Short Stories | Sakshi
1

ఇషా అంబానీ ఇల్లు, లగ్జరీకి నెక్ట్స్‌ లెవల్‌ అంతే!

భారతీయ బిలియనీర్, ముఖేష్ అంబానీ కుమార్తె, ఇషా అంబానీ పిరమల్ దేశంలోని అత్యంత స్ఫూర్తిదాయ కమైన వ్యాపార మహిళలలో ఒకరు. 32 సంవత్సరాల వయస్సులో, రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అంబానీ నివసించే విలాసవంతమైన ఇల్లు గురించి ఎపుడైనా ఆలోచించారా? ముంబై నడిబొడ్డున ఉందీ అద్భుతమైన ఇల్లు, అత్యాధునిక సౌకర్యాలు, విశాలమైన గదులు, పచ్చదనంతో అద్భుతంగా లగ్జరీకి నెక్ట్స్‌ లెవల్‌ అన్నట్టుగా ఉంటుంది.
Read More
2

వాట్సాప్‌లో కొత్త ఫీచర్

స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ.. దాదాపు వాట్సాప్ ఉపయోగిస్తుంటారు. ఈ యాప్ ఉచిత మెసేజింగ్ & వీడియో కాలింగ్ వంటి వాటికి అనుమతిస్తుంది. సంస్థ యూజర్ల భద్రత, సౌలబ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త ఫీచర్ పరిచయం చేసింది.
Read More
3

వైభవంగా బిగ్‌బాస్‌ ప్రియాంక దేశపాండే వివాహం​

ప్రముఖ యాంకర్‌, టీవీ ప్రెజెంటర్‌, బిగ్ బాస్ తమిళ సీజన్ 5 ఫేమ్‌ ప్రియాంక దేశ్‌పాండే తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తన నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాదు, ఆయా షోలకు సక్సెస్‌కు కీలకంగా నిలిచింది. అందుకే ఆమెను దక్షిణ భారత టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్‌గా పేరొందింది. తాజాగా ఆమె తనప్రియుడితో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఈ ఫోటోలు నెట్టింట సందడిగామారాయి.
Read More
4

స్కెలిటన్‌లా కరణ్‌జోహార్‌, నెటిజన్లు ఏమన్నారంటే.!

చిత్రనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) అకస్మాత్తుగా బరువు తగ్గి, బక్కచిక్కిపోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇంత త్వరగా బాగా బరువు తగ్గి అటు అభిమానులను, ఇటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. అదనపు బరువును తగ్గించడానికి అసహజ పద్ధతులను ఉపయోగిస్తున్నాడనే పుకార్లు జోరుగా వ్యాపించాయి. బరువు తగ్గడానికి ఓజెంపిక్ (Ozempic) ఇంజెక్షన్లను ఉపయోగిస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమన్నాయి.
Read More
5

Goshala Row: ఎవరిది అసత్య ప్రచారం..? ప్రశ్నిస్తే కేసులే!

తిరుపతి, సాక్షి: శ్రీవారి గోశాలలో గోమాతల మరణాల వ్యవహారంలో ఊహించిందే జరిగింది. వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)పై కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయించింది.
Read More
6

టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాక్

టాలీవుడ్ నటి, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌ గురైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్ వాటిని ఎవరూ నమ్మవద్దని అభిమానులను, సన్నిహితులను కోరింది. తనకు డబ్బులు అవసరమైతే డైరెక్ట్‌గా అడుగుతానని తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరినీ నేను డబ్బులు అడగనని ట్వీట్ చేసింది. ఇలాంటి వాటి పట్ల దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.
Read More
7

'భారత్ మూడేళ్ళలో ఆ దేశాలను అధిగమిస్తుంది'

రాబోయే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ.. జర్మనీ, జపాన్ కంటే పెద్దదిగా ఉంటుంది. 2047 నాటికి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించవచ్చని నీతి ఆయోగ్ సీఈఓ 'బీవీఆర్ సుబ్రహ్మణ్యం' న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.
Read More
8

బెస్ట్‌ ఫ్రెండ్స్‌ స్టోర్‌ లాంచ్‌లో... తళుక్కున మెరిసిన నీతా

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ ఫ్యాషన​ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఖరీదైన చేనేత పట్టుచీరలు, కోట్ల విలువైన డైమండ్‌ ఆభరణాలు అనగానే ఫ్యాషన్‌ ఐకాన్‌ నీతా అంబానీ గుర్తు రాక మానరు అంటే అతిశయోక్తికాదు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్యగా మాత్రమే కాదు, వ్యాపారవేత్తగా , ఐపీఎల్‌ ఫ్రాంచైజీ యజమానిగా, దాతగా ఎపుడూ ఆకర్షణీయంగా ఉంటారు. తాజాగా జియో వరల్డ్‌ ప్లాజాలో తళుక్కున మెరిసారు.
Read More
9

కశ్మీర్‌పై మా ఆశ చావదు

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌(General Asim Munir) భారత్‌ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్‌, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్‌ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు.
Read More
10

లైఫ్‌కు గ్యారంటీ లేదు..పైగా మనీ వేస్ట్‌.. అందుకే..!

కేన్సర్‌ మహమ్మారి సోకిందంటే మరణ శాసనమే అని చాలా మంది భావిస్తారు. కానీ ఆధునిక వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరువాత కేన్సర్‌ను జయించవచ్చు. మెరుగైన వైద్యం, కుటుంబ సభ్యుల సహకారంతోపాటు, ఆత్మ విశ్వాసం, మనోధైర్యం ఉంటే ఈ వ్యాధినుంచి బైటపడవచ్చు. మరీ ముఖ్యంగా కేన్సర్‌ వ్యాధి నివారణలో ముందస్తు గుర్తింపు, అవగాహన చాలా అవసరం. ఈ అవగాహన లేమి కారణంగా పచ్చని కాపురం కుప్పకూలి పోయింది.
Read More
11

లకారానికి దగ్గర్లో పసిడి

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More
12

ఒక్క క్షణం.. జీవితాంతం క్షోభ: బాబూ మోహన్‌

యువత వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబాన్ని గుర్తుచేసుకోవాలని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ సూచించారు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆశ్రమంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి భోజనం వడ్డించారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తికి జుట్టు కత్తిరించారు. అనాథలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Read More
13

వెంటిలేటర్‌పై ఉండగానే, 46ఏళ్ల మహిళపై..!

మహిళల వేషధారణ, ఆహార్యం ఆధారంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న వాదనలకు చెంపపెట్టు ఈ వార్త. ఆడవారి వయసు, ప్రదేశంతో సంబంధం లేకుండా మృగాళ్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మారాల్సింది ఆడవాళ్ల దుస్తులు కాదు, కామాంధుల దుష్టబుద్ది అని నూటికి నూరుపాళ్లు స్పష్టం చేసిన విచారకరమైన వార్త ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గురుగ్రామ్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్‌హోస్టెస్‌పై లైంగిక దాడి కలకలంరేపుతోంది.
Read More
14

వ్యాపారితో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఎంగేజ్‌మెంట్‌

ప్రముఖ కన్నడ నటి వైష్ణవి గౌడ (Vaishnavi Gowda) తన అభిమానులను గుడ్‌ న్యూస్‌ చెప్పింది. 2013 టీవీ సీరియల్ అగ్నిసాక్షి సీరియల్‌ పాపులర్‌ అయినా వేలాది మంది అభిమానుల హృదయాల్లో ఒక ముద్ర వేసిన ఈ అమ్మడు జీవితంలో కొత్త అధ్యయానికి నాంది పలకబోతోంది. ప్రియుడు అనుకూల్ మిశ్రాతో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ ప తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది.
Read More
15

టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పు: 15 రోజుల్లో అమలు!

టోల్ గేట్స్ వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి.. 2019లో ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) అనే ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్ 'గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్' (GNSS) తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
Read More
16

బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ విడుదల

ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్‌ క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్‌ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆగస్ట్‌ 17న వన్డే సిరీస్‌.. 26న టీ20 సిరీస్‌ మొదలవుతాయి.
Read More
17

రూ. 500 కోట్ల నీతా డైమండ్‌ నెక్లెస్‌ రెప్లికా ధర ఎంతంటే?

‌మార్కెట్లో ‘రెప్లికా’ ట్రెండ్‌ సృష్టిస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. ఆభరణాలకు, వస్త్రాలకు నకిలీలు మార్కెట్లో సంచలనం రేపుతున్నాయి. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ గ్రాండ్‌ వెడ్డింగ్‌ సందర్బంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ పచ్చలు పొదిగిన డైమండ్ నక్లెస్ ఖరీదు రూ.500 కోట్లు. దీనికి సంబంధించిన రెప్లికా ఆభరణం నెట్టింట వైరలవుతోంది.
Read More
18

ఈ అవకాశం మళ్లీ రాదేమో.. తగ్గిన బంగారం ధర..

ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఇటీవలి కాలంలో ఒడిదొడుకులకు లోనవుతుంది. సోమవారంతో పోలిస్తే మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు మరింత ఊరట కల్పించింది.
Read More
19

షిర్డీ సాయినాధుడి సేవలో నీతా అంబానీ

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, మానవతావాదిగా మాత్రమే కాదు ఆధ్యాత్మికవాదిగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. ఇటీవల నీతా షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించింది. సాయినాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయదుస్తుల్లో దుస్తుల్లో తల్లి పూర్ణిమ దలాల్,తల్లి పూర్ణిమ దలాల్ ,సోదరి మమతా దలాల్‌తో కలిసి షిర్డీ ఆలయంలో బాబాను దర్శించుకున్నారు.
Read More
20

Amarnath Yatra 2025: రిజిస్ట్రేషన్లు షురూ!

Amarnath Yatra 2025 ప్రముఖ ఆధ్మాత్మిక యాత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేది అమర్‌నాథ్‌యాత్ర. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమర్‌నాథ్‌ యాత్ర షెడ్యూల్‌ వచ్చేసింది. ప్రతి ఏడాది నిర్వహించే ఈ యాత్రకు రిజిష్ట్రేషన్ల ప్రక్రియ షురూ అయింది. అన్ని పత్రాలను సమర్పించి భక్తులను ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు. బాబా బర్ఫానీ యాత్రగా చెప్పుకునే ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర జూలై 25 నుండి ఆగస్టు 19 వరకు వరకు సాగనుంది.
Read More
21

సన్నీ డియోల్ జాట్ మూవీ.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం జాట్(Jaat Movie). ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మించారు. తెలుగు సినిమా కథతో తెరకెక్కించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Read More
22

చైనాలో యాపిల్ ఉత్పత్తికి కారణం ఇదే: టిక్ కుక్

సుంకాల యుద్ధాన్ని ప్రారంభించిన సమయంలో.. అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' యాపిల్ సహా కంపెనీలు తమ ఉత్పత్తులను దేశంలో తయారు చేయాలని కోరుకున్నారు. కానీ నిపుణులు, పరిశ్రమ నాయకులు అమెరికాలో పెద్ద ఎత్తున ఉత్పత్తుల తయారీ సాధ్యం కాదని చెప్పారు.
Read More
23

సరికొత్త మ్యూజిక్‌ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!

ఉరుకుల పరుగుల జీవనంలో ఉల్లాసం కావాలి. వారంలో ఒక్కరోజైనా, ఒక్క పూటైనా ఒత్తిడి నుంచి విముక్తి కావాలి. అందుకే నగరవాసులు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ చికిత్సల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలాల్లో ఇప్పుడు, ఆఫ్రికన్‌ డ్రమ్‌ అయిన జెంబే ఒకటిగా నిలిచింది. మ్యూజిక్‌ థెరపీలో భాగంగా దీనిని నగరవాసులు ఆస్వాదించడం పెరుగుతోంది.
Read More
24

భారత్‌ అభ్యర్థన.. వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు

ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది.
Read More
25

మతవాదులను సంతృప్తి పరిచిన కాంగ్రెస్‌: ‍ప్రధాని మోదీ

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ హర్యానాలో పలు అభివృద్ది పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ఆరోపణల దాడి చేశారు. వక్ఫ్ (సవరణ) చట్టంపై తమ వైఖరి వెల్లడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ మతవాదులను సంతృప్తి పరచిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసిందన్నారు.
Read More
26

బంగారం తగ్గిందోచ్‌... గోల్డ్‌ స్పీడ్‌కు బ్రేక్‌!

వరుసగా ఐదు రోజులుగా దూసుకెళ్తున్న పసిడి ధరలకు బ్రేక్‌ పడింది. దేశంలో బంగారం ధరలు (Gold Prices) నేడు (April 14) కాస్త దిగొచ్చాయి. స్వల్పంగా రూ.150-రూ.160 మేర తగ్గుదల నమోదైంది. బంగారం ధరలు (Gold Rates) ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి.
Read More
27

నాకన్నా చిన్నోడే కానీ, మగతనం ఎక్కువై: హీరో గురించి నటి

‘అతను చాలా అందంగా ఉంటాడు అంతేకాదు అతను నా కంటే ఒక సంవత్సరం చిన్నవాడు అయినా కూడా అతను ఇంకా ఫిట్‌గానే ఉన్నాడు‘ మగవాళ్లలో మేల్‌ హార్మోన్‌ అయిన టెస్టోస్టెరాన్‌ స్థాయిలు చురుకుగా ఉన్నప్పుడు, మంచి ఫిట్‌నెస్‌ పొందుతారని అది సాధారణమేనని చెప్పారు. అంటే మగతనం ఎక్కువైతే ఫిట్నెస్ దాంతో ఆడవాళ్ళ కు ఆకర్షణ కలగడం.. వల్ల ఇలాంటి ఎఫైర్స్‌ పుట్టుకొస్తాయన్నట్టుగా అభిప్రాయపడ్డారు.
Read More
28

అప్పటి నోటిఫికేషన్‌లకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవు: ఉత్తమ్‌

తెలంగాణలో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ అమలు చరిత్రాత్మకమైనదని చెప్పుకొచ్చారు. ఈరోజు నుంచే ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలవుతాయి.. త్వరలోనే అన్ని నోటిఫికేషన్లు ఎస్సీ రిజర్వేషన్ల అమలుతో విడుదల అవుతాయి. గత ఏడాది ఫస్ట్ ఆగస్టు కు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్లు వర్తించవు. గ్రూప్ఏ-1, గ్రూప్‌బీ-9, గ్రూప్‌సీ-5 శాతం..
Read More
29

మారుతున్న ట్రెండ్.. 2025లో ఆ కార్లకే డిమాండ్!

అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో చాలామంది సొంతంగా వాహనం కలిగి ఉండాలని భావిస్తున్నారు. ఈ కారణంగానే కార్ల కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025 మొదటి త్రైమాసికంలో కార్ల అమ్మకాలకు సంబంధించిన డేటాను యూజ్డ్ కార్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ విడుదల చేసింది.
Read More
30

యూపీఐ సేవల్లో అంతరాయం: స్పందించిన ఎన్‌పీసీఐ

దేశ వ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో మరోసారి అంతరాయం ఏర్పడింది. ట్రాన్సక్షన్స్ జరగడం లేదని చాలామంది యూజర్లకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. మధ్యాహ్నం 12:43 గంటకు సమస్య తీవ్రతరం అయిందని, 2,000 మందికి పైగా వినియోగదారులు సమస్యలను నివేదించారని డౌన్ డిటెక్టర్‌ వెల్లడించింది.
Read More
31

వనజీవి రామయ్య ఇక లేరు

ఖమ్మం: పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య(85) ఇక లేరు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దశాబ్దాలకు పైగా హరిత యజ్ఞం కొనసాగించిన ఆయన.. విత్తనాలు, మొక్కల పంపిణీ, వైవిధ్యంగా ప్రచారంతో వార్తల్లో నిలిచారు.​ కోటికి పైగా మొక్కలను నాటిన ఘనతతో.. పర్యావరణానికి చేసిన మేలుకుగానూ కేంద్రం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారాయన.
Read More
32

సీఎస్‌కేతో మ్యాచ్‌.. కేకేఆర్ జ‌ట్టులో కీల‌క మార్పులు?

ఐపీఎల్‌-2025లో చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తానైట్‌రైడ‌ర్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది. వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్ స్దానంలో గుర్బాజ్‌, బౌల‌ర్ స్పెన్స‌ర్ జాన్స‌న్ ప్లేస్‌లో మోయిన్ అలీ తుది జ‌ట్టులోకి రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని వ్యవహరించనున్నాడు.
33

ఈవెంట్‌లో మాజీ ప్రియుడు.. పట్టించుకోని స్టార్ హీరోయిన్

ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించని సుస్మితా సేన్.. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైంది. ముంబయిలో జరిగిన ఈ ఈవెంట్‌లో తన మాజీ భాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. సుస్మితా సేన్ నటుడు రోహ్మన్‌ షాల్‌తో డేటింగ్‌ చేసింది. దాదాపు మూడేళ్ల తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. తాజాగా వీరిద్దరు మరోసారి ఓకే ఈవెంట్‌లో మెరిశారు.
34

ఎంపురాన్ మరో రికార్డ్.. 15 రోజుల్లోనే రూ.100 కోట్లు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఎల్‌2: ఎంపురాన్. ఈ మూవీకి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. 2019లో వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా థియేటర్లలో విడుదలైన ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. పాజిటివ్‌ టాక్ అందుకున్న ఈ మూవీ.. తొలిరోజే ఏకంగా రూ.21 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
35

వచ్చేవారం స్టాక్‌మార్కెట్‌ ట్రేడింగ్‌ 3 రోజులే..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వచ్చేవారంలో మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. వారాంతపు సెలవులు పోనూ సాధారణంగా వారంలో ఐదు రోజులపాటు స్టాక్‌ మార్కెట్లు తెరచి ఉంటాయి. కానీ వచ్చే వారంలో (ఏప్రిల్‌ 14 నుంచి) విశిష్ట దినోత్సవాలు, పండుగల కారణంగా రెండు రోజులు అదనపు సెలవులు వచ్చాయి.
Read More
36

మీరూ టీచరే కదా.. జోక్యం చేస్కోండి ప్లీజ్‌

న్యూఢిల్లీ: బెంగాల్‌లో 25 వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. దీంతో తొమ్మిదేళ్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లు ఒక్కసారిగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామంపై పోరాటం కొనసాగిస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. ఈలోపు మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ వెళ్లింది.
Read More
37

ఎల్లకాలం బాబు పాలనే ఉండదు

‌సత్యసాయి జిల్లా: రాప్తాడు పర్యటనలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కూటమిపై, పోలీసులపై ధ్వజమెత్తారు. ‘‘బాబు మెప్పుకోసం కొందరు పోలీసులు పని చేస్తున్నారు. టోపీలపై ఉన్న సింహాలకు సెల్యూట్‌ చేయకుండా బాబుకు వాచ్‌మెన్‌లా పని చేస్తున్న పోలీసులకు చెబుతున్నా. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసేవారికి శిక్ష తప్పదు’’ అని హెచ్చరించారు. ఇంకా..
Read More
38

బంగారం కొనడానికి ఇదే మంచి సమయం: మరింత తగ్గిన రేటు

దేశంలో బంగారం ధరలు పతనమవుతూనే ఉన్నాయి. ఈ రోజు (ఏప్రిల్ 7) కూడా గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 280 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.
Read More
39

'అమెరికాలో ఉద్యోగాలుండవు'

అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రకటించిన కొత్త సుంకాల ప్రభావం వల్ల.. ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందని 'జేపీ మోర్గాన్' అంచనా వేసింద. ఈ మాంద్యం వల్ల యూఎస్ఏలో నిరుద్యోగం రేటు 5.3 శాతానికి చేరుతుందని.. మైఖేల్ ఫెరోలి అన్నారు.
40

8న అనంతకు వైఎస్‌ జగన్‌

అనంతపురం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి ఆయన వెళ్లనున్నారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే లింగమయ్య హత్య ఘటనను ఖండించిన వైఎస్‌ జగన్‌.. ఆ కుటుంబానికి పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read More
41

ఉద్యోగం కోసం మూడేళ్లు: హృదయాన్ని కదిలించే పోస్ట్

చదువుకుని డిగ్రీలు తెచ్చుకోవడం ఒక ఎత్తైతే.. ఉద్యోగం సంపాదించడం మరో ఎత్తు అయిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో నచ్చిన ఉద్యోగాలు దొరక్క కొందరు సతమవుతుంటే.. అసలు ఉద్యోగాలే లభించనివారు చాలామందే ఉన్నారు. మూడేళ్లు ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తి.. సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో దుమారం రేపుతోంది.
Read More
42

మరో కొత్త ట్రెండ్!.. క్రికెట్ ప్లేయర్ అవతారమెత్తిన శామ్ ఆల్ట్‌మాన్

జిబ్లీ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న సమయంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ మరో ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. యానిమే స్టైల్ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read More
43

తాట తీస్తానన్న పవన్‌ ఎక్కడ?: వరుదు కళ్యాణి

రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చాలా బాధాకరమని వైఎస్సార్‌సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మసీ విద్యార్ధి విషయంలో ఆమెకు అన్యాయం జరిగింది.. చంద్రబాబు ఏం చేశారు?. రాష్ట్రంలో ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ తాటతీస్తామన్నారు.. ఇప్పుడు ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. నాగాంజలి ఆత్మహత్య చేసుకోవడానికి ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్‌లో రాసింది.
Read More
44

మృత్యువుతో పోరాడి ఓడిన నాగాంజలి

రాజమండ్రి: కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా చావుబతుకుల మధ్య పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్న ఫార్మాసిస్ట్.. ఈరోజు (శుక్రవారం) ప్రాణాలు విడిచింది. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపుల వల్ల పార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Read More
45

టీడీపీ అరాచకం.. పల్నాడులో ఘోరం

పల్నాడు: కూటమి పాలనలో టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్త హరిచంద్రను ఫించన్‌ తీసుకోవడానికి వెళ్తుండగా ఎత్తుకెళ్లారు. రాజకీయ కక్షతోనే ఆయన్ని కిడ్నాప్‌ చేశారని, ఆయనకు ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు ఆందోళనా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వాళ్ల భయమే నిజమైంది.
Read More
46

చార్మినార్‌ నుంచి ఊడిపడ్డ పెచ్చులు..

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. గతంలో మరమ్మతులు చేసిన చోటే మళ్లీ పెచ్చులు ఊడి కిందపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న చార్మినార్‌ నుంచి పెచ్చులు పడటంతో పర్యాటకులు పరుగులు తీశారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. పరిస్థితిని సమీక్షించారు.
Read More
47

‘స్ట్రేచర్‌ ఉందని విర్రవీగితే’.. సుప్రీం తీర్పుపై HCU విద్యార్థుల సంబరాలు

హైదరాబాద్‌,సాక్షి: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (​Hyderabad Central University) భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Read More
48

ఫార్ములా ఈ రేస్‌ ఫ్యాన్స్‌కు ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్‌

ఫార్ములా ఈ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కి సంబంధించిన టీమ్‌లు, డ్రైవర్లు, ఇతరత్రా వివరాలన్నీ అభిమానులకు సమగ్రంగా అందించేలా ’ఫార్ములా ఈ–స్టాట్స్‌ సెంటర్‌’ను ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఆవిష్కరించింది. తొలి ఎలక్ట్రిక్‌ ఎఫ్‌ఐఏ ప్రపంచ కాంపిటీషన్‌ అయిన ‘ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా ఈ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌’తో భాగస్వామ్యం ద్వారా కంపెనీ దీన్ని రూపొందించింది.
Read More
49

IPL 2025: సన్‌రైజర్స్‌ నయా సిక్స్‌ హిట్టింగ్‌ సంచలనానికి గాయం..?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 2) జరుగబోయే మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌ తగిలినట్లు తెలుస్తుంది. ఆ జట్టు నయా సిక్స్‌ హిట్టింగ్‌ మెషీన్‌ అనికేత్‌ వర్మ నిన్న ప్రాక్టీస్‌ సందర్భంగా గాయపడ్డాడని సమాచారం. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా.. ఓ బౌలర్‌ వేసిన బంతి అనికేత్‌ కాలి బొటన వేలుకు బలంగా తాకిందని తెలుస్తుంది.
Read More
50

పంచాయత్‌ సీజన్-4.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీలకు అడిక్ట్ అయిపోయారు. ఏ సినిమా అయినా.. వెబ్ సిరీస్‌ ‍అయినా ఓటీటీలోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సరికొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‍‍అయితే ఓటీటీల్లోనూ కంటెంట్‌ బాగుంటేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న వెబ్ సిరీస్‌లు చాలా తక్కువగానే ఉన్నాయి.
Read More