ప్రజలకు వైఎస్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
Published Thu, Apr 14 2016 9:38 PM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అటు భద్రాద్రిలోను, ఇటు ఒంటిమిట్టలోను, రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాల్లోనూ.. ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ శుభాలు కలిగేలా సీతారాముల ఆశీస్సులు లభించాలని ఆయన కోరుకున్నారు.
Advertisement
Advertisement