ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులకు 150 పనిదినాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులకు 150 పనిదినాలు

Published Fri, Sep 27 2024 3:26 AM | Last Updated on Fri, Sep 27 2024 3:26 AM

ఆర్‌వోఎఫ్‌ఆర్‌ రైతులకు 150 పనిదినాలు

పెదబయలు: జిల్లాలో ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు పొందిన ఉపాధి కూలీలకు 150 రోజుల పనిదినాలు కల్పిస్తామని డ్వామా పీడీ ఎం. శివయ్య తెలిపారు. గురువారం స్థానిక ఉపాధి కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఫారం పాండ్స్‌, ఇంకుడు గుంతలు పనులు చేపట్టాలని సూచించారు. వర్షం నీరు వృధాగా పోకుండా భూమిలో ఇంకేలా ఉపాధి పనులు చేపట్టాలని ఆదేశించారు. సిల్వర్‌వోక్‌, జీడిమామిడి తదితర పండ్ల మొక్కల పెంపకం చేపట్టాలని తెలిపారు. వీటి నీడలో కాఫీ, పైనాపిల్‌, మిరయంను అంతర పంటలుగా వేసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చన్నారు. రైతులు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అంతకుముందు గలగండ, సీతగుంట పంచాయతీల్లో ఉపాధి నిధులతో చేపట్టిన పనులను, మస్తర్లను పరిశీలించారు. గిరి రైతులతో మాట్లాడారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల ప్రయోజనాలను వారి నుంచి తెలుసుకున్నారు. డీఆర్పీ షణ్ముఖ, ఏపీవో పెదప్పలనాయుడు, ఈసీ సింహాచలం, టీఏ కష్ణకుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు సన్యాసమ్మ, సదానందం పాల్గొన్నారు.

డ్వామా పీడీ శివయ్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement