారు. సమయానికి దుస్తులు అందించాలి డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య హుస్నాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల ప్రారంభానికి విద్యార్థులకు దుస్తులను అందించాలని డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య ఆదేశించారు. శుక్రవారం పోతారం(ఎస్)లో సీ్త్రశక్తి స్వశక్తి టైలరింగ్ యూనిట్ సందర్శించి దుస్తుల కుట్టు వివరాలను తెలుసుకున్నారు. త్వరగా దుస్తులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల అధికారులు పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి తగు సూచనలు చేయాలన్నారు. వీరి వెంట ఎంపీడీఓలు వేణుగోపాల్రెడ్డి, జయరాం, ఏపీఎంలు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ‘జలశక్తి’కి నామినేట్ కావడం అభినందనీయం మర్కూక్(గజ్వేల్): అంగడి కిష్టాపూర్ పాఠశాల.. జలశక్తి అభియాన్కు ఇటీవల నామినేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో గురువారం రూరల్ డెవలప్మెంట్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీదేవి సందర్శించారు. భూగర్భ జలాలు, ఉపరితల నీటి వనరులను రీచార్జ్ చేసే విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జలశక్తి అభియాన్కు నామినేట్ కావడం, అందులో రాష్ట్రంలోనే మొట్టమొదటి పాఠశాల కావడం అభినందనీయమన్నారు. అనంతరం ఉపాధ్యాయులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీడీ సతీస్కుమార్, జిల్లా పంచాయతీ కార్యదర్శి నీలిమ, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గాలివాన బీభత్సం
రాజీవ్ రహదారిపై స్తంభించిన రాకపోకలు కొండపాక(గజ్వేల్): బలమైన ఈదురు గాలులకు వర్షంతోడైంది. రాజీవ్ రహదారిపై చెట్లు, రేకులు ఎగిరిపడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన దుద్దెడ శివారులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. భారీగా వీచిన ఈదురు గాలులకు రాజీవ్ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా సమీపంలో షెడ్ల రేకులు, కొట్టుకు వచ్చి రహదారికి అడ్డంగా పడ్డాయి. దీంతో సుమారు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చెట్లు నెలకూలాయి. పోలీసులు. టోల్ ప్లాజా సిబ్బంది రహదారిపై పడిన రేకులను, చెట్లను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో పాటు కొండపాక, దమ్మక్కపల్లి, దుద్దెడ, సిర్సనగండ్ల, తిమ్మారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలులకు చెట్లు కూలాయి. -
తొలి రోజు ప్రశాంతం
ముగిసిన పాలిసెట్ నంగునూరు/చిన్నకోడూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. సిద్దిపేట పట్టణంలో ఆరు సెంటర్లను ఏర్పాటు చేయగా 2,143 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారన్నారని సిద్దిపేట కోఆర్డినేటర్ సూర్యనారాయణ తెలిపారు. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు శివారులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 297 మంది విద్యార్థులకు 286 మంది పరీక్షకు హాజరయ్యారు. దుబ్బాక మండలం కమ్మర్పల్లికి చెందిన విద్యార్థి ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదు. సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 27 పరీక్షా కేంద్రాల్లో ఉదయం ప్రథమ సంవత్సరం, సాయంత్రం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రెండు విడుతలుగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జనరల్ కేటగిరిలో ఉదయం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలకు 1,173 మంది విద్యార్థులకు హాజరుకాగా 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక ఒకేషనల్ విభాగంలో 427 మంది విద్యార్థులు హాజరు కాగా 42 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 562 మంది విద్యార్థులకు 541 విద్యార్థులు హాజరు కాగా 21 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక ఒకేషనల్ విభాగంలో 145 మంది విద్యార్థులు హాజరు కాగా 11 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును పరీక్షల కన్వీనర్, జిల్లా ఇంటర్ విద్యాధికారి సూర్యప్రకాశ్తో పాటు పరీక్షల కమిటీ సభ్యులు దేవస్వామి, చెన్నూరు శ్రీనివాస్లు పర్యవేక్షించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సంప్లిమెంటరీ పరీక్షలు పర్యవేక్షించిన అధికారులు -
రెవెన్యూ డివిజన్ సాధించి తీరుతాం
చేర్యాల(సిద్దిపేట): రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని డివిజన్ జేఏసీ, అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానికంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు జేఏసీ, అఖిలపక్ష నాయకులు మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వాగ్దానం చేసి మాట తప్పారన్నారు. కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్రెడ్డి కూడా మాట మరిచారన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఆరు నెలలు గడిచినా రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు అడుగడుగునా నిలదీయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ డివిజన్ సాధనకు జూన్ 1న సమావేశమై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, డివిజన్ జేఏసీ నాయకులు తాడెం ప్రశాంత్, బిజ్జ రాము, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బూరుగు సురేశ్గౌడ్, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.జేఏసీ, అఖిలపక్ష నాయకుల తీర్మానం
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement