భద్రాచలమంతా రామనామం! | - | Sakshi
Sakshi News home page

భద్రాచలమంతా రామనామం!

Published Fri, Sep 27 2024 3:14 AM | Last Updated on Fri, Sep 27 2024 3:14 AM

భద్రాచలమంతా రామనామం!

భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన పట్టణ వ్యాప్తంగా మైకులు ఏర్పాటు చేయిస్తున్నారు. ఆలయంలో జరిగే నిత్య పూజలతో పాటు రామనామం, కీర్తనలను భక్తులతో పాటు పట్టణవాసులకు వినిపించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆలయం నుంచి బస్టాండ్‌, డిగ్రీ కళాశాల రూట్లలో వీటిని అమర్చారు. ఒకటి, రెండో రోజుల్లో పనితీరును పరీక్షించాక మైక్‌లను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

అటవీశాఖ జోనల్‌

క్రీడా జట్టు ఎంపిక

ఇల్లెందు: ఈ నెల 29, 30వ తేదీల్లో కొత్తగూడెంలో అటవీశాఖ జోనల్‌ క్రీడలు జరగనుండగా, జిల్లా జట్టును గురువారం ఇల్లెందులోని ఫారెస్టు గ్రౌండ్‌లో ఎంపిక చేశారు. కబడ్డీ, వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌లో క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఇన్‌చార్జ్‌ ఎఫ్‌డీఓ కోటేశ్వరరావు, ఇల్లెందు ఎఫ్‌డీఓ ప్రసాద్‌, జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌ఓ ప్రసాదరావు, సెక్షన్‌ ఆఫీసర్లు, బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement