ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: మెరిట్ సాధిస్తున్న గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందజేసే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. దమ్మపేట మండలం గండుగులపల్లి గిరిజన సంక్షేమ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాల(బాలికలు)లో ఆరు నుంచి ఇంటర్ వరకు చదివిన మడవి డయానా లాసెట్లో 3,500 ర్యాంక్తో హైదరాబాద్లోని మహాత్మాగాంధీ లా కళాశాలలో సీటు సాధించింది. దీంతో ఆమెకు ప్రోత్సాహకంగా ఐటీడీఏ నుంచి రూ.36 వేల చెక్కును పీఓ గురువారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యుత్తమ చదువుతో సీటు సాధించిన డయానా ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో న్యాయ విద్య పూర్తి చేసి పేదలకు సహాయ పడాలని సూచించారు. ఉన్నత స్థానానికి చేరుకొని స్వగ్రామం జగ్గారానికి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, విద్యార్థిని తల్లి సుజాత, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment