దమ్మపేట/అశ్వారావుపేట రూరల్: మలేషియాలోని వైకేఎల్ కంపెనీ ఇంజనీర్లు భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీలను గురువారం సందర్శించారు. ఈ ఫ్యాక్టరీల్లో ప్రస్తుతం మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈనేపథ్యాన ఫ్యాక్టరీల్లో పామాయిల్ క్రూడ్ ఆయిల్ రికవరీ రేటుపై ఆరా తీసిన వారు రికవరీ రేటు మరింత పెరగడానికి ఉన్న అవకాశాలపై సమీక్షించారు. ఫ్యాక్టరీల్లో యంత్రాల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఇంజనీర్లు.. ఆయిల్ రికవరీ రేటు పెంపుదలకు చేపట్టాల్సిన చర్యలపై ఆయిల్ఫెడ్ అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విభాగం మేనేజర్లు శ్రీకాంత్రెడ్డి, సత్యనారాయణ, ఫ్యాక్టరీ మేనేజర్లు కల్యాణ్, నాగబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment