ఎఫ్‌పీఐల షాక్‌ | FPIs withdraw Rs 23710 cr from equities in Feb | Sakshi

ఎఫ్‌పీఐల షాక్‌

Feb 24 2025 6:31 AM | Updated on Feb 24 2025 8:02 AM

FPIs withdraw Rs 23710 cr from equities in Feb

ఫిబ్రవరిలోనూ కొనసాగుతున్న అమ్మకాలు 

ఇప్పటివరకూ రూ. 23,710 కోట్లు వెనక్కి 

దేశీ స్టాక్‌ మార్కెట్లో కొద్ది నెలలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాలకే ఆసక్తి చూపుతున్నారు. ఈ నెలలోనూ ఇదే బాటలో కొనసాగుతున్నారు. దీంతో ఫిబ్రవరి 3–21 మధ్య నికరంగా రూ. 23,710 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనల మధ్య దేశీ స్టాక్స్‌లో విక్రయాలకు తెరతీస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

డిపాజిటరీల గణాంకాల ప్రకారం జనవరిలో ఎఫ్‌పీఐలు దేశీ మార్కెట్ల నుంచి రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. వెరసి కొత్త కేలండర్‌ ఏడాది(2025)లో ఇప్పటివరకూ రూ. 1,01,737 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మివేశారు. ఫలితంగా ఈ కాలంలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 4 శాతం నష్టపోయింది. పటిష్ట ఆరి్థక పురోగతి, కార్పొరేట్‌ ఫలితాలలో వృద్ధి వంటి సానుకూల అంశాలు మాత్రమే తిరిగి ఎఫ్‌పీఐలను ఆకట్టుకోగలవని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌.. పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్‌ అభిప్రాయపడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement