ఉక్కునగరం: స్థానిక విశాఖ విమల విద్యాలయం కొనసాగింపుపై చర్చలు కొనసాగుతున్నాయి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, నాయకుల మధ్య జరిగిన చర్చల్లో వారు తమ అభిప్రాయాలు తెలిపారు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు శనివారం ఉదయం మూడు వర్గాల వారు హాజరయ్యారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ తాము ఆర్థిక భారం భరించలేమని, ఉక్కు యాజమాన్యం పాత పద్ధతిలో కొనసాగించడమో లేక ఉపాధ్యాయులు తమ జీతాలు తగ్గించుకోవడమో చేయాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు తమ సర్వీస్ రూల్స్పై కొంతమేర తగ్గారు. వేతనాలు, పీఆర్సీ, పాత బకాయిల చెల్లింపు తదితర అంశాలపై తమఅభిప్రాయాన్ని వెల్లడించారు. నాయ కులు మాట్లాడుతూ జీతాలు తగ్గించడం అన్యాయమన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఉక్కు యాజమాన్యానికి వివరించి, వారికి నచ్చచెబుతామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment