రోహిత, కార్తీక్లకు టైటిల్స్
సబ్ జూనియర్ చెస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సబ్ జూనియర్ అండర్-15 చెస్ సెలక్షన్ చాంపియన్షిప్లో జేసీ కార్తీక్, సబ్బి రోహిత విజేతలుగా నిలిచారు. జాంబాగ్లోని వివేకవర్ధని కళాశాలలో రెండు రోజుల పాటు ఈ టోర్నీ జరిగింది. బాల బాలికల విభాగాల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. బాలుర విభాగంలో 5 రౌండ్ల ద్వారా 5 పాయింట్లు సాధించిన కార్తీక్కు తొలి స్థానం దక్కింది. 4 పాయింట్లు సాధించిన షణ్ముఖ తేజ రెండో స్థానంలో నిలిచాడు. బాలికల విభాగంలో రోహిత, మేఘనలకు తొలి రెండు స్థానాలు దక్కాయి. వివేకవర్ధని సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆనంద్ అబ్కారి విజేతలకు బహుమతులు అందజేశారు.
విజేతల వివరాలు
బాలురు: 1. జేసీ కార్తీక్, 2. షణ్ముఖ తేజ, 3. కె. విశ్వజిత్ అరవింద్, 4. రుత్విక్ పొన్నపల్లి.
బాలికలు:1. సబ్బి రోహిత, 2. మేఘన సిరిగుడి, 3. పి. లాస్య ప్రియ, 4. ఆర్. హరి లాస్య.