రామాపురం : కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై బండపల్లె పంచాయతీలోని గన్సీదా దర్గా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మస్తాన్, బుజ్జీలకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. వీరబల్లి మండలం సానిపాయికి చెందిన మస్తాన్, బుజ్జి రామాపురంలో జరిగే పశువుల సంతకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యంలో గన్సీదా వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే వేసిన విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో మస్తాన్, బుజ్జిలు కిందపడి గాయాలయ్యాయి. 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుజ్జి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.లక్ష్మీప్రసాద్రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment