చీరాల అర్బన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి మత్య్సకారుడు మృతి చెందిన ఘటన సోమవారం వాడరేవు–ఊటుకూరి సుబ్బయ్యపాలెం రోడ్డులో చోటుచేసుకుంది. ఈపూరుపాలెం రూరల్ ఎస్ఐ ఎం.శివకుమార్ వివరాల మేరకు.. వేటపాలెం మండలం ఊటుకూరి సుబ్బయ్యపాలేనికి చెందిన వి.బాలాజీ (45) సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం వాడరేవు వచ్చి తిరిగి గ్రామానికి పయనమయ్యాడు. మార్గంమధ్యలో స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలై అక్కకక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment