-
కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
వనపర్తి టౌన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన ఫస్టియర్ పరీక్షకు 2,521 మంది విద్యార్థులకుగాను 2,428 మంది హాజరుకాగా.. 93 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ పరీక్షకు 814 మంది విద్యార్థులకుగాను 777 మంది హాజరుకాగా 37 మంది గైర్హాజరయ్యారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తిటౌన్: సామాజిక సేవారంగంలో విశేష కృషి చేసిన వారి నుంచి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి టి.సుధీర్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్, లిటరేచర్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, మెడిసిన్, సోషల్వర్క్, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్సీసెస్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తదితర రంగాల్లో చేసిన కృషి, సాధించిన లక్ష్యాల గురించి 800 పదాలు మించకుండా రాసి https:// padmaaward.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. దరఖాస్తు, సంబంధిత ధ్రువపత్రాల 4 సెట్లను వచ్చే నెల 4లోగా జిల్లా యువజన, క్రీడలశాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ వేడుకలు పెబ్బేరు రూరల్: సీఐటీయూ 54వ ఆవిర్భావ వేడుకలను బుధవారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు జెండా ఆవిష్కరించి మాట్లాడారు. 1970, మే 30న కోల్కత్తాలో ‘ఐక్యత–పోరాటం’ అనే నినాదంతో సీఐటీయూ ఆవిర్భవించిందన్నారు. స్వాతంత్య్ర పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, చారిత్రక అవసరం ఆధారంగా ఐక్య పోరాటాల రథసారథిగా పని చేస్తోందని తెలిపారు. సరళీకరణ–ప్రైవేటీకరణ–ప్రపంచీకరణ విధానాలు 1991లో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చాయని.. ఈ విధానాలను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించిన సంఘం అని గుర్తు చేశారు. 1991 నుంచి నేటి వరకు 22 జాతీయ సమ్మెలు నిర్వహించడంతో పాటు కార్మిక హక్కుల సాధనకు ఐక్య పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నట్లు వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణ విధానాల వేగం పుంజుకుందని, ప్రభుత్వరంగ సంస్థలను నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో రూ.ఆరు లక్షల కోట్లకు కారుచౌకగా ప్రధాని మోదీ అనుయాయులకు అప్పగించిందని ఆరోపించారు. నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిందని, 10 శాతం చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారన్నారు. కార్యక్రమంలో సునీత, నారాయణమ్మ, నందిమళ్ల రాములు, బి.కవిత, లింగంశెట్టి, సాయిబాబా, బుచ్చమ్మ, గిరిజ, గంధం మదన్, మద్దిలేటి, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. -
వైభవంగా భూలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణం
కొత్తకోట రూరల్: కొత్తకోట సమీపంలోని వెంకటగిరి గుట్టపై ఉన్న భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్ల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఉత్సవ విగ్రహాలను పట్టువస్త్రాలతో అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణ క్రతువు నిర్వహించారు. వేడుక తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు తలంబ్రాలు.. ఆడపడుచులు అమ్మవారికి వడి బియ్యం పోశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్చకులు సింగరా ఆచార్యులు, కిట్టుస్వామి, అమిత్తో పాటు ఆలయ నిర్వాహకులు వి.శ్రీనివాస్రెడ్డి, బి.శ్రీనివాసులు శెట్టి, సంద వెంకటేష్, పాండురంగం, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పంట బీమాపై ఆశలు
జిల్లాల వారీగా రైతులు, సాగు విస్తీర్ణం వివరాలు జిల్లా రైతులు సాగు భూమి మహబూబ్నగర్ 2,39,600 3,21,523 నాగర్కర్నూల్ 3,50,699 5,38,531 వనపర్తి 1,82,901 2,54,012 జోగుళాంబ గద్వాల 1,76,402 5,35,435 నారాయణపేట 1,85,878 4,62,476 ● ప్రీమియం చెల్లించనున్న ప్రభుత్వం ● కసరత్తు చేస్తున్న వ్యవసాయశాఖ ● వానాకాలం నుంచే ఉచిత పంటల బీమా మహబూబ్నగర్ (వ్యవసాయం): ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరడం, ప్రీమియం చెల్లింపు, బీమా పరిహారం తదితర వాటితో పాటు పొరుగు రాష్ట్రాల్లో పంటల బీమా పథకం ఎలా అమలవుతున్నాయనే దానిపై అధ్యాయనం చేస్తున్నారు. గతంలో అమలు చేసిన పంటల బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95 శాతం ప్రీమియాన్ని, మిగిలిన 5 శాతం ప్రీమియాన్ని రైతులు చెల్లించేవారు. పరిహారం పొందడంలో సమస్యలు ఉండటం, పెద్దగా రైతులకు ఉపయోగం ఉండటం లేదనే కారణంతో గత ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించాలనే నిర్ణయానికి వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 11.35 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తున్నారు. వరి ప్రధాన పంటగా, ఆ తర్వాత పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేస్తారు. ఇతర పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగవుతాయి. ప్రతి సంవత్సరం ఏదో రకంగా రైతులు పంటలను నష్టపోతున్నారు. ఇలాంటి సమయంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా ప్రభుత్వం పంట బీమాపథకం అమలు చేస్తుంది. గతంలో బ్యాంకు నుంచి రుణం పొందే రైతులకు పంట బీమా తప్పనిసరి చేశారు. రుణంతో సంబంధం లేకుండా పంటలను సాగు చేసే రైతులు మాత్రం బీమా చేయడమనేది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. తర్వాత ప్రీమియం చెల్లింపు అనేది రైతుల ఇష్టానికి వదిలేశారు. పత్తికి వాతావరణ ఆధారిత గ్రామం యూనిట్గా, ఇతర పంటలకు మండల యూనిట్గా బీమా పథకాన్ని అమలు చేశారు. తాజాగా ఏఏ పంటలకు బీమా వర్తింపజేస్తారు, ప్రీమియం, పరిహారం, బీమా ఎలా అమలు అనేది తేల్చాల్సి ఉంది. వీటికి సంబంధించి వ్యవసాయశాఖ అధ్యాయనం చేస్తుంది. పక్కాగా అమలు.. కొత్తగా అమలు చేయనున్న పంటల బీమా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు ఇప్పటికే క్లస్టర్ల వారీగా వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న క్రాప్ బుకింగ్ను పరిగణలోకి తీసుకోనున్నారు. చాలా మంది ఏఈఓలు పంట పొలాలకు వెళ్లకుండా, రైతులను అడిగి రాస్తుండటం, పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో పంటల నమోదుపై గొడవలు జరుగుతుండటంతో పంటల బీమాను పకడ్బందీగా అమలు చేయాలంటే బయోమెట్రిక్ తీసుకోవడంతో పాటు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభం అవుతుండటంతో పంటల బీమా పథకాన్ని త్వరగా తేల్చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లాల వారీగా పంటల సాగు అంచనాలు, ప్రీమియం తదితర వాటికి సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని కోరారు. పంటల బీమాకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించడం, బీమా కంపెనీలను సంప్రదించడం, ప్రీమియాన్ని నిర్ధారించడం, ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనతో వచ్చే ప్రయోజనాలను వినియోగించుకోవడంతో పాటు రైతులపై ఎలాంటి భారం పడకుండా పంటల పథకాన్ని అమలు చేయనుంది.రైతులకు ప్రయోజనం ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు బీమా పథకం ఎంతో ఉపయోగపడుతుంది. వానాకాలం పంటల నుంచి రైతులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సల్ కవరేజ్, ఎంపిక చేసిన ప్రాంతాల్లోని పంటలకు బీమా పథకం వర్తింపజేయడం, రైతులకు ఉచిత ప్రీమియం, వాటాను ప్రభుత్వం భరిస్తుంది. బీమా యోజన ప్రయోజనాలు రైతులు పొందేలా ఏఈఓలు రైతులకు అవగాహన కల్పిస్తారు. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
కౌంట్డౌన్..
● ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం ● సీఎం ఇలాకాలో ఓటరు తీర్పుపై ఉత్కంఠ ● ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్డౌన్ మొదలైంది. ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. జూన్ 4న ఉమ్మడి జిల్లాలోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం కౌంటింగ్ను మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ పరీక్షల విభాగంలో, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలోని నెల్లికొండ సమీపంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులో చేపట్టనున్నారు. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక మార్చి నెల 28న నిర్వహించగా, ఓట్ల లెక్కింపును జూన్ 2న చేపట్టనున్నారు. దీంతో లోక్సభ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 2న ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ● 4న లోక్సభ ఎన్నికల ఫలితాలుఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల పరిధిలో నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలు, పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అదే రోజున ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే కౌంటింగ్లో నిమగ్నమయ్యే ఎన్నికల సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేశారు. ఏర్పాట్లలో అధికార యంత్రాంగం.. -
‘ఆర్ఆర్ యాక్ట్’ అమలుకు రంగం సిద్ధం
వనపర్తి: జిల్లాలో 2020–21, 2021–22 వానాకాలం, యాసంగి సీజన్కు సంబంధించి సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్ అమలుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సీఎంఆర్ అప్పగింతకు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఏప్రిల్ 30తో ముగియడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 125 శాతం బియ్యంతో పాటు 12 శాతం వడ్డీతో వసూలు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులను బ్లాక్ లిస్టులో ఉంచి ప్రస్తుత యాసంగి సీజన్లో సీఎంఆర్ కేటాయింపులు చేయలేదు. జిల్లాలో మొత్తం 186 రైస్మిల్లులు ఉండగా.. ఇందులో 175 సాధారణ, 11 పారాబాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం 19 మిల్లులకు మాత్రమే ధాన్యం కేటాయింపులు చేయడం గమనార్హం. సీఎంఆర్ కేటాయించిన మిల్లుల్లో 12 సాధారణ, ఏడు పారాబాయిల్డ్ మిల్లులు ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఎలాంటి గ్యారంటీలు లేకుండా అడ్డగోలుగా మిల్లర్లకు ధాన్యం కేటాయించడం, సీఎంఆర్ రికవరీపై దృష్టి సారించకపోవడంతో కొందరు రాజకీయ సంబంధాలున్న మిల్లర్లు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా సాగింది. సీఎంఆర్ ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కొద్దిమే బియ్యం పంపించి పెట్టుబడిలేని వ్యాపారం చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం మారడం.. సీఎంఆర్పై వత్తిడి తీసుకురావడంతో డిఫాల్ట్ మిల్లర్ల బాగోతం వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. జిల్లాలో అత్యధికం.. జిల్లావ్యాప్తంగా 2020–21 నుంచి ఇప్పటి వరకు 186 మిల్లుల నుంచి సుమారు 75 వేల మెట్రిక్ టన్నులకుపైగా సీఎంఆర్ రావాల్సి ఉంది. కొందరు మిల్లర్లవి ఒకటి, రెండు సీజన్లవి మాత్రమే పెండింగ్లో ఉండగా.. మరికొందరివి ఏళ్లుగా సివిల్ సప్లయ్, ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యం పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోనే వనపర్తిలో అత్యధికంగా సీఎంఆర్ పెండింగ్ ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఇన్చార్జ్ అధికారులతో ఎన్నాళ్లు.. జిల్లాలో కొన్ని నెలలుగా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం, డీఎస్ఓ పోస్టుల్లో ఇన్చార్జ్లే కొనసాగుతుండటం శోచనీయం. దీంతో పెండింగ్ సీఎంఆర్ ఎక్కువగా ఉండటం, కొన్ని మిల్లుల వద్ద కనీసం ధాన్యం కూడా లేకపోవడం, రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండటం కారణాలుగా పలువురు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలే ఆలస్యం.. ఆర్ఆర్ యాక్ట్ను ఉపయోగించి బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లర్ల నుంచి కేటాయించిన ధాన్యం విలువను జరిమానాతో కలిపి వసూలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటమే ఆలస్యం. ఇప్పటికే పలుమార్లు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. కలెక్టర్ ఆదేశానుసారం ఎక్కువ మొత్తం పెండింగ్లో ఉన్న మిల్లర్లకు ఆర్ఆర్ యాక్ట్ అమలు చేస్తామని నోటీసులు జారీ చేశారు. – బాలు, అసిస్టెంట్ డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, వనపర్తి ●బ్లాక్లిస్ట్లో 80 మిల్లులకు పైగా.. ప్రభుత్వ ఆదేశానుసారం పౌరసరఫరాలశాఖ అధికారులు ఎక్కువ మోతాదు బియ్యం ఇవ్వాల్సిన మిల్లుల వివరాలను బ్లాక్ లిస్టులో ఉంచి ఇటీవల వరి ధాన్యం కేటాయింపులు చేయలేదు. జిల్లాలో ఈ జాబితాలో ఉన్న మిల్లులు సుమారు 80 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో పేర్లున్న మిల్లర్లు 2020–21 నుంచి సీఎంఆర్ పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లర్లలో సగం మంది ఇవ్వాల్సిన బియ్యం ఇచ్చినా.. ప్రభుత్వం అదనంగా ఇవ్వాలని ఆదేశించిన 25 శాతం బియ్యం విషయంలో ఊరట లభిస్తుందని వేచిచూస్తుండగా.. మరో సగం మంది మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వనివారున్నారు. జిల్లాలో 75 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ పెండింగ్ 80కి పైగా మిల్లులు బ్లాక్లిస్టులో.. 25 శాతం అదనపు బియ్యం.. 12 శాతం వడ్డీ చెల్లిస్తేనే ఊరట ప్రస్తుత సీజన్లో 19 మిల్లులకే ధాన్యం కేటాయింపు ఇన్చార్జ్ అధికారులతో అవస్థలు -
‘బడిబాట’తో పూర్వవైభవం రావాలి
వనపర్తి: ప్రభుత్వం జూన్ 3 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని.. సర్కారు బడులకు పూర్వవైభవం తీసుకురావాలని కలెక్టర్ తేజస్ పవార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు, యూనిఫామ్స్, పుస్తకాల పంపిణీ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని.. విద్యార్థుల నమోదు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో కొనసాగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యతలో రాజీపడొద్దని.. కేజీబీవీలు, సంక్షేమ పాఠశాలల్లో సైతం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మరమ్మతులు, మౌలిక వసతులు, పుస్తకాల పంపిణీ, యూనిఫామ్స్ పంపిణీ, బడిబాటను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, పీఆర్ ఈఈ మల్లయ్య, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ నాగేంద్ర, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పకడ్బందీగా నిర్వహించాలి.. జూన్ 3 నుంచి కొనసాగే పదోతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ పవార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అఽధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాకేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్సులు పరీక్ష సమయానికి నడపాలని.. కేంద్రాల్లో మౌలిక వసతులతో పాటు ప్రథమ చికిత్స కిట్లు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలను కేటాయించాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. పరీక్షలు జరగనున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలో ఉండే జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా చూడాలన్నారు. నాసిరకం పత్తి విత్తనాలు కొనొద్దు.. రైతులు నాసిరకం పత్తి విత్తనాలు కొని మోసపోవద్దని కలెక్టర్ తేజస్ పవార్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. విత్తన ప్యాకెట్లపై లేబుల్, ప్యాకింగ్ లేకుండా విక్రయించే విత్తనాలను కొనరాదన్నారు. జిల్లా రైతుల కోసం 10 వేల నాణ్యమైన పత్తి విత్తనాల ప్యాకెట్లు, 19 వేల టన్నుల యూరియా, 1,226 టన్నుల డీఏపీ, 254 టన్నుల పొటాష్, 335 టన్నుల సూపర్ పాస్పేట్, 5,697 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, పచ్చరొట్ట విత్తనాలు 240 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన పడొద్దని తెలిపారు. నాసిరకం విత్తనాలు ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే.. వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎరువులు, పురుగు మందుల దుకాణాల తనిఖీకి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. కలెక్టర్ తేజస్ పవార్ -
నాణ్యమైన విత్తనాలే విక్రయించాలి
అమరచింత: రైతులకు నాణ్యమైన విత్తనాలే విక్రయించాలని.. కంపెనీలు విత్తన అమ్మకానికి జారీ చేసిన ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని, లేనిపక్షంలో విక్రయించొద్దని ఏడీఏ దామోదర్ సూచించారు. బుధవారం మండలంలోని నాగల్కడ్మూర్, అమరచింతలోని సాయిసావిత్రి, హనుమాన్ ట్రేడర్స్, నందీశ్వర్ ట్రేడర్స్ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో విత్తన నిల్వలు, విక్రయాల రికార్డులను పరిశీలించారు. సాయిసావిత్రి ట్రేడర్స్లో రూ.1,03,680 విలువగల పత్తి విత్తనాలకు సంబంధించి ప్రిన్సిపల్ సర్టిఫికేట్ లేకపోవడంతో విక్రయించొద్దని ఆదేశించారు. అదేవిధంగా హనుమాన్ ట్రేడర్స్లో రూ.30 వేల విలువగల మిరప విత్తనాలకు సంబంధించి పత్రాలు లేకపోవడంతో విక్రయాలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఏ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రైతుల బలహీనతను దృష్టిలో ఉంచుకొని కొందరు నాసిరకం పత్తి, ఇతర విత్తనాలను అంటగట్టేందుకు పాల్పడుతుంటారని, అలాంటివి కొని మోసపోవద్దని సూచించారు. ఆగ్రో సేవాకేంద్రాలు, ఫర్టిలైజర్స్ దుకాణాల డీలర్ల వద్ద నాణ్యమైన విత్తనాలు కొని విధిగా రసీదు తీసుకోవాలని సూచించారు. మండలం కర్ణాటకకు సరిహద్దుగా ఉన్నందున నకిలీ విత్తనాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారు కనబడితే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆయన వెంట ఏఓ వినయ్, ఏఈఓలు రాజేష్, మల్లేష్ తదితరులు ఉన్నారు. ఏడీఏ దామోదర్ -
సమస్యల సాధనే లక్ష్యంగా పోరాటం : సీపీఎం
పాన్గల్: ప్రతి కార్యకర్త ప్రభుత్వాలు అమలుచేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ సమస్యల సాధనే లక్ష్యంగా పోరాటాలు కొనసాగించాలని సీపీఎం ఉమ్మడి రాష్ట్ర నాయకుడు మీర్యం వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని రేమద్దులలో నిర్వహించిన పార్టీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం మంగళవారం జరగగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి పేదల పక్షాన నిలిచిన చరిత్ర సీపీఎంకు ఉందని గుర్తు చేశారు. భూస్వాముల నుంచి 10 లక్షల ఎకరాల భూమికి విముక్తి కలిగించి పేదలకు పంచిన ఘనత పార్టీకి ఉందని తెలిపారు. పేదలు, రైతులు, కూలీలు, కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నది ఎర్రజెండా పార్టీ అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులు, కార్మిక చట్టాలను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు వంత పాడుతోందని.. కనీస అవసరాలకు నోచుకొని స్థితిలో పేదలు ఉన్నారని తెలిపారు. పేదల కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ప్రభుత్వాలు కల్పించాలన్నారు. రెండ్రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల్లో ‘పార్టీ నిర్మాణం.. ప్రజాసంఘాల బాధ్యత’ అనే అంశంపై పార్టీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బాల్యానాయక్, మండల నాయకులు వెంకటయ్య, భాస్కర్, నిరంజన్, కోదండరాములు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం
వనపర్తి: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను జూన్ 2న జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 9.30లోపే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని సూచించారు. మండల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ పతాకావిష్కరణలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ఎం.నగేష్ పాల్గొన్నారు. హెల్ప్డెస్క్ ఏర్పాటు.. జిల్లాలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల సౌకర్యార్థం జూన్ 8న ఉదయం 10 నుంచి 9వ తేదీ మధ్యహ్నం రెండు వరకు హెల్ప్డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ పవార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలు, పరీక్షకు సంబంధించి మరేవైనా సందేహాలు ఉంటే హెల్ప్డెస్క్ టోల్ఫ్రీ నంబర్ 08545–233525 కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. కలెక్టర్ తేజస్ పవార్ -
క్రీడలతో మానసికోల్లాసం : డీవైఎస్ఓ
మదనాపురం: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని డీవైఎస్ఓ సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయనతో పాటు ఎస్జీఎఫ్ కార్యదర్శి సురేందర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని.. ఉత్సాహంగా ఉల్లాసంగా గడపాలని కోరారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వారి వెంట పీఈటీ ఎం.రామచంద్రమ్మ తదితరులు ఉన్నారు. జాతీయ క్రీడల్లో రాణించాలి.. ఆత్మకూర్: గ్రామీణప్రాంత క్రీడాకారులు జాతీయస్థాయి క్రీడల్లో రాణించాలని డీవైఎస్ఓ సుధీర్రెడ్డి, ఎస్జీఎఫ్ సురేంధర్రెడ్డి కోరారు. మంగళవారం పట్టణంలో కొనసాగుతున్న వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని వారు సందర్శించి కోచ్ ఖాదర్, క్రీడాకారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు, సీనియర్ క్రీడాకారులతో పాటు శిక్షణ పొందుతున్న క్రీడాకారులు పాల్గొన్నారు. -
No Headline
మిన్నంటిన రోదనలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన రాఘవేంద్రచారి, వెంకటేష్, మహేష్ పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు తరలిరావడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా కిటకిటలాడింది. వారి రోదనలతో ఆస్పత్రి పరిసర ప్రాంతాలు హృదయ విదారకంగా మారాయి. పరామర్శించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను చూసి మృతుల తల్లిదండ్రులు కాళ్లమీద పడి బోరున విలపించారు. దీంతో ఎమ్మెల్యే వారిని పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. ఆస్పత్రిలోనే మృతదేహాలకు పోస్టుమార్గం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ చెప్పారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. -
చిన్నపాటి నిర్లక్ష్యం.. భారీ మూల్యం
బస్సు, బైక్ ఢీకొని.. ముగ్గురు యువకుల దుర్మరణం ● ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం,అతివేగమే ప్రమాదానికి కారణం ● నారాయణపేట జిల్లా మక్తల్లోవిషాదం నింపిన ఘటన ● శోకసంద్రంలో కుటుంబాలు.. పరామర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రతిరోజు వారు కలిసి తిరుగుతూ.. కష్టసుఖాలను పంచుకునేవారు.. శుభకార్యాల్లో ఫొటోలు, వీడియోలు తీస్తూ జీవనం సాగించారు.. జీవితకాలం ఇలాగే సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారి.. కాటికి సాగనంపింది.. నిబంధనలను బేఖాతర్ చేస్తూ.. హెల్మెట్ లేకుండా ముగ్గురు కలిసి ఒకే బైక్పై అతివేగంగా వెళ్లి.. ఎదురుగా వచ్చిన బస్సును అదుపు తప్పి ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం మక్తల్ పట్టణంలో విషాదం నింపింది. హెల్మెట్ లేకపోవడం, మితిమీరిన వేగంతో వాహనం నడపడం వల్ల ఎంతటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. – మక్తల్ -
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం
పాన్గల్: బాధిత కుటుంబానికి అండగా ఉంటూ అన్నివిధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని మల్లాయిపల్లి మాజీ సర్పంచ్ జయకళ భర్త సీహెచ్ రామస్వామి గుండెపోటుతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి మంగళవారం గ్రామానికి చేరుకొని మృతదేహానికి పూలమాల వేసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడారు. రామస్వామి మృతి పార్టీకి తీరని లోటని.. దళిత సామాజికవర్గంలో మంచి నాయకుడిగా ఎదిగారన్నారు. ఆయన అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసిందని తెలిపారు. మంత్రి వెంట నాయకులు రవికుమార్, వెంకటేష్నాయుడు, గోవర్ధన్సాగర్, మధుసూదన్రెడ్డి, రాముయాదవ్, జయరాములుసాగర్, పుల్లారావు ఉన్నారు. 146 మంది గైర్హాజరు వనపర్తిటౌన్: జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 146 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ మద్దిలేటి తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షకు 2,636 మంది విద్యార్థులకుగాను 2,536 మంది హాజరుకాగా.. 100 మంది, అదేవిధంగా రెండో సంవత్సరం పరీక్షకు 840 మందికిగాను 794 మంది హాజరుకాగా.. 46 మంది గైర్హాజరయ్యారని వివరించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు అమరచింత: రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే చట్టరీత్యా చర్యలు తప్పవని ఏడీఏ దామోదర్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని పలు ఫర్టిలైజర్, ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాలు, రసాయన ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని, అన్నింటికి రసీదులు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జీలుగ విత్తనాల కొరత ఉందని, దీంతో జిల్లా రైతులు అనుకున్నంత త్వరగా అందించలేకపోయామన్నారు. జిల్లావ్యాప్తంగా 895 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు అవసరం ఉండగా.. 535 క్వింటాళ్లు సరఫరా చేశామని, ఇప్పటి వరకు 465 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు విక్రయించినట్లు చెప్పారు. ఆగ్రో సేవాకేంద్రాల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం పత్తి, కంది, ఆముదం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పక్క రాష్ట్రాల నుంచి జిల్లాకు నకిలీ పత్తి విత్తనాలు వస్తున్నాయని.. కొందరు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు విక్రయిస్తున్నారని, అలాంటి వారి సమాచారం ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఏఓ వినయ్ ఉన్నారు. 18 మంది డిబార్ మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు కొనసాగుతుండగా.. మంగళవారం ఒక్కరోజే 18 మంది విద్యార్థులు డిబార్ అయ్యారు. ఉదయం సెషన్లో సెమిస్టర్ 2కు సంబంధించి మొత్తం 12,882 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 12,024 మంది హాజరయ్యారు. 846 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 6వ సెమిస్టర్లో 8,415 మంది విద్యార్థులకు 8,085 మంది విద్యార్థులు హాజరయ్యారు. 324 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సెమిస్టర్–2లో 12 మంది మహబూబ్నగర్లోని ఎంవీఎస్, జడ్చర్ల, కొండనాగుల పరీక్ష కేంద్రాల్లో డిబార్ కాగా... మధ్యాహ్నం జరిగిన సరీక్షలో ఆరుగురు విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్ప డుతూ చిక్కారు. ఇందులో ఒక్క ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఎనిమిది మంది విద్యార్థులుడిబార్ అయినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రాజ్కుమార్ పేర్కొన్నారు. -
ఆస్తి నష్టం.. పన్ను భారం
దుకాణం లేకున్నా.. పన్ను వస్తుంది.. రహదారి విస్తరణలో దుకాణం పూర్తిగా తొలగించారు. ఆ సమయంలో పన్ను బకాయిలు మాఫీ చేయడంతో పాటు కొత్త నిర్మాణాలకు ఉచితంగా అనుమతులు ఇస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం కోల్పోయిన దుకాణానికి పన్ను చెల్లించాలంటూ మెస్సేజ్లు వస్తున్నాయి. ఇంటి పన్ను అధికారులు ఒత్తిడి చేయడంతో చెల్లించా. – పాండు, పాతబజార్, వనపర్తి చర్యలు తీసుకుంటాం.. రహదారి విస్తరణ బాధితులకు ఆస్తి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తామని అప్పటి పాలకులు హామీ ఇచ్చారని ప్రజలు చెబుతున్నారు. కానీ అది అధికారికంగా చెల్లదు. ప్రతి బకాయిదారు పన్ను చెల్లించి పుర అభివృద్ధికి పాటుపడాలి. క్షేత్రస్థాయి పరిస్థితికి అనుగుణంగా యజమానులు ఆన్లైన్లో వివరాలు సవరించుకోవాలి. కొన్నిచోట్ల కొళాయి కనెక్షన్లు ఏళ్లుగా వినియోగంలో లేకపోయినా బిల్ వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాస్తవ వివరాలతో ఉన్నతాధికారులకు లేఖ రాసి వారి నిర్ణయానికి అనుగుణంగా చర్యలు చేపడతాం. – ఎం.పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి ●‘జిల్లాకేంద్రంలో 2020 నుంచి 2023, సెప్టెంబర్ వరకు వివిధ మార్గాల్లో రహదారి విస్తరణ పనులు చేపట్టారు. అప్పట్లో పుర పెద్దలు, ప్రజాప్రతినిధులు ఆస్తులు కోల్పోయిన బాధితులకు ఆస్తి పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తామని.. కొత్త నిర్మాణాలకు ఉచితంగా అనుమతులిస్తామని ప్రకటించారు. పురపాలికలో, రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలకవర్గం ఉండటంతో ప్రజలంతా విశ్వసించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై పాలకులు దృష్టి సారించారు. పన్ను చెల్లించాలని పుర సిబ్బంది కోరగా.. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు తాము ఆస్తి పన్ను చెల్లించమని బాధితులు తెగేసి చెబుతుండటంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.’ వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా రామా థియేటర్, గాంధీచౌక్, చిట్యాల రోడ్, పాతబజార్ తదితర ప్రాంతాల్లో రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ఉండే అత్యధికులు ఆస్తి పన్ను చెల్లించడం లేదు. నాగవరం, పాన్గల్, కర్నూలు రోడ్లలోని రుణ, ఇతర అవసరాలున్న ఇంటి యజమానులు మాత్రమే పన్ను చెల్లిస్తుండగా మిగతా వారు చొరవ చూపడం లేదు. దీంతో సుమారు రూ. అర కోటి వరకు మున్సిపాలిటీ నష్టపోతుంది. సుమారు 1,500 వరకు.. రహదారి విస్తరణ జరిగిన మార్గాల్లో ఆస్తిపన్ను బకాయిల వసూలుకు చర్యలు చేపట్టాలని, రహదారి విస్తరణ చేపట్టే వరకు ఎంతమేర ఆస్తి పన్ను బకాయి ఉందో అంతమేర వసూలు చేయాలని, తర్వాత ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందుకు అనుగుణంగా వ్యవహరిద్దామని ఇటీవల పుర రెవెన్యూ అధికారుతో నిర్వహించిన సమీక్షలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. ఆయా మార్గాల్లో పూర్తిగా, పాక్షికంగా నష్టపోయిన ఆస్తుల వివరాల లెక్క ఇంకా తేల్చలేదు. సుమారు 1,500 వరకు ఉండవచ్చని అంచనా. ఇందులో ఒకటి, రెండు, మూడంతస్తుల భవనాలు ఉండగా.. ఇందులో ఎక్కువగా వ్యాపార సముదాయాలే ఉన్నాయి. ఆస్తి పన్ను బకాయిదారులకు నోటీసులు ఇవ్వాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. త్వరలోనే నోటీసులు అందించేందుకు పుర యంత్రాంగం సన్నద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఇదీ పరిస్థితి.. ఆస్తుల వివరాలు ఆన్లైన్లో నమోదైన తర్వాత అవి పూర్తిగా తొలగించినా, పాక్షికంగా తొలగించినా అప్పటి వరకు ఉన్న పన్ను చెల్లించి తిరిగి ఉన్న వివరాలు నమోదు చేస్తే అందుకు అనుగుణంగా కొత్తగా ఆస్తి పన్ను రూపొందిస్తారు. లేదంటే ఎప్పటిలాగే కొనసాగుతుంది. వీటిపై ప్రజలకు అవగాహన లేకపోవడం, క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి మార్పులు చేయకపోవడంతో ఆస్తి పన్ను ఎప్పటిలాగే వస్తుండటంతో యజమానులు ఇదేమి దుస్థితని తలలు పట్టుకుంటున్నారు. భవనాలు పూర్తిగా కోల్పోయినా, కొంతమేర కోల్పోయినా ఇప్పటి వరకు ఉన్న బకాయిలు చెల్లిస్తేనే సమస్య పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయోమయంలో రహదారి విస్తరణ బాధితులు పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించిన అప్పటి ప్రజాప్రతినిధులు బకాయిలు చెల్లించాల్సిందేనంటున్న పుర అధికారులు రూ. అర కోటిపైనే పెండింగ్.. నోటీసుల జారీకి ఉన్నతాధికారుల ఆదేశాలు -
అందరూ నిరుపేదలే..
రాఘవేంద్రచారి మక్తల్లో భ వాని ఫొటోస్టూడియో పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈయన తండ్రి శ్రీనివాస్చారి అనారోగ్యంతో బాధపడుతుండగా.. తల్లి సత్యమ్మ గతంలోనే మృతిచెందింది. రాఘవేంద్రచారికి భార్య చందన, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే వీడి యోగ్రాఫర్ వెంకటేష్ తల్లిదండ్రులు చిన్నప్పు డే మృతి చెందగా సోదరుడు రాములుతో కలిసి ఉంటున్నా డు. మక్తల్ మండలం పంచలింగాలకు చెందిన మహేష్ మక్తల్లో ఐటీఐ చదువుతున్నాడు. మహేష్ తల్లిదండ్రులు బుచ్చన్న, లలితమ్మ పదేళ్ల క్రితమే మక్తల్కు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మహే ష్ వీడియోగ్రఫీ నేర్చుకోవాలనే ఇష్టంతో వారితో కలిసి తిరుగుతున్నాడు. బుచ్చమ్మ, లలితమ్మ దంపతులకు ముగ్గురు సంతానం కాగా ఇద్దరు కూతుళ్లు, కుమారుడు మహేష్ ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో గుండెలవిసేలా రోదించారు. వెంకటేష్ (ఫైల్)మహేష్కుమార్ (ఫైల్) -
తెలంగాణ వైతాళికుడు సురవరం
వనపర్తి: కవులు, కళాకారులకు తెలంగాణ పుట్టినిల్లని.. 354 మంది కవుల రచనలతో గొల్కొండ కవుల సంచికను ప్రచురించిన తెలంగాణ వైతాళికుడు, వనపర్తి తొలి ఎమ్మెల్యే సురవరం ప్రతాపరెడ్డి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. మంగళవారం సురవరం జయంతిని పురస్కరించుకొని స్థానిక భగత్ సింగ్నగర్లోని సురవరం ప్రతాప్రెడ్డి పార్క్లో ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చని, తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పార్షీ, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులన్నారు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందారని గుర్తుచేశారు. నైజాం నిరంకుశ పాలనలో తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యం చేసేందుకు ఎంతగానో కృషి చేశారన్నారు. జీవితం చివరి దశలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన వనపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బి.లక్ష్మయ్య, పలుస రమేష్గౌడ్, గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, కురుమూర్తి యాదవ్, లక్ష్మీనారాయణ, నాగన్నయాదవ్, రవి, రవిప్రకాష్రెడ్డి, పరంజ్యోతి, నాగమ్మ, మహేశ్వర్రెడ్డి, బలరాం, జమీల్ తదితరులు పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నిరంజన్రెడ్డి, నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి -
No Headline
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ శివారులోని ఎల్లమ్మకుంటకు చెందిన ఫొటోగ్రాఫర్ రాఘవేంద్రచారి (30), వెంకటేష్(29), మహేష్కుమార్(21) వీడియో గ్రాఫర్గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో మక్తల్ మండలంలోని కాచ్వార్ గ్రామంలో ఓ ఇంట్లో శుభకార్యంలో ఫొటోలు తీసేందుకు మంగళవారం ఉదయం వెళ్లారు. తర్వాత కొద్దిసేపు విరామం దొరకడంతో మక్తల్కు వచ్చి.. తిరిగి మధ్యాహ్నం సమయంలో ముగ్గురు కలిసి ద్విచక్రవాహనంపై మళ్లీ బయలుదేరారు. ఈ క్రమంలో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండు గ్రామం సమీపంలోని అంతర్రాష్ట్ర రహదారి–167పై మహబూబ్నగర్ నుంచి రాయచూర్ వెళ్తున్న కర్ణాటక బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటేష్, రాఘవేంద్రచారి అక్కడికక్కడే మృతిచెందగా.. మహేష్ కాలు విరిగి తలకు తీవ్రగాయాలు కావడంతో 108లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. -
భూసార పరీక్షలేవి..?
జిల్లాకేంద్రంలో మూతబడిన కేంద్రాలు వనపర్తి: భూసార పరిరక్షణపై నిర్లక్ష్యం ఆవహించింది. మూడేళ్లుగా వ్యవసాయశాఖ అధికారులు అన్నదాతలకు భూమిలో లోపించిన సూక్ష్మధాతువులపై అవగాహన కల్పించడం లేదు. శాసీ్త్రయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామంటూనే. .రైతులను మూస ధోరణిలోకి నెట్టేశారనేందుకు మూడేళ్లుగా నిర్వహించని భూసార పరీక్షలే నిదర్శనంగా చెప్పవచ్చు. గతంలో ఏటా వానాకాలం సీజన్కు ముందు గ్రామాల్లో రైతు చైతన్య యాత్రల పేరుతో భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువుల ఎంపిక, వినియోగంపై వ్యవసాయశాఖ అధికారులు రైతుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించేవారు. కొంతకాలంగా సాగునీటి లభ్యత పెంచామంటూ.. భూమిలో లోపించే పోషకాలు, ఎరువుల రూపంలో అందించాల్సిన ఆర్గానిక్ కార్బన్, లవణాలు, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి వాటిపై దృష్టి సారించకపోవటం గమనార్హం. జిల్లాలో 2.63 లక్షల ఎకరాలు.. జిల్లాలో మొత్తం 2.63 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా.. సగానికిపైగా వరి సాగవుతోంది. పంటల మార్పిడి లేకపోవడంతో రోజురోజుకు భూమిలో సారం తగ్గుతోంది. భూమి ఆరోగ్యంపై రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడంతో రసాయన ఎరువులతో దిగుబడి పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారే తప్పా.. భవిష్యత్ తరాలకు సారవంతమైన భూమిని అందించలేకపోతున్నామన్న విషయాన్ని అన్నదాతలు గుర్తించలేకపోతున్నట్లు వ్యవసాయశాఖ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదించాల్సిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష ధోరణి ప్రదర్శించడంతో అత్యంత ముఖ్యమైన భూసార పరీక్షలు అటకెక్కాయి. ప్రారంభానికే పరిమితం.. జిల్లాకేంద్రంలోని నాగవరం శివారులో ఉన్న వ్యవసాయ ఏడీఏ కార్యాలయం సమీపంలో భూసార పరీక్ష కేంద్రాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్షలు నిర్వహించేందుకు కావాల్సిన పరికరాలు, సామగ్రిని సమకూర్చలేదు. దీంతో ఈ కేంద్రం ప్రారంభోత్సవానికే పరిమితమైంది. 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రానికి మూడేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మూతబడింది. ఈ కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన టెక్నికల్ ఏఓను భూత్పూరు మండలానికి డిప్యూటేషన్పై పంపించగా.. ఏఈఓ, ఇతర సిబ్బందిని స్థానికంగా ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. మూడేళ్లుగా జిల్లాకేంద్రంలోని కేంద్రం తాళం వేసి దర్శనమిస్తోంది. బడ్జెట్ లేకనే మూతబడ్డాయి.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మూడేళ్లుగా జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించడం లేదు. నిజానికి వ్యవసాయంలో భూమి ఆరోగ్యం సంరక్షించుకవడం చాలా ముఖ్యం. ఏటా వానాకాలానికి ముందు భూమిలో సారం ఎంతమేర ఉందనే విషయాన్ని పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా పచ్చిరొట్ట, సేంద్రియ ఎరువులు పొలంలో వేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా భూమిలో లోపించిన పోషకాలను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించడం లేదు. భూమి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే.. నేలలు చవుడుగా మారి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. – డి.చంద్రశేఖర్, ఇన్చార్జ్ డీఏఓ, వనపర్తి నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు.. మునుపటిలా వ్యవసాయశాఖ అధికారులు సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఎరువులు, విత్తనాల ఎంపిక, వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జిల్లాలోని 14 మండలాల్లో ఆయా మండల వ్యవసాయశాఖ అధికారులు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిధుల విడుదలపై నిర్లక్ష్యం? డిప్యూటేషన్పై సిబ్బంది విధులు మూస పద్ధతిలోనే ఎరువుల వినియోగం నేటి నుంచి గ్రామాల్లో రైతు సదస్సులు -
బీజేపీపై తిరుగుబాటు తప్పదు : సీపీఐ (ఎంఎల్)
అమరచింత: ఐకమత్యంతో ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టిస్తూ బీజేపీ రాజకీయం చేస్తోందని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు హన్మేష్ ఆరోపించారు. మండల కేంద్రంలోని మార్క్స్ భవనంలో మాస్లైన్ ఉమ్మడి జిల్లా రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు సమావేశం ఆదివారం జరగగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 200 ఏళ్లు పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం, మోఘలాయిలు, తురుష్కులు, నవాబుల కన్నా పదేళ్ల బీజేపీ పాలన మరింత దారుణంగా ఉందన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమంటూనే పేదలకు సంక్షేమ ఫలాలను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరాచకాలు ఎక్కువయ్యాయని.. వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మాస్లైన్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాంచందర్, ఇఫ్టూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యం, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరుణ్కుమార్, హన్మంతు, సాంబశివుడు, ప్రసాద్, ఆర్ఆర్ మన్యం, సత్యం, గౌస్, వెంకటేష్, గణేష్, దేవదానం, కొండారెడ్డి, శివారెడ్డి, చంద్రన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు. -
టీ–20 టోర్నీలో జిల్లా జట్టుకు రెండో విజయం
మహబూబ్నగర్ క్రీడలు: హైదరాబాద్లో హెచ్సీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్ డిస్టిక్ట్ టీ–20 టోర్నమెంట్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జట్టు తన రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆదివారం జింఖానా గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో జిల్లా జట్టు 41 పరుగుల తేడాతో నిజామాబాద్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో అబ్దుల్ రాపే అర్ధ సెంచరీతో రాణించాడు. 44 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్తో 56 పరుగులు చేశాడు. ఇతర క్రీడాకారులు డేవిడ్ క్రిపాల్ 46, జయసింహ 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నిజామాబాద్ జట్టు 16.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. జిల్లా బౌలర్లు అరుణ్కుమార్ 3, శ్రీకాంత్యాదవ్ 2, జయసింహ 2 వికెట్లు తీశారు. టోర్నీలో వరుసగా రెండు విజయాలతో జిల్లా జట్టు సెమీఫైనల్కు చేరుకుంది. ఈనెల 28న కరీంనగర్ జట్టుతో జిల్లా జట్టు సెమీఫైనల్లో తలపడనుంది. జిల్లా జట్టు విజయంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, కోచ్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేశారు. -
స్పోర్ట్స్ స్కూల్కు వేళాయె
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో ప్రస్తుత 2024–25 విద్యా సంవత్సరానికి 4వ తరగతిలో ప్రవేశాలకు త్వరలో జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్స్ జరగనున్నాయి. మేడ్చల్ జిల్లాలోని హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్లో స్పోర్ట్స్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 4వ తరగతికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ ఎంపికల్లో పాల్గొనే విద్యార్థులకు కొన్ని శారీరక, సామర్థ్యానికి సంబంధించిన వాటితోపాటు పలు వాటిలో టెస్టులు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎక్కువ స్కోర్ సాధిస్తారో వారికి 4వ తరగతిలో ప్రవేశం లభిస్తుంది. రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ స్కూళ్లు ఉండగా ప్రతి స్కూల్లో 4వ తరగతిలో 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి పోటీలకు ఇలా.. జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు తమ వయస్సు ధ్రువీకరణ పత్రాలు పాఠశాల ప్రధానోపాధ్యాయునితోపాటు మున్సిపాలిటీ, పంచాయతీకి సంబంధించిన వయస్సు ధ్రువీకరణ పత్రాలతో రావాలి. అలాగే రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, 3వ తరగతి పాస్ సర్టిఫికెట్తో జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరుకావాలి. 10 పాయింట్లు స్కోర్ సాధిస్తే.. జిల్లా, రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ జూన్ నుంచి ఆగస్టు వరకు నిర్వహించనున్నారు. శారీరక సామర్థ్య పరీక్షల్లో కనీసం 10 పాయింట్లు స్కోర్ సాధిస్తే రాష్ట్రస్థాయికి పంపిస్తారు. రాష్ట్రస్థాయిలో ఎవరైతే ఎంపికై తే స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు. క్రీడాకారుడిని అవుతా స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికై పెద్దయ్యాక క్రీడాకారుడిని అవుతాను. ఇదే లక్ష్యంగా రెండు నెలల నుంచి స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్న. మా నాన్న వెంట ప్రతి రోజు స్టేడియానికి వస్తున్నా. ఎలాగైనా ఈసారి స్పోర్ట్స్ స్కూల్లో సీటు సాధిస్తాను. – ఎల్విన్ స్టీఫెన్, మహబూబ్నగర్ శిక్షణ బాగుంది.. ఈ ఏడాది స్పోర్ట్స్ స్కూల్కు ఎంపికవుతానన్న నమ్మకం ఉంది. జిల్లాస్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్లో పాల్గొనాలని ప్రతిరోజు స్టేడియంలో ప్రాక్టిస్ చేస్తున్నా. సునీల్ సార్ చాలా మంచిగా శిక్షణ ఇస్తున్నారు. – సాయి ఆరాధ్య, మహబూబ్నగర్ ● సద్వినియోగం చేసుకోవాలి.. ఈ ఏడాది స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాల కోసం మెయిన్ స్టేడియంలో చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. చిన్నారులకు జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్స్లో నిర్వహించే శారీరక దేహదారుఢ్య అంశాలపై ప్రత్యేక శిక్షణ అందజేస్తున్నారు. చిన్నారులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. – సునీల్కుమార్, అథ్లెటిక్స్ కోచ్, మహబూబ్నగర్ హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్లో క్రీడా పాఠశాలలు ప్రతి పాఠశాలలో 40 మంది చొప్పున చేరిక 4వ తరగతిలో మాత్రమే ప్రవేశానికి అవకాశం జూన్ నుంచి ఆగస్టు వరకు జిల్లా, రాష్ట్రస్థాయి ఎంపికలు చిన్నారులకు ప్రత్యేక శిక్షణ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం కొంతమంది చిన్నారులు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. స్పోర్ట్స్ స్కూళ్లలో నిర్వహించే ఫిట్నెస్ అంశాలపై ఉదయం, సాయంత్రం వేళల్లో అథ్లెటిక్స్ కోచ్ సునీల్కుమార్ శిక్షణ ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువ మంది స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలు పొందుతున్నారు. స్పోర్ట్స్ స్కూళ్లకు విద్యార్థులను పంపించాలనే ఆసక్తి తల్లిదండ్రుల్లో కూడా వస్తోంది. -
కొత్త చట్టాలపై అవగాహన తప్పనిసరి
వనపర్తి: వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న కొత్త క్రిమినల్ చట్టాలపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రక్షిత కె.మూర్తి అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీచేసిన ప్రకటన ప్రకారం.. భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 172 చట్టాల స్థానంలో కొత్త చట్టాలను రూపొందించి అమలులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. సత్వర న్యాయం, న్యాయవ్యవస్థ బలోపేతానికి మూడు చట్టాల స్థానంలో కొత్తవి అమలులోకి తీసుకొచ్చేందుకు 2023, డిసెంబర్ 21న పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసిందని, 2023, డిసెంబర్ 25న కొత్త చట్టాల అమలుకు రాష్ట్రపతి ద్రౌపతిముర్ము ఆమోదముద్ర వేసినట్లు గుర్తుచేశారు. మారిన కాలానుగుణంగా చట్టాలను అప్డేట్ చేయటమే ముఖ్య ఉద్దేశని తెలిపారు. కొత్త చట్టాలపై డీఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు అందరికి శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. నూతన చట్టాలపై హైదరాబాద్లో శిక్షణ పొందిన ఎస్ఐ వెంకటస్వామి, ఏఎస్ఐ బాషా విడతల వారీగా పోలీస్శాఖలోని ప్రతి ఒక్కరికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎస్పీ రక్షిత కె.మూర్తి -
అకాల మృత్యువు
వివరాలు 9లో uవేర్వేరు చోట్ల ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం ● రేకుల షెడ్డు కూలి నలుగురు, పిడుగు పడి ఇద్దరు, రాయి తగిలి మరొకరు.. ● తండ్రులకు సహాయంగా వెళ్లి.. అసువులుబాసిన ఓ బాలిక, బాలుడు ● మరో నలుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం ● నాగర్కర్నూల్ జిల్లాలో పెనువిషాదం నింపిన గాలివాన బీభత్సం దైవదర్శనం చేసుకొని వస్తుండగా.. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నీలపల్లికి చెందిన వేణుగోపాల్(38) శనివారం తన క్రూయిజర్ వాహనంలో 12 మంది ప్రయాణికులతో శ్రీశైలం వెళ్లి.. దైవదర్శనం అనంతరం స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని మంతటి స్టేజీ వద్ద ఈదురుగాలుల ధాటికి ఓ షెడ్ రేకులు రాయితో సహా వాహనంపై పడటంతో డ్రైవర్ వేణుగోపాల్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనంలో ఉన్న మిగతా ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా మార్చురీకి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. వారంతా బడుగు జీవులు.. నిత్యం రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితులు.. ఉన్నంతలో తమ పనులు చేసుకుంటూ కుటుంబాలతో కలిసి జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలోనే రోజు మాదిరిగానే ఆదివారం సైతం వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ, వీరిని విధి చిన్నచూపు చూసింది.. ఈదురుగాలులు, అకాల వర్షం రూపంలో మృత్యువు కబళించింది. రేకుల షెడ్డు కూలిపడి కూలీ పనులకు వచ్చిన తండ్రీకూతురుతోపాటు మరో ఇద్దరు, పిడుగు పడి తండ్రితో కలిసి మేకలను మేపడానికి వెళ్లిన ఓ బాలుడు, పొలంలో పనులు చేసుకుంటున్న రైతు, ఈదురుగాలులకు రాయి తగిలి వాహనం నడుపుతున్న ఓ డ్రైవర్.. ఇలా వేర్వేరు ఘటనల్లో ఏడుగురు దుర్మరణం పాలైన విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. – తాడూరు/ నాగర్కర్నూల్ క్రైం/ బిజినేపల్లి/ తెలకపల్లి/ పెద్దకొత్తపల్లి రేకుల షెడ్డు కూలిపడి.. ఈదురుగాలులకు రేకుల షెడ్డు కూలిపడి నలుగురు దుర్మరణం చెందిన సంఘటన తాడూరు, ముష్టిపల్లి గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో తాడూరుకు చెందిన మల్లేష్ రేకుల షెడ్డు నిర్మాణ పనుల కోసం వచ్చాడు. అతని వెంట కూతురు అనూష సైతం రాగా రేకుల షెడ్డు మీదపడటంతో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. మల్లేష్కు భార్య పార్వతమ్మ, మరో కూతురు ఉన్నారు. అలాగే అడ్డా మీది కూలీలుగా వచ్చిన ముష్టిపల్లి రాములు, చెన్నమ్మలు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. వీరు ముష్టిపల్లిలో ఉపాధి లేక పదేళ్ల క్రితం నాగర్కర్నూల్కు వచ్చి అడ్డా కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. చెన్నమ్మకు భర్త రాముడు, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా.. ఒక కుమారుడు. చెన్నమ్మ మృతితో వీరంతా రోడ్డునపడ్డారు. అలాగే రాముడుకు భార్య జ్యోతితోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామ మాజీ సర్పంచ్ నాగమ్మ, ఎంపీటీసీ సభ్యుడు రాజా కోరారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కనకయ్య తెలిపారు. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించామని చెప్పారు. పిడుగుపాటుతో మరో ఇద్దరు.. పిడుగుపాటుతో రైతుతోపాటు ఓ బాలుడు మృతిచెందాడు. తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన రైతు వెంకటయ్య(52) తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా.. పిడుగుపాటుకు గురయ్యాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రికి సహాయంగా వచ్చి.. తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన దండు లక్ష్మణ్ (12) తన తండ్రి వెంకటయ్యతో పాటు మేకలను మేపడానికి వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో సమీపంలో ఉన్న చెట్టు కిందకు వెళ్లాలని తండ్రి సూచించాడు. లక్ష్మణ్ చెట్టు కిందకు వెళ్లిన కొద్దిసేపటికే పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. తన కళ్లెదుటే కొడుకు చనిపోవడంతో తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోధించారు. మృతుడు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. -
త్వరలోనే ఆయిల్ మిల్లు ప్రారంభం
ఎర్రవల్లి చౌరస్తా: ప్రభుత్వం త్వరలోనే విజయవర్ధి ని ఆయిల్ మిల్లును ప్రారంభించి నడిగడ్డ రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆయిల్ ఫెడ్ అధికారులతో కలిసి బీచుపల్లి ఆయిల్ మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్ష మేరకు విజయవర్ధిని ఆయిల్ మిల్లులో పురాతన సామగ్రిని తొలగించి రూ.150 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యంత్రాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ ఆయిల్ మిల్లుకు 10 వేల ఎకరాల్లో రైతులు పండించిన పంటను ఆయిల్గా మార్చే సామర్థ్యం ఉందన్నారు. ఇప్పటికే నడిగడ్డలో సుమారు 6 వేల ఎకరాల్లో రైతులు పంట సాగుచేస్తున్నారని, నాగర్కర్నూల్, వనపర్తి తదితర ప్రాంతాల్లో రైతులు పండించిన ఆయిల్పాం గెలలను సైతం ఇక్కడికే తీసుకువస్తామన్నారు. దీంతో ఆయిల్పాం సాగు చేసిన రైతులు ప్రతిఏటా రూ.లక్షల దిగుబడి తీసి అధిక ఆదాయం పొందుతారని చెప్పారు. కార్యక్రమంలో పెబ్బేర్ మార్కెట్ యార్డు చైర్మన్ బుచ్చారెడ్డి, శ్రీరంగాపూర్ జెడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్, మండలాధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, ఆయిల్ఫెడ్, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన అంజన్న బ్రహ్మోత్సవాలు
ఎర్రవల్లిచౌరస్తా: ఎర్రవల్లి మండల పరిదిలోని బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మాత్సవాలు శనివారంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఉదయం సన్నాయి వాయిద్యాల నడుమ ఆంజనేయస్వామిని ఆలయం నుంచి పల్లకిలో కృష్ణానది వరకు ఊరేగించారు. అర్చకులు కృష్ణానదిలో వేద మంత్రాల నడుమ బీచుపల్లి రాయుడికి అమృతస్నానాన్ని వైభవంగా చేయించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఉత్సవాలను తిలకించి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు మట్టి కుండల్లో దాసంగాలు.. నైవేద్యాలను వండి ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ తీఓ రామన్గౌడ్, పాలక మండలి సభ్యులు తదితరులు ఉన్నారు. చివరి రోజు వైభవంగా కృష్ణానదిలో స్వామివారి అవభృత స్నానం
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement