నందలూరు: కడప జిల్లా సీనియర్స్ క్రికెట్ జట్టుకు నందలూరు క్రికెట్ సబ్ సెంటర్ నుంచి ఆరుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. జాఫర్ అలీఖాన్, ఆదిల్ హుస్సేన్, పృధ్వీరాజ్, మారుతీ శంకరాచారి, గిరీష్ తేజ, స్టాండ్బైగా హరిప్రసాద్ ఎంపికై నట్లు హెడ్కోచ్ గయాజ్ తెలిపారు. నందలూరు సబ్ సెంటర్ నుంచి గతంలో కూడా అండర్ 12, 14, 16, 19, 23 సీనియర్ విభాగాలలో రాష్ట్రస్థాయి క్రికెట్కు ఎంతోమంది క్రీడాకారులు ఎంపికయ్యారన్నారు. ఈ ఏడాది కూడా ఆరుగురు క్రీడాకారులు సీనియర్ జట్టుకు ఎంపిక కావడంపై అసిస్టెంట్ కోచ్ ఫిరోజ్ ఖాన్ లోడి, ట్రైనర్ శివకోటి, క్యూరేటర్ హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment