-
బ్రెయిన్ ఉంటే సరిపోతుందా...
భైరవ బెస్ట్ ఫ్రెండ్ బుజ్జి... కానీ బుజ్జి అంటే మనిషి కాదు. మరి.. బుజ్జి అనేది వాహనమా? లేక ఓ టైమ్ మిషన్లాంటి పరికరమా? అనేది ఈ నెల 22న తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫ్యూచరిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భైరవ ΄ాత్రధారిగా ప్రభాస్, అశ్వత్థామ ΄ాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సూపర్ హీరోలాంటి బుజ్జి ΄ాత్ర కూడా ఉంది. ఈ ΄ాత్రను పూర్తిగా చూపించకుండా ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ పాత్రకు హీరోయిన్ కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘మనుషుల శరీరాన్ని బ్రెయిన్ కంట్రోల్ చేసినట్లే.. బుజ్జి బాడీని కూడా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంటుంది’ (నాగ్ అశ్విన్), ‘హాయ్.. నేను బుజ్జి బ్రెయిన్... బ్రెయిన్ ఉంటే సరిబ్రెయిన్ ఉంటే సరిపోతుందా...తుందా... బాడీ కూడా కావాలి కదా.. భైరవ ఎక్కడికీ.. నా బాడీ బిల్డ్ చేయడానికేనా..’ (కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్), ‘నీ టైమ్ స్టార్టైంది బుజ్జి.. పదా!’ (ప్రభాస్) అనే డైలాగ్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ బుజ్జి గురించిన పూర్తి వివరాలను ఈ నెల 22న వెల్లడిస్తామని మేకర్స్ తెలి΄ారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ జూన్ 27న విడుదల కానుంది. -
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు కావడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండడంతో పెద్ద సినిమాలన్నీ దాదాపు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఓటీటీల్లోనే సినిమాలు ఆడియన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్తో సహా చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో సుహాస్ ప్రసన్నవదనం, పృథ్వీరాజ్ సుకుమార్ ఆడుజీవితం కాస్తా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి మీరు ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి. నెట్ఫ్లిక్స్గారోడెన్న్ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్(యానిమేషన్)- మే 23ఇల్లూజన్స్ ఫర్ సేల్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23ఇన్ గుడ్ హ్యాండ్స్-2(ఇంగ్లీష్ సినిమా)- మే 23 ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్(ఇంగ్లీష్ సిరీస్)- మే 23అట్లాస్ (సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- మే 24ముల్లిగన్ పార్ట్-2 (యానిమేషన్ సిట్కామ్)- మే 24మై ఓని గర్ల్(యానినేషన్ చిత్రం)- మే 26 అమెజాన్ ప్రైమ్ది వన్పర్సెంట్ క్లబ్ సీజన్-1- మే 23ది బ్లూ ఎంజెల్స్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23డీఓఎం సీజన్-2(వెబ్ సిరీస్)- మే 24బాంబ్సెల్- మే 25డిస్నీ ప్లస్ హాట్స్టార్డోరామ్యాన్ సీజన్-19 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20షిన్ చిన్ సీజన్-16 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20మార్వెల్ స్టూడియోస్:అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22పాలైన్-(జర్మన్ సినిమా)- మే 22ది కర్దాషియన్స్- సీజన్-5(ఇంగ్లీష్ సినిమా)- మే 23ది బీచ్ బాయ్స్(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24ఆడుజీవితం(ది గోట్ లైఫ్) (మలయాళ సినిమా)- మే 26(రూమర్ డేట్)రోలాండ్ గారోస్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ సినిమా)- మే 26ఆహాప్రసన్నవదనం(తెలుగు సినిమా) మే 24యాపిల్ టీవీ ప్లస్ట్రైయింగ్ సీజన్-4- మే 22 -
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
తమిళ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు సమాజసేవలోనూ దూసుకెళ్తున్నారు. మాత్రం సంస్థ పేరుతో తమిళనాట సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పదిమంది పేద రైతు కుటుంబాలకు ట్రాక్టర్లు అందజేశారు. వారిని ప్రత్యేకంగా కలిసి మరి రాఘవ లారెన్స్ ట్రాక్టర్ తాళాలు అందించారు.తాజాగా తాను సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు. దాదాపు 20 ఏళ్లుగా వారి అన్నీ తానే నడిపిస్తున్నారు. ఆ విద్యార్థులంతా చదువుల్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసి రాఘవ లారెన్స్ ఎమోషనల్ అయ్యారు. తాను కూడా వారితో పాటు కలిసిపోయి ఆటలు ఆడారు. వారిని చూస్తే తనకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. వారిని కలిసి సమయం వెచ్చించడం నా హృదయం సంతోషంతో నిండిపోయిందంటూ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మీరు గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. The seeds I planted 20 years ago have now grown into these beautiful souls and are being a good example in society. I’m extremely proud of my boys and girls for the kind of persons they have grown into. My heart is so full after spending some beautiful and quality time with them.… pic.twitter.com/XjytGqj2OW— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2024 -
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
ప్రముఖ యాంకర్, హీరోయిన్ స్వప్న చౌదరి అరుదైన ఘనత సాధించింది. పదేళ్లుగా యాంకరింగ్ రాణిస్తోన్న స్వప్న చౌదరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. ఈ సందర్భంగా ఆమెకు అవార్డ్ అందజేశారు. తనకి ఈ అవార్డ్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని స్వప్న చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లుగా యాంకరింగ్లో రాణిస్తూ దాదాపు 2500 పైగా ఈవెంట్స్లో పాల్గొన్నారు. అంతేకాకుండా నమస్తే సెట్ జీ , మిస్టరీ సినిమాల్లో హీరోయిన్గా నటించారు.బిగ్ బాస్ సీజన్- 8లో పాల్గొనడమే తన కోరికని స్వప్న చౌదరి అన్నారు.శబరి నిర్మాతకు అవార్డ్టాలీవుడ్ యువ నిర్మాత శబరి మహేంద్ర నాధ్ కు అరుదైన అవార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ను ఆయన సొంతం చేసుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో శబరి చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఏకకాలంలో సుమారు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవరిస్తున్న సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డ్తో నా బాధ్యత మరింత పెరిగిందని శబరి మహేంద్ర నాధ్ అన్నారు. -
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా రేంజ్లో మోస్ట్ అవైటెడ్ మూవీగా దేవర ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నాడు. మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా దేవర నుంచి ఫస్ట్ సాంగ్ను మేకర్స్విడుదల చేశారు.బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించాడు. తాజాగా విడుదలై ఫియర్ సాంగ్ అభిమానులను మెప్పించేలా ఉంది. ఇందులోని ప్రతి పదం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పాట కోసం గేయ రచయతలు ఎంతో ప్రత్యేకంగా దీనిని రచించారని ఇప్పటికే మేకర్స్ చెప్పారు. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి ,హిందీలో మనోజ్ ముంతాషిర్, తమిళంలో విష్ణు ఏడవన్, కన్నడలో ఆజాద్ వరదరాజ్, మలయాళంలో గోపాలకృష్ణన్ రచించారు. -
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
మే 20 వచ్చిందంటే చాలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండుగ. తారక్పై ఈగ కూడా వాలకుండా ఆయన చుట్టూ వైఫైలా అభిమానులు ఉంటారు. ఎన్టీఆర్ను ఎవరైనా కామెంట్ చేస్తే చాలు ఫ్యాన్స్ అంతా ఏకమై దండయాత్ర చేస్తారు. బాద్షాను టచ్ చేస్తే సౌండ్ సాలిడ్గా ఉంటుందనేలా వారందరూ తారక్పై ప్రేమను చూపుతారు.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'రా ఎన్టీఆర్ 2.0' వ్యవస్థాపకులు రక్తదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ఆ టీమ్ సేవ చేస్తుంది. విద్యార్థుల కోసం పలు సేవా కార్యక్రమాలను చేసేందుకు వారు ఎప్పుడూ ముందుంటారు. ఇందుకోసం సోషల్ మీడియాలో వారు ఒక పేజీని క్రియేట్ చేసి సాయం అవసరం ఉన్నవారికి తమకు చేతనైనంత వరకు చేస్తున్నారు. మే 20న తారక్ పుట్టినరోజు కావడంతో రక్తదానం కార్యక్రమాన్ని చేపట్టి తమ అభిమానాన్ని ఇలా చూపించారు. దీంతో నెటిజన్ల నుంచి 'రా ఎన్టీఆర్ 2.0' వ్యవస్థాపకుల పట్ల ప్రశంసలు అందుతున్నాయి. View this post on Instagram A post shared by RAW NTR (@rawntrofficial) -
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
తమదైన కామెడీ టైమింగ్తో బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వించే ఫైమా నేడు పుట్టినరోజు జరుపుకుంది. ఈ క్రమంలో తన అభిమానులకు పెద్ద షాకింగ్ న్యూస్ షేర్ చేసింది. తన బాయ్ఫ్రెండ్ను ఆమె రివీల్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.తాజాగా ఫైమా తన బాయ్ఫ్రెండ్తో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. తన ప్రేమికుడు ప్రవీన్ నాయక్ అని పరిచయం చేసింది. ఆ ఫోటోలను ప్రవీన్ నాయక్ కూడా షేర్ చేశాడు. ఈ క్రమంలో అతను ఇలా చెప్పుకొచ్చాడు. 'నా ప్రియిమైన లవ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మన ప్రేమ మొదలయ్యి 5 సంవత్సరాలైంది. ఇన్నిరోజులు ఎలా గడిచిపోయాయో తెలీదు. నా జీవితం మొత్తం నీతోనే గడపాలని ఉంది. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను.' అని అతను తెలిపాడు. దీనికి ఫైమా మద్ధతు ఇస్తూ వాటిని షేర్ చేసింది.ప్రవీణ్తో లవ్!ప్రముఖ కామెడీ షోలోని మరో కమెడియన్ ప్రవీణ్తో ఫైమా ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో ప్రవీణ్ మాట్లాడుతూ తన ప్రేమన ఫైమా రిజెక్ట్ చేసిందని కూడా వెళ్లడించాడు. ఫైమాతో బ్రేకప్ అయినట్లు చెప్పాడు. కానీ ఫైమా మాత్రం ప్రవీణ్ను ప్రేమించలేదని తెలిపింది. ఆన్స్క్రీన్లో జోడీగా చూపించేందుకే తమను జంటగా ఆదరించారని పేర్కొంది. కానీ, ప్రవీణ్కు, తనకు మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలున్నాయని, అవి చెప్పుకోలేమని అందుకే దూరం కావాల్సి వచ్చినట్లు ఆమె తెలిపింది. ప్రవీణ్ మాత్రం తామిద్దరం లవ్లో ఉన్నామని తెలిపాడు.నెటిజన్లు నుంచి విమర్శలుఐదేళ్లుగా ప్రేమలో ఉన్నప్పుడు ప్రవీణ్తో ఎందుకు ప్రేమలో ఉన్నావ్ అని కొందరు నెట్టింట ఫైమాను ప్రశ్నిస్తున్నారు. అతన్ని బకరాను చేసి ఆడుకున్నావ్ కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రవీణ్ను బాగా ఉపయోగించుకున్నావ్ నీ లిస్ట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు రాధికా అక్క అంటూ డీజే టిల్లు డైలాగ్స్ పేలుస్తున్నారు. View this post on Instagram A post shared by Praveen Nayak (@praveen_nayak.24) -
సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు జారీ
సుచీ లీక్స్తో సింగర్ సుచిత్ర కోలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భర్త కార్తీక్ గే అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్ పేల్చింది. అంతటితో ఆగని సుచిత్ర ఈ వివాదంలోకి హీరో ధనుష్ను కూడా లాగింది. పూటుగా మద్యం సేవించి హీరో ధనుష్, కార్తీక్ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.తాజాగా సుచిత్రకు తన మాజీ భర్త కార్తీక్ లీగల్ నోటీసులు జారీ చేశాడు. తనపైనే కాకుండా హీరో ధనుష్పై కూడా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు సుచిత్ర చేసిందంటూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. ఇంటర్వ్యూ సమయంలో తన పట్ల పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని, ఆపై అలాంటి వ్యాఖ్యలు మరోసారి ఆమె చేయకుండా చూడాలని తన లీగల్ టీమ్ ద్వారా ప్రత్యేకంగా డిమాండ్ చేశాడు.సుచిత్రతో పాటు ఇంటర్వ్యూ హోస్ట్ చేస్తున్న రెండు యూట్యూబ్ ఛానెల్స్కు కూడా కార్తిక్ లీగల్ నోటీసులు పంపాడు. సదరు యూట్యూబ్ ఛానెల్లు విడుదలచేసిన వీడియోలు పూర్తిగా తమ పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే ఆ ఛానెల్లను రద్దు చేయాలని నోటీసులో పేర్కొన్నాడు. సుచిత్ర ఇప్పటికే త్రిష, కమల్ హాసన్, వనిత విజయ్ కుమార్ వంటి వారందరిపై ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చింది. -
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్లో మెరిసిందా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసింది. తాజాగా ఆమె తన కూమార్తెతో ఫ్రాన్స్ నుంచి ముంబైకి తిరిగొచ్చింది. గత 20 ఏళ్లుగా కేన్స్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై ఆమె మెరుస్తూనే ఉంది. అయితే ఈసారి తన చేతికి గాయం అయింది. దానిని ఏమాత్రం లెక్కచేయని ఐశ్వర్య నూతన డిజైనర్ దుస్తుల్లో కార్పెట్పై హొయలుపోతూ కనిపించింది.యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం అంటే ఆ హీరోయిన్లకు దక్కిన గౌరం అని అందరూ అంటారు. కానీ, ఐశ్వర్య గ్లామర్తో ఆ ఫెస్టివల్కు మరింత అందాన్ని ఇచ్చిందని ఆమె అభిమానులు అంటారు. ఐశ్వర్య చేతికి గాయం కావడంతో ఆమె అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. అయితే, తన కుమార్తె ఆరాధ్య సాయంతో ఆమె కేన్స్లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఐశ్వర్యరాయ్ గత వారాంతంలో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనాలని నిర్ణయించుకుంది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
నేనే హీరో..నేనే విలన్..తగ్గేదేలే అంటున్న స్టార్స్
సినీ ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్తదనం ఉంటేనే థియేటర్స్కి వెళ్తున్నారు. అందుకే మన హీరోలు కూడా రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలో హీరో పాజిటివ్గా ఉంటే..విలన్ నెగటివ్గా ఉండేవాడు. కానీ ప్రస్తుతం హీరోనే విలన్గాను మారుతున్నాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో రెచ్చిపోయి నటిస్తున్నారు. ఒకే సినిమాలో నాయకుడిగా..ప్రతి నాయకుడిగానూ నటిస్తూ తమలో దాగిఉన్న మరో యాంగిల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఎప్పుడూ చేసిందే చేస్తే ఏం బావుంటుందబ్బా... అప్పుడప్పుడూ కొత్తగా చేయాలి అంటున్న ఈ స్టార్ హీరోలపై ఓ లుక్కేయండి. -
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
'బేబి'తో హిట్ కొట్టిన యువ హీరో ఆనంద్ దేవరకొండ.. ఇప్పుడు ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇతడు హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'గం గం గణేశా'. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఆనంద్ తన కెరీర్లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది. దీంతో సిక్స్ ప్యాక్ కూడా చేశాడు.(ఇదీ చదవండి: 'జబర్దస్త్' కమెడియన్కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!)ఈ నెల 31న 'గం గం గణేశా' సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నెల 20న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ సిక్స్ ప్యాక్ ఫొటోని మేకర్స్ విడుదల చేశారు. అయితే ఇందులో ఆనంద్ ని చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. ఇంతలా మారిపోయాడేంటని కామెంట్స్ పెడుతున్నారు.(ఇదీ చదవండి: In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!) -
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
సౌత్ ఇండియా లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందిన నయనతార సిండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మొటిక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా ఆమె పలు దేవాలయాల చుట్టు తిరుగుతూ తన భర్తతో కలిసి పూజలు నిర్వహిస్తుంది. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒకటే చర్చ జరుగుతుంది.నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి మరీ.. పుణ్యక్షేత్రాల చుట్టూ ఆమె తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే ఆ పట్టు వస్త్రాలతోనే తిరుమల శ్రీవారిని ఆమె సందర్శించిన విషయం తెలిసిందే. వారి పెళ్లి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం నయన్,విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్కు ఫుల్స్టాప్ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారని సమాచారం. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించేందుకు పలు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
'జబర్దస్త్' కమెడియన్కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?) -
హనీమూన్ ఎక్స్ప్రెస్: 'క్యూట్గా స్వీట్గా' సాంగ్ వచ్చేసింది..
చైతన్యా రావు, హెబ్బా పటేల్ ‘క్యూట్గా... స్వీట్గా...’ అంటూ పాట పాడుకున్నారు. ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’ చిత్రం కోసమే ఇలా పాడుకున్నారు. చైతన్యా రావు, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ఇది. ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బాల రాజశేఖరుని దర్శకత్వంలో కేకేఆర్, బాల రాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ‘క్యూట్గా... స్వీట్గా...’ అంటూ సాగే పాటను హీరో అడివి శేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాట స్వీట్గా ఉంది. సినిమా హిట్టవ్వాలన్నారు. చిత్ర సంగీతదర్శకుడు కల్యాణీ మాలిక్ స్వరపరిచిన ఈ సాంగ్కు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించగా దీపు పాడారు. ‘‘ఇదొక మంచి మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ’’ అని బాల రాజశేఖరుని అన్నారు. -
హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?
అందం, అభినయం.. ఇలా రెండింటిలోనూ కేక పుట్టించే టాలెంట్ ఉన్న బ్యూటీ అనుష్క శెట్టి. గతంలో ఆమె నటించిన సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ప్రస్తుతం ఈమె చాలావరకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన అనుష్క.. 40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే సింగిలే. ఈ క్రమంలో చాలాసార్లు పెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓ నిర్మాతతో ఏడడుగులు వేయబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?)'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. ఈ మూవీ చేస్తున్న టైంలోనే 'సైజ్ జీరో'లో నటించింది. ఇందులో పాత్ర కోసం భారీగా బరువు పెరిగింది. ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇదే. సినిమా హిట్ అవ్వలేదు. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గట్లేదు. దీంతో చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మలయాళం ఓ మూవీ చేస్తోంది.హీరోయిన్లలో అనుష్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఈమె-ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వచ్చాయి. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. టాలీవుడ్ దర్శకుడితోనూ పెళ్లంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అలా మరోసారి టాక్ మొదలైంది. అనుష్క త్వరలో పెళ్లికి రెడీ అయిందని, కన్నడ నిర్మాతతో ఏడడుగులు వేయనుందని అంటున్నారు. ఇది కూడా కేవలం ఓ రూమర్లానే అనిపిస్తుంది. కొన్నిరోజులాగితే నిజమేంటనేది తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు) -
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'సిల్క్ శారీ'. ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరితో దర్శకుడు టి. నాగేందర్ రూపొందిస్తున్నారు. "సిల్క్ శారీ" సినిమా మే 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత కమలేష్ కుమార్ మాట్లాడుతూ.. 'సిల్క్ శారీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి మూవీతో టాలీవుడ్లోకి నిర్మాతగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇకపైనా మా చాహత్ బ్యానర్పై రెగ్యులర్గా సినిమాలు రూపొందిస్తాం. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఈ నెల 24న థియేటర్స్లోకి వస్తున్న మా 'సిల్క్ శారీ' సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం.' అని ఆయన అన్నారు. -
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్లో కొనసాగుతూనే ఉంది. కొన్ని గంటల క్రితం ప్రభాస్ చేసిన ఒక పోస్ట్తో కల్కి సినిమా పేరు భారీగా ట్రెండ్ అయింది. 'ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి.' అంటూ అయిన షేర్ చేసిన పోస్ట్పై అందరూ ఎంతగానో ఆసక్తి కనపరిచారు. కొంత సమయం తర్వాత 'నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అంటూ మరో పోస్ట్ చేశారు. దీంతో అసలు బుజ్జి ఎవరు..? ఎలా ఉంటుంది..? అని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.తాజాగా బుజ్జికి సంబంధించిన ఒక గ్లింప్స్ను మేకర్స్ విడుదల చేశారు. చాలా ఆసక్తిగా కొనసాగిన ఈ విడియోలో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తూ ఉంటారు. బుజ్జికి వాయిస్ను కీర్తి సురేష్ ఇచ్చింది. 'నా లైఫ్ ఎంటి..? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా' అంటూ బుజ్జి చెబుతుండగా ఇంతలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి 'నీ టైమ్ మొదలైంది బుజ్జి' అంటూ ఒక వాహనాన్ని రివీల్ చేయబోయాడు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటూ జూన్ 22 వరకు వేచి ఉండాల్సిందేనని తెలిపారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 'కల్కి' విడుదల కానుంది. -
ఎన్నికల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్
లోక్సభ ఎన్నికల బరిలో హిమాచల్ ప్రదేశ్లోని మండీ నుంచి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. వాస్తవంగా బీజేపీలో చేరకముందే ఆమె టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏడో దశ ఎన్నికల్లో భాగంగా మండిలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఆమెకు పోటీగా కాంగ్రెస్ నుంచి విక్రమాదిత్యసింగ్ బరిలో నిలిచారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రణరంగంలోకి దిగిన తర్వాత ఎంత కష్టమో తనకు తెలిసిందని ఆమె చెప్పింది. ఎన్నికల ప్రచారం కోసం తను పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని కంగనా పేర్కొంది.ఎన్నికల యుద్ధం ప్రారంభం నుంచి వరుసగా ప్రజా సభలతో పాటు పార్టీ కార్యకర్తలతో అనేక సమావేశాలు నిర్వహించినట్లు ఆమె అన్నారు. ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో చాలా కష్టమైన రహదారులపై ఒక్క రోజే 450 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేసినట్లు కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం వల్ల సరిగ్గా నిద్రకు కూడా సమయం దొరకడం లేదని ఆమె చెప్పారు. కనీసం సమయానికి భోజనం కూడా తీసుకోవడంలేదని అన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ పోరాటం ముందు సినిమా నిర్మించడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివేనని కంగన చెప్పడం విశేషం. కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. జూన్ 14న విడుదల కావాల్సిన ఈ సినిమా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
'నరేంద్ర మోదీ' బయోపిక్లో స్టార్ యాక్టర్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది.బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో పాన్ ఇండియా రేంజ్లో సత్యరాజ్కు భారీ పాపులారిటీ తీసుకొచ్చింది. నరేంద్ర మోదీగా ఈ సినిమాలో సత్యరాజ్ నటించనున్నారని వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంతోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.మోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
‘బిగ్ బ్రదర్’తో టాలీవుడ్ రీఎంట్రీ ఇస్తున్న భోజ్పురి డైరెక్టర్
శివ కంఠంనేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘బిగ్ బ్రదర్’. భోజ్పురిలో వరుస విజయాలతో ‘రాజమౌళి ఆఫ్ భోజ్పురి’గా నీరాజనాలు అందుకుంటున్న ప్రముఖ దర్శకులు గోసంగి సుబ్బారావు చాలా విరామం అనంతరం తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ రూపొందించిన చిత్రమిది. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియా హెగ్డే హీరోయిన్గా నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేశారు. మే 24న భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ... "అన్నదమ్ముల అనుబంధం నేపధ్యంలో... ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ దట్టించి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం "బిగ్ బ్రదర్". శివ కంఠంనేని మరోసారి ఇందులో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచారు. ఈ చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై తెలుగులో వరసగా సినిమాలు చేస్తాను’ అన్నారు. -
అందరికి నచ్చేలా ‘ఐ - 20’
సూర్యరాజ్ - మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా మూవీ "ఐ - 20". బివేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది ఉప శీర్షిక. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి.మహేంద్ర నిర్మించారు. తాజాగా ఈ మూవీ పాటలు, ప్రచారచిత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు.ప్రముఖ ఆడియో సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం పాటలు లభ్యం కానున్నాయి!!తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ దర్శకులు వి.సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రూపొందించిన "ఐ - 20" అందరికీ నచ్చుతుందనే ఆశాభావాన్ని దర్శకనిర్మాతలు వ్యక్తం చేశారు.మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ యెలెందర్, గీత రచయిత దేవకరణ్, సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, కొరియోగ్రాఫర్స్ శైలజ- శ్యామ్ తదితర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. రాగిణి, లీరిషా (సూపర్ ఉమెన్), చిత్రం శ్రీను, జోష్ రవి, పొట్టి చిట్టిబాబు, సద్దాం హుస్సేన్, రియాజ్, పర్శ, పల్లెమోని శ్రీనివాస్, వినోద్ నాయక్ తదితరులు ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోషించారు. -
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘అంగ్రేజీ బీట్’ అంటూ అదిరిపోయే బీటున్న పాటను విడుదల చేశారు.అంగ్రేజీ బీట్ అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పవన్ లిరిక్స్, బాణీలు ఈ పాటను ప్రత్యేకంగా మార్చేశాయి.మంచి హుషారైన బీటుతో ప్రస్తుతం ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. -
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఐదేళ్లుగా నటితో సహజీవనంతల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్లు చేశాడు.ఈ జన్మకు చాలునేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు. ఈ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.చదవండి: చనిపోతానని ముందే హింటిచ్చిన నటుడు.. ఐదేళ్ల నుంచి పట్టించుకోట్లేదంటూ విలపించిన తల్లి -
వవన్ కల్యాణ్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్
పవన్ కల్యాణ్కు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులున్నారు. కానీ వారిలో ఎక్కువమంది శాడిస్టుల్లా ప్రవర్తిస్తుంటారని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుందని చాలామంది అంటారు. పవనిజం ముసుగులో ఇతరులపై భూతులతో దండయాత్ర చేస్తారని కూడా తెలుపుతుంటారు. బ్రో సినిమా విడుదల సమయంలో మదనపల్లిలో ఒక సంఘటన గురించి చూస్తే.. బ్రో మూవీ ఎలా ఉందని కొందరు మీడియా వారు పవన్ అభిమానని అడిగిన పాపానికి అతడు బ్లేడ్తో చేయి కోసుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెబుతూ.. పవన్ అభిమానుల్లో కొందరు శాడిస్టులు నిజంగానే ఉన్నారని బహిరంగంగానే నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.సోషల్ మీడియాలో రేణు దేశాయ్, పూనమ్ కౌర్ ఇద్దరూ ఏ పోస్టు పెట్టినా సరే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అందులోకి దూరిపోతుంటారు. వాళ్లు ఎలాంటి పోస్ట్ పెట్టినా సరే తమ నాయకుడి గురించే అంటూ భుజాలు తడుముకుంటారు. ఆపై వెంటనే ట్రోలింగ్కు దిగిపోతుంటారు. ఒకవేళ పవన్కు పాజిటివ్గా పోస్ట్ పెడితే ఆ క్రెడిట్ అంతా పవన్కు ఇచ్చేస్తారు. తాజాగా ఇలాంటి సంఘటన గురించే రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టింది.ఇటీవల రేణు దేశాయ్ పలు యానిమల్స్ ఎన్జీవోలకు సహకారం అందిస్తుంది. కుక్కలు,పిల్లుల వంటి జంతువుల రక్షణ కోసం ప్రతి నెల తను కొంత డబ్బు సాయం చేస్తుంది. అందుకు సంబంధించి ఆమె తన ఇన్స్టాలో ఒక మెసేజ్ చేసింది. రేణు చేస్తున్న సాయాన్ని గుర్తించలేని పవన్ అభిమాని ఇలా కామెంట్ చేశాడు. పవన్ కల్యాణ్ అన్నలా గోల్డెన్ హార్ట్ అని అన్నాడు. దీంతో రేణూ దేశాయ్కి కోపం వచ్చినట్లు ఉంది. అతనికి కరెక్ట్ సమాధానంతో ఇచ్చిపడేసింది.ప్రతిసారి నేను పెట్టే పోస్టుల కింద నా ఎక్స్ హస్బెండ్తో నన్ను ఎందుకు పోలుస్తున్నారు. ఇలాంటి వాళ్లను చాలామందిని నేను ఇప్పటికే బ్లాక్ చేశాను. పదేళ్ల వయస్సు నుంచి నేను జంతు సంరక్షణ కోసం నా వంతు సాయం చేస్తున్నాను. జంతువులపై నేను చూపించే ప్రేమ, వాత్సల్యం ఆయనకు లేవు. నా మాజీ భర్త ప్రస్తావన తీసుకొస్తూ కామెంట్ చేయకండి. వ్యక్తిగతంగా నా మాజీ భర్తతో ఎలాంటి సమస్య లేదు. నన్ను నన్నుగా చూడండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నా పోస్టుల్లో, నేను చేసే పనుల్లో ఆయన్ను పోల్చకండి. జంతువుల మీద నాకున్నంత కేర్ గానీ, ప్రేమ గానీ ఆయనకు ఉండదు. అతను నాలాగా యానిమల్స్ పై కేరింగ్ చూపించడు.' అని రేణు చెప్పింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
‘డియర్ ఉమ’కు స్పెషల్ బర్త్డే విషెస్
ఒకవైపు హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగానూ రాణిస్తున్నారు తెలుగమ్మాయి సుమయా రెడ్డి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘డియర్ ఉమ’. పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్నాడు. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, నవ్వుతుంటనే లిరికల్ వీడియో సాంగ్ ద్వారా సినిమాలోని ఫీల్ గుడ్ ఎమోషన్కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. అందమైన ప్రేమ కథా చిత్రంగా డియర్ ఉమ అందరినీ ఆకట్టుకునేలా ఉందని అంతా ఫిక్స్ అయ్యారు.సుమయా రెడ్డి పుట్టిన రోజు (మే 18) సందర్భంగా చిత్రయూనిట్ ఆమెకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. అన్నీ తానై నడిపిస్తున్న తమ లేడీ బాస్కు చిత్రయూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement