అనంతపురం అగ్రికల్చర్: డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ జాప్యంపై ‘43 వేల హెక్టార్లు... 33 వేల మంది రైతులు’ శీర్షికతో గురువారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పరికరాల పంపిణీకి సంబంధించిన ఫైలుపై కలెక్టర్ వినోద్కుమార్ సంతకం చేశారని పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ ఫిరోజ్ఖాన్ తెలిపారు. 139.30 హెక్టార్లకు పరికరాలు ఇవ్వడానికి 113 మంది రైతులకు మంజూరు ఉత్తర్వులు వచ్చాయన్నారు. వీలైనంత త్వరగా మెటీరియల్ సరఫరా చేసి బిగించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పరిపాలన అనుమతి కోసం మరోఫైలు కలెక్టర్కు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment