
రూ. 20 లక్షల బీమా చెక్కు అందజేత
బాధిత కుటుంబ సభ్యులకు
ప్రమాద బీమా చెక్కు అందిస్తున్న
ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ అధికారులు
దేవరాపల్లి: గరిశింగి పంచాయతీ శివారు చినగంగవరానికి చెందిన కోలా జోగిబాబు ఇటీవల మరణించడంతో దేవరాపల్లి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ), ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్(ప్రమాద బీమా) కింద రూ.20 లక్షలు మంజూరైంది. ఈ మేరకు స్థానిక ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్లో రీజనల్ మేనేజర్ పి.చిరంజీవి వెంకటేష్, ఇతర బ్యాంక్ అధికారుల చేతుల మీదుగా రూ. 20 లక్షల ప్రమాద బీమా చెక్కును నామినీగా ఉన్న మృతుడి భార్య కోలా మణికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ చిరంజీవి వెంకటేష్ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్య, జీవిత బీమా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్, ఎంవీ రమణయ్య, నోడల్ అధికారి ఎస్.కె.సనవాజ్, తదితరులు పాల్గొన్నారు.