-
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం
నల్లగొండ: బ్యాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం 12 జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి సమీపంలో ఎఫ్సీఐ గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలలో భద్రపరిచారు. ఈ స్ట్రాంగ్రూంలను కలెక్టర్తో పాటు ఎన్నికల సంఘం పరిశీలకుడు రాహుల్ బొజ్జా, ఎస్పీ చందనాదీప్తి, రాజకీయ పార్టీల ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోదాం పూర్తిగా స్థానిక పోలీసుతో పాటు సీఆర్పీఎఫ్ భద్రతలో ఉందన్నారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్రూంలలో ఉంచి ఎన్నికల పరిశీలకుల సమక్షంలో సీల్ వేసినట్లు తెలిపారు. వారి వెంట కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డీఎఫ్ఓ రాజశేఖర్, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ మురళి, అధికారులు భూమన్న, రమేష్, రాజకీయ పార్టీల నాయకులు నాగం వర్షిత్రెడ్డి, తీన్మార్ మల్లన్న తదితరులు ఉన్నారు. సహకరించిన వారికి కృతజ్ఞతలు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించిన ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్, రెవెన్యూ సిబ్బంది, రాజకీయ పార్టీల అభ్యర్థులు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన -
అధిక సిజేరియన్లపై ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరా
భువనగిరి: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణులకు అధిక సిజేరియన్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే అధిక సిజేరియన్ ప్రసవాలు యాదాద్రి జిల్లాలోనే చేస్తున్నట్లుగా వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. సుమారు 85 శాతం సిజేరియన్ ప్రసవాలతో రాష్ట్రంలో ముందు వరుసలో ఉంది. దీంతో సిజేరియన్ ఎక్కువ సంఖ్యలో చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడంతో పాటు సిజేరియన్లు తగ్గించి సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడం కోసం శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారులు ప్రత్యేక బృందం ఏర్పడి ఈ నెల మొదటి వారం నుంచి ప్రైవేట్ ఆస్పత్రులో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ఇటీవలే ముగిసింది. 16 ఆస్పత్రులకు నోటీసులు జారీ జిల్లాలో సుమారు 150 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో ప్రసవాలు నిర్వహించే ఆస్పతులు సుమారు 20 నుంచి 30 వరకు ఉన్నాయి. ఆయా ఆస్పత్రులు ధనార్జణే ధ్యేయంగా సాధారణ ప్రసవాల కంటే ఎక్కువగా సిజేరియన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో గత ఫిబ్రవరి నెలలో జిల్లా రాష్ట్రంలో 85 శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ తేల్చింది. మార్చి, ఏప్రిల్ నెలలో ఈ శాతం 83కు చేరుకుంది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ముగ్గురు వైద్య అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఈ నెలలో స్పెషల్ డ్రైవ్ చేయడం ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా భువనగిరి, రామన్నపేట, చౌటుప్పల్, వలిగొండ, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మలరామారం ప్రాంతాల్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యబృందం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సిజేరియన్ల వివరాలు, రికార్డులు, కేస్ షీట్లు, స్కానింగ్ రిపోర్టులను పరిశీలించారు. దీంతో ఒక్కో ఆస్పత్రిలో 10 ప్రసవాలకు 8 సిజేరియన్ చేసినట్లుగా గుర్తించారు. దీంతో పాటు మరో ఆస్పత్రిలో 100 శాతం సిజేరియన్ ప్రసవాలు చేసినట్లు గుర్తించారు. సరియైన కారణాలు లేకుండా ఎక్కువగా సిజేరియన్కు ప్రాధాన్యత ఇవ్వడంతో దానికి గల సమాధానాలు ఇవ్వాలని మొత్తం 16 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. దీంతో కొన్ని ఆస్పత్రుల యజమానులు అధికారులకు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అయితే పరిమితికి మించి సిజేరియన్ ప్రసవాలు చేసిన ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిపై చర్యలు తీసుకుంటారా లేదా అనుమానాలు రేకెత్తుతున్నాయి. వచ్చే నెలలో మళ్లీ తనిఖీలు ఈ నెలలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యాధికారుల బృందంతో తనిఖీలు ప్రారంభించాం. సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా చేస్తున్న 16 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశాం. వచ్చే నెలలో మళ్లీ తనిఖీలు చేస్తాం. సిజేరియన్ ప్రసవాల సంఖ్య తగ్గించని ఆస్పత్రులను సీజ్ చేయడం లేదా జరిమానా విధించం లాంటి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వై.పాపారావు, డీఎంహెచ్ఓ ఫ ముగిసిన ఆరోగ్య శాఖ స్పెషల్ డ్రైవ్ ఫ 16 ఆస్పత్రులకు నోటీసులు జారీ ఫ చర్యలపై సర్వత్రా అనుమానాలు -
టిప్పర్ బీభత్సం
త్రిపురారం: మిర్యాలగూడ నుంచి త్రిపురారం మండలంలోని ముకుందాపురం వైపు మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఐరన్ గ్రిల్స్ను ఢీకొట్టి ట్రాన్స్ఫార్మర్పై బోల్తా పడింది. దీంతో రైతులు వ్యవసాయ అవసరాల నిమ్తితం ఏర్పాటు చేసుకున్న రెండు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమయ్యాయి. అతివేగంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలో గత కొన్నిరోజులు మట్టి లోడు టిప్పర్లు రాత్రివేళ సైతం తిరుగుతున్నాయని, డైవర్ల నిద్ర మత్తు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొందరు టిప్పర్ డ్రైవర్లు మద్యం సేవించి టిప్పర్లు నడుపుతున్నట్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు అర్థరాత్రి వేళ టిప్పర్లలో మట్టి తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50వేల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు మండల విద్యుత్ ఏఈ రవీందర్రెడ్డి తెలిపారు. రెండు స్తంభాలు పూర్తిగా విరిగిపోగా.. ట్రాన్స్ఫార్మర్ పాక్షికంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని త్రిపురారం ఎస్ఐ వీరశేఖర్ తెలిపారు. ఫ అతివేగంగా ఢీకొట్టడంతో విరిగిన విద్యుత్ స్తంభాలు ఫ ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్, రోడ్డు పక్కన గ్రిల్స్ -
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
లోక్సభ నియోజకవర్గాల ఓట్ల కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సూచించారు. మంగళవారం కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కించాలన్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలు రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించే సమయంలో తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు బెన్ షాలోమ్, గంగాధర్, భువనగిరి ఆర్డీఓ అమరేందర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని మోదీ వ్యాఖ్యలు బాధాకరం
భువనగిరి టౌన్: ప్రజలను తప్పుదోవ పట్టించేలా, విపక్షాలను విమర్శించేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన పార్టీ జిల్లా విసృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ నిజమైన చరిత్రను కనుమరుగు చేసి అవాస్తవాలను చరిత్రగా పేర్కొంటూ దేశ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దేశ ప్రధానిగా ఉండి మతాన్ని మతోన్మాదాన్ని ప్రేరేపించే విధంగా ఉపన్యాసాలు చేసి ప్రజలను రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ మోదీ పాలన సాగిస్తున్నారని, తొమ్మిదేళ్ల పాలనలో రైతులు, కూలీలు, యువజనులు, విద్యార్థులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. కార్మిక చట్టాలను కాలరాయడం, రైతులను పొట్టగొట్టి నల్లచట్టాలు తీసుకురావడం, ఆకలి సూచీలో ఉన్నత స్థాయిలో నిలబెట్టడం, నిరుద్యోగాన్ని పెంచి పోషించడం, పేదరికం రోజురోజుకు పెంచడం, ధరల భారాన్ని అదుపు చేయలేకపోవడం బీజేపీ పాలనలోనే సాధ్యమైందన్నారు. అనంతరం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎక్కవ సంఖ్యలో సర్పంచ్ స్థానాలు కై వసం చేసుకునే విధంగా పనిచేయాలన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శులు సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, జెల్లెల పెంటయ్య, బబ్బూరి పోశెట్టి, బొడ్డుపల్లి వెంకటేష్, బొల్లు యాదగిరి, గంగదేవి సైదులు, పగిల్ల లింగారెడ్డి, దోడ యాదిరెడ్డి, గుంటోజు శ్రీనివాస్చారి, గడ్డం వెంకటేష్, వనం ఉపేందర్, గుండు వెంకటనర్సు, దూపటి వెంకటేష్, గాడి శ్రీనివాస్, పోతరాజు జహంగీర్, వేముల భిక్షం, పెద్దులు, నాయకులు పాల్గొన్నారు. ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీరయ్య -
జూన్ 3 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
భువనగిరి: వచ్చే జూన్ 3 నుంచి 11 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు డీఈఓ కె.నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్నాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షల కోసం 3 కేంద్రాలు కేటాయించి అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. మొత్తం 1,070 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాన్నుటుతెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించే ప్రైవేట్ స్కూళ్లపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ కె.నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కొన్ని చోట్ల వేసవి సెలవులో తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోచంపల్లిలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్, గౌతమి మోడల్ స్కూళ్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఎక్కడైనా తరగతులు నిర్వహిస్తున్నట్లయితే వెంటనే నిలిపివేయాలని లేని పక్షంలో అపరాధరు సుముతో పాటు సీజ్ చేస్తామని చెప్పారు. డయేరియాపై అవగాహన తప్పనిసరి బొమ్మలరామారం: డయేరియా నియత్రణపై ప్రజలందరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ శిల్పిని అన్నారు. మండలంలోని రామలింగంపల్లి ఆరోగ్య సబ్ సెంటర్ను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భగా మహిళలకు డయేరియా నియంత్రణ, రుతుక్రమ పరిశుభ్రతలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమలత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మళ్లీ పెరిగిన ఎండలు భువనగిరి టౌన్: ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. వారం క్రితం చిరుజల్లులతోపాటు మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. మళ్లీ రెండు రోజుల నుంచి భానుడి భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాలులు వీస్తున్నాయి. తీవ్రమైన ఎండకు తోడు ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు మంగళవారం అత్యధికంగా వలిగొండ మండల కేంద్రంలో 43.2 డిగ్రీలు, యాదగిరిగుట్ట 42.1, ఆలేరు మండలం కొలనుపాక 40.8, భువనగిరి మండలం నందనం 40.7, అడ్డగూడూరు 40.6, మిగతా మండలాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని జిల్లా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మట్టపల్లిలో గరుడవాహన సేవ మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు వేదమంత్రాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిత్యహోమం పూర్తిగావించి శ్రీస్వామి అమ్మవార్లను నూతన పట్టు వస్త్రాలతో వధూవరులుగా అందంగా ముస్తాబుచేసి ఎదుర్కోలు మహోత్స సంవాదం రక్తిగట్టించారు. అనంతరం మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామికి తమలపాకులతో విశేష పూజలు చేశారు. శ్రీగరుడ ఆళ్వార్కు తులసీదళాలతో అర్చనలు గావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ నవీన్కుమార్, మహదేవశర్మ, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
No Headline
సాక్షి, యాదాద్రి: భువనగిరి లోక్సభ స్థానం ఓట్ల లెక్కింపు విధులకు హాజరయ్యే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జూన్ 4న స్థానిక ఆరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల కౌంటింగ్ పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్లో ఉదయం తుంగతుర్తి, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు, మధ్యాహ్నం భువనగిరి, ఆలేరు, నకిరేకల్, జనగాం అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నిర్వహించిన శిక్షణకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. జూన్ 2న రెండో విడత శిక్షణ ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో అన్ని వసతులు కల్పించామని, కౌంటింగ్ సిబ్బంది ఉదయం 6గంటలకు తమకు కేటాయించిన టేబుళ్ల వద్ద సిద్ధంగా ఉండాలని, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎం యంత్రాల సీల్ తీయాలన్నారు. పోలైన ఓట్లను అభ్యర్థుల వారీగా ప్రదర్శించాలని, ఓట్ల వివరాలను సరిగా నమోదు చేయాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కె.గంగాధర్, మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథరెడ్డి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, డీఈఓ కె.నారాయణరెడ్డి ఉన్నారు. ‘పది’ సప్లిమెంటరీకి ఏర్పాట్లు చేయాలి పదో తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్ని శాఖల జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే ఆదేశించారు. పదో తరగతి పరీక్ష నిర్వహణలో భాగంగా అధికారులతో మంగళవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 3 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. వేసవి దృష్ట్యా విద్యార్థుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు పరీక్షల సమయానుకూలంగా వసతులు, సౌకర్యాలు కల్పించాలని, ఆర్టీసీ, విద్యుత్, వైద్య ఆరోగ్య, పోలీస్, విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. డీఈఓ నారాయణరెడ్డి మాట్లాడుతూ 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లాలో మొత్తం 1,070 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘అమ్మ హస్తం’పై ఆశలు
రామన్నపేట, భువనగిరి టౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అమ్మహస్తం పథకంపై పేద ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే గతంలో అమలైన అమ్మహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. ఈనెల 16న అధికారులతో జరిపిన చర్చల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకుల సంఖ్య పెంచుతామని ప్రకటించారు. అయితే 2014కంటే ముందు వరకు అప్పటికాంగ్రెస్ ప్రభుత్వం అమ్మహస్తం పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు మీద 8రకాల సరుకులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. 2.14లక్షల కుటుంబాలకు మేలు రాష్ట్ర ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని అమలు చేస్తే జిల్లాలోని 2.14లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుంది. జిల్లాలో 2,00,297 ఆహార భద్రతాకార్డులు, 13,706 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ఆహారభద్రతా కార్డుల్లో 6,30,391మంది, అంత్యోదయ కార్డుల్లో 36,941మంది లబ్ధిదారులు నమోదై ఉన్నారు. 515 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. కార్డుదారులకు ప్రస్తుతం నెలకు 4262.056 మెట్రిక్ టన్నుల బియ్యం, 13.706 మెట్రిక్టన్నుల చక్కెర, 36కిలో లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. అయితే పదేళ్ల క్రితం వరకు ప్రభుత్వం రేషన్షాపుల ద్వారా ఎనిమిది రకాల సరుకులను పంపిణీ చేసేది. అప్పట్లో రూ.185లకే అరకిలో చక్కెర, కిలో కందిపప్పు, రెండుకిలోల గోధుమలు, గోధుమ పిండి, పసుపు, ఉప్పు వంటి ఎనిమిది రకాల సరుకులు అందేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం యూనిట్ ఒక్కంటికి 6 కిలోల బియ్యం, అంత్యోదయ కార్డులు ఉన్నవారికి చక్కెరను మాత్రమే ఇస్తూ గతంలో పంపిణీ చేసిన ఎనిమిది రకాల సరుకులపై కోత విధించారు. దీంతో ఆయా సరుకుల కొనుగోలుకు నెలకు ఒక్కో కుటుంబం రూ.500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మహస్తం పథకం అమలులోకి వస్తే పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. రేషన్ దుకాణాలకు పూర్వవైభవం ప్రస్తుతం బియ్యం పంపిణీకి మాత్రమై పరిమితమైన రేషన్ దుకాణాలకు అమ్మహస్తం పథకం అమలులోకి వస్తే పూర్వవైభవం వస్తుంది. డీలర్లకు కూడా కమీషన్ పెరుగుతుంది. దీంతో వారికి షాపుల అద్దె చెల్లింపులకు పడే ఆర్థిక ఇబ్బందులు తొలగనున్నాయి. ఫ రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకుల సంఖ్య పెంపునకు ప్రభుత్వం యోచన ఫ ఇటీవల అధికారులతో జరిగిన చర్చల్లో సీఎం ప్రకటన ఫ ఆనందంలో రేషన్ కార్డుదారులు -
కోదాడ పట్టణంలో నకిలీ డాక్టర్!
కోదాడ: కోదాడలో కొంత కాలంగా ఓ ప్రైవేట్ వైద్యశాలను నిర్వహిస్తున్న వైద్యుడి వైద్యడిగ్రీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ జిల్లా వైద్యాధికారి కోదాడ పట్టణ పోలీసులకు పది రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కాగా ఫిర్యాదు చేసిన విషయాన్ని జిల్లా వైద్యశాఖ అధికారులు బయటకు చెప్పకపోవడం, దీనిపై ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం కోదాడలోని హుజూర్నగర్ రోడ్డులో ఓ ప్రైవేట్ వైద్యశాలను నిర్వహిస్తున్న వైద్యుడిపై రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు వెల్లడంతో 20 రోజుల క్రితం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేసి సదరు వైద్యశాలను సీజ్ చేశారు. ఆ వైద్యుడు తన బోర్డుపై తప్పుడు డిగ్రీలు రాసుకున్నాడని అందుకే సీజ్ చేశామని నాడు అధికారులు చెప్పారు. దీంతో పాటు ఇతర దేశాల్లో చదివి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) స్క్రీనింగ్ టెస్ట్ పాస్ కాకుండా ఎండీ డిగ్రీ రాసుకున్న వైద్యశాలను కూడా అధికారులు సీజ్ చేశారు. ఆ తరువాత హుజూర్నగర్ రోడ్డులో సీజ్ చేసిన వైద్యశాలలో పని చేస్తున్న వైద్యుడి డిగ్రీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పది రోజుల క్రితం కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కేసు నమోదుకు అవసరమైన అదనపు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరడంతో వాటిని కూడా ఇటీవల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అందించినట్లు సమాచారం. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా పట్టణ సీఐ స్పందించలేదు. ఫ కొద్ది రోజులుగా ప్రైవేట్ వైద్యశాల నిర్వహణ ఫ ఇటీవల సీజ్ చేసిన జిల్లా అధికారులు ఫ డాక్టర్ డిగ్రీపై అనుమానంతో పది రోజులక్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన డీఎంహెచ్ఓ -
యాదాద్రిలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. శ్రీఆంజనేయస్వామికి ఆచార్యులు ఆకుపూజ నిర్వహించారు. అంజనీపుత్రుడికి మంగళవారం ఇష్టమైన రోజు కావడంతో ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో ఆకు పూజ జరిపించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు కొనసాగాయి. -
కల్తీ పాలను పట్టుకున్న పోలీసులు
భూదాన్పోచంపల్లి: కల్తీ పాలు తయారుచేసి విక్రయిస్తున్న పాల వ్యాపారి ఇంటిపై మంగళవారం ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి 60లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ముక్తాపూర్ గ్రామానికి చెందిన పాల వ్యాపారి సన్న ప్రశాంత్ కల్తీ పాలు తయారుచేసి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఎస్ఓటీ పోలీసులు అతడి ఇంటిపై ఆకస్మిక దాడి చేసి 60లీటర్ల కల్తీ పాలతో పాటు 250 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాకై ్సడ్, 8 స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కల్తీ పాలను లేబోరేటరీకి పంపించారు. ఈ మేరకు ప్రశాంత్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
108లో మహిళ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
గరిడేపల్లి : 108లో ఓ మహిళ ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అప్పన్నపేట గ్రామానికి చెందిన బత్తిని శభరి మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది. శభరి రెండో సారి గర్భవతి కావడంతో అత్తగారింటి వద్దే ఉంటుంది. మంగళవారం ఉదయం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వెంటనే స్పందించి గ్రామానికి చేరుకొని మిర్యాలగూడలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువై శభరి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమెను వెంటనే నేరేడుచర్ల పీహెచ్సీకి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించిన 108సిబ్బందిని కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు. -
బైక్ దొంగల అరెస్ట్
కట్టంగూర్: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను కట్టంగూర్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం బొడ్రాయి అన్నారం గ్రామానికి చెందిన చెన్నబోయిన రవి, కొణతం మహేష్ ఇటీవల మిర్యాలగూడ రూరల్, తిప్పర్తి, నకిరేకల్, కట్టంగూర్, కనగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు బైక్లు, ఒక యాక్టీవా స్కూటీని దొంగలించారు. దొంగిలించిన వాహనాలను హైదరాబాద్లో అమ్మేందుకు మంగళవారం వారిద్దరు నకిరేకల్ మీదుగా నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా.. కట్టంగూర్ మండల కేంద్రంలోని కురుమర్తి క్రాస్రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను తెలిపారు. -
తల్లడిల్లుతున్న కన్న పేగు
మిర్యాలగూడ టౌన్: నోటి క్యాన్సర్తో బాధపడుతున్న కుమారుడికి సరైన వైద్యం అందించలేక ఆ వృద్ధ తల్లి తల్లడిల్లుతోంది. వివరాలు.. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన హుడుగుండ్ల పెదలింగయ్య, ముత్యాలమ్మ దంపతులు బతుకుదెరువు కోసం మిర్యాలగూడకు వచ్చి తాళ్లగడ్డలో స్థిరపడ్డారు. వీరికి కుమారుడు హుడుగుండ్ల సైదులు, కుమార్తె నాగలక్ష్మి సంతానం. పెద లింగయ్య గతంలోనే మృతిచెందాడు. సైదులు వివాహం కాగా.. భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. నాగలక్ష్మిని కూడా తన భర్త వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో సైదులు హమాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన సైదులు మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా నోటి క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. హైదరాబాద్లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లగా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చయ్యింది. దీంతో బంజారాహిల్స్లోని ఓ క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి వారు ఆరోగ్యశ్రీ కార్డు అడగగా.. వారి వద్ద ఆరోగ్యశ్రీ కార్డు లేదు. దీంతో డబ్బులు కట్టి ఆస్పత్రిలో చేరారు. అనంతరం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స నిమి త్తం రూ.3లక్షల వరకు ఖర్చు చేశారు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు. అయితే ఆరోగ్యశ్రీ కార్డుకు బదులుగా మండల తహసీల్దార్ ధ్రువీకరించిన పత్రాన్ని తీసుకెళ్తే హైదరాబాద్లోని లక్డీకపూల్లో గల ఎంఎన్జీ ఆస్పత్రి వారు వైద్యం నిర్వహించేందుకు సిద్ధమని చెప్పారని, కానీ మందుల ఖర్చుకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆ వృద్ధ తల్లి వేడుకుంటోంది. సైదులుకు క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి తన చెల్లి నాగలక్ష్మి ఇళ్లలో పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తోంది. దాతలు సహాయం చేయాల్సిన వివరాలు పేరు: హుడుగుండ్ల సైదులు బ్యాంక్ అకౌంట్ నంబర్: 62378451204 (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాజీవ్ చౌక్, మిర్యాలగూడ) ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్బీఐఎన్0020174 ఫోన్ పే, గూగుల్ ఫే నంబర్: 7993105511 (నాగలక్ష్మి) ఫ నోటి క్యాన్సర్తో బాధపడుతున్న కుమారుడు ఫ మందులు కొనుగోలు చేయడానికి కూడా డబ్బుల్లేక దిక్కుతోచని స్థితిలో వృద్ధ తల్లి ఫ దాతల సాయం కోసం ఎదురుచూపు నా కుమారుడిని ఆదుకోండి నా కుమారుడికి నోటి క్యాన్సర్ సోకడంతో వైద్యం కోసం ఇప్పటికే రూ.3లక్షల వరకు అప్పులు తీసుకొచ్చి ఖర్చు చేశాను. మందులు కొనుగోలు చేయడానికి కూడా డబ్బులు లేవు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి నా కుమారుడిని ఆదుకోండి. – ముత్యాలమ్మ, సైదులు తల్లి -
నాటు తుపాకులు స్వాధీనం
పెద్దఅడిశర్లపల్లి: వన్యప్రాణులను వేటాడే మూడు నాటు తుపాకులను మంగళవారం గుడిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలంలోని ఘనపురం గ్రామం నుంచి గుడిపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్దమ్మతల్లి గుడిలో నాటు తుపాకులు ఉన్నట్లు ఆలయ పూజారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తన సిబ్బందితో గుడి వద్దకు చేరుకుని మూడు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. దేవరకొండ డీఎస్పీ గిరిబాబు, సీఐ ధనుంజయ్య గుడిపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించి నాటు తుపాకుల గురించి ఆరా తీశారు. ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యపెన్పహాడ్ : మనస్థాపంతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని మాచారం గ్రామ పరిధిలోని అనిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ పెరిక రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చింత జగదీష్రెడ్డి తన వ్యవసాయ భూమిని సర్వేయర్తో కొలిపిస్తుండగా మాచారం గ్రామానికి చెందిన ఇటికాల శ్రీను అడ్డుకున్నాడు. పక్క రైతులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కొలుస్తారని చింత జగదీష్రెడ్డి కుమారుడు చింత శేఖర్రెడ్డి(40)ని దుర్భాషలాడాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన శేఖర్రెడ్డి మంగళవారం తల్లిదండ్రులు భూమి కొలిపించేందుకు వెళ్లడంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి శేఖర్రెడ్డి మృతి చెంది కనిపించాడు. మృతుడి వద్ద లభించిన సూసైడ్నోట్లో తన సొంత భూమి వద్ద ఇష్టానుసారంగా ఇటికాల శ్రీను భూతులు తిట్టాడని, నాకు వేరే ఇతర ఇబ్బందులు ఏమి లేవని సూసైడ్నోట్లో రాసి ఉన్నట్లు తెలిపారు. మృతుడి తండ్రి జగదీష్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిభువనగిరి క్రైం: బైక్పై వెళ్తూ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతిచెందాడు. వివరాలు.. భువనగిరి మండలంలోని ఆకుతోటబావితండా ఆవాసం కాండ్లకుంటతండాకు చెందిన మెగావత్ రమేష్(36) ఇంటి పైకప్పు ఇటీవల వీచిన ఈదురుగాలులకు దెబ్బతింది. దీంతో శనివారం అతడు బైక్పై భువనగిరి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చి ఇంటికి వెళ్తుండగా.. అనాజిపురం గ్రామశివారులో గల దివ్యబాల స్కూల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేష్ను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ ఎస్ఐ తెలిపారు. -
రైతన్నలూ జర జాగ్రత్త..!
పెద్దవూర: వానాకాలం సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. తమ వ్యవసాయ పొలాలను వానాకాలం సీజన్కు సిద్ధం చేసుకున్న రైతులు బోర్లు, బావుల కింద పత్తి విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు పత్తి, మిరప విత్తనాలను సైతం కొనుగోలు చేసుకున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కలుపు నివారణ సమస్య ఉండదని జిల్లాలో చాలామంది రైతులు నిషేధిత విత్తనాల వైపు చూస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కంపెనీలు ఆకర్షణీయమైన ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలతో రైతులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నాయి. పలు కంపెనీల యాజమాన్యాలు జిల్లాలోని డీలర్లకు రకరకాల ప్యాకేజీలు, విదేశీ ప్రయాణాలు ఆశ చూపడంతో డీలర్లు సదరు కంపెనీల విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వానాకాలం సీజన్ వచ్చిందంటే చాలు నకిలీ, నాసిరకం విత్తనాలు మార్కెట్ను ముంచెత్తుతాయి. ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు లోబడి విత్తనాలను కొనుగోలు చేయవద్దు. ఆకర్షణీయమైన ప్యాకింగ్, గుర్తింపు లేని లేబుళ్లతో కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాలను అంటగడుతున్నాయి. ఇటువంటి కంపెనీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలో పత్తి, వరి, మిరప పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. విత్తనాల ప్యాకెట్లపై ప్రభుత్వ నిబంధనలు, వివరాలు సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. విత్తనాలు, పురుగుల మందు ఎంపిక, కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇన్చార్జ్ ఏడీఏ పి.సందీప్ సూచించారు. విత్తనాల ఎంపికలో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవీ..● వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. ● విత్తనాల కొనుగోలు రశీదులపై నంబర్, విత్తన రకం, కొనుగోలు తేదీ, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. ● గడువు దాటిన విత్తనాలు, వదులుగా, చిరిగిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి ఇచ్చిన ప్యాకెట్లు కొనుగోలు చేయవద్దు. ● రశీదుపై విక్రయదారుని పేరు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమ్మకాల పన్ను నంబర్, విక్రయదారుని గ్రామం పేరు, విక్రయదారుడి సంతకం, తేదీలు, విత్తన రకం పేర్లు, బ్యాచ్ నంబర్, గడువు తేదీలు, నికర తూకం, నికర ధర, కంపెనీ పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ● కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం వేయించాలి. ● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వ్యవసాయ శాఖ అధికారి, శాస్త్రవేత్తలను సంప్రదించాలి. ● విత్తనాలు కొనుగోలు చేసిన రశీదును పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ● విత్తనాలు తీసుకున్న వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలక శాతం సంతప్తికరంగా ఉన్న వాటినే విత్తనాలుగా వాడాలి. పురుగు మందుల ఎంపికలో ..● పంటలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పురుగుల మందులు కొనుగోలు చేయాలి. ● అవసరానికి మించి కొనుగోలు చేసిన, నిల్వ ఉంచిన పురుగుల మందులను వాడొద్దు. లైసెన్స్ వున్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. ● పురుగు మందు డబ్బాలపై చక్రాకారంలో పురుగు మందు స్థాయిని తెలిపే రంగులు ఉంటాయి. అత్యంత విషపూరితమైతే నీలం రంగు, స్వల్ప విషపూరితమైతే ఆకుపచ్చ రంగు గుర్తులు ఉంటాయి. ● పురుగు మందులు రెండు, మూడు రకాలు కలిపి వాడకూడదు. వాడిన డబ్బాలు, సీసాలు ధ్వంసం చేసి గుంతలో పూడ్చిపెట్టాలి. ● ఒక పంటకు వాడిన పురుగుల మందును మరో పంటకు శాస్త్రవేత్తల సూచనల మేరకు వాడాలి. కల్తీ మందులను ఇలా గుర్తించాలి యూరియా, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్ వంటి ఎరువులు గుళికల రూపంలో ఉంటాయి. ఎరువులు ఇసుక రేణువుల రూపంలో, పొటాష్, సూపర్ పాస్పేట్ పొడి రూపంలో ఉంటాయి. 5 మిల్లీలీటర్ల నీటిలో చెంచా ఎరువును వేసి బాగా కలపాలి. ఇది స్వచ్ఛమైన ద్రావణంగా తయారైతే నాణ్యమైన ఎరువుగా గుర్తించవచ్చు. యూరియా, అమ్మోనియా క్లోరైడ్ ఎరువుల పరీక్షకు 10 మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిని వినియోగించాలి. యూరియా వంటి ఎరువును ఒక చెంచాను ఐదు మిల్లీలీటర్ల పరిశుభ్రమైన నీటిలో వేసి బాగా కలిపితే అడుగున మట్టి చేరితే కల్తీగా గుర్తించాలి. కొన్ని కాంప్లెక్స్ ఎరువులను ఇదే పద్దతిలో పరీక్షిస్తే ఇసుక రేణువులు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినా కల్తీ ఎరువుగా గుర్తించాలి. ఫ విత్తనాలు, ఎరువుల కొనుగోలులో భద్రం ఫ కంపెనీల ప్రకటనలతో మోసపోవద్దు ఫ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనమే మేలు ఎరువుల కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలు ఇవీ.. లైసెన్స్ దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి. బిల్లులు, ఖాళీ సంచులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. మిషన్ కుట్టుతో ఉన్న ఎరువుల సంచులు మాత్రమే వాడాలి. ఒకవేళ చేతికుట్టుతో ఉంటే సీసం సీల్ ఉందో లేదో చూసుకోవాలి. ప్రామాణిక పోషకాల వివరాలు, ఉత్పత్తి సంస్థ, ఉత్పత్తిదారుడి పేరు కచ్చితంగా ఉండాలి. కొనుగోలు సమయంలో డీలర్ రికార్డులో రైతు విధిగా సంతకం చేయాలి. ఎరువుల నాణ్యతపై అనుమానం ఉంటే వెంటనే వ్యవసాయ అధికారి సహకారంతో పరీక్షలకు పంపాలి. చిల్లులు పడి, చిరిగిన ఎరువుల బస్తాలు కొనుగోలు చేయవద్దు. ఇతర పదార్థాలు కలిస్తే ఆ ఎరువును కల్తీగా గుర్తించాలి. -
పాముకాటుతో యువకుడు మృతి
తిరుమలగిరి(నాగార్జునసాగర్): పాముకాటుతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం తిరుమలగిరి(సాగర్)మండలంలోని జువ్విచెట్టుతండాలో జరిగింది. వివరాలు.. జువ్విచెట్టుతండాకు చెందిన సపావత్ శంకర్(26) హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి తండాకు వచ్చాడు. రాత్రి ఇంట్లోని వరండాలో నిద్రిస్తుండగా తెల్లవారుజామున అతడిని పాముకాటేసింది. దీంతో అతడు కేకలు వేయగా ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులు వచ్చి చూశారు. పాముకాటుకు గురైనట్లు వారు గుర్తించి చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. -
లారీ, బైక్ ఢీకొని వ్యక్తి మృతి
ఆత్మకూర్(ఎస్) : లారీ, బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని శెట్టిగూడెం శివారులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలంలోని రామాపురం తండాకు చెందిన ధరంసోత్ సైదులు(45) పనినిమిత్తం బైక్పై శెట్టిగూడెం వెళ్తుంతుండగా ఎదురుగా వచ్చిన లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైదులుకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు సైదులును సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు కారును ఢీకొట్టిన లారీ.. ఒకరికి గాయాలుభువనగిరి క్రైం: కారును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలు.. వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ మంగళవారం భువనగిరి పట్టణంలోని భువనగిరి–నల్లగొండ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీరాం సత్యంకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుడు శ్రీరాం సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఎస్ఐ నాగరాజు తెలిపారు. -
విద్యుత్ వైర్లు పట్టుకుని యువకుడి ఆత్మహత్య
కట్టంగూర్ : మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడు విద్యుత్ వైర్లు పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కాసరబాద్ గ్రామం కుమ్మరిబజార్కు చెందిన నిమ్మనగోటి నరేష్(27) ఓ మెడికల్ షాప్లో వర్కర్గా పనిచేస్తున్నాడు. అతడి మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో కొంత కాలంగా తల్లిదండ్రులతో చనిపోతానంటూ చెబుతున్నాడు. ఈ క్రమంలో అతడు స్వగ్రామం నుంచి ద్విచక్రవాహనంపై వచ్చి అయిటిపాముల గ్రామశివారులో హైవే పక్కనే ఉన్న 133కేవీ సబ్స్టేషన్ సమీపంలో విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లను పట్టుకున్నాడు. దీంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి మల్ల య్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీను పేర్కొన్నారు. -
చీటింగ్ కేసులో పోస్టుమన్కు జైలుశిక్ష
అడ్డగూడూరు: చీటింగ్ కేసులో పోసుమన్కు మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ రామన్నపేట కోర్టు జడ్జి మంగళవారం తీర్పు వెలువరించారు. అడ్డగూడూరు ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండలం డి.రేపాక గ్రామంలో పోస్టుమాన్గా విధులు నిర్వహిస్తున్న భిక్షపతి ఉపాధి హామీ డబ్బులు తన సొంతానికి వాడుకున్నాడని 2018లో కేసు నమోదయ్యింది. మంగళవారం రామన్నపేట కోర్టులో ఈ కేసు తుది విచారణలో భాగంగా సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి భిక్షపతికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
చౌటుప్పల్ : మనస్థాపం చెందిన ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని 14వ వార్డు ఈఎస్ఐ ఆసుపత్రి ఏరియాకు చెందిన అంకర్ల జనార్దన్(52) ఆటోడ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఆదివారం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురై ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. కుమారుడు అరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నెట్బాల్ జట్టు ఎంపిక
నాగార్జునసాగర్: నెట్బాల్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా జట్టును ఆదివారం నందికొండలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలో ఎంపిక చేసినట్లు నెట్బాల్ అసోషియేషన్ నల్లగొండ జిల్లా కార్యదర్శి కిరణ్కుమార్ తెలిపారు. ఎంపిక పోటీలకు 60మంది క్రీడాకారులు హాజరయ్యారని.. వారిలో 12 మంది బాలురు, 12 మంది బాలికలు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 30వ తేదీన హైదరాబాద్ దోమలగూడలో జరిగే రాష్ట్రస్థాయి నెట్బాల్ టోర్నమెంట్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులకు సీనియర్ క్రీడాకారులు సంయుత్ నాయుడు, ధనుష్నాయక్ క్రీడా దుస్తులు అందజేశారు. -
నేడే ఎమ్మెల్సీ పోరు
వరంగల్–ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు అంతా సిద్ధం సాక్షి, యాదాద్రి : వరంగల్ –ఖమ్మం –నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. యాదాద్రి జిల్లా పరిధిలో మొత్తం 34,080 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళలు 13,242, పురుషులు 20,838 మంది ఉన్నారు. పోలింగ్ ప్రక్రియ సాఫీగా జరగడానికి రెండు డివిజన్లు, ఆరు రూట్లుగా విభజించారు. వీరి పరిధిలో 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక అధికారి ఉండేలా 47 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. ఓపీఓలు 141, పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి పరిశీలనకు 47 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. వీరితో పాటు మరికొంత మంది సిబ్బందిని రిజర్వులో వుంచారు. భువనగిరి, చౌటుప్పల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు భువనగిరి డివిజన్లో పరిధిలోని 12 మండలాలకు భువనగిరి మున్సిపాలిటీ పరిధి రాయగిరిలోని విద్యాజ్యోతి హైస్కూల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సామగ్రి అందజేశారు. అలాగే చౌటుప్పల్ డివిజన్కు సంబంధించి 5 మండలాలకు లక్కారంలోని సాన్జాన్ విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ కేంద్రాల వారీగా సామగ్రి పంపిణీ చేశారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రితో సిబ్బంది ఆదివారం సాయంత్రం వరకు పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. సిబ్బందిని తరలించడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను సమకూర్చారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే డీసీపీ రాజేశ్చంద్రతో కలిసి రాయగిరిలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో సామగ్రి పంపిణీని పర్యవేక్షించారు. చౌటుప్పల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సహాయ రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శేఖర్రెడ్డి పర్యవేక్షణలో పోలింగ్ సామగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పోలింగ్ సజావుగా జరగాలి ఫ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే పోలింగ్ సిబ్బంది తమ విధులు సమర్థవంతంగా నిర్వహించి ఎన్నికను సజావుగా పూర్తి చేయాలి. ఓటర్లు పోలింగ్ చిట్టీతో పాటు ఎన్నికల కమిషన్ సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి తీసుకువెళ్లాలి. పోలింగ్ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు, పెన్నులకు అనుమతి లేదు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటర్లు 34,080మహిళలు 13,242పురుషులు 20,838పోలింగ్ కేంద్రాలు 37ప్రిసైడింగ్ ఆఫీసర్లు 47 ఓపీఓలు 141మైక్రో అబ్జర్వర్లు 47ఫ ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ ఫ యాదాద్రి జిల్లా పరిధిలో 37 పోలింగ్ కేంద్రాలు ఫ 34,080 మంది ఓటర్లు ఫ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది -
భువనగిరి శివారులో ట్రాఫిక్ జామ్
భువనగిరి క్రైం : భువనగిరి పట్టణ శివారులో ఆదివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సెలవురోజు కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, స్వర్ణగిరి క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీనికి తోడు సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులు కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో గూడూరు టోల్ప్లాజా నుంచి భువనగిరి పట్టణ శివారు వరకు వాహనాలు బారులు దీరాయి. ఈ క్రమంలో భువనగిరి శివారులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికుల ఇబ్బందులు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో భువనగిరి నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులను బైపాస్ గుండా పంపించారు. అంతేకాకుండా ఎల్లమ్మ గుడి వద్ద నుంచి భువనగిరికి వచ్చే బస్సులను కూడా నేరుగా బైపాస్ నుంచే పంపించారు. బస్సులను బైపాస్ వద్దనే ఆపడంతో ప్రయాణికులు రెండు కిలో మీటర్ల మేర నడుచి పట్టణానికి చేరుకోవాల్సి వచ్చింది. ప్రైవేట్ వాహనాలను చెరువు కట్టమీదుగా అనుమతించకపోవడంతో బొమ్మాయిపల్లి, హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి గుండా వెళ్లారు. భువనగిరి నుంచి గూడూరు టోల్ప్లాజా దాటడానికి రెండు గంటల సమయం పట్టినట్లు ప్రయానికులు తెలిపారు. -
నృసింహుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రఽభాతం, ఆరాధన చేపట్టారు. అనంతరం నిజాభిషేకం, అర్చన చేశారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం , ముఖ మండపంలో అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం ఆలయ మాడ వీధుల్లో శ్రీస్వామి, అమ్మవారి జోడు సేవను ఊరేగించారు. వేద ఆశీర్వచనం, సువర్ణ పుష్పార్చన, నిత్యకల్యాణ వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయాన్ని మూసివేశారు. ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాలకు దరఖాస్తులు రాజాపేట : యాదాద్రి భువనగిరి, జనగాం, మేడ్జెల్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి గాను ఇంర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు యాదాద్రి జిల్లా రిజినల్ కోఆర్డినేటర్ రజనీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ ఒకేషనల్ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.100 చెల్లించి డబ్లుడబ్లుడబ్లు.టీఎస్డబ్లుఆర్ఈఐఎస్.ఏసీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కరాటే బెల్టులు ప్రదానం మోత్కూరు : పట్టణంలోని స్టాండర్డ్ షిటూరియో ఇంటర్నేషనల్ కరాటే డూ ఆధ్వర్యంలో ఆదివారం కరాటే, జూడో సమ్మర్ కోచింగ్ క్యాంపులో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో అవిశెట్టి రిషి, సారగండ్ల చరణ్, మన్నె సాయికుమార్, మన్నె సిరివెన్నెల, బైరు శ్రీమన్, బైరు రేణుశ్రీ, మహేశ్వరం విమల, మోత్కూరు అక్షిత, మహేశ్వరం అద్వైత, నిలిగొండ వైష్ణవి, ఏ.పవన్, సూర్య, ఆర్.చరణ్రాజ్ తదితర విద్యార్థులు బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ బెల్టులు సాధించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి భువనగిరి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, పథకాలు నేరుగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పేర్కొన్నారు. జూన్ 15,16వ తేదీల్లో జరగనున్న సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల నేపథ్యంలో ఆదివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా ప్రజా సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్మిస్తామని చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ సీపీఎం రాజకీయ శిక్షణ తరగతుల్లో అన్ని వర్గాల ప్రజలు, విద్యావంతులు, మేధావులు పాల్గొనాలని కోరారు. అంతకుముందు రాజకీయ శిక్షణ తరగతుల ఆహ్వాన సంఘం కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడుగా గాదె నర్సింహ, అధ్యక్షురాలిగా బట్టుపల్లి అనురాధ, ప్రధాన కార్యదర్శిగా మాయ కృష్ణ, ఉపాధ్యక్షుడిగా మాతయ్య, కార్యదర్శులు రవి, బాలకృష్ణ, ప్రచార కార్యదర్శులుగా కొల్పులు వివేక్, వనం రాజు, చింతల శివ ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, గడ్డం వెంకటేష్, నాయకులు రాజు, భాగ్య,లలిత, రాణి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
అధికారి ఆత్మహత్యకు కారకులపై కేసు ఏదీ?
ముమ్మరంగా ఎమ్మెల్యే ప్రచారం
ఉచిత కంటి వైద్య శిబిరం
విద్యాశాఖ ప్రాధికార ఏర్పాటుకు డిమాండ్
–8లో
నేడు హెచ్సీఎల్ టెక్–బీ జాబ్ మేళా
విద్యార్థులకు రుచికర భోజనం
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
YSRCPదే అధికారం.. విజయ్ బాబు విశ్లేషణ
వాడికి తల్లి లేదు.. చెల్లి లేదు.. రోజుకో అమ్మాయి కావాలి
తప్పక చదవండి
- పచ్చ పార్టీ నేతల కళ్లు బైర్లు కమ్మడం ఖాయమేనా?
- అందాల హీరోయిన్ వెజిటబుల్ సూప్ రెసిపీ, నెటిజన్లు ఏమన్నారంటే!
- ఇది కదా జగన్ అంటే.. ఆ రికార్డ్ ఆయనకే సొంతమవుతుంది.!
- క్యాష్లెస్ చికిత్సపై గంటలోనే నిర్ణయం..ఐఆర్డీఏఐ ఆదేశాలు
- మహిళా యూట్యూబర్ అరెస్టు
- సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
- అల్లుడు హైడ్రామా..!
- సాయి రాజేష్ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్ కామెంట్స్
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
Advertisement