అనంతపురం అర్బన్: జిల్లాలో ఫ్రీహోల్డ్ అయిన తరువాత రిజిస్ట్రేషన్ జరిగిన 99.679 ఎకరాల భూమికి సంబంధించి పునఃపరిశీలన ప్రక్రియను అక్టోబరు 1వ తేదీలోగా పూర్తి చేసి నివేదిక అందిస్తామని సీసీఎల్ఏ జయలక్ష్మికి కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. నిషేధిత భూములు (22ఏ) జాబితా నుంచి తొలగించిన భూముల రీ–వెరిఫికేషన్ ప్రక్రియపై సీసీఎల్ఏ శనివారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 23,399.10 ఎకరాల భూమికి సంబంధించిన పరిశీలన ప్రక్రియను అక్టోబరు 5లో పూర్తి చేసి నివేదిక అందిస్తామన్నారు. కార్యక్రమంలో జేసీ శివ నారాయణ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న పాల్గొన్నారు.
సేవా కార్యక్రమాల్లో ఉద్యోగుల భాగస్వామ్యం అభినందనీయం
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములు కావడం అభినందనీయమని కలెక్టర్, జిల్లా రెడ్క్రాస్ అధ్యక్షులు వి.వినోద్కుమార్ అన్నారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో రెడ్ క్రాస్ సభ్యులుగా చేరిన వారి సభ్యత్వానికి సంబంధించిన రూ.1,85,900 చెక్కును శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ చేతుల మీదుగా రెడ్క్రాస్ సంస్థ ప్రతినిధులు అందుకున్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి మోహన్కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment