అనకాపల్లి (కశింకోట): బయట ఉన్న బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి ప్రభుత్వం చేపట్టిన ‘నేను బడికి పోతా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్రోల్మెంట్ డ్రైవ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం డీఈవో ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీలో ఉండే ఎంఈవో, హెచ్ఎంలకు పలు సూచనలు, షెడ్యూల్, రోజు వారీ కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా, మండల, హేబిటేషన్ కమిటీల ఆధ్వర్యంలో వచ్చే నెల 12 వరకు బడి ఈడు పిల్లలను చేర్పించడానికి డ్రైవ్ నిర్విహించాలన్నారు. మండలాల్లో ఎంపీడీవోలను సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఉత్తర్వుల్లో నిర్దేశించిన మేరకు పది మంది సభ్యులతో కూడిన కమిటీ, సీఆర్పీలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లతో తప్పనిసరిగా డ్రైవ్పై సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు. డ్రైవ్ నిర్వహించిన వివరాలతో ఫోటోలను వాట్సాప్ గ్రూప్లో పెట్టాలన్నారు. గూగుల్ స్ప్రెడ్ షీట్లో రోజు వారీ చేరిన పిల్లల వివరాలను నమోదు చేయాలన్నారు.
ఎంఈవోలు, హెచ్ఎంలకు
ప్రత్యేక కార్యాచరణ
జిల్లా విద్యాశాఖాధికారి
ఎం.వెంకట లక్ష్మమ్మ
Comments
Please login to add a commentAdd a comment