జూలూరుపాడు: రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్ అన్నారు. మండలంలోని అనంతారంలో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో గురువారం పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ.. రైతులు విద్యుత్ను పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడాలన్నారు. పొలం బాట కార్యక్రమం ద్వారా ఒరిగిన విద్యుత్ స్తంభాలు సరి చేయడంతో పాటు విరిగిన, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను మార్చుతామని తెలిపారు. వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న తీగలను సరిచేస్తామని చెప్పారు. వర్షం వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారికంగా ఫ్యూజులను, కాలిన తీగలను మార్చొద్దని కోరారు. విద్యుత్ మోటార్లకు తగిన కెపాసిటర్లను అమర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ కొత్తగూడెం డీఈ రంగస్వామి, ఏడీఈ యాసిన్, జూలూరుపాడు ఏఈ సతీష్ కుమార్, సబ్ ఇంజనీర్ ప్రవీణ్, ఎస్ఎల్ఐ నరసింహారావు, లైన్మెన్ రమేష్, జేఎల్ఎం ఎన్ భాస్కర్, వెంకటేశ్వర్లు, గోపాల్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment