Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Press Meet Updates1
నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి: వైఎస్‌ జగన్‌

సాక్షి,తాడేపల్లి: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని.. నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.ప్రెస్‌మీట్‌ ముఖ్యాంశాలు..రాష్ట్రంలో రాక్షస రాజ్యంరాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని రాక్షస రాజ్యం నడుస్తోంది. దేవుడి దగ్గరకు వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం నా రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా అడ్డుకుంటున్నారు. అందుకే ఇది రాక్షస రాజ్యం.ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులకు నోటీసులు ఇచ్చారు.ఇక ఆ నోటీసులో ఏం రాశారంటే అంటూ.. చదివి వినిపించారు.‘మాజీ సీఎం వైయస్‌ జగన్‌ తిరుమల తిరుపతి సందర్శనకు, సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున, మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో, మరియు మీ సొంత వాహనాల్లో బయలుదేరి తిరుపతి చేరుకుని, వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమంలో పాల్గొనడం, చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తున్న నోటీస్‌’.అంటే, జగన్‌ అనే వ్యకి మాజీ ముఖ్యమంత్రి. ఆయన తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తుంటే, అందుకు మీకు పర్మిషన్‌ లేదు. మీరు వెళ్తే అరెస్టు చేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఒక్కసారి ఆలోచనే చేయండి.ఏ ప్రపంచంలో ఉన్నాం. ఇది రాక్షస రాజ్యం కాదా? ఒకవైపున ఏమో, నన్ను వెళ్లనీయకుండా, వైయస్సార్‌సీపీ శ్రేణులు వెళ్లకుండా నోటీసులు ఇస్తున్నారు. మరోవైపున టీవీల్లో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి బీజేపీ శ్రేణులను రప్పిస్తున్నారు. ఇది పార్టీ నాయకత్వానికి తెలుసో? లేదో?వేల మంది పోలీసులను మొహరించారు. ఎందుకంతగా టాపిక్‌ డైవర్ట్‌ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు? టాపిక్‌ డైవర్షన్‌ కోసం ఎందుకు ఆరాటపడుతున్నారు?.చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తున్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో, 100 రోజుల పాలన మీద డైవర్ట్‌ చేస్తూ, లడ్డూల టాపిక్‌ తీసుకొచ్చారు. అడ్డగోలుగా తప్పు చేసి, గుడి పవిత్రత దెబ్బతీస్తూ అడ్డంగా దొరికిపోయే సరికి, లడ్డూల టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు కొత్తగా డిక్లరేషన్‌ టాపిక్‌ తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు.ఒకసారి గమనించినట్లయితే, తిరుమల పవిత్రత, స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్భుద్ధితో, జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారైనట్టుగా, ఒక జరగని విషయాన్ని జరిగినట్లుగా.. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్లుగా.. నిజంగా సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్దాలు ఆడుతూ, అసత్యాలు పలుకుతూ.. స్వామి వారి పేరు ప్రఖ్యాతలను, తిరుపతి లడ్డూ విశిష్టతను దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం, సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి చేస్తుంటే.. ఇంత కంటే దారుణం, అధర్మం ఎక్కడైనా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి వాటికి సంబం«ధించిన అన్ని విషయాలు చెబుతాను. చంద్రబాబు అనే వ్యక్తి ఏ రకంగా అబద్దాలు చెప్పి, రెక్కలు కట్టాడనేది ఆధారాలతో చూపిస్తా. దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలంతా చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను.అది రొటీన్‌ ప్రాసెస్‌తిరుమలలో లడ్డూల కోసం నెయ్యి కొనుగోల చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకోసారి రొటీన్‌గా, దశాబ్ధాలుగా జరుగుతోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ–టెండర్‌ పిలుస్తారు. అర్హులు బిడ్‌ వేస్తారు. ఇప్పుడు కొత్తగా నియమాలు పెట్టలేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తిరుపతి లడ్డూకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ టేస్ట్‌ మరెక్కడా ఉండదు. ఆరు నెలలకోసారి ఈ–టెండర్‌. బిడ్లు వేస్తే, ఎల్‌–1 గా వచ్చిన వారికి టెండర్‌ ఖరారు చేస్తారు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు.టీటీడీ బోర్డు ఒక ప్రసిద్ధి గాంచిన బోర్డు. అందులో సభ్యుల కోసం కేంద్ర మంత్రులు, చుట్టుపక్కల రాష్ట్రాల సీఎంలు కూడా రికమెండ్‌ చేస్తారు. వారి వారి రాష్ట్రాల్లో ప్రముఖులను సిఫార్సు చేస్తారు. అంత మంచి లక్షణాలు ఉన్న వారితో బోర్డు ఏర్పాటవుతుంది. వారంతా ప్రసిద్ధి పొందిన వారు. దేవుడికి ఇంకా సేవ చేయాలని, భక్తులకు మంచి చేయాలని నిర్ణయాలు తీసుకుంటారు. చెడు చేయాలన్నా చేయబోరు. అక్కడ నెయ్యి సరఫరా కోసం ఆరు నెలలకోసారి ఈ–టెండర్లు పిలుస్తారు. ఎల్‌–1గా వచ్చిన వారికి కూడా పూర్తి టెండర్‌ ఖరారు చేయరు. 65 శాతం వారికిచ్చి, మిగతా వారిని కూడా రేటు తగ్గించమని చెప్పి, వారికి టెండర్‌ ఇస్తారు.సరఫరాలో రొబస్ట్‌ పద్ధతితిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కూడా రొబస్ట్‌ (ధృఢమైన) విధానం ఉంటుంది. నెయ్యి సరఫరా చేసేవారు, ప్రతి ట్యాంకర్‌తో ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ క్యాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌) సర్టిఫై చేసిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ తీసుకొస్తారు. అలా వచ్చిన నెయ్యిని కూడా ప్రతి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసి, మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్‌ అయితేనే, ట్యాంకర్‌ను ముందుకు పంపుతారు. ఒక్క టెస్టు ఫెయిల్‌ అయినా ట్యాంకర్‌ను వెనక్కు పంపిస్తారు.చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య 14 నుంచి 15 ట్యాంకర్లు అలా వెనక్కు పోయారు. అంటే ఎవరూ తప్పు చేయని విధంగా అక్కడ రొబస్ట్‌ విధానం ఉంది. మా ప్రభుత్వ హయాంలో కూడా 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. ఏ సరుకైనా సరే, క్వాలిటీ టెస్టులో ఫెయిల్‌ అయితే వెనక్కు పంపిస్తారు.ఇప్పుడు ఏం జరిగింది?ఇప్పుడు కూడా అదే జరిగింది. టీటీడీ ట్రస్ట్‌ బోర్డు అనుమతించిన బిడ్డర్లు జూన్‌ 12 నుంచి సరఫరా మొదలుపెట్టారు. అంటే, అప్పటికే చంద్రబాబుగారి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాతే నెయ్యి సరఫరా మొదలైంది. అలా జూన్‌ 12, జూన్‌ 21, జూన్‌ 25, జూలై 4న వచ్చిన ట్యాంకర్లన్నీ టెస్టుల్లో పాస్‌ అయి, ముందుకు కదిలాయి. వాటిని లడ్డూల తయారీలో వాడారు.ఆ తర్వాత జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 12న మరో రెండు ట్యాంకర్లలో వచ్చిన నెయ్యి, టీటీడీ టెస్టుల్లో ఫెయిల్‌ కావడంతో, వెనక్కు పంపడానికి సిద్ధం చేశారు. మరోసారి ఆ శాంపిల్స్‌ పరీక్ష కోసం మామూలుగా మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ (సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)కు పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ (నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌)కి పంపారు. ఇది టీటీడీ చరిత్రలో తొలిసారి. టీటీడీ పంపించిన శాంపిల్స్‌పై ఎన్‌డీడీబీ వారు జూలై 23న రిపోర్ట్‌ పంపారు. నెయ్యిలో కల్తీ ఉందన్న విషయం చెప్పారు. దాంతో ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించారు. అలా 4 ట్యాంకర్లను వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చారు.ఇప్పుడు నేను అడుగుతున్నానుఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడకపోయినా, రెండు నెలల తర్వాత సెప్టెంబరు 18న, చంద్రబాబుగారు ఆ నెయ్యిని వాడారని ఉద్దేశపూర్వకంగా ఎందుకు అన్నారు?. ఇప్పుడు ఒకసారి, చంద్రబాబు నియమించిన టీటీడీ ఈఓ, ఆ నెయ్యి నాణ్యత గురించి జూలై 23న ఏమన్నారో చూద్దాం అంటూ.. ఆ వీడియో చూపారు.ఆ రెండు ట్యాంకర్లను రిజెక్ట్‌ చేశాం. షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చామని, వాటిలో వనస్పతి ఆయిల్‌ కలిపినట్లు తేలిందని చాలా క్రిస్టల్‌ క్లియర్‌గా ఈఓ చెప్పినా.. రెండు నెలల తర్వాత చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఏ రకంగా అబద్ధాలు మాట్లాడారో చూడండి.. అంటూ ఆ వీడియో కూడా ప్రదర్శించి చూపారు.ఘీకి బదులు జంతువుల కొవ్వు వాడారని, లడ్డూలు తయారు చేశారని, వాటిని భక్తులు తిన్నారని అన్నీ తెలిసినా, చంద్రబాబు అబద్దాలు చెప్పారు.టీడీపీ ఆఫీస్‌లో కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌చంద్రబాబుగారు సెప్టెంబరు 18న ఆ ఆరోపణలు చేస్తే, ఆ మర్నాడే.. అంటే సెప్టెంబరు 19న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేశారు. నిజానికి అది కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌. అయినా దాన్ని టీడీపీ ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు.ఆ వెంటనే, మర్నాడు, అంటే సెప్టెంబరు 20 టీటీడీ ఈఓ మళ్లీ ఏం మాట్లాడాడో చూద్దాం.. అంటూ వీడియో ప్రదర్శించారు.ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిలో నాణ్యత లేదని తేలినందువల్ల, ఆ నెయ్యిని వెనక్కి పంపామని, వాడలేదని చెప్పారు. అంతే కాకుండా, సెప్టెంబరు 22న ఈఓ, తాను స్వయంగా సంతకం చేసి, ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారని చెబుతూ.. అందులోని అంశాలు చదివి వినిపించారు.కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కు పంపాం. ఆ కంపెనీకి షోకాజ్‌ నోటీస్‌ కూడా ఇచ్చామని.. తమకు ఎన్‌డీడీబీ రిపోర్టు చాలా గోప్యమని అందులో ప్రస్తావించారు. అయినా దాన్ని, అంతకు ముందే తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో రిలీజ్‌ చేశారు.అది అపవిత్రత కాదా?మళ్లీ సెప్టెంబరు 22న మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, అవే పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కల్తీ నెయ్యి వాడారని చెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఈ మాదిరిగా స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి ప్రతిష్టను, శ్రీ వెంకటేశ్వరస్వామివారి ప్రసాద పేరు ప్రఖ్యాతలను, ఈ మాదిరిగా అబద్దాలతో తగ్గించడం, కుట్ర పూరితంగా వ్యవహరించడం.. అపవిత్రత కాదా?.ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ డిస్‌క్లెయిమర్‌పోనీ.. ఆ ఎన్‌డీడీబీ రిపోర్టు అయినా కచ్చితమైందా? అని చూస్తే, ఆ రిపోర్టులో వాళ్లే డిస్‌క్లెయిమర్‌ రాశారు.‘నెయ్యిలో ఉండాల్సిన స్టాండర్డ్‌ వాల్యూ కన్నా.. శాంపిల్స్‌లోని స్టాండర్డ్‌ వాల్యూస్‌లో డీవియేషన్స్‌ ఉన్నాయి. అయినా, ఈ పరిస్థితుల్లో ఒక ఫాల్స్‌ పాజిటివ్‌ ఫలితం కూడా రావొచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. అంటూ.. పాల సేకరణ, ఆవులు, వాటి దాణ గురించి ప్రస్తావించారు. అలాగే ఆవులకు సరైన ఆహారం లేనప్పుడు, అవి సరిగ్గా తినకుండా బలహీనంగా ఉన్నప్పుడు తీసిన పాల నుంచి కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని రాశారు’.పచ్చి అబద్ధాలు. అపవిత్రం కాదా?ఇవన్నీ తెలిసినా చంద్రబాబు కావాలని అబద్దాలు ఆడుతూ, తిరుమల వెంకటేశ్వరస్వామివారి విశిష్టతను, ప్రసాదాల పవిత్రతను దగ్గరుండి, కావాలని అబద్దాలు చెప్పి, అనుమానపు బీజాలు ప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరిలో లేపడం దుర్మార్గం కాదా? అపవిత్రం కాదా?నీ రాజకీయ స్వార్థం కోసం వెంకటేశ్వరస్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నావు. స్వామి ప్రసాదానికి సంబంధించిన విశిష్టతను దిగజారుస్తున్నావు. జరగనిది జరిగినట్లుగా, జంతువుల కొవ్వుతో ప్రసాదం తయారు చేసినట్లుగా ఒక అబద్దాన్ని ప్రచారం చేస్తున్నావు. ధర్మమేనా?.మీ హయాంలో ఎందుకు వాడలేదు?నందిని బ్రాండ్‌ ఎందుకు వాడడం లేదని అంటున్నారు. మరి చంద్రబాబు పాలన సమయంలో 2015 నుంచి 2018 అక్టోబరు వరకు కెఎంఎఫ్‌కు చెందిన నందిని బ్రాండ్‌ నెయ్యి ఎందుకు లేదు? అప్పుడు కూడా టెండర్లు పిల్చారు కదా? నందిని వాళ్లు ఇష్టం వచ్చినప్పుడే టెండర్లలో పాల్గొంటారు.అప్పుడు ఇంత కంటే తక్కువ ధరఇంకొకరు అంటారు. రూ.320కి కిలో నెయ్యి ఎలా వస్తుందని అంటారు. మరి చంద్రబాబుగారి కూడా 2014–19 మధ్య నెయ్యిని ఏ ధరకు సేకరించారు? ఇప్పుడు కూడా అదే క్వాలిటీ నెయ్యి కదా? దశాబ్దాలుగా అదే క్వాలిటీ. అదే నెయ్యి. మరి చంద్రబాబు హయాంలో 2015లో కిలో నెయ్యిని రూ.276కి కొన్నారు. అదే 2019 జనవరిలో కిలో ఆవు నెయ్యిని రూ.324కు కొన్నారు. మరి ఇక్కడ రూ.320కి కొంటే తప్పేం జరిగింది?.అదే చంద్రబాబు కుట్రమీ హయాం అంతా అవే రేట్లకు కొన్నారు. మరి ఇప్పుడు కూడా అవే ధరలు. చంద్రబాబు తన హెరిటేజ్‌ డెయిరీ కోసం, పాలు కార్టల్‌ ఫామ్‌ చేసి, నెయ్యి రేట్లు పెంచేసి, ఆ కార్టల్‌లో చంద్రబాబునాయుడు, హెరిటేజ్‌ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో, కొత్తగా రేట్లు పెంచడం కోసం మాట్లాడుతున్నాడు. అదే క్వాలిటీ నెయ్యి. అవే స్పెఫికేషన్స్‌. అప్పుడు ఇప్పుడూ ఒకటే. తిరుపతి లడ్డూ చాలా టేస్టు ఉంటుందని గొప్పగా చెప్పుకుంటాం. ఆ లడ్డూ అప్పుడూ, ఇప్పుడూ ఒకటే.చంద్రబాబుగారి పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో, ప్రజలంతా కూడా ఆయనను వేలెత్తి చూపే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో.. లడ్డూ టాపిక్‌లో చంద్రబాబు చేసిన తప్పును ప్రశ్నించడం మొదలు పెట్టారో.. వారికి వాస్తవాలు తెలియడం మొదలైందో.. ఆ పెద్దమనిషి ఏం చేస్తున్నారు.నా డిక్లరేషన్‌ కోరడం ఏమిటి?టాపిక్‌ డైవర్షన్‌ కోసం డిక్లరేషన్‌ అంటున్నాడు. జగన్‌ ఏమైనా కొత్తనా? రాజశేఖర్‌రెడ్డిగారు కొత్తనా? ఆయన ఏమిటో తెలియదా?నా మతం ఏమిటో రాష్ట్రంలో కానీ, దేశంలో తెలియదా? నా కులం ఏమిటో తెలియదా? రాజశేఖర్‌రెడ్డిగారు సీఎంగా 5 ఏళ్లు వరసగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన కొడుకునే కదా?నేను గతంలో చాలాసార్లు వెళ్లాను కదా? సీఎం కాక ముందు కూడా వెళ్లాను కదా?అంతెందుకు నా పాదయాత్ర మొదలుపెట్టే ముందు కూడా స్వామివారిని దర్శించుకున్నాను. 3648 కిలోమీటర్ల పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా, తిరుపతి నుంచి కొండ ఎక్కాను. స్వామివారిని దర్శించుకున్న తర్వాతే ఇంటికి వెళ్లాను. అప్పుడు ఉన్నది చంద్రబాబుగారి ప్రభుత్వం. నేను ప్రతిపక్ష నాయకుడిని. రెండుసార్లు స్వామివారిని దర్శించుకున్నాను కదా?ఆ తర్వాత సీఎంగా వరసగా 5 ఏళ్లు, స్వామివారికి భక్తి శ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను కదా?తొలిసారి ఎవరైనా వెళ్తుంటే, ఇలా అడగొచ్చు. కానీ 10, 11 సార్లు పోయిన తర్వాత, ఈరోజు నేను తిరుపతి వెళ్తానంటే. అడ్డుకుంటూ నోటీసులు ఇవ్వడం ఏమిటి?. డిక్లరేషన్‌ అడగడం ఏమిటి? మా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు నోటీసులు పంపడం ఏమిటి?రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాను. 5 ఏళ్లు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాను. ఎన్నోసార్లు స్వామి వారిని దర్శించుకున్నాను.నా మతం మానవత్వం. అదే నా డిక్లరేషన్‌ఈరోజు నేను వెళ్లకూడదట. కారణం నా మతం అంటున్నారు.అసలు నా మతం ఏమిటని అడుగుతున్నాను. నాలుగు గోడల మధ్య నేను బైబిల్‌ చదువుతాను. తప్పేముంది? బయటకు పోతే హిందూ సంప్రదాయాలను అనుసరిస్తాను. గౌరవిస్తాను. ఇస్లాంను అనుసరిస్తాను. గౌరవిస్తాను. సిక్కిజమ్‌ను అనుసరిస్తాను. గౌరవిస్తాను.నా మతం ఏమిటి అంటున్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్‌లో రాసుకుంటారేమో రాసుకొండి.దేశ రాజ్యాంగంలో ఏం చెప్పారు. నేను చదువుతాను వినండి.‘ఇండియా ఈజ్‌ ఎ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌’.సెక్యులర్‌ అంటే అర్ధం తెలుసా?. నీ మతం చెప్పకపోతే గుడిలోకి రావొద్దు అంటున్నావు. ఇది సెక్యులర్‌ దేశం అంటున్నాం.సీఎంగా పని చేసిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంటే, దళితుల పరిస్థితి ఏమిటి? దళితులను గుడిలోకి పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తాం?చంద్రబాబును ఎందుకు సమర్థిస్తున్నారు?మతం పేరుతో రాజకీయం చేయడం ఎంత దౌర్భాగ్యం? బీజేపీని అడుగుతున్నాను. తామే హిందుత్వానికి ప్రతినిధులం అంటారు. మిమ్మల్నే అడుగుతున్నాను.మీ కళ్ల ఎదుటే, మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే, శ్రీ వెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుపతి లడ్డూ పేరు ప్రఖ్యాతలను, స్వామి వారి వైభవాన్ని, దగ్గరుండి అబద్ధాలు చెబతూ, జంతువుల కొవ్వు వాడకపోయినా, వాడి లడ్డూలు తయారు చేసినట్లుగా.. ఇన్ని ఆధారాలతో సహా, రుజువు అవుతున్నా.. అబద్ధాలతో దుష్ప్రచారం చేసి, వెంకటేశ్వరస్వామివారిని అపవిత్రం చేసిన ఈ వ్యక్తిని ఎందుకు మందలించడం లేదు? ఎందుకు వెనకేసుకొస్తున్నారు?.అంటే మీ వాళ్లు ఏం చేసినా ఫరవాలేదు. మిగిలిన వారు ఏం చేసినా తప్పే? ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇదెక్కడి హిందుత్వం?. హిందుత్వానికి మీకు టార్చ్‌ బేరర్స్‌ అంటారు. అందరూ ఆలోచించండి. నిజంగా హిందుత్వం ఏమిటంటే, మానవత్వం చూపడమే. అలా మానవత్వాన్ని చూపలేని వారు మంచి హిందువును అని చెప్పుకోలేరు.తానే దోషి. తానే జడ్జీ. ఇదెక్కడి ధర్మం?చంద్రబాబునాయుడే తప్పు చేస్తాడు. ఆయనే సిట్‌ వేస్తాడు. ఆయన చెప్పుచేతుల్లో ఉన్న అధికారులతో సిట్‌ అంటాడు. ఇదెక్కడి ధర్మం? ఇదెక్కడి పద్ధతి?. చంద్రబాబు ఈ మాదిరిగా హిందూ ధర్మం మీద దుష్ప్రచారం చేస్తూ, రాజకీయం చేయడం ధర్మమేనా? ఆలోచించండి.ఇదే అందరికీ నా విజ్ఞప్తినేను గుడికి వెళ్లకపోయినా ఫరవాలేదు. కానీ, చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన పార్టీ తరపున మీమీ ఊళ్లలో పూజలు చేయండి. తప్పు చేసింది మేం కాదు. చంద్రబాబు అని వేడుకొండి. అందుకే ఆ కోపాన్ని ప్రజలపై కాకుండా, చంద్రబాబుపై చూపమని వేడుకొమ్మని కోరుతున్నాను.ఒకవైపున మా నాయకులు, ప్రజాప్రతినిధులకు నోటీస్‌లు ఇస్తూ, హౌజ్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. మరోవైపు పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలను రప్పించి, గొడవలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు.అలా టాపిక్‌ను డైవర్ట్‌ చేసేందుకు, చంద్రబాబునాయుడు తాను చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారు.అందుకే నా పర్యటన వాయిదాఈ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్లి, టాపిక్‌ డైవర్ట్‌ చేయడం ఇష్టం లేక, వెంకటేశ్వరస్వామిని ప్రేమించే వ్యక్తిగా, గౌరవించే వ్యక్తిగా, టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదనే ఉద్దేశంతో.. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని అబద్దాలతో, అవమానించి, అగౌరవపర్చాడో.. లడ్డూపై దుష్ప్రచారం చేశాడో.. చేసిన తప్పు ఆధారాలతోసహా కనిపిస్తున్న ఈ సత్యం బయటకు రావాలి.చంద్రబాబునాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి. అది రాష్ట్ర ప్రజల మీదకు రావొద్దు. పాపం చేసిన చంద్రబాబు మీదే కట్టడి కావాలి.దాని కోసం, టాపిక్‌ డైవర్ట్‌ కాకూడదన్న ఉద్దేశంతో నా పర్యటనను వాయిదా వేసుకున్నాను.పూజలు చేయమని కోరుతున్నానురాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌సీపీ అభిమానులే కాదు, ప్రజలందరిని కోరుతున్నాను. చంద్రబాబు చేసిన పాపం వల్ల, వెంకటేశ్వరస్వామికి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపకుండా, కోపం కేవలం చంద్రబాబుమీదే చూపించే విధంగా పూజలు చేయండి.ఎందుకంటే, జరిగింది ఘోర అపచారం. వెంకటేశ్వరస్వామిని పలచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ.. జరగనిది జరిగినట్లుగా.. జంతువుల కొవ్వు వాడనిది వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా.. పచ్చి అబద్దాలు ఆడుతూ, ఇంత ఘోరం చేసిన వ్యక్తి. ఆ పాపం కడగబడాలి. అందుకే అందరినీ కోరుతున్నాను. పూజలు చేయమని వేడుకుంటున్నాను.ఏ మెస్సేజ్‌ ఇస్తున్నారు?బీజేపీవారిలో సిన్సియారిటీ ఉంటే, ఇంత ఘోరం చేసిన చంద్రబాబును రిప్రిమాండ్‌ చేయకుండా, టీటీడీ పేరు ప్రఖ్యాతలు మంట కలిపిన ఈ వ్యక్తిని ఎలా ఉపేక్షిస్తున్నారు? ఎందుకు బుద్ధి చెప్పడం లేదు? ఎందుకు మందలించడం లేదు?. చేసింది మన వాడే అనుకుని వదిలేస్తే.. ఏ మెసేజ్‌ ఇస్తున్నట్లు?మళ్లీ ఘోరమైన తప్పులు జరగొద్దు. అందుకు చంద్రబాబుకు తిట్లు పడాలి. మతాన్ని, దేవుణ్ని రాజకీయాల్లోకి తీసుకురాకుండా, ఆయనను మందలించాలి. సుప్రీంకోర్టు నుంచి ప్రధాని నుంచి పడాలి. అప్పుడైనా ఈ మనిషికి జ్ఞానం కలుగుతుందని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Satyam Sundaram Movie Review And Rating In Telugu2
‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ

టైటిల్‌: సత్యం సుందరంనటీనటులు: కార్తి, అరవింద్‌ స్వామి, కిరణ్‌, దివ్య, జయ ప్రకాశ్‌నిర్మాతలు: సూర్య, జ్యోతిక దర్శకత్వం: ప్రేమ్‌ కుమార్‌సంగీతం: గోవింద్ వసంత్‌విడుదల తేది: సెప్టెంబర్‌ 28, 2024ఈ వారం బరిలో ఎన్టీఆర్‌ ‘దేవర’ ఉండడంతో ఇక్కడ మరో చిత్రమేది రిలీజ్‌ కాలేదు. కొన్ని సినిమాలు ఈ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నా.. దేవర ఎంట్రీతో వెనక్కి తగ్గాయి. కానీ ఒక డబ్బింగ్‌ మూవీ మాత్రం టాలీవుడ్‌లో దేవరతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అదే సత్యం సుందరం. ​తమిళ స్టార్‌ హీరోలు కార్తి, అరవింద్‌ స్వామి కలిసి నటించిన ఈ చిత్రానికి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్‌ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్‌ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఈ కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. రామలింగం(జయ ప్రకాశ్‌) ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వికుల నుంచి వచ్చిన ఇంటిని, సొంత ఊరిని వదిలి కొడుకు సత్యమూర్తి అలియాస్‌ సత్యం (అరవింద్‌ స్వామి), భార్యతో కలిసి వైజాగ్‌కి వెళ్తాడు. 22 ఏళ్ల తర్వాత బాబాయ్‌ కూతురు భువన పెళ్లి కోసమై సత్య మళ్లీ తన సొంతూరు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంతో సత్య ఊరికి వెళ్తాడు. తనకు ఇష్టమైన చెల్లి భువన పెళ్లిలో కనబడి వెంటనే వైజాగ్‌కి తిరిగి వద్దామనుకుంటాడు. అయితే పెళ్లిలో బావా..అంటూ ఓ వ్యక్తి(కార్తి) వచ్చి సత్యను ఆప్యాయంగా పలకరిస్తాడు. అతను ఎవరో సత్యకు తెలియదు. ఈ విషయం తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగానే ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే చిన్ననాటి విషయాలేవి గుర్తుకు రాకున్నా ఏదోలా మ్యానేజ్‌ చేస్తుంటాడు. తాను వెళ్లాల్సిన బస్‌ మిస్‌ అవ్వడంతో ఓ రాత్రంతా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో సత్య జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? పేరు కూడా తెలియని వ్యక్తి చూపించే అతి ప్రేమకు సత్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఆ వ్యక్తి పేరు సుందరం అని సత్యకు ఎప్పుడు,ఎలా తెలిసింది? సత్యాని సుందరం అంత ఆప్యాయంగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? సత్యతో సుందరానికి ఉన్న బంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే చిత్రం ఏ భాషలోనైనా విజయం సాధించడం తథ్యం. ఈ విషయం డైరెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌కి బాగా తెలుసు. అప్పుడు 96, ఇప్పుడు సత్యం సుందరం.. ఈ రెండు సినిమాల కథలు నేచురల్‌గా ఉంటాయి. హీరో పాత్ర మన చుట్టు ఉండే ఓ వ్యక్తిలాగానో లేదా మనలోనే చూసుకునేలా ఉంటుంది. 96 సినిమా మాదిరే సత్యం సుందరం కథ కూడా చాలా చిన్నది. అందరికి తెలిసిన, చూసిన కథ. అయినా కూడా తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడ బోర్‌ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. ఇది సినిమా లాగా కాకుండా ఎవరో మన ఆత్మీయులను చూస్తున్నట్లుగా, వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుంది.సినిమా ప్రారంభం అయినా కాసేపటికే మనం కార్తి, అరవింద్‌ స్వామి పాత్రలతో కనెక్ట్‌ అయిపోతాం. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు..సన్నివేశాలన్నీ మన ఇంట్లోనో..లేదా మనకు తెలిసివాళ్ల ఇంట్లోనో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు..మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. స్క్రీన్‌ మీద పండించిన ఎమోషన్‌కి సీట్లలో ఉండే ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లు చెప్పుకునే చిన్ననాటి ముచ్చట్లు..మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇక సత్య తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సీన్‌ అయితే గుండెను బరువెక్కిస్తుంది. అతి ప్రేమను చూపించే వ్యక్తి పేరు తెలియక సత్య పడే బాధను చూసి మనకు కన్నీళ్లు వస్తాయి. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుతూనే మనలో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతుక్కుంటాం. వాళ్లు ఇద్దరు కలిసి మందేస్తే.. మత్తు మనకెక్కుతుంది. సైకిల్‌ సీన్‌ చూసి.. మనకు తెలియకుండానే కళ్లు తడిసిపోతాయి. స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు కార్తి, అరవింద్‌ స్వామి పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం అయ్యేలా చేయడం దర్శకుడు వందశాతం సక్సెస్‌ అయ్యాడు. అయితే, ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లో ఉండడం. సినిమా నివిడి చాలా ఎక్కువ. అందుకే కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన కార్తి, అరవింద్‌ స్వామి ఇద్దరు బడా హీరోలే. కానీ ఆ ఇమేజ్‌ మాత్రం తెరపై ఏ మాత్రం కనిపించదు. తెరపై మనకు సత్యం, సుందరం పాత్రలే కనిపిస్తాయి కానీ ఎక్కడా కార్తి, అరవింద్‌ స్వామి గుర్తుకురారు. ప్రేమ్‌ కుమార్‌ రాసిన సహజ కథకు తమదైన సహస నటనతో ఇద్దరూ న్యాయం చేశారు. ఎమోషనల్‌ సీన్లలో ఇద్దరూ పోటీ పడీ నటించారు. ఇక కార్తి అయితే తన అమాయకత్వపు నటనతో కొన్ని చోట్ల నవ్వించాడు. కిరణ్‌, దివ్య, జయ ప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత్‌ మరోసారి తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ క్రియేట్‌ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు పని తీరు చాలా బాగుంది. ప్రతిఫేమ్‌ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్‌: 3.25/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Bigg Boss Telugu 8, Sep 27th Full Episode Review: Imitation Task in BB House3
పృథ్వీ ఆమెకు పడిపోయాడు, తనను చూస్తే భయమేస్తోంది: సోనియా

సీరియస్‌ టాస్క్‌లకు చెక్‌ పెడుతూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లతో ఫన్‌ గేమ్‌ ఆడించాడు. ఒకరి పాత్రల్లో మరొకరు దూరి మిమిక్రీ చేయాలన్నాడు. ఇంకేముంది.. హౌస్‌మేట్స్‌ దొరికిన ఛాన్స్‌ను బీభత్సంగా వాడుకున్నారు. నబీల్‌ అయితే నెక్ట్స్‌ లెవల్‌.. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్‌ 27) ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..పృథ్వి మాయలో విష్ణుపృథ్వి, విష్ణుప్రియకు ఒకరంటే ఒకరికి ఇష్టం. నిన్న టాస్కులో కూడా పృథ్వి.. విష్ణుకోసం ప్రేమపాట పాడటం.. అది విని ఆమె పరవశించిపోవడం చూశాం. వారి ఇష్టాన్ని గ్రహించిన సోనియా.. పృథ్విగాడిని చూస్తే భయం వేస్తుంది. ఆమె (విష్ణు)కు పడిపోతున్నాడు. నాకు ఏది నిజం? ఏది అబద్ధమో తెలియదుగానీ అలా అనిపిస్తుంది అని నిఖిల్‌తో చెప్పుకొచ్చింది. అటు విష్ణుప్రియ కూడా.. తన లేడీ గ్యాంగ్‌కు పృథ్వీ అంటే ఇష్టమని చెప్పి అతడితోనే ఎంచక్కా ఉంటోంది.రేషన్‌ టాస్క్‌తర్వాత బిగ్‌బాస్‌ రేషన్‌ టాస్క్‌ పెట్టాడు. అందులో భాగంగా తాను వినిపించే శబ్దాలను వరుస క్రమంలో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో శక్తి టీమ్‌ గెలవగా తమకు కూరగాయలు, పండ్లు, కూల్‌డ్రింక్‌ తీసుకునేందుకు ఎక్కువ గడువు దొరికింది. కాంతార టీమ్‌కు వాటిని సంపాదించుకునేందుకు తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు.టీమ్‌ మార్చేసిన మణిఅనంతరం బిగ్‌బాస్‌.. గార్డెన్‌ ఏరియాలో ఓ బంగారు గాజును పెట్టాడు. దాన్ని ఉపయోగించుకుని వేరే టీమ్‌లోకి మారొచ్చని చెప్పాడు. నబీల్‌ను లాక్కోవాలని శక్తి టీమ్‌.. పృథ్విని లాక్కోవాలని కాంతార టీమ్‌ ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ నాగమణికంఠ గోల్డెన్‌ బ్యాంగిల్‌ ధరించాడు. అలా శక్తి టీమ్‌ను వదిలేసి కాంతార టీమ్‌లో చేరాడు. అయితే కాంతార టీమ్‌లో నుంచి ఒకరిని స్వాప్‌ చేయాలనడంతో ఆదిత్యను శక్తి టీమ్‌కు పంపించాడు.పరకాయ ప్రవేశంతర్వాత బిగ్‌బాస్‌.. ఇంట్లో ఫన్‌ గేమ్‌ ఆడించాడు. ఒకరిని ఒకరు ఇమిటేట్‌ చేయాలన్నాడు. ప్రేరణ.. మణి పాత్రలో జీవించేసింది. ఆదిత్య.. సోనియాను అచ్చుదింపేశాడు. నబీల్‌.. ఆదిత్య పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. ఎవరూ తగ్గలేదు. అందరిలో నబీల్‌ను బెస్ట్‌ పర్ఫామర్‌గా ప్రకటించారు. ఇక ఈ ఇమిటేషన్‌ టాస్కులో నిఖిల్‌, సోనియా, పృథ్వీలను ఒక గ్రూపుగా పేర్కొంటూ వారిపైనే ఫోకస్‌ పెట్టడంతో సోనియా తెగ సంతోషపడిపోయింది. తమ ముగ్గురి గురించే హౌస్‌ అంతా మాట్లాడుకుంటోందని మురిసిపోయింది.మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Ap Cpi Leader Ramakrishna Comments On TTD Declaration Issue4
వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ ఎందుకివ్వాలి: రామకృష్ణ

సాక్షి,హైదరాబాద్‌: వెంకటేశ్వర స్వామిని ముందుపెట్టి రాజకీయాలు చేయడం తగదని, స్వామి వద్దకు అందరూ వెళ్లొచ్చని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ విషయమై రామకృష్ణ శుక్రవారం(సెప్టెంబర్‌27)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.‘అందరివాడైన వెంకటేశ్వరస్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదు. తిరుమలకు జగన్‌ వెళ్తే అపవిత్రం అనే వ్యాఖ్యలు తగదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ భార్య క్రిస్టియన్‌ కాదా? మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నాడు. నాడు వైఎస్‌ రాజశే‌ఖర్‌రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వైఎస్‌ జగన్‌ ఐదేళ్లపాటు సీఎంగా ఉండి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు ఇవ్వడమంటేనే ఒక ప్రాధాన్యతగల అంశం. అప్పుడు ఏమీ మాట్లాడకుండా నేడు సాధారణ భక్తునిలా వైఎస్‌ జగన్‌ తిరుమల వెళ్తానంటే డిక్లరేషన్‌ అడగడమేంటి’అని రామకృష్ణ ప్రశ్నించారు.ఇదీ చదవండి: దొరికిపోయిన చంద్రబాబు..అబద్ధాలు బట్టబయలు

Tirupati Laddu Row: YS Jagan Counter On Chandrababu Naidu Allegations5
దొరికిపోయిన చంద్రబాబు.. అబద్ధాలు బట్టబయలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధికోసం చేస్తున్న తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈరోజు(శుక్రవారం) ‍ తాడేపల్లిలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. చంద్రబాబు చేస్తున్న విష రాజకీయాలను ఎండగట్టారు. చంద్రబాబు మళ్లీ మళ్లీ అబద్ధాలుసెప్టెంబర్‌ 18వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో‘యానిమల్‌ ఫ్యాట్‌ కలిసిందంటూ కొత్త వివాదానికి తెరలేపడాన్ని కూడా వైఎస్‌ జగన్‌ వీడియో ముఖంగా ప్రస్తావించారు. ‘‘భక్తులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది, ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రిడియంట్స్‌ కాకుండా యానిమల్‌ ఫ్యాట్‌ కూడా వాడారు’’అని చంద్రబాబు పేర్కొనడాన్ని వైఎస్‌ జగన్‌ కౌంటర్‌ చేశారు.సెప్టెంబర్‌ 22వ తేదీన తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు చెప్పడాన్ని వైఎస్‌ జగన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఆ ట్యాంకర్లను ఈవో వాడలేదని , వెనక్కి పంపామని చెబితే, ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు.. ఆ నెయ్యి వాడారంటూ అసత్యపు ప్రచారం చేయడాన్ని వీడియో ప్లే చేసి మరీ చూపించారు వైఎస్‌ జగన్‌జూలై 23వ తేదీన టీటీడీ ఈవో ఇలా.. తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావులు వేర్వేరు సందర్భాల్లో ఏమి మాట్లాడారో వీడియోలు ప్లే చేసి మరీ చూపించారూ వైఎస్‌ జగన్‌. స్వయంగా చంద్రబాబు నాయుడు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు జూలై 23 వ తేదీన ఏం మాట్లాడారో వీడియో ముఖంగా చూపించారు వైఎస్‌ జగన్‌ఆ నెయ్యి వాడలేదని ఈవోనే రిపోర్ట్‌ ఇచ్చాడు..మళ్లీ సెప్టెంబర్‌ 20వ తేదీన టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా ముఖంగా మాట్లాడుతూ ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదంటూ ధృవీకరించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు వైఎస్‌ జగన్‌. 22వ తేదీన తాను సంతకం చేసి మరీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ ఇచ్చాడు ఈవో శ్యామలరావు. ల్యాబ్‌ టెస్టులో ఫెయిలైన నెయ్యిని వాడలేదని, సదరు ట్యాంకర్లను తిరిగి వెనక్కి పంపామని ఈవో తన రిపోర్ట్‌లో పేర్కొన్నాడు.

Why Google Paid 2 7 Billion Dollars to AI Genius Noam Shazeer6
ఆయన కోసం గూగుల్ రూ. వేలకోట్ల ఆఫర్!.. ఏకంగా..

ఈ రోజు టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. తప్పకుండా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి మాట్లాడకుండా ఉండలేము. అంతలా ఎదిగిన ఈ ఏఐను దిగ్గజ కంపెనీలు సైతం మరింత విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ నిపుణుడు 'నోమ్ షజీర్‌'ను తిరిగి నియమించుకోవడానికి భారీ మొత్తంలో ఆఫర్ చేసింది.గూగుల్ కంపెనీ నోమ్ షజీర్‌ను తిరిగి నియమించుకోవడానికి ఏకంగా 2.7 బిలియన్ డాలర్లు చెల్లించనుంది. ఈయన మళ్ళీ గూగుల్ జెమినీలో పనిచేయడానికి జాయిన్ అవుతున్నట్లు సమాచారం.నిజానికి నోమ్ షజీర్‌ గూగుల్ మాజీ ఉద్యోగి. ఈయన 2000లో గూగుల్ కంపెనీలో పనిచేశారు. అప్పట్లోనే తన సహోద్యోగి డేనియల్ డి ఫ్రీటాస్‌తో కలిసి డెవలప్ చేసిన ‘చాట్ బాట్‌’ను విడుదల చేయాలన్నఅభ్యర్థనను కంపెనీ తిరస్కరించడంతో.. 2021లో గూగుల్ వదిలి వెళ్లారు.ఇదీ చదవండి: నీటిపై తేలే ఇల్లు.. చాలా ఆనందంగా ఉంది: ఆనంద్ మహీంద్రానోమ్ షజీర్, డేనియల్ డి ఫ్రీటాస్‌ Character.AI కనుగొన్నారు. ఇది అతి తక్కువ కాలంలోనే సిలికాన్ వ్యాలీలో గొప్ప ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా మారింది. ఇది గతేడాది ఒక బిలియన్ విలువకు చేరుకుంది. ఆ తరువాత వీరిరువురు గూగుల్ ఏఐ యూనిట్ డీప్‌మైండ్‌లో చేరుతున్నట్లు గూగుల్ ప్రకటించింది.

Injured Cameron Green Ruled Out Of England Tour7
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్‌ షాక్‌

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా గ్రీన్‌కు వెన్ను సంబంధించిన సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో ఇవాళ జరుగుతున్న నాలుగో వన్డేకు గ్రీన్‌ అందుబాటులో లేడు. ఈ గాయం నేపథ్యంలో గ్రీన్‌ బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో పాల్గొంటాడా లేదా అన్నది సందిగ్దంగా మారింది. గాయం​ తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం​ లేదు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండో వన్డేకు దూరంగా ఉన్న గ్రీన్‌ మూడో వన్డేలో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. ఆ మ్యాచ్‌లో గ్రీన్‌ 2 వికెట్లు తీసి 45 పరుగులు చేశాడు. తాజాగా గ్రీన్‌ గాయం బారిన పడటంతో ఈ పర్యటనలో ఆసీస్‌ ఇంజ్యూరీస్‌ సంఖ్య ఐదుకు చేరింది. ఈ సిరీస్‌ ప్రారంభమైన నాటి నుంచి గాయాల కారణంగా నాథన్‌ ఇల్లిస్‌, జేవియర్‌ బార్ట్‌లెట్‌, రిలే మెరిడిత్‌, బెన్‌ డ్వార్షుయిస్‌ జట్టుకు దూరమయ్యారు.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ముగియగా.. ఆసీస్‌ రెండు, ఇంగ్లండ్‌ ఒక్క మ్యాచ్‌లో గెలుపొందాయి. నాలుగో వన్డే ఇవాళ లార్డ్స్‌ వేదికగా జరుగుతుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఫిలిప్‌ సాల్ట్‌ (22), విల్‌ జాక్స్‌ (10) ఔట్‌ కాగా.. బెన్‌ డకెట్‌ (58), హ్యారీ బ్రూక్‌ (35) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో హాజిల్‌వుడ్‌, మిచెల్‌ మార్ష్‌ తలో వికెట్‌ పడగొట్టారు.చదవండి: 56 ఏళ్ల కిందటి చెత్త రికార్డును బద్దలు కొట్టిన బంగ్లాదేశ్‌ బ్యాటర్‌

T​elangana Highcourt Summoned Hydra Commissioner8
హైడ్రా కమిషనర్‌ విచారణకు రావాలి: హైకోర్టు

సాక్షి,హైదరాబాద్‌:కూల్చివేతలపై హైడ్రాను తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.శనివారం నోటీసులిచ్చి ఆదివారం కూలగొడతారా? అని హైడ్రాను హైకోర్టు నిలదీసింది. కోర్టు స్టే ఉన్నా ఎలా కూల్చివేస్తారని సంగారెడ్డి అమీన్‌పూర్‌ వాసి వేసిన పిటిషన్‌పై శుక్రవారం(సెప్టెంబర్‌27) హైకోర్టు విచారించింది.తన ఆస్పత్రిని కూల్చి మందులన్నీ నేలపాలు చేశారని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు.దీనిపై సోమవారం కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని హైడ్రా కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.ఫిజికల్‌గా లేదా వర్చువల్‌గా సోమవారం ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని కోరింది.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్‌..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత

Jani Master Statement On His Assistant Choreographer9
పెళ్లి చేసుకోమని ఆమె నన్ను వేధించేది: జానీ మాస్టర్‌

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ను విచారించేందుకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు. అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జానీ మాస్టర్‌ చిక్కుల్లో పడ్డారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కాపీని జానీ మాస్టర్‌ ముందు ఉంచి నార్సింగి పోలీసులు విచారించారు. అయితే, బాధితురాలే తనను గతంలో వేధించిందని తాజాగా జరిగిన పోలీసుల విచారణలో జానీ మాస్టర్‌ పేర్కొన్నట్లు సమాచారం.పోలీసుల విచారణలో నేడు (సెప్టెంబర్‌ 27) పాల్గొన్న జానీ మాస్టర్‌ కాస్త అనారోగ్యంగా ఉన్నారు. దీంతో ఆయనకు వైద్య పరీక్షలు జరిపించారు. పోలీసుల విచారణలో భాగంగా బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో జానీ మాస్టర్‌ ఏకీభవించలేదని తెలుస్తోంది. తనపై ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జానీ మాస్టర్‌ తెలిపాడు. ఒక టీవీ కార్యక్రమంలో ప్రసారం అవుతున్న ఢీ షో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందని జానీ పేర్కొన్నాడు. అయితే, తను మైనర్‌గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్ధమని చెప్పాడు. తన టాలెంట్‌ను గుర్తించి మాత్రమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానన్నాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలే తనను మానసికంగా హింసించేదని జానీ మాస్టర్‌ తెలిపాడు. ఈ క్రమంలో ఎన్నోసార్లు బాధితురాలు తనను బెదిరించినట్లు తెలిపాడు. దీంతో ఈ సమస్యను డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లాగా.. బాధితురాలితో మాట్లాడారు. అయినా కూడా ఆమెలో మార్పు రాలేదని అన్నాడు. తనపై కుట్ర జరిగిందని, తన వెనుక ఎవరో ఉండి ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నాడు. తన ఎదుగుదలను ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని జానీ మాస్టర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇప్పటికే మూడు రోజుల పాటు జానీమాస్టర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. రేపటితో (సెప్టెంబర్‌ 28) జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుంది. రేపు ఉదయం జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Second Mpox case confirmed in Kerala10
దేశంలో మరో మంకీపాక్స్‌ కేసు నమోదు

తిరువనంతపురం: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు శుక్రవారం ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది. కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. .ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లోమంకీపాక్స్‌ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్‌ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్‌ వచ్చింది. దీంతో కేరళలో తొలి మంకీ పాక్స్‌ కేను నిర్ధారణైంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. మంకిపాక్స్‌ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వైరస్‌ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.చదవండి : మంకీపాక్స్‌ వైరస్‌ లక్షణాలు

Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
NRI View all
title
హాలీవుడ్‌లో మనోడి సినిమా

కరీంనగర్‌ అర్బన్‌: సినిమా.. అదో రంగుల ప్రపంచం.

title
టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'': తెలుగు సాహిత్య వేదిక 206వ సాహిత్య సదస్సు

ఈ నెల (సెప్టెంబరు నెల) 21వ తేదీ  శనివారం  డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ''నెలనె

title
డాలస్‌లో ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు..!

దాదాసాహెబ్ పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా.

title
అమెరికాలో గుండెపోటుతో తెలుగు విద్యార్థి హఠాన్మరణం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు డల్లాస్‌లో గుండెపోటుతో మరణించాడు.

title
న్యూజెర్సీలో విజయవంతంగా నాట్స్ పికిల్‌బాల్ టోర్నీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు న్యూజెర్సీలో తాజాగా పికిల్ బాల్ టోర్న

Advertisement
Advertisement